తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారము

PSV APPARAO
670 views
2 months ago
#తిరుమల శ్రీవారి లడ్డూ పై రాజకీయ దుమారం #తిరుమల లడ్డు #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల తిరుపతి దేవాలయ భక్తి సమాచారం🙏 #తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారము కల్తీ చేయక, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూ ప్రసాదం చేసావా @ysjagan ? ఏ మొఖం పెట్టుకుని, క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకుంటున్నావ్ ? #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #ShameOnYouJagan #AntiHinduJagan #StopHurtingHindus #PsychoFekuJagan
PSV APPARAO
561 views
2 months ago
#తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారము #గ్రహణం సమయంలో ప్రముఖ దేవాలయాలు మూసివేత 🌘🌒🌖🌗🌓 #తిరుమల శ్రీవారి ఆలయం. మూసివేత 🕉️🙏 #తిరుమల తిరుపతి దేవాలయ భక్తి సమాచారం🙏 #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS *మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత* తిరుమల : చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది. ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది. https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42
PSV APPARAO
723 views
6 months ago
#తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారము #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #ఫేక్ న్యూస్ లు నమ్మవద్దు #ఫేక్ న్యూస్ నమ‌్మకండి #సీనియర్ సిటిజన్లకు నేరుగా శ్రీవారి దర్శనం.. పత్రికా ప్రకటన తిరుమల, 2025 అక్టోబర్ 05 వయోవృద్ధుల దర్శనం పై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరో మారు విజ్ఞప్తి వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరు.