🌟 సర్కారీ ఉద్యోగం = జీవిత భద్రత అనే భావన ఉన్న సమాజంలో, ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల వాణీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
2022లో IBPS పరీక్ష క్లియర్ చేసి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో ప్రొబేషన్రీ ఆఫీసర్ (Scale-I Officer) గా చేరింది.
మీరట్లో లోన్ సంబంధిత పనులు నిర్వహిస్తూ, బాధ్యతలతో కూడిన ఉద్యోగంలో కొనసాగింది.
ఉద్యోగం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి, నిరంతర ప్రెజర్ తన వ్యక్తిత్వాన్ని మార్చేస్తున్నాయని వాణీ తెలిపింది.
ఎప్పుడూ హ్యాపీగా ఉండే తాను, చిరాకు, కోపం ఎక్కువయ్యే వ్యక్తిగా మారుతున్నానని గుర్తించింది.
తాను మారిపోతున్న విధానం నచ్చక, జీతం కంటే మానసిక శాంతినే ప్రాధాన్యంగా తీసుకుంది.
2025 సెప్టెంబర్లో, ఎలాంటి Plan B లేకుండానే రాజీనామా చేసింది.
ఈ నిర్ణయం అందరికీ సాధ్యం కాదని అంగీకరిస్తూనే, తప్పు చోటు వదిలిన తర్వాత దొరికే శాంతి అమూల్యమని చెప్పింది.
వాణీ కథ ఇప్పుడు కెరీర్ – మానసిక ఆరోగ్యం మధ్య సమతుల్యత అవసరం అనే చర్చకు ప్రతీకగా మారింది.
💖 ఏ ఉద్యోగం అయినా, మన స్వరూపాన్ని కోల్పోయేంత విలువైనది కాదు అనే బలమైన సందేశం ఇచ్చింది.
#వావ్ #wow #వా...వ్.. 😳😳


