#శ్రీశైల మల్లన్న భ్రమరాంబికా వైభవం 🕉️🔱🕉️ శ్రీశైలం ఉత్సవాలు 🙏 #మహాశివరాత్రి 🔱 శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు 🕉️🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శ్రీశైలం...మల్లికార్జున స్వామి...🙏 నమశ్శివాయ #🥀శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు 🙏🕉️
*శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు*
*ఫిబ్రవరి 8 శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం...*
శ్రీశైల మల్లన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం కొలువైవున్న పరమాద్భుత దివ్య క్షేత్రం శ్రీశైలం. పుడమికి నాభిస్థానం ఉంది. ఏ శుభకార్యానికి సంకల్పం చెప్పుకున్నా శ్రీశైలానికి ఏదిక్కున ఉన్నమో. ఏ ప్రదేశాన ఉన్నామో చెప్పుకొని, శుభాకార్యాన్ని ప్రారంభిస్తాము. ఇంతటి ప్రాశస్థం కలిగిన శ్రీశైలక్షేత్ర బ్రహ్మోత్సవాలంటే అవి అంబరచుంబిత సంబరాలే. సమస్త మానవాళికి మంగళప్రదం శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు.
ప్రధానంగా శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా మాఘమాసంలో 11 రోజుల పాటు మహావైభవంగా జరుగుతాయి. ద్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నవాహ్నిక దీక్షలతో కొనసాగుతాయి. ప్రతి రోజు వాహన సేవలు, శ్రీశైల మల్లన్న శ్రీబ్రమరాంబిక దేవికి విశేష అలంకరణలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రీశైల మల్లికార్జునుడికి అభిషేకం చేస్తే కోటి శివలింగాలకు చేసిన పుణ్యఫలం వస్తుంది. కోటి జన్మల పాపాలు కూడా పఠాపంచలైపోతాయి. ఇక శివరాత్రి లింగోద్భవం సమయంలో మల్లన్నను దర్శించుకున్నా, అభిషేకం చేసినా అంతకు మించిన పుణ్యఫలం మరొకటి ఉండదు.
కాశీలో మరణిస్తే మరుజన్మ ఉండదు కాని శ్రీశైల శిఖరదర్శనం చేసినంత మాత్రాన పునర్జన్మ ఉండదని ప్రాజ్ఞుల ప్రగాఢ విశ్వాసం- శ్రీశైల గర్భాలయం పక్కనే ఒక గుండం ఉంది. స్వామివారి దర్శనం అయిన తరువాత భక్తులు వెలుపలికి వచ్చే దారిలోనే ఈ గుండం ఉంది. ఇందులో గర్భాలయ శిఖరం కనిపిస్తుంది ఇదే అసలైన శిఖర దర్శనం అని చెపుతారు.
పరమాద్భుత శ్రీశైలక్షేత్రానికి మహాభారత రామయణ గాధలతో ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ రామ ప్రతిష్టిత శివలింగం ఉంది. అలాగే సీతామాత ప్రత్యేకంగా తయారుచేసిన వెయ్యిలింగాలతో చెక్కిన ఒక శివలింగాన్ని ప్రతిష్టించింది. అంతేకాకుండా మహాభారతంలో పాండవులు వన వాసం చేసిన సమయంలో వారు చాలాకాలం శ్రీశైలంలో ఉండి శివారాధన చేసారు. ఈ సమయంలో వారు ప్రతిష్టించిన ఐదు శివలింగాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని పంచపాండవుల శివలింగాలుగా-పిలుస్తారు. భక్తులు వాటిని కూడా దర్శించుకుంటారు. ఒకానొక సమయంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ శ్రీశైలంలో అజ్ఞాతంగా ఉన్నారు. ఆ సమయంలో బ్రమరాంబికా దేవిని నిష్టతో ఉపాసన చేసారు. శివాజి భక్తికి మెచ్చిన బ్రమరాంబదేవి విజయ ఖడ్గాన్ని శివాజీకి ప్రసాదించింది. ఈ సంఘటను తలపింపచేసే విధంగా ఆలయప్రాంగణంలో బ్రమరాంబ దేవి. శివాజీకి ఖడ్గం అందిస్తున్న దృశ్యం నిలువెత్తు శిలలలో మలచారు. ఈ సన్నివేశం చూస్తే దేశభక్తితో శరీరం రోమాంచింత మవుతుంది.
మహాశివరాత్రి రోజు శ్రీశైలంలో గడపటం, ఉపవాసంతో జాగరణ చేయటం ఈ జన్మకు దక్కిన గొప్పవరంగానే భావించాలి. శివపార్వతుల కళ్యాణంకూడా మహాశివరాత్రి రోజే జరిగింది. అందుకే ఈ రోజు శివపార్వతుల కళ్యాణం చాలా అద్భుతంగా జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి శ్రీశైలం చేరుకుంటారు. ఇక ఈ కళ్యాణం చూడటానికి భక్తజనం పోటెత్తుతారు.
ఈ 11 రోజుల బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు వాహన సేవలు ఉంటాయి నందివాహనం, పర్వతవాహనం, హంసవాహనం సింహవాహనం, గజవాహనం ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. భక్తులను అనుగ్రహించే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వాహనాలపై స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే నెరవేరని కోరికలు అంటూ ఏమి మిగలవు. శివరాత్రి రోజునే సముద్ర మదనంలో వచ్చిన హాలాహాలాన్ని స్వీకరించి స్వామి వారు నీలకంఠుడైనాడు. మహా జ్యోతి స్తంబంగా శివలింగం ఆవిర్భవించిన రోజు కూడా ఇదే కనుక ఈ సమయానే లింగోద్భవ సమయం అంటారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే రథోత్సవం చూడటానికి రెండు కళ్ళు చాలవు. బంగారురథంపై, కోటి సూర్యసమాన తేజో విరాజితులై ప్రకాశిస్తున్న స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటే కలిగే ఆ అద్భుత అనుభూతి చెప్పనలవికాదు. రథం కదలివస్తుంటే కైలాసమే కదలివస్తున్నంత అనుభూతి కలుగుతుంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని ప్రఖ్యాత సంగీత విద్వాంసులు భక్తులను అలరిస్తూ శివనామ సంకీర్తనలు ఆలపిస్తారు. ప్రతి రాష్ట్రంలో ప్రఖ్యాత కళాకారులు విధిగా ఉత్సవాలకు వచ్చి అసాధారణ ప్రదర్శనలు ఇస్తారు. చెంచు తెగకు సంబంధించిన సంప్రదాయ నృత్యాలు అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి.
శ్రీశైలంలో శివరాత్రి లింగోద్భవ సమయంలో తలపాగా ఉత్సవం చేస్తారు. ఇది కూడా చాలా గొప్పగా జరుగుతుంది ఒక పద్మసాలీ కుటుంబం సంవత్సరం అంతా శ్రమించి, పట్టుపాగాను తయారుచేస్తారు. ఈ పొగాను ఆ కుటుంబ పెద్ద గర్భాలయ గోపురం పైనుంచి నాలుదిశలా చుట్టి అలంకరిస్తారు. అప్పుడు ఆలయం ప్రాంగణంలో లైట్లన్నీ ఆర్పివేస్తారు. ఆలయ ప్రాగంణం చీకటితో నిండిపోతుంది. ఈ సమయంలోనే అర్థ దిగంబరియైన ఆ పద్మసాలి ఈ కార్యాన్ని నెరవేరుస్తారు. ఆలయ ప్రాంగణం ఓం నమఃశివాయ స్మరణతో మారుమ్రోగుతుంది.
భక్తులందరు తన్మయత్వంతో పాగా ఉత్సవాన్ని వీక్షిస్తారు. బ్రహ్మోత్సవాలలో పుష్పోత్సవం, ఆరుద్రోత్సవం లాంటివికూడా విశేషంగా జరుగుతాయి.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*


