ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత

PSV APPARAO
2.1K వీక్షించారు
3 రోజుల క్రితం
#🌑చుక్కల అమావాస్య..ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగిపోతాయట! #హరియాలి అమావాస్య అంటే ఏమిటి? ఈ రోజున ఏమి చేస్తారు? #⚫ఆషాఢ అమావాస్య రోజున చేయాల్సిన పనులు..తప్పక పాటించండి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🌑🌞అమావాస్య శుభాకాంక్షలు🌹🌘🌓🌚🌝🌞 🔔 *విశేషం* 🔔 ఆషాఢమాసంలోని చివరి రోజైన నేటి అమావాస్య ను, చుక్కల అమావాస్య అంటారు...``` ఈ రోజున పితృదేవతలను తల్చుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా, గొప్ప ఫలితం దక్కుతుందని చెబుతారు పెద్దలు ... *ఎందుకంటే... మన పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది... మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే, కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది... దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు, అదే చుక్కల అమావాస్య గా చెబుతారు... ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు, దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట... కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా, వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందని పురాణాలు చెబుతున్నాయి !!!... ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం, కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి, ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు... ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా ‘చుక్కల అమావాస్య’ పేరుతో ఒక నోముని నోచుకుంటారట... ఇందుకోసం గౌరీపూజని చేసి , సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు, అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట... దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు, తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక కదా ! https://youtu.be/3a-V6ZcxXdc ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు... రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికీ, అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు, అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి, వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు, ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు... ఈ చుక్కల అమావాస్య వెనకాల ఇన్ని విశేషాలు ఉన్నాయి...✍️``` 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
PSV APPARAO
11.8K వీక్షించారు
4 రోజుల క్రితం
#ఇదే మాస శివరాత్రి విశిష్టత! #మాస శివరాత్రి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *మాస శివరాత్రి* *"మాస శివరాత్రి" ...* ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. *మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి* ? మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు , అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. #చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో , చంచల స్వభావులుగా మారడమో , మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు , ఆరోగ్యం , ధనం , ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అందుకే మనం గమనించవచ్చు .., అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం , ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది. #మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ? ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5 , 11 , 18 , 21 , 56 , 108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆరోజు ప్రదోష వేల శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు , ఆరోగ్యవంతులు , అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి , మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి. #మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు ? ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు , అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా , పెంకిగా , బద్దకంగా , మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖచ్చితముగా మార్పు వస్తుందని భావించవచ్చు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందవచ్చు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
527 వీక్షించారు
4 రోజుల క్రితం
#బిల్వాష్టకం - బిల్వ పూజ #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *🌼🌿 బిల్వాష్టకం - బిల్వ పూజ🌼🌿* *మాస శివరాత్రి సందర్భంగా డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా...* శివ పూజకు అత్యంత శ్రేష్ఠమైనది మారేడు ఆకు. దీనినే సంస్కృతంలో బిల్వ పత్రం అంటారు. మారేడు చెట్టుకి వచ్చే ఆకులు విశేషమైన ఆకారం లో ఉంటాయి. మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి త్రిదళం అని పేరు పొందాయి . ఇది మూడు గుణాలకు ప్రతీకగా (సత్వ రజస్తమో గుణములు), పరమశివుని మూడు కన్నులుగా, మూడు జన్మల పాపాన్ని హరించేదిగా చెప్పబడింది. ఈ బిల్వపత్రాలు ఎండినా కూడా పూజలో వినియోగించ వచ్చు. మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బిల్వపత్రాల మహిమ గురించి రాసిన బిల్వాష్టకం తాత్పర్యం మీకోసం. 🌿 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను. 🌿 అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్ సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం కోటి ఏనుగుల దానం ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల ఫలం తో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం లక్ష్మీ దేవీ స్తన్యము నుండి జన్మించిన, శివునికి ఎంతో ప్రియమైన, బిల్వ వృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం దర్శనం, స్పర్శనం వలన మహా పాపాలను నాశనం చేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం కాశీ నివాసం, కాల భైరవుని దర్శనం, ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలో శివుని కలిగిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 ఫలశృతి బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్ ఫలశృతి: శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వలన పాపాలు తొలగి, పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది.. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
627 వీక్షించారు
4 రోజుల క్రితం
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శివారాధన ఎలాచేయాలి? *శివ పూజ* శివలింగంపై జలాభిషేకం చేయడం, బిల్వదళాలను సమర్పించడం అత్యంత శుభఫలాలను ప్రసాదిస్తుంది. అయితే చందనం, పాలు, భస్మం సమర్పించడం శుభప్రదమే అయినప్పటికీ, శంఖం ద్వారా శివలింగంపై నీటిని సమర్పించకూడదు. శ్రావణ మాసం ప్రారంభమైన వెంటనే దేశవ్యాప్తంగా శివునికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసమంతా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసాలు, జలాభిషేకం, రుద్రాభిషేకం వంటి అనేక ఆచారాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. అయితే శివునికి కొన్ని వస్తువులు అత్యంత ప్రీతికరమైనవైతే, మరికొన్ని సమర్పించడం శాస్త్రోక్తంగా నిషేధించబడింది. అందువల్ల శ్రావణ మాసంలో శివారాధన చేసే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. చిన్న పొరపాటు కూడా పూజ ఫలితాన్ని తగ్గించవచ్చు. మరి శివునికి ఏవి అత్యంత ప్రీతిపాత్రమైనవి, ఏవి సమర్పించకూడదో తెలుసుకుందాం. శివలింగంపై జలాభిషేకం చేయడం సముద్ర మథనం సమయంలో హాలాహల విషం వెలువడినప్పుడు, సర్వలోకాల రక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో ధరించారు. విష ప్రభావం వల్ల ఆయన శరీరంలో తీవ్రమైన వేడి ఏర్పడింది. ఆ వేడిని శాంతింపజేయడానికి దేవతలు ఆయనపై నిరంతరం జలాభిషేకం చేశారు. అందుకే శివలింగంపై నీటిని సమర్పించడం అత్యుత్తమ పూజగా భావించబడుతుంది. బిల్వదళాలను సమర్పించడం శుభఫలాలను ప్రసాదిస్తుంది శివునికి బిల్వదళాలను సమర్పించడం అత్యంత పుణ్యప్రదమైన కార్యంగా భావించబడుతుంది. బిల్వదళంలోని మూడు ఆకులు శివుని త్రినేత్రానికి ప్రతీకగా భావిస్తారు. ధార్మిక విశ్వాసం ప్రకారం, ఒక బిల్వదళాన్ని సమర్పించడం కోటి కన్యాదానాలు చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుంది. చందనం, పాలు మరియు భస్మం శివారాధనలో చందనం, పాలు, భస్మంతో కూడా పూజ చేస్తారు. చందనం సమర్పించడం