మన హిందూ సంప్రదాయాలు...💐💐💐

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.1K వీక్షించారు
6 రోజుల క్రితం
గాజులు అందానికే కాదు...సౌభాగ్యానికి చిహ్నం..........!! గాజులు తమ రంగును బట్టి రకరకాల అర్థాలని తెలియజేస్తాయి.. ఎరుపురంగు గాజులు శక్తిని.. నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని.. ఉదారంగు గాజులు స్వేచ్ఛ ని.. ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని.. పసుపు రంగు గాజులు సంతోషాన్ని.. నారింజ రంగు గాజులు విజయాన్ని.. తెల్లరంగు గాజులు ప్రశాంతతని.. నలుపురంగు గాజులు అధికారాన్ని.. ఇలా మట్టిగాజులు ఎంతో ప్రత్యేకత,విశిష్టత ఉంది మన సాంప్రదాయం లో స్త్రీ వేసుకునేమట్టిగాజులకి.. అందుకే సుమంగళి స్త్రీ లు తప్పనిసరిగా ధరిస్తారు. ధనవంతులు రెండు చేతుల నిండా బంగారు గాజులు వేసుకున్నా... ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టిగాజులు ధరించాలని శాస్రం చెబుతుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు, కుంకుమ తో పాటు గాజులు పెట్టి పూజించడం మన సాంప్రదాయం, ఆచారం. ముతైదువులకి గాజులు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. స్త్రీ వేసుకునే గాజులకి ఇంత విశిష్టత వుంది. #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు #పల్లెటూరి సాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
638 వీక్షించారు
11 రోజుల క్రితం
ధూపం..లేదా సాంబ్రాణి పొగ...............!! సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు. ఆదివారం : ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే... ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. సోమవారం: దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం: శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటి దృష్టిలోపాలుండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. బుధవారం : నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది. గురువారం: గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. శుక్రవారం: లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు చేకూరుతాయి. అన్నింటా విజయాలుంటాయి. శనివారం : సోమరితనం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
638 వీక్షించారు
11 రోజుల క్రితం
ఒక్క రాగి చెంబు నీరు – పూర్వీకుల దాహం తీర్చి ఇంట్లో శాంతి, సంపద తెచ్చే సులభ పరిహారం...........!! ఈ చిన్న పరిహారం ఇంట్లో దాగి ఉన్న సమస్యలను (గొడవలు, డబ్బు సమస్యలు, శాంతి లేకపోవడం, అడ్డంకులు) తొలగించడానికి చాలా మంది చేస్తున్నారు. ఇది వాస్తు, పితృదేవతల (పూర్వీకులు) పరిహారంగా పాపులర్ అయింది. ఎవరైనా సులభంగా చేయవచ్చు – ఖర్చు లేదు, మంత్రాలు లేవు, భక్తి మాత్రమే కావాలి. ఎందుకు ఇది చేయాలి? చాలా ఇళ్లలో పూజలు, దీపాలు, శ్రాద్ధాలు అన్నీ సరిగ్గా ఉంటాయి. అయినా సమస్యలు తగ్గవు. కారణం: ఇంట్లో ఉన్న స్త్రీల (భార్య/కోడలు) పుట్టింటి పూర్వీకులు (మామయ్యలు, తాతయ్యలు) ఇంటికి రాలేకపోతారు. వారు బయటే నిలబడి బాధపడతారు. ఆ బాధే ఇంట్లో కష్టాలుగా మారుతుంది (డబ్బు రాకపోవడం, గొడవలు, అనారోగ్యం). ఈ చెంబు నీరు వారికి తృప్తి ఇస్తుంది – వారి దాహం తీరుస్తుంది. ఎలా చేయాలి? (స్టెప్ బై స్టెప్ – చాలా సింపుల్) ఎప్పుడు? అమావాస్య రోజు సాయంత్రం (అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు పూర్వీకులకు ప్రత్యేకం). 