తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం 🙏

𝙎𝙖𝙜𝙖𝙧.... 𝙉.....
4.9K views
1 months ago
#తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం 🙏 #తిరుమల సమాచారం🙏 నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు* తిరుమల, 2026 ఫిబ్రవరి 27: మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. - మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి. - మార్చి 3న కుమారధార తీర్థ ముక్కోటి. చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత. - మార్చి 15న వైష్ణవ ఏకాదశి. - మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం - మార్చి 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం. - మార్చి 28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం. - మార్చి 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
PSV APPARAO
685 views
3 months ago
#తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం 🙏 #తిరుమల సమాచారం #తిరుమల తిరుపతి సమాచారం #తిరుమల సమాచారం #తిరుమల తిరుపతి సమాచారం నా స్టెటష్ తిరుమల సమాచారం:09-01-2026 👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . 👉🏻 ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి, నారాయణ గిరి షెడ్స్ వరకు* క్యూ లో వేచి ఉన్న భక్తులు . 👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *16 గంటల* సమయం పడుతుంది. 👉🏻 300 రూ..శీఘ్రదర్శనంకు *3-4 గంటల* సమయం పడుతుంది. 👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4–6 గంటల* సమయం పడుతుంది. 👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,580* 👉🏻 *18,465* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *3.57 కోట్లు.* *ఓం నమో వేంకటేశాయ🙏🙏🏻*
𝙎𝙖𝙜𝙖𝙧.... 𝙉.....
1.5K views
5 months ago
#తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం 🙏 #తిరుమల సమాచారం #తిరుమల తిరుపతి సమాచారం *అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం* తిరుమల, 2025 అక్టోబర్ 28: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణను వసంత మండపంలో నిర్వహించనున్నారు. అంతకు మునుపు మృత్సంగ్రహణం, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. *ఆర్జిత సేవలు ర‌ద్దు* అక్టోబర్ 29న అంకురార్ప‌ణ కార‌ణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. అక్టోబర్ 30 పుష్ప‌యాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ర‌ద్ద‌య్యాయి. తోమాల‌, అర్చ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.