కధలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
542 views
4 days ago
ప్రశ్న :- నీలాదేవి ఎవరు .ఆమె వేంకటేశ్వర స్వామిని ఏ విధంగా సేవించింది. #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు సమాధానం :- దేవీభాగవతం,భాగవతం,స్కందపురాణంలో వేంకటాచల మహత్యం ,మార్కండేయ పురాణం లలో పేర్కొన్న విషయాలు ఈ పోస్ట్ కు ఆధారం. వైకుంఠ వాసుడు ఐన శ్రీ మహావిష్ణువు ను శ్రీ,తుష్టి,పుష్టి, ఊర్జ,ఇలా, నీల అనే శక్తులు స్త్రీ రూపం లో నిత్యము సేవిస్తూ ఉంటాయి .వీరు అందరూ లక్ష్మీదేవి యొక్క అంశ స్వరూపాలు . అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో ఈ నామాలను పదే పదే పేర్కొన్నారు. అలాగే వీరితో పాటు ఒక తామసి శక్తి నిత్యం స్వామిని ఆవాహన చేసి ఉంటుంది . ఆ తామసి శక్తి ద్వారానే స్వామి సమస్త సృష్టి నీ నడుపుతాడు. ఆ శక్తి నీ మహామాయ అని దుర్గ అని వైష్ణవి అని అంటారు. ఈ మహామాయాయే ద్వాపర యుగం లో శ్రీ కృష్ణుని చెల్లెలు అయిన అంబికా దేవి గా యశోదా దేవికి జన్మించింది. పైన పేర్కొన్న శక్తులలో నీలా దేవి పరమ శాంత మూర్తి కరుణామూర్తి ఆ నీలాదేవియే వేంకటేశ్వర స్వామివారికి తన నీలాల ను (వెంట్రుకలు )సమర్పించి స్వామి తలపై శిరోజాల మధ్య ఉన్న ఖాళీ నీ నింపి స్వామి వారి అందాన్ని పరిపూర్ణం చేసింది.ఈ నీలా దేవి పేరు మీదనే సప్త గిరు లలో నీలాద్రి లేద నీలాచలం అనే ఓక పర్వతం ఉంది. ఆ నీలాదేవి కి స్వామివారు ఇచ్చిన వరం వల్లనే మనం తిరుమలలో మన తల నిలాలను సమర్పించుకుంటున్నాం. జై శ్రీ కృష్ణ 🙏🌺
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
628 views
4 days ago
ప్రశ్న :- పరుశరాముని ఆహాన్ని శ్రీ రాముడు ఎలా అంతం చేశాడు. #తెలుసుకుందాం #🚩జై శ్రీరామ 🕉️ #🏹 జై శ్రీ రామ్! ##పురాణాలూ_కథలు సమాధానం :- బ్రాహ్మండ పురాణం లోని భృగుమహర్షి వంశ చరిత్ర, రామాయణం లోని బాలకాండం 74 నుంఛీ 76 సర్గ లు మరియు సుందర కాండం లొనీ కొన్ని అంశాలు ఈ పోస్ట్ కు ఆధారం. శ్రీ మహావిష్ణువు ను శోడశ కళా ప్రపూర్ణుడు అంటారు. అంటే స్వామి పదహారు కళల తో ఉంటాడు. శ్రీ మహావిష్ణువు లోని నాలుగు కళల తో బృగువంశం లో జమదగ్ని మహర్షి రేణుక దేవి దంపతులకు జన్మించాడు పరుశరాముడు. కృతయుగం లో వామన అవతారం తరువాత జన్మించిన పరుశరామునికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ బాధ్యత ను అప్పగించారు పార్వతి పరమేశ్వరులు. పరమ శివుడు ఓక అజెయమైన పరుశువు ను ఓక ధనుస్సు ను పరుశరామునికి ఇచ్చాడు. వాటితో భూమండలం లోని అధర్మ పరాయనులు ఐన సమస్త క్షత్రియులను సంహారించి సమస్త భూమండలాన్ని గెలిచాడు పరుశరాముడు.