తమిళ రాజకీయాలు

P.Venkateswara Rao
539 views
2 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *నో, నో… అన్నా మలై బుద్దిలేని బొద్దింక కాదు… తన రూటే సపరేట్…‼️* June 8, 2026🎯 12 గంటల్లో 8 లక్షలు… 24 గంటల్లో 14 లక్షలు… 2 రోజుల్లో 16 లక్షలు… ఏమిటివి అనుకుంటున్నారా..? కాక్రోచ్ జనతా పార్టీ ఆన్‌లైన్ ఫాలోయింగ్ సంఖ్యలని అంచనా వేస్తున్నారా..? కాదు, అన్నామలై స్టార్ట్ చేసిన wetheleaders పోర్టల్‌కు రిజిష్టరైన వారి సంఖ్య అది… నో, నో, అన్నామలై నాటెటాల్ ఏ కాక్రోచ్… డిజిటల్ సెటైర్ వేదిక అసలే కాదు… ఎందుకు కాదు..? ఏమిటి తేడా అంటారా..? సీజేపీ గురించి పదే పదే మాట్లాడటమే వేస్ట్… అదొక తుక్‌డే తుక్‌డే జాతివ్యతిరేక ముఠాల సమూహం… ఇంకా వివరంగా అవసరం లేదు… కానీ అన్నామలై..? తన ఐపీఎస్ కెరీర్‌ను వదిలిపెట్టి… తమిళనాడులో ఓ కొత్త దశ రాజకీయాల్ని నడపాలనుకుని, బీజేపీకి చేతకాక, పళనిస్వామి పిచ్చి కోరికలకు హైకమాండ్ బలిపెట్టిన ఓ కొత్తతరం నాయకుడు… ఒంటరివాడిని చేస్తే, ఒంటరిగానే ఫైట్ చేస్తానని స్థిరంగా నిలబడి, బీజేపీ ఆఫర్ చేసిన ఎంపీ సీటును ఎడమకాలితో తన్నేసి, జనంలోనే ఉంటానంటూ జనంలోకి వచ్చిన అరుదైన కేరక్టర్… (ఒక్కసారి తెలంగాణలో ఐపీఎస్ వదిలేసి, పాపం, కేసీయార్ గడీస్వామ్యంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తితో పోల్చండి… ఎంత తేడా..?) అబ్బో, అన్నామలైలో ఏమిటంత స్పెషాలిటీ అంటారా..? తనకు డీఎంకే, అన్నాడీఎంకే ద్రవిడ రాజకీయాల బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు… బీజేపీ భంగపడనుందనీ తెలుసు… పళని స్వామి కోసం… బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్, గురుమూర్తి, తమిళిసైల కోసం తనను ఎలా బలిపెట్టారో తెలుసు…అభిప్రాయాలు ఆ పరాభావాల నుంచి పారిపోదలుచుకోలేదు… నిలబడి పోరాడటానికే నిశ్చయించాడు… గెలుపో ఓటమో జానదేవ్… ఏ ఫైటర్… సో, ఏ కోణం చూసినా ఆ బుర్రల్లేని బొద్దింకలన్నా, సొంత పార్టీల నిర్మాణాలు- ఉద్యమాలు మరిచి ఆ డిజిటల్ పొంగు వెనుక పరుగులు తీసే భ్రమాత్మక లెఫ్ట్, ఆప్ తదితర పార్టీలకన్నా అన్నామలై అనేకానేక రెట్లు బెటర్… అన్నామలై ఏదో నిన్నమొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు… తమిళనాడు రాజకీయాల ప్రధాన ప్రవాహంలో ఏళ్లుగా ఢక్కామొక్కీలు తిన్నవాడు… విమర్శలు ఎదుర్కొన్నాడు… సొంత పార్టీలోనే అవమానాలు భరించాడు… ప్రత్యర్థుల దాడులు చూశాడు… మీడియా నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నాడు… అయినా రాజకీయ రంగం నుంచి వెనక్కి తగ్గలేదు… పై ఫోటో చూశారా… అన్నా మలైని బలిస్తున్నట్టుగా నడిరోడ్డు మీద నరికివేత… ఆ రేంజులో తన మీద వ్యతిరేకతను కనబరిచాయి ద్రవిడ పార్టీలు… తను భయపడలేదు… స్టిల్ హి ఈజ్ ఫరమ్ ఆన్ హిజ్ స్టాండ్… విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండేట్టు లేదు అని స్టాలిన్ అంటున్నాడు… తన దయాదాక్షిణ్యాల మీదే విజయ్ ప్రభుత్వం మనుగడ అని తనకు తెలుసు… దాన్నెప్పుడు కూల్చేస్తారో తెలియదు… ఈలోపు తదుపరి పరిణామాలకు ఎలా ప్రిపేరై ఉండాలో బీజేపీకి తెలియదు… అసలు దానికి టిపికల్ సౌత్ పాలిటిక్స్ అర్థం కావు… అన్నాడీఎంకే పళనిస్వామి నాయకత్వంలో నానాటికీ ఇక జనం నుంచి దూరమై, మనుగడ కోసం పోరాడే స్థితి వస్తుందనీ అన్నామలైకి తెలుసు… ఇప్పుడప్పుడే డీఎంకే బలం పుంజుకోదనీ తెలుసు… దానికి ఉదయనిధి వంటి కుర్ర కూతకారులే ప్రధాన శాపమనీ తెలుసు… అందుకే ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు అన్నామలై…అభిప్రాయాలు తను ఈ ప్రస్థానంలో గెలుస్తాడా లేదానేది వేరే సంగతి… తన పోరాటస్పూర్తిని ఇక్కడ చెప్పుకుంటున్నాం.,.. అందుకే ఈ 16 లక్షల సంఖ్యను ఎన్నికల ఫలితంగా కాకుండా, ఒక రాజకీయ సంకేతంగా చూడాలి… ఫలితం ఏమవుతుంది? ఎవరూ చెప్పలేరు… అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ ఆశావహుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడం… నటుడు రాఘవ లారెన్స్ రాజకీయ రంగప్రవేశం గురించి వార్తలు వస్తున్నాయి… ఆయన కుమార్తె రాజకీయ అరంగేట్రం గురించీ చర్చ నడుస్తోంది… మరోవైపు రజినీకాంత్ రాజకీయాలకు దూరమయ్యారని అనుకున్న సమయంలో ఆయన కుటుంబం చుట్టూ మళ్లీ రాజకీయ చర్చలు మొదలయ్యాయి… ఆయన సతీమణి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది… ఎండిపోయిన ఆ పిరికి బట్టతల మీద మళ్లీ ఆశల వెంట్రుకలు మొలుస్తున్నాయి… తమిళనాడు రాజకీయాలు మళ్లీ ఒక సంధికాలంలోకి ప్రవేశిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి… అయితే ఇక్కడ ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి… అందరూ విజయ్‌లు కాలేరు… సినిమా స్టార్‌గా ఉన్న ప్రజాదరణను రాజకీయ మూలధనంగా మార్చుకోవడం అందరికీ సాధ్యం