1. రెండు చెంబులు తీసుకోండి (రాగి లేదా ఇత్తడి – రాగి బెస్ట్). శుభ్రంగా కడిగి ఉంచండి. 2. ఇంటి బయట (పుట్టింటి పూర్వీకుల కోసం): ఒక చెంబులో నీరు నింపండి (మంచి నీరు). ఇంటి నైరుతి మూల (South-West దిశ – ఇంటి వెనక భాగం లేదా బయటి కుడి వైపు) ఉంచండి. (కొందరు చిటికెడు పసుపు/కుంకుమ వేస్తారు – ఐచ్ఛికం). 3. ఇంటి లోపల (మీ ఇంటి పూర్వీకుల కోసం): మరో చెంబులో నీరు నింపండి. ఇంట్లో తాగునీరు ఉంచే చోట (కిచెన్ లేదా హాల్‌లో) పెట్టండి. 4. ముఖ్యం: రెండు చెంబులు వేరువేరు – ఒకటి బయట, ఒకటి లోపల. ఏమీ చెప్పకుండా, భక్తితో ఉంచండి. తర్వాత రోజు నీటిని మార్చండి (పాత నీటిని తులసి దగ్గర పోయవచ్చు). ఏమి జరుగుతుంది? అమావాస్య నుంచే చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. గొడవలు తగ్గుతాయి, శాంతి వస్తుంది. డబ్బు, ఆరోగ్యం, సంతోషం పెరుగుతాయి. 12 అమావాస్యలు (సుమారు 1 సంవత్సరం) క్రమంగా చేస్తే పెద్ద మార్పు కనిపిస్తుందని చాలా మంది అనుభవాలు చెబుతున్నారు. ఇది సాంప్రదాయ విశ్వాసం మాత్రమే. నమ్మితే చేయండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. మీ ఇంట్లో ఎప్పుడూ శాంతి, సంతోషం, సంపద ఉండాలని కోరుకుంటున్నాము! ఒక్క రాగి చెంబు నీరు... కానీ దాని ఆశీర్వాదం జీవితాన్ని మార్చేస్తుంది! #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
654 వీక్షించారు
12 రోజుల క్రితం
నైవేద్యాలలో ఉల్లిపాయఎందుకు వాడరు ? శ్లోకం: లశునం గృంజనం చైవ పలాండుం కవకాని చ | అభక్ష్యాణి ద్విజాతీనాం అమేధ్య ప్రభవాణి చ || (మనుస్మృతి 5-5) తాత్పర్యం: వెల్లుల్లి (లశునం), ముల్లంగి (గృంజనం), ఉల్లిపాయ (పలాండుం), పుట్టగొడుగులు (కవకాని) — ఇవి అశుద్ధమైన చోట్ల పుడతాయి కాబట్టి ఉపాసకులు (బ్రాహ్మణులు) వీటిని శ్రీవిద్యా సాధకులు తినకూడదు.... ఉపాసకులు (బ్రాహ్మణులు )ఉల్లిపాయలు (మరియు వెల్లుల్లి) తినకపోవడానికి ప్రధాన కారణం అవి తామసిక మరియు రజోగుణ ఆహారాలుగా పరిగణించబడటమే. ఆధ్యాత్మిక సాధనకు, మనశ్శాంతికి సాత్విక ఆహారం ముఖ్యం. ఉల్లిపాయలు కామ వికారాలను, కోపాన్ని, ఆందోళనను పెంచుతాయని మరియు యోగసాధనకు అడ్డుపడతాయని నమ్ముతారు. ముఖ్యమైన కారణాలు: ఆధ్యాత్మిక అడ్డంకులు: ఆత్మశుద్ధి, సాత్విక జీవనశైలి కోసం ఉల్లిపాయ, వెల్లుల్లిని నిషిద్ధంగా పరిగణిస్తారు. ఇవి మనస్సును చంచలం చేస్తాయి. తామసిక/రజోగుణ ఆహారం: ఆయుర్వేదం మరియు యోగశాస్త్రం ప్రకారం, ఉల్లిపాయలు శరీరంలో పైత్యరసాన్ని పెంచి, ఆవేశాన్ని, కామ కోరికలను రేకెత్తిస్తాయి. పౌరాణిక నమ్మకం: రాహు, కేతువుల రక్త బిందువుల నుండి ఉల్లి, వెల్లుల్లి పుట్టాయని, అందుకే ఇవి అశుద్ధమైనవిగా (రాక్షస ప్రవృత్తిని కలిగించేవిగా) భావిస్తారు. దైవ నివేదన: పూజలలో దేవునికి సమర్పించే నైవేద్యంలో ఉల్లి, వెల్లుల్లిని అపవిత్రంగా భావించి వాడరు.అయితే, కాలక్రమేణా మారుతున్న అలవాట్ల వల్ల కొందరు బ్రాహ్మణులు ఇప్పుడు వీటినితీసుకుంటున్నప్పటికీ,సంప్రదాయ ఆచారాలను పాటించేవారు వాటికి దూరంగా ఉంటారు.ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని రోగం వస్తే ఎలా తీసుకోవచ్చా ఇలాంటి ప్రశ్నలు రోగికి దోషం ఉండదు. రోగం లేని వాళ్ళు రోగం వస్తుందని భయంతో తినేసే వాళ్ళకి ఇలాంటివి ఎవరిని ఉద్దేశించి గాని విమర్శించాన్ని దృష్టితో కానీ పైని శ్లోకo తెలపటం లేదు గమనించగలరు శాస్త్ర ప్రమాణాలు... #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #సనాతన ధర్మం.. దేవుళ్ళు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