వల్ల గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయని విశ్వాసం. అదేవిధంగా భస్మం, అక్షతలు (బియ్యం), రుద్రాక్షలు కూడా శివునికి అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. శివునికి ఏవి సమర్పించకూడదు? అలంకరణ వస్తువులు సమర్పించకూడదు శివుడు వైరాగ్య స్వరూపుడు. ఆయన భౌతిక మోహాలకు, బాహ్య సౌందర్యానికి అతీతుడు. అందువల్ల శివారాధనలో పసుపు, మెహందీ, కుంకుమ, బొట్టు వంటి అలంకరణకు సంబంధించిన వస్తువులను సమర్పించడం శాస్త్రం నిషేధించింది. శంఖం ద్వారా నీటిని సమర్పించకూడదు సాధారణంగా అనేక దేవతలకు శంఖంలో నీటిని పోసి అభిషేకం చేస్తారు. అయితే శివలింగంపై శంఖం ద్వారా నీటిని సమర్పించడం నిషిద్ధం. శాస్త్రాల ప్రకారం, శివుడు ఒకప్పుడు శంఖచూడుడు అనే అసురుడిని సంహరించాడు. అందువల్ల శంఖానికి సంబంధించిన వాటిని శివారాధనలో ఉపయోగించరాదని విశ్వసిస్తారు. తులసి దళాలను శివునికి సమర్పించరాదు ఒక పురాణ కథనం ప్రకారం, బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువుల మధ్య జరిగిన వివాదంలో తులసి అసత్య సాక్ష్యం చెప్పింది. ఆ కారణంగా శివుడు ఆమెకు శాపమిస్తూ, తన పూజలో తులసి దళాలను స్వీకరించనని ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది. అందువల్ల శివారాధనలో తులసి దళాలను సమర్పించరు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
580 వీక్షించారు
6 రోజుల క్రితం
#శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం 🕉️🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు అధ్యాత్మిక విశిష్ఠత కామిక ఏకాదశి / అజ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత 🕉️ నారాయణ తే నమో నమః 🙏 #కామిక ఏకాదశి *శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం* *శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం* *భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి...* భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు. మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్‌ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును. ⚜️ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి. ⚜️ మహా విష్ణు దేవతలందరి లో ఉత్తమోత్తమైన దేవుడు.. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు..చక్రీ సర్వోపగతుండు.ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును. ⚜️ ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్తానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది. ⚜️ పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి. ⚜️ జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది. ⚜️ మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ⚜️ ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది. ⚜️ ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు. ⚜️ శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది.తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. ...... ⚜️ జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది... పారాయణం అనంతరం మీ పేరు, చిరునామా ఫోన్ నంబర్ మా వాట్సాప్ నెంబర్ +919700722711 కు మెసేజ్ చేయగలరు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
P.Venkateswara Rao
623 వీక్షించారు
13 రోజుల క్రితం
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి *🕉️🌺 సంకటహర చతుర్థి విశిష్టత 🌺🕉️* 🙏 సంకటహర చతుర్థి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ పక్ష చతుర్థి రోజున ఆచరిస్తారు. ఈ రోజు శ్రీ గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అన్ని విఘ్నాలు, కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని శాస్త్రాలు 🌺 🕉️🙏 సంకటహర చతుర్థి పూజ విధానం 🙏🕉️ 🌺 సంకటహర చతుర్థి రోజున శ్రీ గణపతి స్వామిని ఈ విధంగా పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 🌅 ఉదయం 🛁 స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. 🪔 పూజా స్థలాన్ని శుభ్రపరచి గణపతి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించండి. 🌼 దీపం వెలిగించి ధూపం సమర్పించండి. 🌺 పూజకు కావలసిన సామగ్రి 🍃 దూర్వ (గరిక) 🌺 ఎర్ర పూలు లేదా జపా పుష్పాలు 🍌 అరటిపండ్లు 🥥 కొబ్బరికాయ 🍬 మోదకాలు లేదా ఉండ్రాళ్లు 🍎 పండ్లు 🪔 కర్పూరం, ధూపం, దీపం 💧 అక్షింతలు, గంధం, కుంకుమ 🙏 పూజ చేసే విధానం 🔸 గణపతికి గంధం, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. 🔸 గరిక (దూర్వ) సమర్పించండి. 🔸 ఎర్ర పూలతో అర్చన చేయండి. 🔸 మోదకాలు లేదా ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టండి. 🔸 "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని 21, 54 లేదా 108 సార్లు జపించండి. 🔸 సంకటనాశన గణేశ స్తోత్రం లేదా గణేశ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. 🌙 చంద్రోదయం తర్వాత 🌕 చంద్రునికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. 🙏 గణపతికి కర్పూర హారతి ఇవ్వండి. 🍌 నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో ప్రసాదంగా స్వీకరించండి. 🌼 ఈ రోజు పాటించాల్సినవి ✅ సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండండి. ✅ కోపం, అబద్ధం, చెడు మాటలు నివారించండి. ✅ గోవులకు లేదా అవసరమైన వారికి ఆహారం దానం చేయండి. ✅ గణపతి నామస్మరణతో రోజంతా గడపండి. 🌺 పూజ ఫలితాలు ✨ విఘ్నాలు తొలగుతాయి 💰 ధన, ఐశ్వర్యాలు కలుగుతాయి 📚 విద్యలో, ఉద్యోగంలో విజయం లభిస్తుంది 👨‍👩‍👧 కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతుంది 🙏 మనసుకు ప్రశాంతత, గణపతి స్వామి అనుగ్రహం లభిస్తుంది. 🌺 శ్రీ గణేశాయ నమః 🐘🙏 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా॥ 🕉️🌸 1శ్లోకం🌺ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ । భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ॥ 📖 అర్థం: 🙏 గౌరీదేవి కుమారుడైన వినాయకుడికి నమస్కరిస్తూ, ఆయన్ను ప్రతిరోజూ స్మరిస్తే దీర్ఘాయుష్షు, కోరికలు, ధర్మ–అర్థ–కామ ఫలితాలు లభిస్తాయి. 🌺 శ్లోకం 2 య్కప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం । తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం ॥ 📖 అర్థం: 🐘 గణపతి స్వామి వివిధ దివ్యరూపాలను స్మరించడం ద్వారా విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి. 🌺 శ్లోకం 3 లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ । సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥ 📖 అర్థం: 🌺 గణపతి నామాలను భక్తితో జపిస్తే జీవితంలోని ఆటంకాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయి. 🌺 శ్లోకం 4 నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ । ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ॥ 📖 అర్థం: 🌸 ఈ పవిత్ర నామాలను స్మరించిన వారికి శుభం, ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయి. 🌺 శ్లోకం 5 ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః । న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ॥ 📖 అర్థం: 🙏 ఈ పన్నెండు నామాలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జపించిన వారికి విఘ్నాలు ఉండవు. అన్ని కార్యాల్లో విజయం లభిస్తుంది. 🌺 జపించడం వల్ల కలిగే ఫలితాలు 🌼 విఘ్నాలు తొలగుతాయి 💰 ధనలాభం కలుగుతుంది 📚 విద్యలో విజయం 💼 ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి 👨‍👩‍👧 కుటుంబ సుఖశాంతి 🕉️ మనశ్శాంతి, ఆధ్యాత్మిక పురోగతి 🌺🙏
PSV APPARAO
644 వీక్షించారు
13 రోజుల క్రితం
#శ్రీ కృష్ణుడు కుచేలుడి స్నేహం #నిజమైన స్నేహితులు #నిజమైన స్నేహితులు మీరే #నిజమైన స్నేహబంధం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *చిన్న వయసులో వేద పాఠశాలలో శ్రీ కృష్ణుడు కుచేలుడు అత్యంత స్నేహితులు గా మెలిగారు వారికి తెలియదు ఒకరు రాజు మరొకరు పేద అని, విద్యా కాలం మొత్తం పూర్తి అయ్యింది ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు, ఒకనాడు స్నేహితుడైన శ్రీకృషుడ్ని కలవడానికి కటిక పేద బ్రహ్మణుడు కుచేలుడు వచ్చాడు భటులు అంతః పురంలోనికి ప్రవేశపెట్టలేదు, దివ్యశక్తి గల కృష్ణుడు ఆ విషయాన్ని గ్రహించి తానే స్వయంగా కుచేలుడ్ని భుజం మీద చేయి వేసుకుని లోపలకు తీసుకు వెళ్ళాడు, రాజ భవనం లోపలకు వెళ్లాక అర్ధం అయ్యింది శ్రీకృష్ణుడు ఎంత గొప్ప వాడో అని నాలాంటి పేద వాడికి లోపలకు ప్రవేశించే అర్హత లేదు అని వెనుదిరగ బోయాడు కుచేలుడు, మిత్రమా లోపలకు రమ్ము అని చేయి పట్టుకుని తీసుకు వెళ్ళి ఆసనం వేసి కూర్చోబెట్టి పాదాలు కడిగి అతిధి మర్యాదలు చేసి నాకోసం ఏమి తెచ్చావు మిత్రమా అని శ్రీకృష్ణుడు అడిగినపుడు తన చిరిగిన వస్త్రంలో కొంగుకు ముడి వేసి తెచ్చిన అటుకులు ఇచ్చాడు, అమ్మకండగా తిని స్నేహితునికి గొప్ప వరాన్ని ఇచ్చాడు, ఆనాటి నుండి స్నేహితుల దినోత్సవ వైభవం వెలుగులోకి వచ్చింది... నన్ను నన్నుగా అభిమానించే ప్రియమైన మిత్రులకు శ్రేయోభిలాషులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!* *మీ పొలిమేర శివ వెంకట అప్పారావు!* P S V APPPARAO (Gopalapatnam🇮🇳Visakhapatnam) 💐🤝💐🤝💐🤝💐🤝💐🤝💐
PSV APPARAO
921 వీక్షించారు
21 రోజుల క్రితం
#అలా పండరిపురంలో "వార్కరీ ఉత్సవం" జయ జయ పాండురంగ విఠలా! #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఆషాడ మాసం - ఆధ్యాత్మికతకు అనువైన మాసం #జయ పాండురంగ విఠల ప్రభో 🙏🕉️🙏 *పండరీపురం పాండురంగ ఉత్సవం* *పండరీపురం పాండురంగ ఉత్సవం* > ఓం నమో పాండురంగాయ > ఓం నమో పుండరీక వర్మయా > ఓం నమో నారాయణాయ > ఓం నమో ఆశ్రిత జన రక్షకాయ శ్రీ పాండురంగ స్వామి వారి లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. ఈ ఆలయంలో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తారు. దీనినే పండరీపురం పాండురంగ ఉత్సవం అంటారు. అన్ని ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొట్టమొదటిది. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని, పాండురంగస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేక సేవలు చేస్తారు. కీర్తనలు పాడతారు. మహారాష్ట్ర చంద్రభాగ (భీమా) నదీ తీరాన పండరిపురంలో కొలువైన పాండురంగ స్వామిని విఠలుడు అనికూడా పిలుస్తారు. ఈ స్వామి వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలని చెబుతారు. అంత వైభవంగా అక్కడ ఉత్సవం జరుగుతుంది. మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 'విఠోబా' పేరుతో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షం ప్రసాదించడానికి పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీపాండురంగ స్వామివారి లీలా విశేషాలకు నిదర్శనంగా, భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పండరీపురం దివ్య క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుణ్య క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న భీమా నదిలో స్నానమాచరిస్తారు. భీమా నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఇక్కడ కొలువుతీరడానికి పుండరీకుడే కారణంగా చెబుతుంటారు. ఆ కారణం చేత భక్తులు మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పద్దెనిమిదవ శతాబ్దం కాలంలోనే ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. ఇక్కడ పాండురంగస్వామిని భక్తులు మెట్లమార్గం ద్వారా దర్శించుకుంటారు. పండరీపురంలో శ్రీపాండురంగస్వామి కొలువుదీరడం వెనుక ఒక పురాణగాథ ఉంది. పుండరీకుడు అనే వ్యక్తి భోగాలాలసుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకుని, తమ కొడుకు బుద్ది మార్చమని అర్థించేవారు. కాలక్రమంలో వేశ్యాలోలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను, భార్యను కూడా ఇంట్లో నుండి వెళ్లగొట్టాడు. అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై పశ్చాత్తాపం చెంది అహో రాత్రులు అన్నపానీయాలు మానుకుని తమ తల్లిదండ్రులకు సేవచేశాడు. పుండరీకున్ని శ్రీహరి పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తన తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, అతని వద్దకు ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులుకమ్మని చెప్పాడు. పుండరీకుడు వచ్చేవరకు శ్రీకృష్ణుడు ఆ ఇటుకరాయి మీద నిలబడి ఉంటాడు. పుండరీకుడు తల్లిదండ్రులకు చేసిన సేవలకు మెచ్చుకొని శ్రీహరి అతనికి వరం ఇవ్వాలనుకున్నాడు. పుండరీకుడు శ్రీహరిని అక్కడే ఉండమని కోరుకున్నాడు. అందువల్ల శ్రీహరి అక్కడే శిలారూపుడయ్యాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీహరి అలా శిలారూపుడైన దివ్వ క్షేత్రమే పండరీపురం. మధురలో ఉన్న రుక్మిణీదేవి కృష్ణుడు కనుపించక పోవటంతో ఆయనను వెదుక్కుంటూ వచ్చిన రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు పండరీపురంలో నిలబడి ఉండటం చూసి తాను కూడ అక్కడే