పురాణ కథ

Anjaiah Soma
3.3K views
1 months ago
ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మోహించడం, ఆ తర్వాత గౌతముడు ఇచ్చిన శాపం మరియు ఇంద్రుడికి "సహస్రాక్షుడు" (వెయ్యి కళ్ళు ఉన్నవాడు) అనే పేరు ఎలా వచ్చిందో వివరించే పురాణ గాథ ఇది: ### **కథా నేపథ్యం:** గౌతమ మహర్షి భార్య **అహల్య**. ఆమె బ్రహ్మదేవుడి సృష్టిలోనే అత్యంత అందగత్తె. దేవతల రాజైన **ఇంద్రుడు** అహల్య అందానికి ముగ్ధుడై, ఎలాగైనా ఆమెను పొందాలని ఆరాటపడతాడు. ### **ఇంద్రుడి మాయ:** ఒకరోజు తెల్లవారుజామున గౌతమ మహర్షి నదికి స్నానానికి వెళ్ళే సమయం కోసం ఇంద్రుడు వేచి చూస్తాడు. సమయం కాకముందే ఇంద్రుడు కోడి రూపం ధరించి గట్టిగా కూస్తాడు. అది విని తెల్లవారిందేమోనని భావించి గౌతమ మహర్షి నదీ స్నానానికి బయలుదేరుతాడు. ఆ వెంటనే ఇంద్రుడు గౌతమ మహర్షి రూపం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించి, అహల్యతో గడుపుతాడు. అయితే, నది దగ్గరకు వెళ్లిన గౌతముడికి ఇంకా తెల్లవారలేదని, ప్రకృతి ప్రశాంతంగా ఉందని గ్రహించి, మోసపోయానని తెలుసుకుని వెంటనే ఆశ్రమానికి తిరిగి వస్తాడు. ### **గౌతమ మహర్షి ఇచ్చిన శాపం:** ఆశ్రమం నుంచి బయటకు వస్తున్న ఇంద్రుడిని, తన రూపంలో ఉన్న మాయావిని చూసి గౌతముడు తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు. ఇంద్రుడి కామ ప్రవృత్తికి, చేసిన తప్పుకు శిక్షగా గౌతమ మహర్షి ఇలా శపించాడు: > **"నువ్వు దేని కోసమైతే ఈ ద్రోహానికి ఒడిగట్టావో, అటువంటి స్త్రీ జననేంద్రియ గుర్తులు (యోని గుర్తులు) నీ శరీరం మొత్తం వెయ్యి సంఖ్యలో ఏర్పడుగాక!"** > ఈ శాపం వల్ల ఇంద్రుడి శరీరం మొత్తం అసహ్యకరమైన యోని గుర్తులతో నిండిపోతుంది. అవమానంతో, తలదించుకుని ఇంద్రుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. *(గమనిక: ఇదే సమయంలో గౌతముడు అహల్యను కూడా రాయిగా మారిపోమ్మని శపిస్తాడు. త్రేతాయుగంలో శ్రీరాముడి పాదధూళి తగిలి ఆమెకు తిరిగి శాపవిమోచనం కలుగుతుంది).* ### **ఇంద్రుడిని "సహస్రాక్షుడు" అని ఎందుకు పిలుస్తారు?** శరీరం అంతా ఆ గుర్తులతో ఉండటంతో ఇంద్రుడు తీవ్ర మనోవేదనకు గురవుతాడు. దేవతలందరూ కలిసి గౌతమ మహర్షిని ప్రార్థించి, ఇంద్రుడి తప్పును క్షమించమని, శాపాన్ని ఉపసంహరించుకోవాలని వేడుకుంటారు. మహర్షి శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేనని చెప్తూ, దానికి ఒక ప్రత్యామ్నాయం (మార్పు) ఇస్తాడు. * **శాపాంతం / మార్పు:** ఇంద్రుడి శరీరంపై ఉన్న ఆ వెయ్యి యోని గుర్తులు, **వెయ్యి కళ్ళు (సహస్ర అక్షులు)** గా మారిపోతాయి. > **సహస్ర (వెయ్యి) + అక్షులు (కళ్ళు) = సహస్రాక్షుడు** > అలా గౌతముడి శాప మార్పు వల్ల ఇంద్రుడికి శరీరం నిండా వెయ్యి కళ్ళు వచ్చాయి. అప్పటి నుండి ఇంద్రుడిని **"సహస్రాక్షుడు"** అని పిలవడం ప్రారంభమైంది. ఇది ఇంద్రుడికి ఒకవైపు శక్తులను ఇచ్చినప్పటికీ, అతను చేసిన తప్పుకు శాశ్వత గుర్తుగా మిగిలిపోయింది. #పురాణ కథలు #పురాణ గాథలు/కథలు #హిందూ పురాణ కథలు #పురాణ కథ
Anjaiah Soma
1.2K views
2 months ago
*శివార్పణం ………!!* ఇది నిజంగా జరిగిన కథ అని చెబుతారు…. ఇప్పటికీ ఆ ప్రదేశంలో జరిగే ఉత్సవాలు, వేడుకలు ఇందుకు నిదర్శనం….. పరమ శివునికి మహాభక్తుడైన ఓ జాలరి కథను తెలుసుకుందాం….. *“జాలరి కథ”……!!* తమిళనాడు దగ్గర సముద్రతీర ప్రాంతంలో నాగపట్నం అనే ఊరు ఉన్నది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహా శివభక్తుడు…… ఈ జాలరివాడి దినచర్య అందరిలా కాకుండా కొంత ప్రత్యేకంగా ఉండేది….. ఇతడు జాలరి వాళ్లకు నాయకుడు…. ఈ జాలరి అందరితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాడు…. అయితే ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని “శివార్పణం”అని సముద్రంలో వేసేవాడు….. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు….. ఈ విధంగా అతను భగవద్భక్తిని పాటిస్తూ కుటుంబ పోషణ చేస్తూ జీవనాన్ని సాగిస్తుండేవాడు….. ఇతని బ్రతుకులో తెలిసినదంతా తనకు దొరికిన దానిలో మొదటిది “శివార్పణం” చేయడమే…… *“శివార్పణం”అంటే….!!* నిజానికి భక్తి అంటేనే “శివార్పణం”…..ఏ పని చేసినా భక్తితో మనసారా “శివార్పణం” అంటే చాలు ఎక్కడలేని ప్రశాంతత కలుగుతుంది….. అలా అనగలిగిన వారు నిజంగా ధన్యులు… నిజానికి శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది…. శివభక్తి….శివ ప్రేమ…”శివార్పణం” ఇలాంటి మాటలు. ఈ జాలరికి తెలిసిన ఒకే పదం “శివార్పణం”…. *ఒకే మాటగా ఒకే బాటగా….!!* ఈ జాలరి నాయకత్వంతో అందరూ సుఖంగా ఉండేవాళ్లు…. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్లు అదే పాటించేవారు….. ఒకే మాటగా ఒకే బాటగా వారంతా ఆనందంగా జీవనం సాగిస్తుండేవాడు…. జాలరి నాయకత్వంలో మత్స్యసంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు…. *ముంచుకొచ్చిన ఆపద…!!* ఇలా కాలం ఆనందంగా సాగుతుండగా ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్లకి చేపలు పడలేదు….. ఎన్నాళ్లు సముద్రంలోకి ఎంత దూరం వెళ్లి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్య భోజనాలకీ, కుటుంబ పోషణకీ అయిపోయాయి….. చివరికి తిండికి కూడా కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఇదే పరిస్థితి. ఎవరి ఇళ్లల్లో పొయ్యి వెలగట్లేదు…… *వలలో బంగారు చేప…..!!* ఒకసారి అందరూ గుంపుగా వెళ్లి చేపల కోసం వల వేశారు….. జాలరి నాయకుడు వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది….. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కనీవినీ ఎరుగని ఒక చేప వచ్చింది…. అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు పొదిగిన చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది…. దానిని వీళ్లందరూ కష్టపడి పడవ మీదకి తీసుకువచ్చారు….. ఈ చేపని కానీ తీసుకువెళ్లి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్లకి కావలసినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్మినా మరెన్నడూ చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది….. *మరి శివార్పణం ఎలా…..!!