13 shares
More like this
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣శ్రావణ మాసం వస్తోంది............!! పండుగలకు గృహ శోభ కి విశేష మాసం శ్రావణ మాస విశిష్టత ...... వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మే. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పూర్వీకుల ఉవాచ. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మానం ఇదే. శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది. శ్రావణ సోమవారం ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు శ్రావణ మంగళవారం కొత్త పెళ్లికూతురు శ్రావణమాసంలో వచ్చే ప్రతిమంగళవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మంగళగౌరీ అనుగ్రహం తో అష్టైశ్వర్యాలు, నిండు ముత్తెదుతనం పొందుతారు. శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు. శ్రావణ శుక్రవారం ఈ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవి ని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం శ్రావణ శనివారాలు ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి . జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. నాగుల చవితి నాగుల చవితి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి ని నాగదేవతలకు ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం, నాగ దేవతలకు పాలు పోస్తే సంతానానికి సంబంధించిన దోషాలు అన్ని తొలుగుతాయి. సర్పదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శ్రీ సంతోషిమాతా వ్రతం శ్రావణ పూర్ణిమ రోజుని శ్రీ సంతోషీ మాతా జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున సంతోషిమాతా వ్రతం చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని నమ్మకం. శ్రీ సంతోషిమాతా వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్నిశుభాలు కలుగుతాయని, ధన, కనక, వస్తు, వాహన యోగంతో పాటు నిండు ముతైదుతనం లభిస్తుందని మహిళలు భావిస్తారు. . రక్షా బంధనం శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. మహిళలు తమ అన్నదమ్ములకు, సోదర సమానులకు రాఖీని కట్టి వారి క్షేమం కోరుకుంటారు. శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది. హయగ్రీవ జయంతి శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణాల్లో ఉంది. ఈ రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతాలు, విశేష ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ రోజున హయగ్రీవుల వారి ద్వారా ఉపదేశించిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్లు నైవేద్యం పెట్టటం మంచిది. మనలో ఉండే అహంకారం తొలగిపోయి అందరిలో సమ భావన కలిగి ఉంటారు. #తెలుసుకుందాం #🕉️పవిత్ర శ్రావణ మాసం🙏 #🪔శ్రావణ మాసం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏2731