475 వీక్షించారు
12 రోజుల క్రితం
పల్లెల్లో అప్పటి ఇళ్లల్లో దీగూడు (దీపం గూడు )అని ఉండేది. అది వీధివాకిలి కి ఎదురుగా అందరికీ కనపడేట్టు ఉండేది. తలవాకిలికి (main door)ఇరు వైపులా రెండు దీపం గూళ్లు ఉండేవి. ఇంటి లోపలి దీగూడు లో మట్టి ప్రమిద లో మంచి నూనె (నువ్వులనూనె )వేసి వెలిగించేవారు. ప్రమిద కింద ఆవుపేడ ఉంచి దాని మీద ప్రమిద ఉంచే వారు ప్రమిదలో ఓ రాగినాణెం వేసేవారు దీపం వెలిగించే వారు. బయట వాకిలికి ఇరువైపులా ఉన్న దీపం గూళ్లలో విప్పనూనె వేసి వెలిగించే వారు. బయట ఎందుకు అంటే బయట వీదుల్లోనడిచే వారికి మనకు ఎంతో సౌలభ్యం గా ఉంటుంది. మనసంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ఈ విద్యుత్దీపాలు వచ్చాక అన్నీ పోయాయి. దేవుడి దగ్గర ఓపిక ఉన్న నాడు పెడుతున్నారు దీపం. ఏమి అంటే ఉద్యోగం టైం లేదు అని సాకు చెప్పేస్తున్నారు. తినడానికి ఉన్న టైం దీపం పెట్టడానికి లేదా? 90% జనాలు ఉదయం, సాయంత్రం పెడతారు. పూర్వం ఓ సామెత చెప్పే వారు పూజ గురుంచి ఉన్నవివదులుకోకు, లేనివితెచ్చుకోకు అని అంటే ఉన్నపూజలువదులుకోకండి ఎవరెవరో చెప్పిన కొత్త పూజలు చేయకండి అని. #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
629 వీక్షించారు
12 రోజుల క్రితం
సాయంత్రం పూట దీపం పెట్టేటప్పుడు...........!! శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి. ఏ దేవీ, దేవతా పూజలోనైనా ఆవునేతి దీపం, నువ్వుల నూనెదీపం తప్పక వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీ దేవి కృప కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి. గణపతి అనుగ్రహం కోసం మూడు వత్తుల దీపం వెలిగించాలి. ఆర్థిక లాభాలను ఆశించేవారు నియమపూర్లకంగా ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి. శత్రుపీడ విరగడ కోసం భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించాలి. సూర్య భగవానుని ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి. అలాగే దీపాలు పెట్టేవేళ ఇంటికి ముందు తలుపులు తెరిచి ఉంచాలని, వెనక తలుపులు మూసి వెయ్యాలని, దీపాలు పెట్టాక గోర్లు కత్తిరించకూడదని, ఏడ్వకూడదని, తల దువ్వకూడదని, సంధ్య సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలని, ఇలా అనేకం చెబుతూ ఉంటారు. అయితే ఇవన్ని ఎందుకు చెబుతారు అనేది చాల మందికి తెలియదు. సాయంత్రం పూట జ్యేష్టాదేవి వెనుక ద్వారం నుంచి.. లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని సంధ్య సమయం లోపు వెనక తలుపులను క్లోజ్ చేసి, ముందు తలుపులను తెరిచి ఉంచాలి. దాని వలన జ్యేష్టా దేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మన ఇంటికి ఎవరైన గెస్ట్ వస్తారు అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి, మనం కూడా శుభ్రంగా తయారై, వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురుచూస్తుంటాం. అలాంటిది మన జీవితాలలో వెలుగును నింపడానికి ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరచుకుని, మనం కూడా శుభ్రంగా ఉండి ఆతల్లిని ఆహ్వానిస్తే, వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అంతేకాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోర్లు కత్తిరించడం, తల దువ్వడం, ఏడ్వటం చేయకూడదని పండితులు చెప్తున్నారు. #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు