voters

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
444 views
4 hours ago
ఎన్నికల కోడ్,నిబంధనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - లేకపోతే లేనిపోని తలనొప్పులు తప్పవు! లేదా ఎన్నికల కోడ్ అమలులో వున్నప్పుడు ప్రజలు వీలయినంతవరకు తమ అవసరాల నిమిత్తమై ప్రయణాల్లో అధిక డబ్బులు తీసుకెళ్లడం వాయిదా వేసుకుంటే సర్వదా శ్రేయస్కరం! ఎన్నికల కోడ్ అమలులో వున్నప్పుడు ప్రజలు అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి.ఎందుకంటే ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ఏ ఒక్క ప్రజానీకం అయిన వ్యవహారిస్తే మాత్రం వారి డ్యూటీ కి, అధికారాలకు అనుగుణంగా ఒక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి మరోవైపు ఎన్నికల కమిషన్ నుంచి లేనిపోని తలనొప్పులు తప్పవు.ఎందుకయినా మంచిది ఈ ఎన్నికల కోడ్ అమలులో వున్నన్ని రోజులు ప్రజలు వీలయినంతవరకు ప్రయాణాల్లో తమ అవసరం నిమిత్తమై అధిక డబ్బులను తీసుకెళ్ళడాన్ని వాయిదా వేసుకుంటే మంచిది.అత్యవసరం అయితే కార్డుల ద్వారానో లేదా మరే ఇతరాత్ర రక్షణాత్మక మార్గాలలో డబ్బును పంపించే ఏర్పాట్లు చేసుకోవాలి. అలాకాకుండా ప్రజలు గుడ్డిగా,అవివేకంతో, మూర్కత్వంతో వ్యవహరించి ఏమవుతుందిలే, మనల్ని ఎవరు పట్టుకుంటారులే అనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.ఒక వేళ తగిన పత్రాలు,ఆధారాలు లేకుండా మీ అవసరాలకు అధిక మెత్తంలో డబ్బులు తీసుకెళ్తూ పోలీసు డిపార్ట్మెంట్ వారికి పట్టుబడితే మాత్రం వారు లేనిపోని ఇబ్బందుల్లో చిక్కుకుపోవడమే కాదు,పైగా ఇన్కమ్ టాక్స్ అధికారుల బారినపడి వీరు కష్టాలను కొని తెచ్చుకోవడంతో పాటు నరక యాతన చవిచూడటం తథ్యం.కాబట్టి ప్రజలు కాస్తంత ముందు వెనుక ఆలోచించుకొని,ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ ఎలక్షన్ నియామవళికి అనుగుణంగా నడుచుకుంటే ఏ మాత్రం ఇబ్బందులు వారికి తలఎత్తవు.అలా కాకుండా ఎలక్షన్ కోడ్ ను తక్కువ అంచనా వేసి,ఎలక్షన్ కమిషన్ నియమావళిని బుట్ట దాఖలు చేసి ఏ ఒక్క ప్రజానీకం అయిన నిర్లక్ష్యంగా,దూకుడుగా వ్యవహరిస్తే మాత్రం వారి మెడ చుట్టూ వారు ఉచ్చు బిగించుకొని మరీ గిల గిల లాడటం తథ్యం.అంతేకాదు ఒక్క డబ్బు వ్యవహారాల్లోనే కాదు,అయా పార్టీలకు సంబందించిన వ్యవహారాల్లో కూడా అనవసరంగా తలదూర్చి గ్రూప్ రాజకీయాలు నడపడం,మీడియాలో ఏదేని పార్టీ మీద అసభ్య వ్యాఖ్యలు చేయడం వంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోయి మిమ్మల్ని కట కటాల వెనక్కు తోసేయడం తథ్యం.అదే మాదిరి ప్రజలలో ఎవరైనా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ స్నేహితులతో బాత్కానీలు కొట్టడం,వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం,మద్యం సేవించి విచ్చలవిడిగా వ్యవహరించడం,దౌర్జన్యాలు చేయడం వంటి చేష్టలకు ఒడిగడితే మాత్రం పోలీసు డిపార్ట్మెంట్ వారి చేతిలో చిక్కి అష్టకష్టాల బారిన పడటం, శృతిమించితే వారి చేతిలో లాఠీ దెబ్బలు సైతం రుచి చూసే దయనీయ పరిస్థితి సైతం వారికి ఎదురుకావొచ్చు. ఏదిఏమైన ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి,ఎలక్షన్ కమిషన్ వారికి పూర్తి స్థాయి అదనపు అధికారాలు సైతం వుంటాయి అనేది ఎవ్వరూ కాదనలేని అక్షర సత్యం.ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వారే బాస్ లు,వారే రథ సారథులు,పరిపాలన దక్షకులు కూడా,అందుకే వారిరువురు చెప్పినట్లుగా లా అండ్ అర్డర్ కు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోక తప్పదు, నడుచుకొని తీరాలి కూడా. ఏమైనా ఎన్నికలు జరిగే వరకు ఆ తర్వాత ఫలితాలు వచ్చే వరకు కూడా ప్రతి ఒక్క ప్రజానీకం కూడా తమ హద్దుల్లో ఉండాలి,ఏ మాత్రం హద్దులు దాటిన,తోక ఆడించిన,ఎలక్షన్ నియమావళికి విరుద్దంగా నడుచుకొన్న అందుకు చట్టరీత్యా వారికి తగిన కఠిన చర్యలు తప్పవు కాక తప్పవు.ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ కోడ్ అమలులో వున్న అత్యవసర కాలంలో, క్లిష్ట సమయాలలో ప్రజలు ఎవరైనా పొరపాటున చట్టంతో పరాచకాలు,చెలగాటం ఆడాలని చూస్తే మాత్రం అందుకు వారు తప్పక భారీ చెల్లించుకోక తప్పదు.తస్మాత్ జాగ్రత్త! - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #elections
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
549 views
6 days ago
ఓటరు దేవుళ్ళు మీరు డబ్బుకు దాసోహమయితే ప్రజాస్వామ్యం ఖుని అయునట్లే! లేదా ఎన్నికల వేళ కోడ్ అమలులో ఉంటునప్పటికి పోలీసు వారి తనిఖీలో మాత్రం ప్రతి ఎన్నికల వేళ లక్షలాది రూపాయలు బయటపడుతున్న వైనం అత్యంత బాధాకరం! మాములుగా అయితే ఏ ఒక్కరూ కూడా ఉడతాభక్తిగా తమ డబ్బులను ఇతరులకు ఇవ్వడమో, పేదవారికి దానం చేయడమో జరుగదు.అయితే ఈ ఎలక్షన్స్ పుణ్యమా అని కొంతమంది పార్టీల నాయకులు ప్రజల ఓట్లకు గాలం వేసేందుకు డబ్బు అనే వజ్రాయుధాన్ని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ వుంటారు అనే మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం.ఇది ఇలా వుంటే ఎన్నికల కోడ్ అమలులో వున్న వేళ పోలీసు వారు తమ విధి నిర్వహణలో రోడ్లపై వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు ఆ తనిఖీల్లో లక్షలాది రూపాయలు ఎన్నికలు జరిగే ప్రతి సందర్భంలో బయటపడుతుండటం,ఆ విచ్చలవిడి డబ్బు ఖచ్చితంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకై ఉపయోగించే డబ్బే అని నిర్ధారణ అవుతుండటాన్ని బట్టి ఈ ప్రజాస్వామ్యంలో డబ్బు అనేది ఎంతటి బలమైన సాధనంగా తమ విశ్వ రూపాన్ని,ప్రతాపాన్ని చూపుతున్నదో మనం ఇట్టే ఊహించవచ్చు.అయితే అయా పార్టీల గెలుపు అవకాశాలను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే నిర్ణయాత్మక శక్తులు మాత్రం ఖచ్చితంగా మన ఓటరు దేవుళ్లే అనడంలో ఎలాంటి అవాస్తవానికి తావు లేదు.అయితే ఈ ఓటరు దేవుళ్ళు పొరపాటున ఈ డబ్బు అనే బలహీనతకు దాసోహమయ్యి స్వేచ్ఛగా వేయాల్సిన తమ అమూల్యమైన ఓటును కాసులకు అమ్ముడుపోయి ఓటు వేస్తే మాత్రం మన ప్రజాస్వామ్యం నిట్ట నిలువునా ఖుని అయ్యినట్లే.అయితే ఓటరు దేవుళ్ళు ఎప్పుడు అయితే డబ్బు అనే మాయల మంత్రదండానికి ఆశపడి,కకృతి పడి,లాలూచి పడి తమ ఓటును అమ్ముకున్నారంటే మాత్రం అంతకుమించిన దౌర్బాగ్యం,దారుణం మరొకటి ఈ ప్రజాక్షేత్రంలో ఉండదు కాక ఉండదు.అంటే దీని అర్థం అందరూ ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోతారు అని కాదు,కొందరు నిరక్షరాస్యులు,డబ్బు అత్యవసరం వున్న,పూట కూడా గడవడం గగన కుసుమం అయిన నిరుపేదలు పొరపాటున తమ ఓటును అమ్ముకున్న కూడా కొంతమంది అయా పార్టీల నాయకుల ముందు తమ హక్కులను,లక్ష్యాలను కాలదన్ని మరీ వారి కాళ్ళ ముందు వారంతా జాగిర్ల పడినట్లే లెక్క.కాబట్టి ఇకనైనా ప్రతి ఒక్క ఓటరు దేవుడు కూడా తమ స్వాభిమానానికి,నైతికతతో కూడిన తమ ఓటు హక్కుకు కట్టుబడి ఎలాంటి పరిస్థితుల్లో ఈ డబ్బు అనే మాయలో పడి తమ వ్యక్తిత్వాన్ని అమ్ముకునే స్థాయికి దిగజారిపోకూడదు.ఎందుకంటే ఎప్పుడయితే ఓటరు మహాశయులు తమ ఓటును డబ్బుతో ముడిపెడతారో మున్ముందు మీరు ఏదేని సమస్య పై ప్రజాప్రతినిధులను ప్రశ్నించే,నిలదీసే అవకాశాన్ని ఖచ్చితంగా,చేజేతులారా కోల్పోతారు అనే పచ్చి యదార్థమైన విషయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మీరు మరువకూడదు. ఏదిఏమైన డబ్బు పోగుట్టుకుంటే మళ్ళీ ఎలాగోలా సంపాదించుకోవొచ్చు,అయితే డబ్బుకు ఆశపడి ఏకంగా మన విలువైన వ్యక్తిత్వాన్నే అమ్ముకొని మరీ ఓటు వేసే కు సంస్కృతికి మనం బీజం వేశామంటే మాత్రం ఖచ్చితంగా అది మన దిగజారుడు వ్యవహారశైలికి ఓ ప్రబల నిదర్శనంగా నిలువడం తథ్యం. కాబట్టి ఓటరు మహాశయులం అయిన మనమందరం నైతిక విలువలకు పెద్ద పీట వేసి,మంచి నడవడిక ఉన్నత వ్యక్తిత్వంతో మన అత్యంత ప్రతిష్టాత్మక ఓటును ఎవరి ప్రొద్భలం,ఒత్తిడి ప్రమేయం ఏ మాత్రం లేకుండా ఓటుకు నోటు అనే అనాగరిక ధోరణికి గుడ్ బై చెప్పి,స్వేచ్ఛగా,నిర్భయంగా మనకు నచ్చిన నాయకునికి ఓటు వేసి మన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టుకుందాం.ఏమైనా రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో విచ్చలవిడిగా లక్షల రూపాయలను ఎరవేసి మరీ ఎలాగోలా ఓటరు మహాశయులను మభ్య పెట్టి తమ పని కానించుకుందాం అనే కొంతమంది అయా పార్టీల నాయకుల కుట్రలు,కుతంత్రాలకు ఓటరు దేవుళ్ళు బలి అవ్వకుండా, శునకాలకు బిస్కెట్ లు ఇచ్చి వాటిని ఎలా వశబరచుకుంటారో అ స్థాయికి మన ఓటరు దేవుళ్ళు దిగజారిపోకుండా తమ స్వార్థం,స్వలాభం కోసం కొంతమంది పార్టీ నాయకులు ఇచ్చే డబ్బును ఖచ్చితంగా, ఖరాకండిగా మన ఓటరు దేవుళ్ళు తిరస్కరిస్తే మన ప్రజాస్వామ్యం మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా వర్దిల్లడం తథ్యం!ఇక ఏమి చేయాలి అనేది అంతా మన ఓటరు దేవుళ్లపై ఆధారపడి ఉంది.వారు ఇచ్చే తాయిలాలకు అమ్ముడుపోయి వారికే ఓట్లు వేస్తారో లేదా వారిచ్చే డబ్బుకు జై కొట్టకుండా,తల ఆడించకుండా వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించి తమ ఓటు విలువను కాపాడుకుంటారో అంతా ఓటరు దేవుళ్ళం అయిన మన చేతుల్లోనే ఉంది! జై హింద్! జయ జయహో భారత్!మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️💶💶💶💷💷💷 - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #voters
MV NEWS TELUGU
931 views
1 months ago
మున్సిపల్ ఎన్నికల వేడి తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ.... #elections https://mvnewstelugu.com/telangana-jilla-punarvyavasthikaranam-charcha/
MANA VOICE
1.1K views
2 months ago
📢మున్సిపల్ రిజర్వేషన్: _______ ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికలకు.. ప్రభుత్వం ఇటీవల రిజర్వేషన్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే: ::::::::::::::: కులాల వారీగా కేటాయించిన స్థానాలు📌 🥇BCలకు: 854 (28.51%) 🥈SCలకు: 444 (14.8%) 🥉STలకు: 187 (6.24%) 🏅జనరల్: 1511 (50.4%) ....... ఓటర్ల జాబితా: (అత్యధికం & అత్యల్పం) ❶. అత్యధికంగా నిజామాబాద్ కార్పోరేషన్ లో: 3,48,051 ఓటర్లు. ❷. ఆత్యల్పంగా కొత్తగూడెం కార్పోరేషన్ లో: 1,34,775 ఓటర్లు. ❸. అత్యధికంగా అదిలాబాద్ మున్సిపాలిటీలో: 1,43,655 ఓటర్లు. ❹. అత్యల్పంగ అమరచింత మున్సిపాలిటీలో: 9,147 ఓటర్లు. ..... #municipalcorporationelections #TgElections #CmRevanth #manavoice #elections #✊ AP మున్సిపల్ ఎన్నికలు #telangana municipal elections
MANA VOICE
1.1K views
2 months ago
📢మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇవి గుర్తుంచుకోండి:📥 __________________ ☛ దాఖలుకు అవసరమైన పత్రాలు:🗳️ 1. 🔴నామినేషన్ ఫారం☑️ 2. 🟠అభ్యర్థి ఆధార్ కార్డు☑️ 3. 🟡ఓటరు ఐడీ కార్డు☑️ 4. 🟢ఇంటి పన్ను రసీదు☑️ 5. 🔵నోడ్యూస్ సర్టిఫికెట్☑️ 6. 🟣కొత్తగా తెరిచిన బ్యాంక్ ఖాతా పుస్తకం☑️ 7. 🟤పాస్ ఫొటోలు☑️ 8. ⚫కుల ధ్రువీకరణ పత్రం☑️ ...... • మున్సిపాలిటీలో రూ.5లక్షలు, కార్పొరేషన్ లో రూ.10 లక్షల వరకు ఎన్నికల కోసం ఖర్చు చేయవచ్చు. • పోటీ చేసే అభ్యర్థుల SC,ST,BC లు మున్సిపాలిటీలో ₹1250, కార్పొరేషన్ లో ₹2500 డిపాజిట్ చేయాలి • కార్పొరేషన్ లో పోటీ చేసే ఇతర కులాల అభ్యర్థులు మున్సిపాలిటీలో ₹2500, కార్పొరేషన్ లో ₹5000 డిపాజిట్ చేయాలి. • అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలి. ఇందులోనే ఎన్నికల ఖర్చులు ఉండాలి. • అభ్యర్థులు ఓటర్, ఆధార్, పాన్, కుల ధ్రువీకరణ, జననం, ఆస్తులు, నేర చరిత్రలతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి. • అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలి. ప్రతిపాదకుల పూర్తి వివరాలు కూడా ఉండాలి. ...... #municipalelections #tgGovt #manavoice #elections #ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు #ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
Manohar Reddy
966 views
2 months ago
#voter ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది... ఓటు హక్కును వినియోగించుకుందాం... ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుందాం... జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. #NationalVotersDay #Voter #YsrCongressParty #YSJagan ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి ఎర్రకోట_రాజీవ్_రెడ్డి sajalaramakrishnareddy gangulaprabhakarreddy peddireddyramachandrareddy svmohanreddy మనోహర్_రెడ్డీ ysrcpsocialmedia 🇸🇱YEMMIGANUR