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣జీవితం కఠినంగా అనిపించినప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొనే జీవిత పాఠాలు పరిచయం ప్రతి మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, అపజయాలు సహజం. జీవిత ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి. మరికొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా సమస్యలే ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి, వ్యాపార నష్టాలు, కుటుంబ కలహాలు లేదా మనసుకు దగ్గరైన వారిని కోల్పోవడం వంటి సంఘటనలు జీవితాన్ని భారంగా మారుస్తాయి. అలాంటి సమయంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకుంటే, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగగలం. 1. ఈ పరిస్థితి శాశ్వతం కాదు ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. సుఖం వచ్చినట్లు దుఃఖం కూడా వస్తుంది. దుఃఖం వచ్చినట్లు సుఖం కూడా వస్తుంది. వర్షాకాలం తర్వాత ఎండాకాలం వస్తుంది. అలాగే కష్టాల తర్వాత మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య ఎంత పెద్దదిగా అనిపించినా అది శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. "ఇది కూడా గడిచిపోతుంది" అనే భావన మనసుకు గొప్ప బలాన్ని ఇస్తుంది. 2. మీరు ఊహించిన దానికంటే బలమైనవారు మనిషి తనలో ఉన్న శక్తిని పూర్తిగా తెలుసుకోడు. కష్టాలు వచ్చినప్పుడే మన అసలు సామర్థ్యం బయటపడుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలను ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు కూడా అవి చాలా పెద్దవిగా అనిపించాయి. కానీ మీరు వాటిని అధిగమించారు. అంటే ఇప్పుడు ఎదురవుతున్న సమస్యను కూడా అధిగమించే శక్తి మీలో ఉందన్నమాట. 3. అపజయం అంతిమం కాదు ఒక అపజయం జీవితానికి ముగింపు కాదు. అది ఒక పాఠం మాత్రమే. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరూ అనేక అపజయాలను ఎదుర్కొన్నారు. - థామస్ ఎడిసన్ వేలసార్లు విఫలమయ్యాడు. - అబ్రహం లింకన్ ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయాడు. - డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. వారి విజయానికి కారణం వారు ఓటమిని అంగీకరించకుండా ముందుకు సాగడమే. 4. సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టండి సమస్య గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల సమస్య తగ్గదు. ప్రశ్న: "ఎందుకు ఇలా జరిగింది?" కన్నా, "ఇక్కడి నుండి నేను ఏమి చేయగలను?" అని ఆలోచించడం మంచిది. సమస్యలను లెక్కపెట్టడం కంటే పరిష్కార మార్గాలను వెతకడం జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. 5. చిన్న చిన్న అడుగులు కూడా పురోగతే కష్టకాలంలో పెద్ద లక్ష్యాలు భయపెడతాయి. అప్పుడు ఒక్కరోజు, ఒక్కపని, ఒక్క అడుగు అనే విధంగా ముందుకు సాగాలి. రోజుకు 1% మెరుగుదల కూడా ఏడాది తర్వాత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గొప్ప విజయాలు ఒక్కరోజులో రావు. అవి చిన్న చిన్న విజయాల సమాహారం. 6. సహాయం అడగడం బలహీనత కాదు చాలామంది తమ బాధలను ఒంటరిగా భరిస్తారు. కానీ మనిషి ఒక సామాజిక జీవి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. సహాయం కోరడం బలహీనత కాదు. అది పరిపక్వతకు గుర్తు. 7. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి కష్టకాలంలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. కానీ ఆరోగ్యమే మనకు ఉన్న అతి పెద్ద సంపద. - సరైన నిద్ర - సమతుల ఆహారం - నడక లేదా వ్యాయామం - ధ్యానం - యోగా వంటి అలవాట్లు మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. 8. ప్రతి కష్టంలో ఒక పాఠం ఉంటుంది జీవితం మనకు ఎప్పుడూ పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. కొన్ని పాఠాలు పుస్తకాల ద్వారా వస్తాయి. మరికొన్ని పాఠాలు కష్టాల ద్వారా వస్తాయి. మన జీవితంలోని గొప్ప ఎదుగుదల చాలా సార్లు కష్టకాలంలోనే జరుగుతుంది. 9. మీ విలువ పరిస్థితులపై ఆధారపడదు ఉద్యోగం పోయిందని, వ్యాపారంలో నష్టం వచ్చిందని, ఒకసారి విఫలమయ్యారని మీ విలువ తగ్గిపోదు. మీ విలువ మీ ఆదాయం కాదు. మీ విలువ మీ పదవి కాదు. మీ విలువ మీ బ్యాంకు బ్యాలెన్స్ కాదు. మీ విలువ మీ వ్యక్తిత్వం, మీ నైతికత, మీ కృషి మరియు మీ మానవత్వం. 10. కృతజ్ఞత భావాన్ని పెంపొందించండి కష్టకాలంలో మనం కోల్పోయిన వాటిపైనే దృష్టి పెడతాం. కానీ మన దగ్గర ఇంకా ఉన్న వాటిని కూడా గుర్తించాలి. - జీవితం - కుటుంబం - ఆరోగ్యం - అనుభవం - నేర్చుకునే అవకాశం వీటికి కృతజ్ఞతతో ఉండటం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. 11. మీ కథ ఇంకా పూర్తికాలేదు ప్రస్తుతం మీరు ఒక కఠినమైన అధ్యాయంలో ఉండవచ్చు. కానీ అది మొత్తం పుస్తకం కాదు. జీవితం ఇంకా కొనసాగుతోంది. ఈ రోజు మీరు అనుభవిస్తున్న బాధ రేపు మరొకరికి స్ఫూర్తినిచ్చే కథగా మారవచ్చు. అందుకే ఎప్పుడూ ఆశను కోల్పోవద్దు. 12. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం నిన్న ఏమి జరిగిందో మార్చలేము. కానీ ఈ రోజు ఏమి చేయాలో నిర్ణయించవచ్చు. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం. ప్రతి రోజు ఒక కొత్త అవకాశం. ప్రతి ప్రయత్నం ఒక కొత్త ఆశ. ముగింపు జీవితం కఠినంగా అనిపించినప్పుడు మనకు అవసరమయ్యేది సమస్యలు లేని జీవితం కాదు; వాటిని ఎదుర్కొనే ధైర్యం, సహనం మరియు విశ్వాసం. గుర్తుంచుకోండి: - ఈ పరిస్థితి శాశ్వతం కాదు. - మీరు అనుకున్న దానికంటే బలమైనవారు. - అపజయం అంతిమం కాదు. - ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. - మీ కథ ఇంకా పూర్తికాలేదు. కష్టాలు మన జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి రావు; మనలోని శక్తిని వెలికితీయడానికి వస్తాయి. "చీకటి ఎంత గాఢంగా ఉన్నా, ఉదయం రావడం ఖాయం. కష్టం ఎంత పెద్దదైనా, ధైర్యంగా నిలబడిన మనిషిని ఓడించలేడు." #💗నా మనస్సు లోని మాట #🗣️జీవిత సత్యం #😃మంచి మాటలు #తెలుసుకుందాం920
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣శ్రావణ శుక్రవారం - అమ్మవారికి సొంతం...........!! చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం, విశిష్టమైన నక్షత్రాలలో శ్రవణం ఒకటి. అంతేకాదు, ఇది శ్రీమహావిష్ణువుకు జన్మ నక్షత్రం. సకల వరాలనూ ప్రసాదించే ఆ అనుగ్రహ దంపతులను (లక్ష్మీనారాయణులను) సేవించుకునేందుకు ఇంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది! శ్రవణం అంటే వినడం అనే అర్థం కూడా ఉంది కదా! అందుకే, ఈ మాసంలో తనను సేవించే వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం. అమ్మవారు మన మొరలను వినడమే కాదు, పెద్దలు చెప్పే