యాదాద్రి: రమణేశ్వరం మార్కండేయ క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రమణేశ్వరం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మార్కండేయ మహాక్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని రుషి లింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణమంతా శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది
#రమణేశ్వరం #🌺వరలక్ష్మి వ్రతం స్టేటస్🙏 #🪔శ్రావణ మాసం #🛕శివాలయ దర్శనం #📙ఆధ్యాత్మిక మాటలు