ShareChat
click to see wallet page
search
#శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము పారాయణ ఫలితం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాఘ పూర్ణిమ - మహా మాఘి / శ్రీ లలితా దేవి జయంతి 🔱🕉️🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రీ లలితా సహస్ర నామ స్త్రోత్రం / శ్రీ లలితా సహస్ర నామ పారాయణం *మాఘపూర్ణిమ శ్రీ లలితా జయంతి* ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయం లో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత, పంచదశాక్షరీ మంత్రాధిదేవత. భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమినాడు శ్రీ లలితాదేవి ఆవిర్భ వించినట్టు పురాణాలు చెబుతున్నాయి. *‘మఘము’* అంటే యజ్ఞం. యజ్ఞ, యాగాలూ, పవిత్రమైన దైవకార్యాలూ చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే *"మహా మాఘి"* అని కూడా అంటారు. ఈరోజున చేసే సముద్ర, నదీ స్నానాలు, పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. *లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.* లలితా దేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది. భండాసురుడు అనే రాక్షసుడు శివు డి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపో నిష్టకు మెచ్చి, ప్రత్యక్ష మయ్యాడు. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే.. ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలనీ, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు, వరగర్వంతో విజృంభించిన భండాసురుడు తనసోదరులతో కలిసి మూడు లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలను భరించలేక..... నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహాయాగం చేశారు. ఆ హోమగుండంనుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి, శ్రీచక్రాన్ని అధిష్ఠించి, భండాసురుణ్ణి సంహరించింది. ఆమె రౌద్రరూపాన్ని శాంతింపజేయడానికి దేవతలు, మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే *‘శ్రీ లలితా సహ స్రనామం’* గా ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది. సకల సృష్టినీ నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి. సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏరూపంలో పూజించినా *‘లలితాసహస్రనామా’* న్ని పఠిస్తారు. అరుణవర్ణంలో ప్రకాశిస్తూ, పాశాన్నీ, అంకుశాన్నీ, పుష్పబాణాలనూ,ధనస్సునూనాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీ లలితా దేవిని భయాన్ని పోగొట్టి, శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి, లలితాసహస్రనామ, పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ, కళ ల్లోప్రావీణ్యాన్నీ, కుటుంబసౌఖ్యాన్నీ, ప్రశాంతతనూ, సంపదనూ ప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మిక. ప్రత్యేకించి *శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమిరోజున.* పవిత్రస్నానాలు చేసి, లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ, అలాగే *‘ప్రాతః స్మరామి లలితా వదనార విందం...’* అంటూ ప్రారంభమయ్యే *‘శ్రీలలితా పంచ రత్న స్తోత్ర’* పారాయణ కూడా విశేష ఫల ప్రదమనీ పెద్దల మాట. సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాన్ని పఠిస్తారు. మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే *‘మహా మాఘి’* అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర,నదీస్నానాలు, పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితాజయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. . *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము పారాయణ ఫలితం - ಜಯಂತಿ లలితా శుభాకాంక్షలు ಜಯಂತಿ లలితా శుభాకాంక్షలు - ShareChat