* జాలరి నాయకునికి మొదట పడ్డ చేప శివార్పణంగా సముద్రంలోకి విసిరేయడం అలవాటు కదా…… పోనీ దీనితోపాటు ఒక రెండు, మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు. కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప…. ఆందోళనలో జాలరులు అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న మిగిలిన వాళ్లందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన అలవాటు వాళ్లందరికీ తెలుసు. మొదటి చేపను “శివార్పణం” అని వేయడం ఈయనకు అలవాటు… నాయకుడు కాబట్టి వద్దు అనలేరు…. తిండికి కూడా గడవని ఈ గడ్డు పరిస్థితిలో ఈయన ఇప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన కలిగింది….. మిగిలిన జాలరులు ప్రతిరోజూ తిండికి లేదని బాధ పడుతుంటే ఈ పెద్దమనిషి మాత్రం రోజూ “శివార్పణం” చేయడానికి చేప లేదు అని ఏడ్చేవాడు. ఇక ఇప్పుడు ఈ బంగారు చేపను “శివార్పణం” చేస్తే ఇక మన గతి ఏంటి అని అందరూ ఆందోళన చెందసాగారు….. *అదీ భక్తి అంటే…..!!* ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్లకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది….. ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను. శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్లంతా పులకించిపోయింది….. కళ్లవెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి. ఆ చేపని పైకి తీశాడు. మిగిలిన జాలరులు ఆ చేపను “శివార్పణం” చేయవద్దని ఆయన కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు…… “శివార్పణం” అయిన బంగారు చేప జాలరుల ప్రార్థనలు కానీ…. ఏడుపు కానీ ఆ నాయకునికేమి పట్టలేదు…… శివుడికి ఇవ్వడానికి బంగారు చేప దొరికిందన్న ఆనందంతో మైమరచిపోయి ఆ చేపను పైకెత్తి “శివార్పణం” అని సముద్రంలో వేశాడు….. *ప్రత్యక్షమైన పరమశివుడు…..!!* వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో…… మహా కాంతిపుంజం కనిపించి ఆ కాంతిపుంజం మధ్యలో……”వృషభ వాహనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు”…. దర్శనమిచ్చి 'సంతోషించాను' అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకొని వాళ్లకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు….. భక్తుని ఆశ్రయంతో భగవత్ దర్శనం ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే భగవంతుని పూజించకపోయినా భగవంతుని భక్తుడిని అంటిపెట్టుకున్న చాలు తరించిపోతాం అని చెప్పడం. ఆ జాలరి నాయకుడు తన అచంచలమైన భక్తి విశ్వాసాలతో తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపజేశాడు…… *ఇది నిజం…..!!* నాగపట్నంలో ఇప్పటికీ ఆ భక్తుడి పేరున ఉత్సవం జరుగుతుంది. ఆ సమీపంలో ఉన్న శివుడు ఉత్సవమూర్తిని తీసుకువచ్చి ఆ జాలరి వాళ్ల ఇంట్లో ఘనంగా ఉత్సవం చేస్తారు. *జీవిత సత్యం……!!* అర్పణకు సిద్ధంగా ఉన్నవాడికే అన్నీ లభిస్తాయి….. కనుక అర్పించేదే నీది…. దాచుకున్నది నీది కాదు….. తరువాత ఎవడిదో అవుతుంది….. ఇలాంటి కథలు వింటే స్వార్థ రాహిత్యము, త్యాగనిరతి, ఏర్పడి నీతి, నిజాయితీ అభివృద్ధి చెందుతాయి….. ఇలాంటి నిజ జీవిత గాథలు మన పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియజేసి వారిలో భగవత్ భక్తిని పెంచి, అర్పించడంలో ఉన్న ఆనందాన్ని తెలియజేయాలి….. ఇలాంటి భగవత్ కథ వింటూ ఉంటే మనలో రజోగుణం తమోగుణం పోయి మంచి సంస్కారాలు మేల్కొంటాయి….. *ఓం నమ:శివాయ….!!* ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి…….!! *అరుణాచల శివ*🙏 #పురాణ కథలు #పురాణ గాథలు/కథలు #📙🙏శివుని పురాణ కథలు #హిందూ పురాణ కథలు #పురాణ కథ