తను సంహారించిన క్షత్రియుల రక్తం తో ఏర్పరిచినవే శమంత పంచకం అనే ఐదు మడుగులు. తరువాత ఆ మడుగుల్లో గంగ జలాన్ని నింపి పరమ పవిత్రం చేశాడు. ఈ ఐదు మడుగులు అత్యంత పవిత్రమైనవి. ఈ మడుగు లు ఇప్పటికి కురుక్షేత్రం లో ఉన్నాయి. గ్రహణ సమయాల్లో స్నానం చేయడానికి దేవతలు కూడా ఇక్కడికి వస్తారు. మహా భారతం లో ఈ మడుగుల గురించి చాలా సార్లు పేర్కొన్నారు. తరువాత తాను గెలిచిన భూమి మొత్తాన్ని కశ్యప మహర్షి కీ దానం ఇచ్చాడు. అందువల్ల భూమి కీ కాశ్యపి అనే పేరు వచ్చింది. కానీ భూమి నీ దానం తీసుకొన్న కశ్యప మహర్షి నాకు దానం ఇచ్చిన భూమి పై నువ్వు ఉండకూడదు అనీ ఆజ్ఞపించాడు. దాంతో పరుశ రాముడు తన గొడ్డలి నీ సముద్రం లో విసరగా సముద్రము వెనక్కి వెళ్లి కొంత భూభాగం ఏర్పడింది. ఆలా ఏర్పడ్డ ప్రాంతాన్ని పరుశరామ క్షేత్రం అన్నారు.కేరళ నుంచి గోవా వరకు ప్రాంతం అంటే కొంకన్ తీరం మొత్తం పరుశరామ క్షేత్రం. అక్కడే కేరళ లో ఉన్న మహేంద్ర పర్వతం పై ఇప్పటికీ నివసిస్తున్నాడు.పరుశ రాముడు. నిజానికి మహేంద్ర పర్వతం పేరుతో ఒడిశా లో కూడా ఓక పర్వతం ఉంది అది కూడా పరుశ రాముని నివాస స్థలం అనీ అంటారు కానీ కేరళ తమిళనాడు బోర్డర్ లో ఉన్న పర్వతమే పరుశ రాముని నివాస స్థలం ఆని నా అభిప్రాయం. దానికి కారణం ఒడిశా ప్రాంతం కూడా కశ్యప మహర్షి కీ దానం ఇచ్చిన ప్రాంతం లోకి వస్తుంది కాబట్టి. కాకపోతే కాశ్యప మహర్శి ఓక వెసులు బాటు ఇచ్చాడు. సూర్యాస్తామయం వరకు తనకు దానం ఇచ్చిన భూమీ పై ఉండొచ్చు. సూర్యాస్తామయం కాగానే మహేంద్రగిరి కీ వెళ్ళిపోవాలి అనేధి నియమం. దాంతో పరుశ రాముడు చీకటి పడగానే ఎక్కడున్నా సరే ఆకాశ మార్గం. లో మహేంద్ర గిరికి వెళ్లిపోయే వాడు. త్రేతా యుగం వచ్చింది. శ్రీ మహా విష్ణువు తనలోని పన్నెండు కళల తో దశరథ మహారాజు కు శ్రీ రాముని గా జన్మించాడు. ****** కొంత కాలానికి రాముడు ఆని పేరు గలవాడు శివ ధనుస్సు ను విరిచి సీతాదేవి నీ వివాహం చేసుకొంటున్నాడు ఆని విన్నాడు పరుశరాముడు. తన గురువు అయిన పరమ శివుని ధనుస్సు ను తన పేరు ఉన్న వాడే భంగ పరిచాడు అనీ తెలుసుకొన్న పరుశ రాముడు తీవ్ర అగ్రహానికి గురి అయి సీతా రాముల కల్యాణ మండపం లోకి తీవ్ర ఆగ్రహం తో ప్రవేశించి. శ్రీ రామున్ని తన ముందుకు రమ్మనీ ఆదేశించాడు. తన ముందు కు వచ్చి వినయం గా నిలబడ్డ శ్రీ రామునీ చూసి నీవేనా రాముడవు శివ అపరాధం చేసిన వాడవు అనగా శివ సంకల్పం ప్రకారమే ధనుస్సు విరిగిపోయింది అనీ అంటాడు శ్రీ రాముడు అయితే ఈ విష్ణు చాపాన్ని కూడా ఎక్కు పెట్టి చూయించు ఆని విష్ణు ధనుస్సు ను శ్రీ రామునీ కీ ఇవ్వగ శ్రీ రాముడు విష్ణు చాపాన్ని తీసుకొంటూ పరుశ రాముని లో నాలుగు శ్రీ మహా విష్ణువు యొక్క కళల ను కూడా స్వీకరిస్తాడు. దాంతో పరుశ రాముని కీ తన అవతారలక్ష్యం పూర్తి అయింది ఆని గ్రహించి తన ముందు ఉన్నది సాక్షత్ శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ రూపం అనీ గ్రహిస్తాడు. రాముడు పుట్టింది పన్నెండు కళల తో కానీ పరుశ రాముని నాలుగు కళలు కూడా శ్రీ రామునీ లో చేరడం తో శ్రీ రాముడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారం అయ్యాడు. అందుకే శ్రీ మహా విష్ణువు యొక్క కోదండం శ్రీ రాముని విల్లు గా మారింది. అప్పుడు విష్ణు చాపాన్ని ఎక్కు పెట్టిన శ్రీ రాముడు ఇలా అంటాడు. నేను విష్ణు చాపాన్ని ఎక్కు పెట్టాను. ఎక్కు పెట్టిన విల్లు ను వృధా గా దించను ఈ విల్లు ను దేనిపై గురి పెట్టాలి చెప్పు నువ్వు తపస్సు తో సంపాదించు కున్న పుణ్య లోకాలను నాశనం చెయ్యన లేకపోతే నీ ఆకాశ గమన శక్తి నీ నాశనం చేయనా అనీ అడుగగా పరుశరాముడు ఇలా అంటాడు. కశ్యప మహర్షి ఆజ్ఞ ప్రకారం నేను సూర్యాస్తామయం తరువాత ఈ భూమి పై ఉండకూడదు రామా.నేను మహేంద్ర గిరి కీ వెళ్ళిపోవాలి. కాబట్టి నా ఆకాశ గమన శక్తి నాకు ఉండాలి నీవు నా తపస్సు తో నేను సంపాదించిన పుణ్య లోకాలను నాశనం చెయ్యి అనగా సరే అనీ పరుశ రాముని యొక్క సమస్త పుణ్యాన్ని ధ్వంసం చేశాడు శ్రీ రాముడు. ఇక్కడ పుణ్యలోకాలను ధ్వంసం చెయ్యడం అంటే పరుశ రాముని తపో శక్తినీ మొత్తం ధ్వంసం చెయ్యడమే. ఆ విధంగా శ్రీ రాముడు పరుశ రాముని తపో శక్తి నీ ధ్వంసం చేసి అతడి గర్వాన్ని అంతం చేశాడు. జై శ్రీ కృష్ణ 🙏🌺
surya
648 views
20 days ago
New thriller story dropping today at 6:30 PM! 📸😱 Don’t miss it. #ai #stories https://youtube.com/@taleflux09?si=86F7zoeglf9A-uLW Please support by watching, liking, and sharing 🙏
surya
1.5K views
21 days ago
Midnight Museum Heist! Detective Arjun Solves the Case #youtube #ai #stories #crime https://youtube.com/shorts/9KO3sEqiw0M?si=CATYkEkWvR-9USRG please like and subscribe
surya
2K views
21 days ago
When darkness came… three friends brought back the light #stories #ai https://youtube.com/shorts/hnNmYRUUEU4?feature=share please support in YouTube also
surya
2.2K views
24 days ago
The Farmer’s Golden Integrity👨‍🌾🌾 #stories #kids #Aistories #ai