కాదు… రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కేవలం అభిమానులు సరిపోరు… సంస్థ కావాలి… నాయకత్వం కావాలి… సహనం కావాలి… అదృష్టం కూడా కావాలి… కానీ అందరూ విజయ్‌లు కాలేరని చెప్పడం ఎంత నిజమో, కొత్త కలలు కనొద్దని చెప్పడం కూడా అంతే తప్పు… రాజకీయాలు చివరికి ఆశల మీదే నడుస్తాయి… ఆ ఆశలే ఒకప్పుడు ఎంజీఆర్‌ను తీసుకొచ్చాయి… జయలలితను నిలబెట్టాయి… విజయ్‌కాంత్‌ను ఎదిగించాయి… ఇప్పుడు విజయ్‌ను రాజకీయాల కేంద్రబిందువుగా మార్చాయి… అదే ఆశ ఇప్పుడు అన్నామలైలో కనిపిస్తోంది… రాఘవ లారెన్స్‌లో కనిపిస్తోంది… ఇంకెవరిలోనో కనిపించొచ్చు… వాళ్లలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో కాలమే చెబుతుంది… కానీ ఆశలను మాత్రం ఎవరూ చంపలేరు…
P.Venkateswara Rao
581 views
3 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 #విద్యా వ్యవస్థ *📕తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలల ఫీజు ఫిక్స్..❗* తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూల్ ఫీజులపై ఇలాంటి నియంత్రణ వస్తే..? తమిళనాడు నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ! 07 జూన్ 2026, చెన్నై ఒక చిన్న ఫోటో.. కానీ అది లేవనెత్తిన చర్చ మాత్రం చాలా పెద్దది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోలో తమిళనాడులోని పాఠశాలల ఫీజు నిర్మాణానికి సంబంధించిన బోర్డు కనిపిస్తోంది. ఆ బోర్డులో వివిధ తరగతులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను స్పష్టంగా ప్రదర్శించారు. ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత విద్య, ప్రైవేట్ పాఠశాలల ఫీజులు, మధ్యతరగతి కుటుంబాల భారం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. తమిళనాడులో ఫీజుల నియంత్రణకు సంబంధించిన ఈ విధానం అమలవుతున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లు "మన దగ్గర కూడా ఇలాంటి వ్యవస్థ ఉంటే ఎంత బాగుంటుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా కుటుంబాలు పిల్లల విద్య కోసం తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, తమిళనాడులో ఈ విధానం అమలుకు సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి వచ్చే అభ్యంతరాలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లిన విధానం ప్రశంసలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో అనేక మంది ఈ నిర్ణయాన్ని ప్రజా ప్రయోజనాలకు అనుకూలమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. విద్య అనేది వ్యాపారం కాకుండా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాల్సిన ప్రాథమిక హక్కు అనే వాదన కూడా ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఇంకా, ప్రైవేట్ పాఠశాలల ఫీజులు నియంత్రణలో ఉంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఫీజుల పెంపు కారణంగా తల్లిదండ్రులు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదే కారణంగా సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇక, ఈ చర్చ కేవలం ఫీజులకే పరిమితం కాలేదు. ప్రభుత్వాలు విద్యా రంగంలో ఎంతవరకు జోక్యం చేసుకోవాలి అనే ప్రశ్న కూడా ముందుకు వచ్చింది. కొందరు విద్యా సంస్థలకు స్వేచ్ఛ అవసరమని వాదిస్తుంటే, మరికొందరు విద్య పేరుతో అధిక ఫీజులు వసూలు చేయడాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ రెండు అభిప్రాయాల మధ్య సమతుల్యత సాధించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలుగా మారింది. అయితే, ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులపై పడుతున్న భారం తగ్గించాలనే ఆలోచన ప్రజల్లో బలంగా పెరుగుతోంది. అందుకే తమిళనాడులో అమలవుతున్న ఈ విధానాన్ని చాలా మంది ఆదర్శంగా చూస్తున్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే విద్యా రంగంలో సానుకూల మార్పులు రావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇంకా, విద్య అనేది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన అంశం కాదు. అది సమాజ భవిష్యత్తును నిర్ణయించే రంగం. అందుకే ఫీజుల నియంత్రణ, నాణ్యమైన విద్య, అందుబాటులో ఉండే విద్యా వ్యవస్థ వంటి అంశాలపై ప్రజలు ఎక్కువగా చర్చించడం సహజమే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో కూడా అదే చర్చకు నాంది పలికింది. ఇక, సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రధాన అభిప్రాయం ఏమిటంటే.. విద్యా వ్యవస్థలో పారదర్శకత పెరిగితే తల్లిదండ్రుల విశ్వాసం కూడా పెరుగుతుందని. అందుకే తమిళనాడులో తీసుకున్న ఈ చర్యపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి నమూనాలను పరిశీలిస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది మన విశ్లేషణ. ఇది కేవలం వార్త కాదు.. సమాజం ఆలోచించాల్సిన విషయం. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలా? తెలుగు రాష్ట్రాల్లో కూడా తమిళనాడు తరహా ఫీజు నియంత్రణ విధానం అమలు చేయాలా? #TamilNadu, #SchoolFees, #EducationSystem, #PrivateSchools, #SchoolFeeRegulation, #EducationReforms
P.Venkateswara Rao
577 views
6 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 #భారతీయ జనతా పార్టీ bjp *అసలు సమస్యలు వేరు… అవి వదిలేసి బీజేపీ హైకమాండ్ తంటాలు…❗* June 4, 2026🪷 తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు… బీజేపీ హైకమాండ్ పూర్తిగా పక్కనపెట్టిన నాయకుడు అన్నామలై వ్యవహారం ఇంకా సస్పెన్స్… తను రాజీనామా చేయడానికే ఢిల్లీ వెళ్లాడు… తమిళనాట బీజేపీ వైఖరి తనకు నచ్చడం లేదు… అసలు తమిళ రాజకీయాలే బీజేపీకి అర్థం కావడం లేదు, ఇక తంటాలు, అవమానాలు దేనికని… మొదట ఓ జాతీయవాద ఉద్యమం మొదలుపెట్టి, తరువాత ఓ ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు పోవాలనేది తన ప్లాన్… బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిశాడు, రాజీనామా పత్రం ఇచ్చాడు, తరువాత అమిత్ షాను కలిశాడు, తనే కదా పార్టీ వ్యవహారాల కీలకస్థానం… బీఎల్ సంతోష్‌ను కలిశాడు… కానీ ఇంకా రాజీనామాకు ఆమోదం లభించలేదు… బుజ్జగిస్తున్నారు… ఆర్ఎస్ఎస్ ముఖ్యులను కూడా ఢిల్లీకి రప్పించారు… మాట్లాడుతున్నారు, రేపో, ఈ సాయంత్రమో మోదీని కూడా కలవనున్నట్టు వార్తలు.., అంతా బీట్ అరౌండ్ ది బుష్… అంటే అసలు విషయం తేలకుండా, ఏదో కాలయాపన చేయడం..! తమిళనాడులో అన్నామలై ఖచ్చితంగా బీజేపీకి కాస్త జోష్ తీసుకొచ్చాడు… కానీ తనకు పార్టీలోనే పెద్ద వ్యతిరేకవర్గం, ఇన్నేళ్లూ వాళ్లదే తమిళ బీజేపీ మీద ఆధిపత్యం, వాళ్లు ఉద్దరించేది లేదు, అన్నామలై కాళ్లలో కట్టెలు పెట్టడం తప్ప… వాళ్లు ప్రస్తుత అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్, తమిళిసై… అదొక వర్గం… అన్నామలై కాదని, నైనార్ పేరు కూడా పళనిస్వామి సూచించాడని అంటారు… (తెలంగాణలో బండి సంజయ్‌ను తీసేసిన తీరుగానే)… అన్నామలై అంటే పడదు వాళ్లకు… అన్నామలైని పార్టీలోనే కొనసాగేలా చేసినా… వాళ్లు పడనిస్తారా..? రోజూ తలనొప్పులే… ఈ ముగ్గురినీ ఇప్పుడు ఢిల్లీకి పిలిపించారు అర్జెంటుగా… అసలు సమస్య పళనిస్వామి… అన్నాడీఎంకేతో పొత్తు… ఇప్పటికిప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోలేదు అన్నామలై కోసం… పళనిస్వామి అన్నామలైని సహించడు… ఇవీ అసలు సమస్యలు… తమిళిసై గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, గత లోకసభ ఎన్నికల నుంచే ఈమెకూ అన్నామలైకీ పడటం లేదు… కోల్డ్ వార్… ఆమె ఏమైనా ఉద్దరించే స్థితిలో ఉందా..? జీరో… 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానైనా సరే జాతీయవాద ఎజెండాతో దూసుకెళ్లాలని, ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడాలని అన్నామలై భావించాడు… అది కుదరలేదు, మరి ఇప్పుడు అన్నా మలైని రిటెయిన్ చేసుకోవడం (పార్టీలో ఉంచుకోవడం) అమిత్ షా, మోదీ ద్వయానికి పెద్ద సవాలే… ఎందుకంటే అన్నామలై కేవలం పదవి కోసం ఆశపడే వ్యక్తి కాదు, దానికి ఆయన ఐపీఎస్ ఉద్యోగాన్నే వదిలేశాడు… కాబట్టి ఆయనను బుజ్జగించడానికి కేంద్ర నాయకత్వం మూడు ప్రధాన హామీలను టేబుల్ మీద పెట్టినట్లు సమాచారం… – ఇకపై తమిళనాడు బీజేపీలో సీనియర్ల పెత్తనం చెల్లకుండా, అన్నామలై చెప్పిందే వేదంగా సాగేలా “ఫ్రీ హ్యాండ్” ఇవ్వడం… నైనార్ నాగేంద్రన్, తమిళిసై, వనతి వంటి సీనియర్లకు ఢిల్లీ నుంచే గట్టి వార్నింగ్ ఇచ్చి, స్టేట్ యూనియన్‌లో అన్నామలై వ్యూహాలకు అడ్డురాకుండా చేయడం… – ఇప్పుడు విజయ్ గెలిచినా, తమిళనాడులో పాత ద్రావిడ శకం (DMK/AIADMK) ముగింపు దశకు వచ్చింది… తదుపరి టార్గెట్ మనదే” అని అన్నామలైకి నచ్చజెప్పడం… పార్లమెంట్ ఎన్నికల నాటికి తమిళనాడులో అన్నాడీఎంకేతో సంబంధం లేకుండా ఒంటరిగా ఎదిగేలా, పార్టీ ఓటు బ్యాంకుని పెంచే పూర్తి బాధ్యత ఆయనకే అప్పగించడం… – అవసరమైతే ఆయనకు జాతీయ స్థాయిలో లేదా కేంద్ర క్యాబినెట్‌లో కీలక బాధ్యతలు ఇవ్వడం, లేదంటే తమిళనాడులో సరికొత్త క్యాడర్‌ను ఆయనే స్వంతంగా రిక్రూట్ చేసుకునేలా సంస్థాగత మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం… ఢిల్లీ పెద్దలు అన్నామలైని వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేరు… ఎందుకంటే తమిళనాడులో బీజేపీకి కాస్తో కూస్తో క్రేజ్ తెచ్చింది ఆయనే… పొత్తుల విషయంలో జరిగిన తప్పును ఒప్పుకుంటూనే, భవిష్యత్తు తమిళనాడును అన్నామలై చేతుల్లో పెట్టడమే ఏకైక మార్గమని అమిత్ షా భావిస్తున్నాడు… భేటీ తర్వాత అన్నామలై నిర్ణయం ఎలా ఉండబోతున్నదో..!
