తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం 🙏

🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
608 వీక్షించారు
5 రోజుల క్రితం
తిరుమల మొదటి గడప సేవ టికెట్లు విడుదల.. భక్తులకు కీలక సమాచారం ___________________________________________ తిరుమల భక్తులకు శుభవార్త 🙏 ఆగస్టు 2026 నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన మరియు అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్లు మే 18 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. లక్కీ డ్రా రిజిస్ట్రేషన్‌కు మే 20 ఉదయం 10 గంటల వరకు అవకాశం కల్పించింది TTD. భక్తులు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. శ్రీవారి సేవకు సిద్ధం అవ్వండి ✨ ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ✍🏻 ___________________________________________ #🌅శుభోదయం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #TTD తిరుపతి తిరుమల #🙏తిరుమల తిరుపతి సమాచారం TTD🙏 #🌸శనివారం స్పెషల్ స్టేటస్
PSV APPARAO
629 వీక్షించారు
9 రోజుల క్రితం
#తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #హనుమాన్ జయంతి ఉత్సవాలు #🙏తిరుమల తిరుపతి సమాచారం TTD🙏 #తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం 🙏 #తిరుమల తిరుపతి సమాచారం 👆 తిరుమ‌ల‌లో ఘనంగా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు తిరుమ‌ల‌, 2026 మే 12: హనుమ‌జ్జ‌యంతి సందర్భంగా మంగ‌ళ‌వారం తిరుమల మొద‌టి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్ర‌హం వ‌ద్ద వేద మంత్రోచ్చారణలు మేళ‌తాళాల నడుమ టీటీడీ ప్రత్యేక పూజలను వేడుకగా నిర్వహించింది. అనంతరం భ‌క్తుల‌కు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, వీజీవో శ్రీ సురేంద్ర‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుమ‌ల‌లో స్థానికంగా ఉన్న ప‌లు హ‌నుమాన్ ఆల‌యాల్లో కూడా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌ల‌ను అత్యంత వైభవంగా నిర్వ‌హించారు. టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.
𝙎𝙖𝙜𝙖𝙧.... 𝙉.....
4.9K వీక్షించారు
2 నెలల క్రితం
#తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం 🙏 #తిరుమల సమాచారం🙏 నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు* తిరుమల, 2026 ఫిబ్రవరి 27: మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. - మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి. - మార్చి 3న కుమారధార తీర్థ ముక్కోటి. చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత. - మార్చి 15న వైష్ణవ ఏకాదశి. - మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం - మార్చి 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం. - మార్చి 28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం. - మార్చి 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
PSV APPARAO
685 వీక్షించారు
4 నెలల క్రితం
#తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం 🙏 #తిరుమల సమాచారం #తిరుమల తిరుపతి సమాచారం #తిరుమల సమాచారం #తిరుమల తిరుపతి సమాచారం నా స్టెటష్ తిరుమల సమాచారం:09-01-2026 👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . 👉🏻 ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి, నారాయణ గిరి షెడ్స్ వరకు* క్యూ లో వేచి ఉన్న భక్తులు . 👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *16 గంటల* సమయం పడుతుంది. 👉🏻 300 రూ..శీఘ్రదర్శనంకు *3-4 గంటల* సమయం పడుతుంది. 👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4–6 గంటల* సమయం పడుతుంది. 👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,580* 👉🏻 *18,465* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *3.57 కోట్లు.* *ఓం నమో వేంకటేశాయ🙏🙏🏻*
𝙎𝙖𝙜𝙖𝙧.... 𝙉.....
13.6K వీక్షించారు
4 నెలల క్రితం
#తిరుమల పుణ్యక్షేత్ర సమాచారం.టికెటుభుకింక్.సమాచారం. 9వ తేది నుండి ఆన్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు జారీ నెల రోజుల పాటు ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్ శ్రీవాణి ద‌ర్శ‌న టికెట్ల జారీ నిలిపివేత‌ తిరుమ‌ల‌, 2026 జ‌న‌వ‌రి 06: య‌థావిధిగా ఇప్ప‌టికే అమ‌లులో ఉన్న‌ శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల అడ్వాన్స్ బుకింగ్, తిరుప‌తి విమానాశ్ర‌యంలోని ఆఫ్ లైన్ క‌రెంట్ బుకింగ్ విధానం భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించ‌నున్నారు. ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్‌లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భ‌క్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం న‌లుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి. ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ‌డ్ విధానంలో భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. త‌ద్వారా ఆఫ్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కోసం భ‌క్తులు క్యూలైన్ లో నిరీక్షించే స‌మ‌స్య తొల‌గిపోతుంది. ఈ నూతన విధానాన్ని నెల రోజుల‌పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అదేవిధంగా రోజుకు 500 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుద‌ల చేయ‌డం జరిగింది. మూడు నెల‌ల అనంత‌రం ఈ విధానంపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంది. తిరుప‌తి విమానాశ్ర‌యంలో ప్ర‌తిరోజూ భ‌క్తుల‌కు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా య‌థావిధిగా కొన‌సాగ‌నుంది. అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని గ‌మ‌నించి భ‌క్తులు త‌మ ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌డ‌మైన‌ది. టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.