లక్ష్మీ కటాక్షం కొరకు.........!!
ఆ లక్ష్మీ దేవి చల్లగా చూస్తేనే మనకు భోగభాగ్యాలు, ఆస్తులు అంతస్తులు దక్కేది.
అందుకోసమే ఆమెను మొక్కులు, పూజలు చేస్తుంటాం. అయితే లక్ష్మీదేవిని తిధి ప్రకారం పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆ తిధిని బట్టి చేయాల్సిన పద్దతులు కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం.
పాడ్యమి.
ఈ రోజున లక్ష్మీ దేవికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి.
విదియ.
ఈ రోజున చక్కెరతో అమ్మవారికి అభిషేకం చేయాలి.
తదియ.
ఈ రోజున కూడా ఆవుపాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది
చవితి.
పిండివంటల నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు సంప్రాప్తిస్తాయి.
పంచమీ.
అరటిపళ్ళు నైవేద్యం నివేదించడం వలన మేథస్సు, బుద్ధిశక్తి దిగ్వినీకృతం అవుతుంది (పెరుగుతుంది).
షష్ఠి.
తేనెతో అభిషేకించి..తేనెను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది.
అష్టమి.
బెల్లం నీళ్ళతో అభిషేకించి, శుద్ధి బెల్లం ఎవరికయినా దానం ఇవ్వడం వలన అష్టకష్టాలు తీరిపోయి సుఖంగా ఉంటారు.
నవమి.
పేలాలు నైవేద్యం నివేదించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
దశమి.
నల్లనువ్వులతో చేసిన నైవేద్యాన్ని పెట్టినట్టయితే దీర్ఘాయుష్షు లభిస్తుంది.
#ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః #ఓం శ్రీమాత్రే నమః🙏🕉️🌹🙏 #శ్రీ మహాలక్ష్మి దేవి #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి


