#భోగాపురం ఎయిర్ పోర్టు శంఖుస్థాపన🛬🛫
*భోగాపురం క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్..*
*అదే బాబు మార్కు రాజకీయం*
-YS జగన్
2019 ఎన్నికలకు నెల రోజుల ముందు
ఒక రాయి వేయడం మినహా మీరు చేసింది ఏముంది బాబూ?
నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ,
నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలకు
రూ.1,200 కోట్లు ఖర్చు పెట్టింది మేమే..
మరి మీరు చేసింది ఏమిటి బాబూ?
కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే
పనులు ప్రారంభించి 2024 ఎన్నికల నాటికే
విమానాశ్రయ రన్వే పనులను కీలక దశకు తేగలిగాం
టెర్మినల్ నిర్మాణ పనులను
కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం
మా ప్రభుత్వం చేసిన విశేష కృషితోనే
2026 జూన్లో భోగాపురం నుంచి
విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని
ఆనాడే ప్రకటించాం
జూన్ 2020లో నిర్మాణం కోసం ..
జీఎంఆర్ సంస్థతో
కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి,
ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్, సైట్ క్లియరెన్స్,
ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్,
ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ
వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే.
అన్నింటికంటే ముఖ్యంగా
మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం.
నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం.
భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు,
ఎయిర్పోర్టుకు నీళ్లు తీసుకురావడం కోసం రూ.75 కోట్లు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.134.5 కోట్లు,
ప్రత్యామ్నాయ రోడ్ల కోసం రూ.7.29 కోట్లు,
సబ్స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు
మొత్తంగా రూ.1,200 కోట్లు ఖర్చు పెట్టింది మేమే
(విశాఖ నగరం నుంచి
విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు
ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు.
ఎయిర్పోర్టు ఉంది కానీ సిటీ నుంచి వేగంగా,
తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు.
భోగాపురం విమానాశ్రయానికి
శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖ నుంచి
విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో,
రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవే కోసం
కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తేవడంతో కేంద్ర మంత్రిగా
ఉన్న గడ్కరీ స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు
అక్కడే ప్రకటించారు.
ఇప్పుడు కూడా
ఆయన అదే శాఖకు మంత్రిగా ఉన్నారు.
చంద్రబాబు గారూ.. మీరు కేంద్రంలో అధికారంలో
భాగస్వామిగా ఉన్నారు.
ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు.
కానీ రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు.
ఇప్పుడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే
ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదీ మీ చిత్తశుద్ధి! )
*Note*:
నా ఫస్ట్ ఎయిర్పోర్టు
హైదరాబాద్ ఎయిర్ పోర్టు.
రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ వేశారు.
మళ్లీ ఆయనే సీఎంగా ప్రారంభోత్సవం చేశారు.
మా రెండో ఎయిర్పోర్టు ఢిల్లీ ఎయిర్ పోర్టు.
దానిని కూడా రాజశేఖరరెడ్డి వారితో పాటు వచ్చి
ప్రారంభోత్సవం చేశారు.
ఈ రోజున అది భగవంతుడు నిర్ణయమో తెలియదు..
వారి తనయుడు జగన్మోహన్రెడ్డి అమృత హస్తాలతో
భోగాపురం ఎయిర్పోర్టుకు ఫౌండేషన్ వేయడమనేది.
వారే దీనిని మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను.. ’
–జీఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు 2023 మే 3న
భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన సభలో చేసిన వ్యాఖ్యలివి.