P.Venkateswara Rao
490 views
8 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…‼️* June 2, 2026🎯 నిజం… ఒక దశలో బీజేపీ తురుఫు ముక్కగా కనిపించిన అన్నామలై… ఇప్పుడు అనేక కారణాల రీత్యా ఆ బీజేపీ బంధనాలు తెంచుకుని, ఇక స్వేచ్ఛగా తనదైన దూకుడుతో వెళ్లనున్నాడు… ఈ ధోరణి, తన కార్యాచరణ ఫస్ట్ పళనిస్వామి అనబడే ఓ విఫలనేతకు చుక్కలు చూపించబోతోంది… ఇన్నాళ్లు పళనిస్వామిని పట్టుకుని వేలాడి, తన షరతులకు సాగిలబడి, అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, టికెట్టు కూడా ఇవ్వక, ప్రచారానికీ అనుమతించక అన్నిరకాలుగా తనను దూరం పెట్టింది… (తెలంగాణలో కేసీయార్ కోసం బండి సంజయ్‌ను పక్కన పెట్టేసి భంగపడినట్టు…) సౌత్‌లో బీజేపీ వ్యూహాలన్నీ తల్లకిందులే… పళనిస్వామిని పట్టుకుని వేలాడితే ఆ ద్రవిడ బరిలో ఎంతోకొంత కాళ్లూనుకోవచ్చునని భ్రమపడింది… డీఎంకే మీద వ్యతిరేకత, విజయ్ చీల్చే వోట్లు ఎన్డీయే కూటమికి ఫాయిదా తీసుకొస్తాయని అనుకుంది… కానీ అసలు అన్నాడీఎంకేలోనే పళనిస్వామికి తీవ్ర వ్యతిరేకత ఉంది… మొన్న విజయ్ గెలిచాక, మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువ పడితే ముందుగా రెడీ అయిపోయింది అన్నాడీఎంకేలోని పళనిస్వామి వ్యతిరేకవర్గమే… (అనర్హత వేటు వేస్తామనే బెదిరింపుతో పళనిస్వామి వాళ్లందరినీ మళ్లీ అదుపులోకి తెచ్చుకున్నాడు, కానీ అది లోలోపల మండుతూనే ఉంది)… రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, లోకసభ ఎన్నికల్లో గానీ పళనిస్వామితో బీజేపీ ఒనగూరిందేమిటి..? పే-ద్ద జీరో..! ఐనా పళనిస్వామిని వదలదు… ఇక తన కెరీర్ ఏమిటో పునర్ నిర్వచించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నామలైకి… బీజేపీ- పళనిస్వామి బంధం ఉన్నన్ని రోజులూ తనకు బంధనాలే… అందుకే తెంపుకున్నాడు, రాజీనామా చేశాడు… ముందుగా తన వైపు వచ్చేది అన్నాడీఎంకేలోని పళనిస్వామి వ్యతిరేకులే… పళనిస్వామి- అన్నామలై సేమ్ ఏరియా, సేమ్ కేస్ట్… ఇప్పుడిక బీజేపీ కూడా వారించలేదు… వారించినా తను ఆగేది లేదు… తను ఎలాగూ రైటిస్టే కదా, పైగా చెప్పి మరీ రాజీనామా చేశాడు, అమిత్ షాను కలుస్తున్నాడు, రైటిస్టు… ఎప్పుడైనా మనవాడే… అందుకని లోలోపల బీజేపీ ‘వోకే గో ఎహెడ్’ అంటుంది తప్ప, వారించదు… ఒకవేళ అన్నామలై బీజేపీలోనే ఉన్నా సరే, పళనిస్వామి కోసం తనను ఎంకరేజ్ చేసే సీన్ కూడా లేదు… అందుకని బీజేపీ సైలెంటుగా ఉండబోతోంది… అన్నామలై సరైన దీర్ఘదృష్టితోనే ఉన్నాడు… తమిళనాట జనం ద్రవిడ పార్టీలంటే విముఖత చూపిస్తున్నారు… అది వాస్తవం… స్టాలిన్, పళనిస్వామి చతికిలపడ్డారంటే అదే కారణం… ఏదో ఓ కొత్తతరహా రాజకీయాలు కోరుతున్నారు తమిళజనం… దాన్ని బీజేపీ అర్థం చేసుకోలేకపోయింది… ఆ స్పేసులోకి విజయ్ దూరిపోయాడు… గెలిచాడు… సో, ఇప్పుడిక అక్కడ బీజేపీ సొంతంగా చేయడానికి ఏమీ లేదు… ఒక శూన్యత ఆవరించింది… అందుకే అన్నామలై రాజ్యసభ సభ్యత్వమూ వద్దన్నాడు… ప్రజాక్షేత్రంలోనే పోరాడదలుచుకున్నాడు… మంచి నిర్ణయం… విజయ్ అధికారం డీఎంకే కూటమి చెప్పుచేతల్లో ఉంది, జనానికి నాలుగురోజుల్లో విసుగు, వ్యతిరేకత రావడం ఖాయం… ఇప్పుడప్పుడే డీఎంకే మళ్లీ పుంజుకునే చాన్స్ లేదు, అన్నాడీఎంకేకు అసలే లేదు… సో, మెల్లిగా ఒక స్పేస్ క్రియేట్ కానుంది… అందులోకి ఒక ధనుష్ వంటి కొత్తవాళ్లు ప్రవేశించే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్లందరికన్నా అన్నామలైకి మంచి చాన్స్… తనకు తమిళ రాజకీయాలు, ఆ పార్టీల బలాబలాలపై మంచి అవగాహన ఉంది… దూకుడు ఉంది… వెంటనే ఓ ప్రాంతీయ పార్టీ పెడతాడా..? లేక యువతరం, మార్పు కోరుకునే జనం కోసం ఏదైనా ఓ మూమెంట్ స్టార్ట్ చేసి, దాన్ని రాజకీయాల వైపు తీసుకెళ్తాడా ఇప్పుడే తెలియదు… తనే చెబుతాడు… విజయమో, స్తబ్దతో… డెస్టినీ చెబుతుంది… కానీ అన్నామలై తనదంటూ ఓ ముద్ర వేయగలడు… రాజకీయాల్లో ఓ ఫోర్స్‌లా మనగలడు… ఆల్ ది బెస్ట్…!!
