మద్యం మత్తులో పోలీస్ డ్రైవింగ్.. యువకుడి ధైర్యం వైరల్!
ఏపీలో సంచలనం రేపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని గుంటుపల్లి హైవేపై ఓ పోలీస్ మద్యం మత్తులో బైక్ నడుపుతూ నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఉన్న బారికేడును ఢీకొట్టాడు.
ఈ ఘటనను గమనించిన ఓ యువకుడు వెంటనే అతడిని ఆపి, “పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా?” అని ప్రశ్నించాడు. అనంతరం మరో పోలీస్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమసిపర్చేందుకు ప్రయత్నించినా, యువకుడు మాత్రం మద్యం పరీక్షలు చేయాలని పట్టుబట్టాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
#vijayawada #📰ఈరోజు అప్డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #🆕Current అప్డేట్స్📢