ShareChat
click to see wallet page
search
#🕉️ సనాతన హిందూ ధర్మం 🚩 #తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *'సనాతన ధర్మం నిర్మూలన'.. ఉదయనిధి స్టాలిన్ చెంప చెల్లుమనిపించేలా విజయ్ నిర్ణయాలు.. ఇద్దరికీ ఎంత తేడా❓* 13.05.2026🎯 తమిళనాడు అనగానే ద్రవిడ రాజకీయాలు గుర్తుకొస్తాయి. అక్కడ ద్రవిడ వాదంతోపాటు బ్రాహ్మణ వ్యతిరేకత సైతం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. డీఎంకే పార్టీ నుంచి ఇప్పటి దాకా ఒక బ్రాహ్మణుడు కూడా మంత్రి కాలేదంటే.. అక్కడ బ్రాహ్మణేతర వాదం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అఫ్‌కోర్స్ 20వ శతాబ్దం ఆరంభంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని మెజార్టీ ఉద్యోగాలు బ్రాహ్మణులతో నిండిపోయి ఉండేవి. దీన్ని సహించలేకే జస్టిస్ట్ పార్టీ, ఆ తర్వాత ద్రవిడ వాదం పురుడు పోసుకున్నాయి. ఈ క్రమంలోనే డీఎంకే, అన్నాడీఎంకే ఏర్పాటై.. దశాబ్దాలపాటు తమిళనాడును ఏలాయి. ఈ రెండు పార్టీల వైఖరితో విసిగిపోయిన తమిళ ప్రజలు.. విజయ్ ఏర్పాటు చేసిన టీవీకేకు పట్టం కట్టారు. ఇటీవలే తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన విజయ్.. తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎంగా పని చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు సనాతన ధర్మం అంటే ఏమాత్రం గిట్టదనే సంగతి తెలిసిందే కదా. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు, 2023లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఏకంగా డెంగీ, మలేరియాతో పోల్చారు. దాన్ని నిర్మూలించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం అయ్యాయి. దీంతో ఉదయనిధి స్టాలిన్‌పై దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉదయనిధి స్టాలిన్ వైఖరి మారలేదు. తాజాగా మంగళవారం తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఈ ప్రసంగంలోనే తాను, విజయ్ ఒకే కాలేజీలో చదువుకున్నామని.. తమ పార్టీ డీఎంకే రాజకీయాల్లో సీనియర్ కాబట్టి.. తమ సలహాలు విజయ్ తీసుకోవాలని ఆయన ఆర్డర్ వేసినంత పని చేశారు. ఉదయనిధి వ్యాఖ్యల పట్ల విజయ్ పరోక్షంగా స్పందించారు. ఇక్కడ అందరూ సమానమే. ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం మాత్రమే ఉన్న పార్టీకి కూడా ఈ సభలో టీవీకే సభ్యులకు దక్కిన ప్రాధాన్యం దక్కుతుంది. మంచి సలహాలు స్వీకరిస్తాం. మిగతా వాటిని పట్టించుకోం అన్నారు. విజయ్ క్రిస్టియన్ అయినప్పటికీ.. ఆయనకు ఇతర మతాల పట్ల గుడ్డి ద్వేషం లేదు. అందరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలనేదే ఆయన భావనగా ఉంది. అందుకే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ పార్టీలతోపాటు బీజేపీ కూడా బ్రాహ్మణుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినప్పటికీ.. విజయ్ తన పార్టీ తరఫున ఇద్దరు బ్రాహ్మణులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంతే కాదు మైలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పి.వెంకటరమణన్‌కు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు విజయ్. సనాతన ధర్మాన్ని రూపుమాపాలని ఉదయనిధి అసెంబ్లీలో మాట్లాడిన కొద్ది సేపటికే.. సీఎం విజయ్ ఓఎస్డీగా ఓ జ్యోతిషుడిని నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది (ఈ నిర్ణయం పట్ల విమర్శలు రావడంతో 24 గంటల్లోనే విజయ్ ఈ నియామకాన్ని రద్దు చేశారు). ఈ నిర్ణయాల ద్వారా తాను అందరివాడినని విజయ్ చాటుకున్నారు. ఓ వర్గాన్ని గుడ్డిగా ద్వేషించే తత్వం తనది కాదని, సద్విమర్శలను స్వీకరిస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. రాజకీయ కుటుంబంలో పుట్టి, చిన్నప్పటి నుంచి రాజకీయాలను దగ్గర్నుంచి చూస్తూ పెరిగిన ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ వాదం పేరిట సనాతన ధర్మంపై అక్కసు వెళ్లగక్కుతుంటే.. ఏ రాజకీయ నేపథ్యం లేని విజయ్ మాత్రం ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్నారు.
🕉️ సనాతన హిందూ ధర్మం 🚩 - ఉదయనిధిగుడ్డిద్వేషం: మెచ్యుః &. ನಿಜಯ ఉదయనిధిగుడ్డిద్వేషం: మెచ్యుః &. ನಿಜಯ - ShareChat