P.Venkateswara Rao
547 views
11 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *కామరాజ్ టు విజయ్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ❗* 29.05.2026🎯 తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ సాధించిన విజయం అనేక చర్చలకు తెరలేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ సాధించిన విజయం అనేక చర్చలకు తెరలేపుతోంది. సంప్రదాయ పార్టీలను మట్టి కరిపించి విజయ్ సంచలనం విజయం సాధించారు. దీనిపై రకరకాల విశ్లేషణలు వ్యక్తం అవుతుండగా, హీరో సూర్య తండ్రి సీనియర్ నటుడు శివకుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ’ప్రజల తీర్పు ఎప్పుడూ ఒకేలా ఉండదు, దానికి నిదర్శనమే కామరాజ్ ఓటమే’ అంటూ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 1954లో తొలిసారిగా సీఎం అయిన కామరాజ్ సుమారు 9 ఏళ్ల 172 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఈ కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు తమిళనాడు దశ, దిశను సమూలంగా మార్చేశాయి. దీంతో తరాలు మారుతున్నా తమిళనాట కామరాజ్ ను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలో విజయ్ గెలుపుపై శివకుమార్ స్పందన మరోసారి కామరాజ్ రూలింగును స్మరించుకునేలా చేసిందని అంటున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రను కామరాజ్ పాలనకు ముందు, ఆ తర్వాత అని విభజించి చూస్తారని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంస్కరణలు, ముఖ్యంగా 'మధ్యాహ్న భోజన పథకం'తో విద్యా విప్లవం తీసుకువచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చేశారని ప్రశంసిస్తుంటారు. అయితే ఆయన గొప్పదనం పాలనలో మాత్రమే కాదని, ఆయన జీవించిన విధానంలో కూడా ఉందని కామరాజ్ మరణాంతరం వెల్లడైంది. తమిళనాడుతోపాటు దేశ రాజకీయాల్లో 'కింగ్ మేకర్'గా చక్రం తిప్పిన కామరాజ్ మరణించినప్పుడు, ఆయన పడుకునే దిండు కింద కేవలం రూ. 140 మాత్రమే లభ్యమైంది. కొన్ని ఖాదీ షర్టులు, పంచెలు తప్ప ఆయన సొంత ఆస్తి అంటూ ఏమీ కూడబెట్టు కోలేదని చెబుతారు. అధికారం ఉంటే కోట్లు సంపాదించుకోవచ్చనే నేటి రోజుల్లో, కామరాజ్ జీవితం ఒక నమ్మలేని నిజంగా కీర్తిస్తుంటారు. ప్రస్తుతం విజయ్ ఇమేజ్‌ను కామరాజ్ వంటి మహానేతలతో పోల్చడంపై తమిళనాడులోని ప్రముఖ చానళ్లు, పొలిటికల్ అనలిస్టుల మధ్య ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. కామరాజ్ ప్రజల మధ్యే ఉంటూ, కింది స్థాయి నుండి ఎదిగిన నాయకుడు అయితే విజయ్ తన అపారమైన సినీ గ్లామర్, యూత్ ఫాలోయింగ్ ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి వీరిద్దరి శైలికి అస్సలు పోలిక లేదనేది ఒక వర్గం వాదన. అంతేకాకుండా లీడింగ్ పార్టీలపై ఉన్న సహజమైన వ్యతిరేకత, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న యువత ఓట్లు విజయ్‌ను గెలిపించాయని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో కామరాజ్ లాంటి నిస్వార్థపరుడిని పక్కన పెట్టి ద్రావిడ సిద్ధాంతాలకు పట్టం కట్టిన తమిళ ప్రజలు, నేడు మళ్లీ మార్పు కోసం సాంప్రదాయ ద్రావిడ పార్టీలను కాదని విజయ్ వైపు మొగ్గు చూపడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసినా కూడా ప్రజలు మార్పు వైపే నిలబడ్డారని, ఇది తమిళనాడు ఓటర్ల విలక్షణతకు నిదర్శనమని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. కామరాజ్ ఓటమి పాఠం.. విజయ్ కి సవాల్ నిష్కళంక చరిత్ర ఉన్న కామరాజ్‌నే 1967 ఎన్నికల్లో తమిళ ప్రజలు ఓడించారు. అప్పట్లో ద్రావిడ సిద్ధాంతాల ఉధృతి ముందు కామరాజ్ చేసిన మంచి పనులు కూడా కొట్టుకుపోయాయి. ప్రజాదరణ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పడానికి కామరాజ్ ఓటమే అతిపెద్ద ఉదాహరణగా చెబుతుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ గెలవడాన్ని స్వాగతిస్తూనే ఆయన భవిష్యత్తులో కామరాజ్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సివుందని శివకుమార్ వంటి వారు హెచ్చరిస్తున్నారు. దళపతి సాధించిన విజయం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, గ్లామర్ తోపాటు మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన విజయ్, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? కామరాజ్ ఆశయాలైన పారదర్శకత, నిస్వార్థ సేవను ఎంతవరకు ఆచరణలో చూపిస్తారు? అనే దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
P.Venkateswara Rao
798 views
15 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *సింహాసనం విజయ్‌ది.. వ్యూహం కాంగ్రెస్‌ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..❗* 25.05.2026🎯 తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం(క్యాబినెట్)లో భాగస్వామి అయింది. విజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కాంగ్రెస్ భవిష్యత్ పొలిటికల్ వ్యూహంలో భాగం అని చెప్పవచ్చు. దీనిలో విజయ్ కూడా పొలిటికల్ గా మాస్టర్ మైండ్ ఉపయోగించినట్లు క్లియర్ గా తెలుస్తోంది. విశ్వాస పరీక్షలో సీఎం విజయ్‌కు మద్దతుగా ఓటు వేసిన 25 మంది ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను విజయ్ తెలివిగా పక్కన పెట్టారు. మంత్రి పదవులపై ఆశలతో వచ్చిన తిరుగుబాటు నేతలకు (వేలుమణి, షణ్ముగం వర్గం) మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, ప్రజావ్యతిరేకత కారణంగా విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల తిరుగుబాటుదారులు ఇప్పుడు అటు పదవులు లేక, ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS)ని ఎదిరించలేక నట్టేట మునిగారు. మైనారిటీ లేదా స్వల్ప మెజారిటీతో ఉన్న తన ప్రభుత్వానికి భవిష్యత్తులో మిత్రపక్షాల నుండి ఎలాంటి ముప్పు రాకుండా ఉండటానికి విజయ్ సరికొత్త ప్లాన్ వేశారు. కూటమి పార్టీలను (కాంగ్రెస్, త్వరలో చేరబోయే విసికె, ఐయూఎంఎల్) నేరుగా ప్రభుత్వంలో భాగస్వాములను చేయడం ద్వారా వారు ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ‘రాజకీయ భీమా’ కల్పించుకున్నారు. గతంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే వైపు ఉన్న బలమైన ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ కూటమి ఈ నిర్ణయంతో అధికారికంగా ముక్కలైంది. తమిళనాడులో బీజేపీ వ్యతిరేక ఓట్లకు కేవలం డీఎంకే ఒక్కటే దిక్కు కాదనే సందేశాన్ని విజయ్ ఇచ్చారు. గత 60 ఏళ్లుగా తమిళనాడులో డీఎంకే లేదా ఏఐఏడీఎంకేలు ఒంటరిగా పూర్తి మెజారిటీతో పాలిస్తూ, చిన్న పార్టీలకు అధికారంలో వాటా ఇచ్చేవి కావు. కానీ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఈ పాత సంప్రదాయాన్ని బద్దలు కొట్టి, చిన్న పార్టీలను ప్రభుత్వంలో చేర్చుకోవడం ద్వారా తమిళనాడును 'కూటమి ప్రభుత్వాల' యుగం వైపు తీసుకెళ్లింది. ఈ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో పుంజుకోవడానికి, 2029 లోక్‌సభ ఎన్నికల్లో టీవీకే-కాంగ్రెస్ బలమైన కూటమిగా ఏర్పడటానికి ఒక పునాదిగా మారింది.
