గ్రహం అనుగ్రహం

PSV APPARAO
823 views
2 days ago
#✋జ్యోతిష్య పరిహారాలు♌ #ఈరోజు గ్రహం - అనుగ్రహం నేటి పంచాగం 🌞 రాశి ఫలాలు #🤫 గ్రహం అనుగ్రహం 🫢 #గ్రహం అనుగ్రహం #ఈరోజు అధ్యాత్మిక విశిష్టత: నిర్జల ఏకాదశి/భీమసేన ఏకాదశి (జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి)🛕🙏 *నిర్జల ఏకాదశి రోజున శుక్రుడు–శని అనుగ్రహం* జూన్ 25న జరుపుకునే నిర్జల ఏకాదశి సందర్భంగా శుక్రుడు, శని గ్రహాల సంయోగం వల్ల *‘నవపంచమ రాజయోగం’* ఏర్పడుతోంది. జ్యోతిష్య గణనల ప్రకారం ఈ శుభయోగం *వృషభ, మిథున, కన్య, కుంభ* రాశుల వారికి విశేష ధనలాభం, శుభఫలితాలను ప్రసాదించనుంది. జూన్ 25న నిర్జల ఏకాదశి పర్వదినాన్ని ఆచరిస్తారు. ఇది సంవత్సరంలో అత్యంత ప్రాముఖ్యమైన ఏకాదశుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజున *శ్రీ మహావిష్ణువు* మరియు *మహాలక్ష్మీదేవిని* ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజున నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరించే భక్తుల జీవితాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ధనవృద్ధి కలుగుతాయి. ఈసారి నిర్జల ఏకాదశి మరింత ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఎందుకంటే ఇదే రోజున ఒక అరుదైన శుభయోగం కూడా ఏర్పడుతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, *జూన్ 25, 2026న శుక్రుడు మరియు శని మధ్య ఏర్పడే ప్రత్యేక స్థాన సంబంధం కారణంగా ‘నవపంచమ రాజయోగం’ ఏర్పడుతుంది.* ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి సుమారు 120 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. శుక్రుడు, శని మిత్రగ్రహాలుగా పరిగణించబడటంతో, వీరి ఈ సంయోగం అనేక రాశుల వారికి అత్యంత శుభఫలితాలను ప్రసాదించనుంది. 🕉️📿🕉️ వృషభ రాశి 🕉️📿🕉️ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల ఈ రాశివారికి ఈ రాజయోగం ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. వారి పనికి ప్రశంసలు దక్కుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్న వారికి ఇది అనుకూల సమయం. నిలిచిపోయిన ధనం తిరిగి లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. 🕉️📿🕉️ మిథున రాశి 🕉️📿🕉️ మిథున రాశివారికి ఈ యోగం అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు. వ్యాపారులకు పెద్ద లాభాలు చేకూరే అవకాశముంది. భవిష్యత్తులో మంచి ఆదాయం పొందే మార్గాలు ఏర్పడతాయి. మొత్తంగా ఈ కాలం అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. 🕉️📿🕉️ కన్య రాశి 🕉️📿🕉️ కన్య రాశివారికి ఈ యోగం అనుకూలమైన మార్పులను తీసుకురానుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించవచ్చు. ఆదాయం పెరిగే అవకాశముంది. కుటుంబంలో ఆనందం, సంతోషం నెలకొంటాయి. 🕉️📿🕉️ కుంభ రాశి 🕉️📿🕉️ కుంభ రాశికి అధిపతి శని. అందువల్ల ఈ రాజయోగం ప్రభావం ఈ రాశివారిపై స్పష్టంగా కనిపిస్తుంది. ధనానికి సంబంధించిన విషయాల్లో లాభాలు కలగవచ్చు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారి కోరిక నెరవేరే అవకాశముంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ విధంగా, *నిర్జల ఏకాదశి* పర్వదినం కేవలం ఆధ్యాత్మిక దృష్టితోనే కాకుండా, జ్యోతిష్య పరంగా కూడా అనేక రాశుల వారికి సంతోషం, ఐశ్వర్యం, అభివృద్ధిని అందించే శుభదినంగా నిలవనుంది. డైలీ విష్ ఆధ్యాత్మిక ఆనందం ద్వారా మీరు సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, పౌరాణిక విశేషాలు, పండుగల ప్రాముఖ్యత, వ్రతాలు, పూజా విధానాలు, దేవతల మహిమలు మరియు జీవితాన్ని సన్మార్గంలో నడిపించే ధార్మిక సందేశాలను తెలుసుకుంటున్నారు. ఈ దివ్య జ్ఞానం మీలో భక్తిని, ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంపొందించుగాక. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
꧁ღ🥀🕊️𝐒𝐚𝐢𝐬𝐚𝐧𝐠𝐞𝐞𝐭𝐡𝐚(SS)🥀🕊️ღ꧂
1K views
5 months ago
#అనుగ్రహం *మడి అంటే అసలు అర్ధమేంటి?* ➖➖➖✍️ మన హిందూ సాంప్రదాయం లో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు. కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు. మన ఆచారాలు మనం పాటించాలి, వాటిని వదిలివేయరాదు. మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు. *ఆచార హీనం నపునంతి వేదాః* ఆచార హీనుణ్ణి వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం. అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం. ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.. మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.. మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు. కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. *మడి అంటే ఏమిటి ?* మడి అంటే శారీరక శౌచము. (ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు.) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.. *మడి ఎలా కట్టుకోవాలి?*` రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండెముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయవలెను. (ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు.) మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకొనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు. మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషము వున్నది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము. మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించినవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికిరావు. మడితో పచ్చళ్ళు,మడితో వడియాలు, మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది. ఆసక్తికలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి. దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవములోకి వస్తాయి. నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనం.✍️ . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏` 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* ➖▪️➖ ఇలాంటి మంచి విషయాలకోసం… *“అనుగ్రహం గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9398455116. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