నేడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 346 వర్ధంతిని పురస్కరించుకొని! (3 - 4 - 2026)!
లేదా
భరతజాతి ముద్దుబిడ్డ,వీరత్వం,
పరాక్రమానికి ప్రతీక,హిందూత్వ ఉనికిని కాపాడిన ఓ మహాయోధుడు ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు!
ఈ రోజు భరతజాతి ముద్దు బిడ్డ,వీరత్వం, పరాక్రమానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 346వ వర్ధంతి.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆ మహానుభావుడు, అమోఘ ధైర్య,సాహసాలకు,దేశభక్తికి మారు పేరైనా శివాజీ మహారాజ్ గారి గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలను భరతమాత గడ్డపై జన్మించిన ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా వుంది.భారతదేశ చరిత్రలో ఓక గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత వుంది.ఆయన పేరు ఉంటే యావత్తు హిందూ మతం ఉత్సహంతో,ఎనలేని ఉత్తేజంతో ఉప్పొంగిపోతుంది.తన చిన్నతనంలో మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని,వారితో యుద్ధంలో అందరూ ఓడిపోయి చేతులేత్తేసిన వేళ శివాజీ మహారాజ్ మండే నిప్పు కణికలా పోరాడాడు.అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజ్ శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి వర్ధంతిని భారతదేశ వ్యాప్తంగా ఓక వేడుకలా జరుపుకుంటారు.ఇక ఆయన చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది.ఈ మహా గొప్ప,వీర యోధుడి 346వ వర్ధంతి సందర్బంగా ఆయన పుట్టినప్పటి నుంచి వీర మరణం పొందేవరకు ఎలాంటి విజయాలు శివాజీ గారు సాధించారనే ఆశక్తికరమైన విషయాలను ఒక్కసారి మనమంతా తెలుసుకుందాం.ఇక శివాజీ జననం గురించి చెప్పాలంటే క్రీస్తుశకం 1630లో ఫిబ్రవరి 19వ తేదిన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న జనార్ లోని శివనీర్ కోటలో జిజియాబాయ్,షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు.ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు, శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో,ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా వున్నాడు.దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు.శివాజీ మహారాజ్ కన్నతల్లి దగ్గరే పరమత సహనం,మహిళల పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకున్నాడు.అతి చిన్న వయస్సులోనే తాను పుట్టిన భూమికి మేలు చేయాలని, ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజియాబాయి పూస గుచ్చినట్లు వివరించారు.మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరు ఉండేవారు.తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు.అలాగే రాజనీతి మెళుకువలు నేర్చుకుంటూ తన తండ్రి ఓటముల నుంచి సైతం అధ్యయనం చేసేవాడు.సరిగ్గా అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను గురించి కూడా ఆయన నేర్చుకున్నాడు.అదేమాదిరి శివాజీ 17వ ఏటలోనే కత్తి పట్టాడు.అంతేకాదు వెయ్యి మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్ కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు.ఆ తర్వాత మూడేళ్లలోపే రాజ్ ఘడ్, కొండన ప్రాంతాలను చేజిక్కించుకొని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.
ఏదిఎమైన శివాజీ గారు బాగా నమ్మే సూత్రాలలో ' ఓటమి తప్పదు అన్నప్పుడు యుద్ధం నుండి తప్పుకోవాలి,అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి.ఇక శివాజీ పాటించే యుద్ధ తంత్రం,దీన్నే గెరిల్లా యుద్ధం అని కూడా అంటారు.ఇక చత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు ఉండేవారు.తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు.అదే మాదిరి శివాజీ మహారాజ్ పటిష్టమైన నావికా దళాలు మరాఠాలకు మరింత బలాన్ని పెంచింది.ఇందుకు శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం.విదేశీ దండయాత్రల నుంచి కాపాడటానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి.ఏమైనా శివాజీ మహారాజ్ గారి యుద్ధ తంత్రాల గురించి తెలుసుకోవాలంటే ఈయన గారి ప్రత్యర్థి అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ గారి యుద్ధ తంత్రాలు,గెరిల్లా యుద్ధం గురించి తెలుసుకొని శివాజీని రెచ్చగొట్టేందుకు తనకు ఎంతో ఇష్టమైన దుర్గా మాత దేవాలయాన్ని కూలగొట్టాడట.అదే సమయంలో శివాజీ కుట్రలను పసిగట్టి తనను సమావేశానికి ఆహ్వానించాడు.అయితే శివాజీ ముందు జాగ్రత్త చర్యగా తన ప్రాణాలకు ముప్పు ఉందని పసిగట్టి తన ఉక్కు కవచాన్ని వేసుకొని చేతికి పులి గోళ్లు ధరించి మరీ అక్కడికి వెళ్ళాడు.అక్కడ అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా,తన పులి గోళ్ళతో అఫ్జల్ ఖాన్ ను ఖతం చేశాడు.అన్నింటికి మించి భారతదేశ ప్రజల రక్షణ కోసం అంతలా వీరపోరు సల్పాడు కాబట్టే ఆయనను భారతదేశవ్యాప్తంగా ఉన్న అశేష కోట్లాది మంది ప్రజలు ముఖ్యంగా యావత్తు హిందూ సమాజం ఆయనను ఓక మరాఠా యోధుడుగా,అపార దేశభక్తి మెండుగా ఉన్న ఓక గొప్ప మహారాజుగా ఈ ఛత్రపతి శివాజీగారిని వెయ్యినోళ్ల ఆరాధిస్తారు,కీర్తిస్తారు.అమర్ రహే అమర్ రహే! జోహార్ ఛత్రపతి శివాజీ మహారాజ్!👑👑👑🫅🫅🫅! బోలో భారతమాతాకీ జై! మేరా హిందూస్తాన్ మహాన్!🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి, సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#chatrapati