P.Venkateswara Rao
542 views
21 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *తండ్రి హంతకుడికి తమిళ సీఎం నివాళిని రాహుల్ ఎలా స్వీకరించాలి..⁉️* May 19, 2026🎯 ఇదే తేడా… బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి దేశ భద్రతకు సంబంధించి మమత హయాంలో జరిగిన తప్పిదాలను దిద్దుతూ… కంచె కోసం భూమి అప్పగింత, చికెన్ నెక్ భూమి ధారాదత్తం వంటి కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్నాడు… మరి తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్.,.? అడగడకపోయినా తనకు మద్దతునిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆయన తండ్రి రాజీవ్ గాంధీని హతమార్చిన సంస్థ ఎల్‌టీటీఈ… దాని మృత అధినేత ప్రభాకరన్‌ను నివాళి అర్పించాడు… ఈ దేశం రాజీవ్ హత్య తరువాత ఆ సంస్థను నిషేధించింది, వెంటాడింది… మూలాలు పెరికేసింది… టైగర్లకు అన్నిరకాల మద్దతు పలికే డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసింది… అలాంటి ప్రభాకరన్‌కు విజయ్ నివాళి..! ముల్లివైకల్ తీర ప్రాంతంలో జరిగిన ఆఖరి యుద్ధ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విజయ్ ఎక్స్‌లో ఇలా రాశాడు… (అనువాదం)… “ముల్లివైకల్ జ్ఞాపకాలను మేము మా హృదయాలలో మోస్తాము! సముద్ర అవతలి ఒడ్డున నివసిస్తున్న మా తమిళ బంధువుల హక్కుల కోసం మేము ఎల్లప్పుడూ సంఘీభావంగా నిలబడతాము!” 2009 మే 18న శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిన చివరి దశలో ముల్లివైకల్ గ్రామంలో వేలాది మంది తమిళ పౌరులు ప్రాణాలు కోల్పోయారు… అదే రోజున ఎల్‌టీటీఈ (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ కూడా శ్రీలంక సైన్యం చేతిలో మరణించాడు… గ్లోబల్ శ్రీలంక తమిళులు ఈ రోజును ‘తమిళ జీనోసైడ్ రిమెంబరెన్స్ డే’గా జరుపుకుంటారు… సెప్టెంబర్ 2025లో నాగపట్నం పర్యటనలో విజయ్ మాట్లాడుతూ.. “ఈలం తమిళులు ఒక తల్లి లాంటి ప్రేమను చూపించిన నాయకుడిని (ప్రభాకరన్) కోల్పోయి బాధపడుతున్నారు… వారి కోసం గొంతు విప్పడం మన బాధ్యత” అని వ్యాఖ్యానించాడు… తన రాజకీయ ప్రచారంలోనూ ప్రభాకరన్‌ను శ్రీలంక తమిళుల ‘తల్లి’ లాంటి వ్యక్తిగా అభివర్ణించి గతంలో వివాదాలకు తెరలేపాడు…ప్రజాభిప్రాయ సర్వేలు రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకరన్‌కు, భారతదేశంలో నిషేధించబడిన ఎల్‌టీటీఈ (LTTE) కి అనుకూలంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం ఎలా సమర్థనీయం..? స్టాలిన్ అయితే ఈ ప్రభుత్వం చాన్నాళ్లు ఉండదు, మధ్యంతర ఎన్నికలకు సిద్దం కావాలని కేడర్‌కు పిలుపునిస్తున్నాడు… ఇదే డీఎంకే కూడా టైగర్ల మద్దతుదారే… అంతెందుకు..? విజయ్‌కు మద్దతునిస్తున్న వీసీకే బలమైన టైగర్ల మద్దతుదారు… కేంద్రంలోని కాంగ్రెస్ ఎవరి ప్రభుత్వాన్నయితే రాజీవ్ హత్యను చూపి రద్దు చేసిందో, అదే డీఎంకేతో చాలా ఏళ్లుగా కాంగ్రెస్ దోస్తీ..! సరే, అది అనైతికమో, నైతికమో, రాజకీయాల్లో సహజమేనేమో… ఇప్పుడు విజయ్ కూడా అదే బాట… మరి తన తండ్రిని చంపిన హంతకుడికి విజయ్ నివాళి అర్పించడాన్ని రాహుల్ ఎలా స్వీకరిస్తాడు.? ఎలా స్వీకరించాలి..? గతం గతః … హంతకులను ఆయన తల్లే క్షమించింది కదా, ఇంకా ఎందుకు ఉండాలి కక్ష, కోపం అనుకోవాలా..?! రాజకీయ అవసరమా..? భావోద్వేగాలకు రాజకీయాల్లో స్థానం లేదా..? ఉండకూడదా..? [రాజీవ్ గాంధీ హత్య] ──> [డీఎంకే ప్రభుత్వం రద్దు (1991)] │ ▼ [యుపిఎ కూటమిలో భాగస్వామ్యం (2004 – 2014)] ──> (కాంగ్రెస్ + డీఎంకే దోస్తీ) │ ▼ [ప్రస్తుత సమీకరణం (2026)] ──> (ప్రభాకరన్‌ను ఆరాధించే విజయ్ + వీసీకే కూటమికి కాంగ్రెస్ మద్దతు)
P.Venkateswara Rao
625 views
22 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *CM Vijay: రియల్ 'GOAT'.. సీఎం విజయ్‌కు 'TN 07 CM 2026' నంబర్ ప్లేట్‌ను బహూకరించిన డైరెక్టర్ వెంకట్ ప్రభు‼️* 19.05.2026🎯 భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆయన, తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇటీవలే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విజయ్ ను, తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు నేరుగా కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ వెంకట్ ప్రభు, సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జోసెఫ్ విజయ్‌ను కలిసి కంగ్రాట్స్ చెప్పిన వెంకట్ ప్రభు.. ప్రత్యేకంగా తయారు చేయించిన 'TN07 CM 2026' నంబర్ ప్లేట్‌ను అందజేశారు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. "చరిత్ర సృష్టించబడింది.. ఒక చిన్న ఆలోచనగా మొదలై.. ఒక గొప్ప విజన్‌గా మారి.. ఈరోజు ఈ అద్భుతమైన క్షణంగా నిలిచింది. మన గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ అన్నను ఈరోజు కలవడం, 'GOAT' సినిమాకు సంబంధించిన మొట్టమొదటి ఆవిష్కరణను ఆయనకు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. TN07CM2026" అని వెంకట్ ప్రభు పోస్ట్ పెట్టారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ద్విపాత్రాభినయంలో నటించిన యాక్షన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'గోట్' (GOAT - The Greatest Of All Time). ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్ రాజకీయ ప్రయాణానికి పునాది పడింది. ఆయన తన రాజకీయ పార్టీని ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత ఈ చిత్రం విడుదలైంది. ఇందులో విజయ్ 'TN07 CM 2026' రిజిస్ట్రేషన్ నంబర్ గల కారును నడుపుతూ కనిపించారు. కట్ చేస్తే, ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు. గోట్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోగా, విజయ్ రియల్ లైఫ్‌లో అంతకంటే పెద్ద విజయాన్ని సాధించి ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2024లో ఆ సినిమా రిలీజైనప్పుడు కారు నంబర్ ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. విజయ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ క్లిప్పింగ్ బాగా వైరల్ అయింది. విజయ్ ఈ సంవత్సరం ముఖ్యమంత్రి అవుతారానికి వెంకట్ ప్రభు ముందే ఊహించి ఈ సీన్ పెట్టారని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. విజయ్ గెలిచిన తర్వాత #TN07CM2026 అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీనిపై వెంకట్ ప్రభు, ఆయన సోదరుడు నటుడు ప్రేమ్‌జీ అమరన్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య విజయ్ ప్రభుత్వాన్ని స్థాపించి, సీఎం పీఠమెక్కారు. అందులో పేర్కొన్నట్లు మే 7వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలని ప్లాన్ చేశారు కానీ, వీలుపడలేదు. ఏదేమైనా ఈ విషయాన్ని రెండేళ్ల ముందే ఊహించిన వెంకట్ ప్రభును దళపతి ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అందుకే దర్శకుడు ఇప్పుడు అదే నంబర్ ప్లేట్‌తో ఒక మెమొంటోను తయారు చేయించి సీఎం విజయ్ కు బహూకరించారు. ఈ ఫోటోలను ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో ఇద్దరూ నవ్వుతూ కనిపించారు.
P.Venkateswara Rao
608 views
28 days ago
#🕉️ సనాతన హిందూ ధర్మం 🚩 #తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *'సనాతన ధర్మం నిర్మూలన'.. ఉదయనిధి స్టాలిన్ చెంప చెల్లుమనిపించేలా విజయ్ నిర్ణయాలు.. ఇద్దరికీ ఎంత తేడా❓* 13.05.2026🎯 తమిళనాడు అనగానే ద్రవిడ రాజకీయాలు గుర్తుకొస్తాయి. అక్కడ ద్రవిడ వాదంతోపాటు బ్రాహ్మణ వ్యతిరేకత సైతం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. డీఎంకే పార్టీ నుంచి ఇప్పటి దాకా ఒక బ్రాహ్మణుడు కూడా మంత్రి కాలేదంటే.. అక్కడ బ్రాహ్మణేతర వాదం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అఫ్‌కోర్స్ 20వ శతాబ్దం ఆరంభంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని మెజార్టీ ఉద్యోగాలు బ్రాహ్మణులతో నిండిపోయి ఉండేవి. దీన్ని సహించలేకే జస్టిస్ట్ పార్టీ, ఆ తర్వాత ద్రవిడ వాదం పురుడు పోసుకున్నాయి. ఈ క్రమంలోనే డీఎంకే, అన్నాడీఎంకే ఏర్పాటై.. దశాబ్దాలపాటు తమిళనాడును ఏలాయి. ఈ రెండు పార్టీల వైఖరితో విసిగిపోయిన తమిళ ప్రజలు.. విజయ్ ఏర్పాటు చేసిన టీవీకేకు పట్టం కట్టారు. ఇటీవలే తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన విజయ్.. తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎంగా పని చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు సనాతన ధర్మం అంటే ఏమాత్రం గిట్టదనే సంగతి తెలిసిందే కదా. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు, 2023లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఏకంగా డెంగీ, మలేరియాతో పోల్చారు. దాన్ని నిర్మూలించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం అయ్యాయి. దీంతో ఉదయనిధి స్టాలిన్‌పై దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉదయనిధి స్టాలిన్ వైఖరి మారలేదు. తాజాగా మంగళవారం తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఈ ప్రసంగంలోనే తాను, విజయ్ ఒకే కాలేజీలో చదువుకున్నామని.. తమ పార్టీ డీఎంకే రాజకీయాల్లో సీనియర్ కాబట్టి.. తమ సలహాలు విజయ్ తీసుకోవాలని ఆయన ఆర్డర్ వేసినంత పని చేశారు. ఉదయనిధి వ్యాఖ్యల పట్ల విజయ్ పరోక్షంగా స్పందించారు. ఇక్కడ అందరూ సమానమే. ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం మాత్రమే ఉన్న పార్టీకి కూడా ఈ సభలో టీవీకే సభ్యులకు దక్కిన ప్రాధాన్యం దక్కుతుంది. మంచి సలహాలు స్వీకరిస్తాం. మిగతా వాటిని పట్టించుకోం అన్నారు. విజయ్ క్రిస్టియన్ అయినప్పటికీ.. ఆయనకు ఇతర మతాల పట్ల గుడ్డి ద్వేషం లేదు. అందరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలనేదే ఆయన భావనగా ఉంది. అందుకే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ పార్టీలతోపాటు బీజేపీ కూడా బ్రాహ్మణుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినప్పటికీ.. విజయ్ తన పార్టీ తరఫున ఇద్దరు బ్రాహ్మణులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంతే కాదు మైలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పి.వెంకటరమణన్‌కు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు విజయ్. సనాతన ధర్మాన్ని రూపుమాపాలని ఉదయనిధి అసెంబ్లీలో మాట్లాడిన కొద్ది సేపటికే.. సీఎం విజయ్ ఓఎస్డీగా ఓ జ్యోతిషుడిని నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది (ఈ నిర్ణయం పట్ల విమర్శలు రావడంతో 24 గంటల్లోనే విజయ్ ఈ నియామకాన్ని రద్దు చేశారు). ఈ నిర్ణయాల ద్వారా తాను అందరివాడినని విజయ్ చాటుకున్నారు. ఓ వర్గాన్ని గుడ్డిగా ద్వేషించే తత్వం తనది కాదని, సద్విమర్శలను స్వీకరిస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. రాజకీయ కుటుంబంలో పుట్టి, చిన్నప్పటి నుంచి రాజకీయాలను దగ్గర్నుంచి చూస్తూ పెరిగిన ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ వాదం పేరిట సనాతన ధర్మంపై అక్కసు వెళ్లగక్కుతుంటే.. ఏ రాజకీయ నేపథ్యం లేని విజయ్ మాత్రం ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్నారు.