వరూధిని ఏకాదశి

🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
4.4K వీక్షించారు
16 గంటల క్రితం
*ఏప్రిల్ 13 సోమవారం వరూధిని ఏకాదశి సందర్భంగా...* వరూధిని ఏకాదశి ప్రాముఖ్యత మరియు ఆ రోజున ఇలా చేస్తే...! పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశంతో పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంత ముఖ్యమైన వరూధిని ఏకాదశి ఈ నెల అంటే ఏప్రిల్ 18వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం... పద్మపురాణ ప్రకారం... పద్మపురాణం ప్రకారం, ఒకప్పుడు మంధత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు, ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణు మూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యే సరికే రాజు గారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు. ‘ఓ ప్రభూ, ఇది నాకు ఎందుకు జరిగింది, అప్పుడు రాజు పూర్వ జన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడట. అయితే అదే సమయంలో అదే శ్రీవిష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు. ఆ దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట. అప్పటి నుండి వరూధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్టతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు. అలాగే భజనలు మరియు కీర్తనలు కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి, బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈరోజు విరాళాలు ఇవ్వాలి. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించాలి. శ్రీక్రిష్ణుడు యుధిష్టర రాజుకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు. వరూధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడు. ✔ చేయవలసినవి :- 🔵 దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు. (వీలు ఉంటే) 🔵 రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి. 🔵 ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు. 🔵 శ్రీ మహా విష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి హారం అర్పించాలి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి 🔵 పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి, దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి. 🚫 ఇవి చేయకూడదు... 🔴 ఎర్రని ధాన్యాలను తినకూడదు 🔴 మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తినకూడదు 🔴 మెటల్ ప్లేట్ లో ఆహారం తినవద్దు 🔴 తేనే తినకూడదు 🔴 ఆహారం ఒక్కసారి మాత్రమే చేయాలి. ___________________________________________ #వరూధిని ఏకాదశి #ఏకాదశి శుభాకాంక్షలు #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #🕉️ ఓం నమో వేంకటేశాయ నమః 🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🕉️ ఓం నమో నారయణాయ నమః 🕉️🙏 #🙏🌺ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🌺🙏
PSV APPARAO
550 వీక్షించారు
1 రోజుల క్రితం
#వరూధినీ ఏకాదశి 🕉️ ఏకాదశి వ్రత మహత్యం🙏 #ఏకాదశి రోజున ప్రత్యేక నియమాలు తెలుసా #ఏకాదశి *రేపు వరుథిని ఏకాదశి* *(ఏప్రిల్ 13)* హరే కృష్ణ.. *భక్తి జనని అయిన ఏకాదశి యొక్క నియమాలను తెలుసుకుందాం* ✓ ధాన్యాలు, పప్పులు, శనిగలు, మక్కజొన్న, కూరగాయలలో(గొకర్కాయ, చిక్కుడుకాయ లాంటివి), బటాని వంటివి తినకూడదు. ✓*పండ్లు, పాలు, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, *సామలు* లాంటివి మనం తినవచ్చు* / తులసి పత్త్రిన్ని/ఆకులని ఏకాదశి మరియు ద్వాదశి(ఏకాదశి తరువాత రోజున) తెంపకూడదు. ✓ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం, మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి, శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయడం. ✓ మన రోజును కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం చాలా మంచిది. ధూపం, దీపం, తులసి పత్రం(ఏకాదశి ముందు రోజు తీసినవి), పండ్లు, పూలు సమర్పించి ఆ శ్రీ విష్ణువుని కృప కొరకు ప్రార్థించండి. ✓ హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే || హరే రామ హరే రామ రామ రామ హరే హరే ॥ అనే ఈ మహా మంత్రాన్ని ఎంత కుదిరితే అంత జపించండి. ✓ ఒక గమనిక ఏమిటంటే మనం ఏకాదశి రోజున మాంసము, చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తుపదార్తాలు(సిగరెట్, తంబాకు) మరియు ఇతర తామసిక పదార్థాలను సేవించకూడడు. ✓ ద్వాదశి (ఏకాదశి తరువాత రోజు) ప్రొదున్నే లేచి స్నానంచేసి, విష్ణు మూర్తిని ఆరాధించి, ఉపవాసాన్ని పారణ సమయమున (ఉపవాసము విడిచిపెట్టు సమయం) విడిచిపెట్టాలి, ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతుంది. శ్రీమాన్ ప్రణవానంద ప్రభూజీ యొక్క ప్రవచనాల గురించి మరియు రాబోయే కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ వాట్సాప్ ఛానెల్ ని ఫాలో అవ్వండి 👇🏻👇🏻 https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
PSV APPARAO
1.7K వీక్షించారు
1 రోజుల క్రితం
#ఏకాదశి రోజున ప్రత్యేక నియమాలు తెలుసా #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: వరూథిని ఏకాదశి - ప్రాముఖ్యత Varuthini Ekadashi - 16.04.2023 #ఏకాదశి ప్రాముఖ్యత #వరూధిని ఏకాదశి ప్రాముఖ్యత? #ఏకాదశి *రేపు వరుథిని ఏకాదశి* *(ఏప్రిల్ 13)* హరే కృష్ణ.. *భక్తి జనని అయిన ఏకాదశి యొక్క నియమాలను తెలుసుకుందాం* ✓ ధాన్యాలు, పప్పులు, శనిగలు, మక్కజొన్న, కూరగాయలలో(గొకర్కాయ, చిక్కుడుకాయ లాంటివి), బటాని వంటివి తినకూడదు. ✓*పండ్లు, పాలు, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, *సామలు* లాంటివి మనం తినవచ్చు* / తులసి పత్త్రిన్ని/ఆకులని ఏకాదశి మరియు ద్వాదశి(ఏకాదశి తరువాత రోజున) తెంపకూడదు. ✓ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం, మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి, శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయడం. ✓ మన రోజును కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం చాలా మంచిది. ధూపం, దీపం, తులసి పత్రం(ఏకాదశి ముందు రోజు తీసినవి), పండ్లు, పూలు సమర్పించి ఆ శ్రీ విష్ణువుని కృప కొరకు ప్రార్థించండి. ✓ హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే || హరే రామ హరే రామ రామ రామ హరే హరే ॥ అనే ఈ మహా మంత్రాన్ని ఎంత కుదిరితే అంత జపించండి. ✓ ఒక గమనిక ఏమిటంటే మనం ఏకాదశి రోజున మాంసము, చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తుపదార్తాలు(సిగరెట్, తంబాకు) మరియు ఇతర తామసిక పదార్థాలను సేవించకూడడు. ✓ ద్వాదశి (ఏకాదశి తరువాత రోజు) ప్రొదున్నే లేచి స్నానంచేసి, విష్ణు మూర్తిని ఆరాధించి, ఉపవాసాన్ని పారణ సమయమున (ఉపవాసము విడిచిపెట్టు సమయం) విడిచిపెట్టాలి, ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతుంది. శ్రీమాన్ ప్రణవానంద ప్రభూజీ యొక్క ప్రవచనాల గురించి మరియు రాబోయే కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ వాట్సాప్ ఛానెల్ ని ఫాలో అవ్వండి 👇🏻👇🏻 https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
PSV APPARAO
702 వీక్షించారు
15 రోజుల క్రితం
#కామదా ఏకాదశి 🔱🕉️🔱 ఏకాదశీ వ్రత మహిమ 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఏకాదశి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఏకాదశి వ్రత మహత్యం / ఏకాదశి వ్రత మహిమ 🪔🔱🕉️🙏 *సకల పాప హరణం కామదా ఏకాదశి వ్రతం* *మార్చి 29 ఆదివారం కామదా ఏకాదశి సందర్భంగా...* _డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా ఈ శీర్షిక..._ ప్రతి నెలలో వచ్చే ఏకాదశిలలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చైత్ర మాసం శుక్ల పక్షంలో వచ్చే కామదా ఏకాదశి కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. కామదా ఏకాదశినే దమన ఏకాదశి అని వ్యవహరిస్తారు. పాపాలు హరించడం ఈ ఏకాదశి ప్రత్యేకత. కామద ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు దూరమవుతాయి. ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి అని పురాణ వచనం. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కామదా ఏకాదశి వ్రతం ఆదరించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తుంటారు. స్త్రీలు తమ సమస్త సంపదగా భావించుకునే సౌభాగ్యం చిరకాలం పచ్చగా ఉండటానికి చేసే విశిష్టమైన వ్రతాలలో కామదా ఏకాదశి వ్రతం ఒకటి. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీలక్ష్మీనారాయణులను ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున వేకువనే తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజన ఉపవాసం, జాగరణ చేసి నియమనిష్టలతో నిబంధనలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే ఫలితం బాగుంటింది. అంతేకాకుండా కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. కామదా ఏకాదశికి సంబంధించిన ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది. వరాహ పురాణంలో శ్రీకృష్ణడు, యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు. అలాగే వశిష్ట మహాముని దిలీప రాజుకు ఈ ఏకాదశి వ్రత కథను వివరించాడు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ రాజుకు వినోదం పంచేవారు. ఒక రోజు ఒక గంధర్వుడు సభలో కళా ప్రదర్శన సరిగ్గా ఇవ్వక, పరధ్యానంతో ఉండడం గమనించిన రాజు ఆగ్రహించి ఆ గంధర్వుడిని శపించాడు. ఆ శాపం కారణంగా అతని అందం, సృజనాత్మకత, కళా అంత నాశనమైపోతుంది. రాక్షసుని ఆకారంలోకి మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతగానో బాధపడి భర్తను తీసుకొని వింధ్యాచల అడువుల్లోకి పయణమయింది. అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. అక్కడ ఉన్న శ్రింగి మహర్షిని కలిసి తనకు జరిగిన దురదృష్ట సంఘటన గురించి వెళ్లబోసుకుంది. అప్పుడు శ్రింగి మహర్షి కామదా ఏకాదశి మహత్యం గురించి వివరించాడు. ఆయన చెప్పిన ప్రకారం లలిత భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం ఆచరించి తన కోరిక తీరాలని మనసులో అనుకొని నమస్కరించుకుంది. వెంటనే తన భర్త రాక్షస ఆకారం పోయి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. ఇంతటి మహత్తువున్న కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన తెలియక చేసే పాపాలన్నీ కూడా ప్రోతాయని పురాణాలు చెబుతున్నాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*