ఉండిపోయింది. కాని తనతో చెప్పకుండ కృష్ణుడు వచ్చినందుకు అలిగిన రుక్మణీదేవి ఆయన పక్కన కాకుండ కొంత దూరంగా ఉండి పోయింది. అందువల్లనే పాండురంగ ఆలయంలో కాకుండా ఆలయం వెనుక పక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. పక్కన ఉన్న ఉపాలయాల్లో సత్యభామ, రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మీ, వేంకటేశ్వరస్వామికూడా కొలువుతీరి ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ పాండురంగస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో కనిపిస్తారు. ఆషాఢ ఏకాదశినాడు నిర్వహించే పాండురంగస్వామి ఉత్సవం సందర్భంగా ఈ ప్రాంతమంత భక్తజన సంద్రమవుతుంది. ఉత్సవంలో స్వామివారిని దర్శించుకుంటే వారి ఆశీర్వాదం మెండుగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవంలో పాల్గొనడానికి తరలి వస్తారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
446 వీక్షించారు
21 రోజుల క్రితం
#ధర్మధ్వజం (హిందు చైతన్య వేదిక) సమాచారం ప్రతి రోజు మీకోసం #ధర్మధ్వజం (హిందు చైతన్య వేదిక) భక్తిసమాచారం ప్రతి రోజు మీకోసం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత _*🚩ఈరోజు తొలి ఏకాదశి , శయన ఏకాదశి🚩*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?* హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాడ శుద్ధ ఏకాదశిని *“తొలి ఏకాద‌శి”* అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి – విశిష్టత ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే *“శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం”* అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని *“శయన ఏకాదశి”* అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి. *తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు* మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు. *ఉపవాస ఫలితాలు:* ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. *ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.* ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు , మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు. ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు *‘చాతుర్మాస్య వ్రతం’* అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. *తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..* ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు. *ప్రాశస్త్యం* ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు. *_🙏🙏🙏🙏🙏🙏_*
PSV APPARAO
516 వీక్షించారు
21 రోజుల క్రితం
#ధర్మధ్వజం (హిందు చైతన్య వేదిక) భక్తిసమాచారం ప్రతి రోజు మీకోసం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ధర్మ ద్వజం #ధర్మద్వజం #తొలి ఏకాదశి _*🚩ఈరోజు తొలి ఏకాదశి , శయన ఏకాదశి🚩*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?* హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాడ శుద్ధ ఏకాదశిని *“తొలి ఏకాద‌శి”* అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి – విశిష్టత ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే *“శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం”* అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని *“శయన ఏకాదశి”* అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి. *తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు* మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు. *ఉపవాస ఫలితాలు:* ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. *ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.* ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు , మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు. ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు *‘చాతుర్మాస్య వ్రతం’* అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. *తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..* ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు. *ప్రాశస్త్యం* ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు. *_🙏🙏🙏🙏🙏🙏_*