ఆశీర్వచనాలను మనం విని ఆచరించడానికి కూడా ఇది ఒక గొప్ప సమయమట! నూతన వధువు అత్తవారింట అడుగుపెట్టాలన్నా; శుభకార్యాలు, గృహ నిర్మాణం వంటి పనులు ప్రారంభించాలన్నా; నోములు ఆచరించాలన్నా... శ్రావణ మాసం అత్యుత్తమం! అందులోనూ శ్రావణ శుక్రవారం అంటే ఇక చెప్పనవసరం లేదు. స్త్రీలకు ఐదోతనాన్నీ, అష్టైశ్వర్యాలనీ అందించే అమ్మవారిని ఎంతో భక్తితో కొలుచుకుంటారు. ఎప్పటిలాగే తన చల్లని చూపును తమ మీద నిలిపి ఉంచాలని వేడుకుంటారు. శ్రావణ శుక్రవారం ఆచారాలు....... శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, అభ్యంగన స్నానం చేస్తారు. ఇంటి గడపలకు పసుపు, కుంకుమలు అద్దుతారు. అమ్మవారిని ఫలపుష్పాలతో పూజించి... పాయసం, చక్కెరపొంగలి, పరమాన్నం వంటి నైవేద్యాలను అర్పిస్తారు. వీటితోపాటు పూర్ణం బూరెలను కూడా ప్రసాదంగా వండితే మంచిదని పెద్దలు చెబుతారు. ఇక మధ్యాహ్నం భోజనానికి ఒక ముత్తయిదువను ఇంటికి ఆహ్వానిస్తారు. ఆమెను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి, భోజనాది సత్కారాలతో సేవించి, తాంబూలంతో పాటు నూతన వస్త్రాలను అందిస్తారు. సాయంత్రం వేళ ముత్తయిదువలను పేరంటానికి పిలిచి శనగలు, తమలపాకు, వక్క, అరటిపండులతో కూడిన తాంబూలాన్ని అందించి... తమకు ఆశీర్వాద బలాన్ని అందించవలసిందిగా వేడుకుంటారు. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారంనాడు ఆడవారు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే, రెండో వారంలో ఏదైనా అవాంతరం వస్తుందనుకునే వారు అప్పటివరకూ వేచి ఉండకుండా తొలి శుక్రవారంలోనే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరాలను ఒసగేందుకు ఆ తల్లి సిద్ధంగా ఉంటే ప్రతి శుక్రవారమే వరలక్ష్మిదే కదా! #తెలుసుకుందాం #💐వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు🌼 #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #🔱లక్ష్మిదేవి కటాక్షం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️1418
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🕉️ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు అంటే ఎవరు?🙏📚 విద్య, జ్ఞానం, జ్ఞాపకశక్తి, వాక్పటుత్వానికి అధిదేవతగా ఆరాధించబడే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు. శ్రీమహావిష్ణువు అవతారాలలో హయగ్రీవ అవతారం అత్యంత విశిష్టమైనది. గుర్రం ముఖం, మానవ శరీరంతో దివ్యరూపంలో దర్శనమిస్తూ, తన కరుణాకటాక్షంతో భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 🌺 స్వామివారి విశిష్టత: పురాణాల ప్రకారం మధు–కైటభ రాక్షసులు అపహరించిన వేదాలను తిరిగి సంపాదించి బ్రహ్మదేవునికి అందించిన జ్ఞానస్వరూపుడు హయగ్రీవుడు. అందుకే ఆయనను సర్వవిద్యల ఆధారమూర్తిగా భావిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు, పరిశోధకులు, కళాకారులు భక్తితో హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే జ్ఞానం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, విజయాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం. 🕉️ 1. హయగ్రీవ ధ్యాన శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ । ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥ 🌺 అర్థం: జ్ఞానం, ఆనందం స్వరూపుడై, నిర్మలమైన స్ఫటికంలా ప్రకాశించే, సమస్త విద్యలకు ఆధారమైన శ్రీ హయగ్రీవ స్వామిని నేను భక్తితో ఉపాసిస్తున్నాను. 🕉️ 2. విద్యా ప్రసాద శ్లోకం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ । తస్య నిస్సరతే వాణీ జాహ్ను కన్యా ప్రవాహవత్ ॥ 🌺 అర్థం: ఎవరు భక్తితో "హయగ్రీవ" నామాన్ని జపిస్తారో, వారి మాటలు గంగానది ప్రవాహంలా స్పష్టంగా, మధురంగా ప్రవహిస్తాయి. 🕉️ 3. విద్యా సిద్ధి శ్లోకం శ్రీమాన్ హయగ్రీవో మే సన్నిధత్తాం సదా హృది । విద్యాం బుద్ధిం బలం చైవ దేహి మే కరుణానిధే ॥ 🌺 అర్థం: ఓ కరుణాసాగరుడా! నా హృదయంలో ఎల్లప్పుడూ నివసించి నాకు విద్య, బుద్ధి, బలం ప్రసాదించు. 🕉️ 4. జ్ఞాన ప్రాప్తి శ్లోకం విద్యానాం దేవతం వందే హయగ్రీవం దయానిధిమ్ । యస్య ప్రసాదాత్ సర్వజ్ఞం భవేత్ మానవ జీవనం ॥ 🌺 అర్థం: సమస్త విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవ స్వామిని నమస్కరిస్తున్నాను. ఆయన అనుగ్రహంతో జ్ఞానం, వివేకం, విజయాలు లభిస్తాయి. 🕉️ 5. ప్రార్థన ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః॥ 🌺 అర్థం: విద్య, జ్ఞానం, బుద్ధి ప్రసాదించే శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామికి నమస్కారం. 📖 పిల్లలు ప్రతిరోజూ ఉదయం లేదా చదువు ప్రారంభించే ముందు ఈ శ్లోకాలను భక్తితో చదివితే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ధైర్యం, విద్యలో పురోగతి కలుగుతాయని విశ్వాసం. 🙏🌸 🕉️ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు 🙏 📍 స్వామివారు ఎక్కడ ఉంటారు? శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనవి: 📍 తిరువహీంద్రపురం (తమిళనాడు) – శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి అత్యంత ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడ ఊషధగిరి కొండపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 📍 నంగనల్లూరు, చెన్నై (తమిళనాడు) – శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి ప్రసిద్ధ ఆలయం. 📍 బాసర జ్ఞాన సరస్వతి ఆలయం (తెలంగాణ) – ఇక్కడ కూడా హయగ్రీవ స్వామివారిని విద్యాప్రదాతగా ఆరాధిస్తారు. #తెలుసుకుందాం #హయగ్రీవ స్వామి #లక్ష్మీ హయగ్రీవ స్వామి #🕉️ శ్రీ హయగ్రీవ 🙏 #హయగ్రీవ17176
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#తెలుసుకుందాం #హర హర మహాదేవ 🙏 #om Arunachala siva🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ1523
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🕉️🌺 ధనాకర్షణ దక్షిణామూర్తి — లక్ష్మీదేవి & కుబేరుని అంతరార్థం 💰🪷 దక్షిణామూర్తి స్వామి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జ్ఞానం. వటవృక్షం క్రింద మౌనంగా ఆసీనుడై, మాటలు లేకుండానే సనకాది మహర్షులకు పరమతత్త్వాన్ని బోధించిన ఆదిగురువు ఆయన. 🙏 అయితే ధనాకర్షణ దక్షిణామూర్తి ఆరాధనలో “ధనం” అనే పదానికి కేవలం బంగారం, డబ్బు అనే అర్థమే కాదు. జీవితాన్ని సుసంపన్నం చేసే ఐశ్వర్యం అనే విస్తృతమైన అర్థం కూడా ఉంది. 🌺 శ్రీమహాలక్ష్మీదేవి సంపద, సౌభాగ్యం, శుభం, సమృద్ధికి ప్రతీకగా ఆరాధించబడుతుంది. 💰 కుబేరుడు దేవతల ధనాధిపతిగా, సంపదకు రక్షకుడిగా పురాణ సంప్రదాయంలో ప్రసిద్ధుడు. 🕉️ దక్షిణామూర్తి ఆ సంపదను సరిగ్గా పొందడానికి, నిలుపుకోవడానికి, ఉపయోగించడానికి అవసరమైన జ్ఞానం మరియు వివేకానికి ప్రతీక. ఇక్కడే ఈ తత్త్వంలోని లోతైన సందేశం దాగి ఉంది. 🌿 లక్ష్మీ అనుగ్రహం సంపదను ప్రసాదిస్తే, కుబేర తత్త్వం దానిని సంరక్షించడాన్ని సూచిస్తుంది; దక్షిణామూర్తి జ్ఞానం ఆ సంపదను ధర్మమార్గంలో వినియోగించే బుద్ధిని ప్రసాదిస్తుందని భావించవచ్చు. 💎 సంపద ఉండి వివేకం లేకపోతే అది అహంకారానికి కారణం కావచ్చు. 💎 జ్ఞానం ఉండి జీవనోపాధి లేకపోతే జీవితం కష్టసాధ్యమవుతుంది. 💎 సంపద వచ్చినా దానిని కాపాడే నియమం లేకపోతే అది నిలవదు. అందుకే జ్ఞానం–లక్ష్మీ–కుబేర తత్త్వాలను పరస్పరపూరకంగా చూడవచ్చు. 🌳 దక్షిణామూర్తి వటవృక్షం క్రింద కూర్చోవడం కూడా ఒక గొప్ప సంకేతం. వృక్షం తనకు వచ్చినదాన్ని తనకే దాచుకోదు—నీడను ఇస్తుంది, ఫలాలను ఇస్తుంది, అనేక జీవులకు ఆధారమవుతుంది. అలాగే మనకు వచ్చిన సంపద కూడా మనకే కాకుండా కుటుంబానికి, అవసరంలో ఉన్నవారికి, ధర్మకార్యాలకు ఉపయోగపడినప్పుడే దాని విలువ పెరుగుతుంది. 🙏 🪷 లక్ష్మీదేవి మన ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకురావాలి. 💰 కుబేరుని అనుగ్రహం సంపదను సక్రమంగా నిర్వహించే స్థిరత్వాన్ని ఇవ్వాలి. 🕉️ దక్షిణామూర్తి కృప మనకు ఆ సంపదను ధర్మబద్ధంగా ఉపయోగించే జ్ఞానాన్ని ఇవ్వాలి. అప్పుడు “ధనాకర్షణ” అనేది కేవలం డబ్బును ఆకర్షించడం అనే భావనగా కాకుండా— “జ్ఞానాన్ని ఆకర్షించాలి… ధర్మాన్ని ఆకర్షించాలి… శుభసంకల్పాలను ఆకర్షించాలి… అవకాశాలను సద్వినియోగం చేసుకునే వివేకాన్ని ఆకర్షించాలి… అలాంటి జీవితంలో ఐశ్వర్యం స్వయంగా అర్థవంతమవుతుంది.” 🌺 🙏 శ్రీ ధనాకర్షణ దక్షిణామూర్తి స్వామినే నమః 🪷 శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 💰 శ్రీ కుబేరాయ నమః 🕉️ #తెలుసుకుందాం1014
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣శ్రీవారిసేవతో లక్ష్మీ కటాక్షం అనంత కోటి బ్రహ్మాండ నాయకుడిని ఎంత పూజించిన కిర్తించిన తనివి తీరదు కొలిచే వారి కొంగు బంగారమై కోరిన వరాలను ఇచ్చే కోనేటి రాయుడు , పద్మావతి ప్రియుడు, ప్రసన్న వధనుడు, అయిన శ్రీవారికి ఏది ఇష్టమో..! శ్రీవాసుడికి ముఖ్యమైన సమయం ఉదయం సమయంలో ,యంత్ర ప్రతిష్ట చేసిన ప్రతి దేవాలయంలోని విగ్రహం రెప్పపాటు సమయం మహావిష్ణువు రూపం దాల్చి తిరిగి యధా రూపం దాల్చుతుంది ఆ సమయంలో స్వామి వారిని దర్శించేందుకు ముక్కోటి దేవతలు, మునులు వేచి ఉంటారు. ఆ సమయంలో రోజు అష్టాక్షరీ మంత్రంతో ధ్యానం చేయడం, చాలా విశేష ఫలితం ఇస్తుంది. శ్రవణ నక్షత్రం రోజు స్వామి వారికి ఉదయం తేన నివేదన చేస్తే నెలలో. ఒక్క రోజు చేస్తే నెలంతా చేసిన ఫలితం దక్కుతుంది. ఉదయం 5.30 నిమిషాల దీపానికి అధిపతి లక్ష్మీ దేవి ఏ ఇంట్లో అయితే ఆ సమయంలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ని దీపంలో లక్ష్మీ దేవి కొలువై శ్రీనివాసుని ద్యానిస్తుంది ఎక్కడ ఆ తల్లి కూర్చిని స్వామి ని ద్యానిస్తుందో ఆ ఇంటి పైన శ్రీనివాసుని దృష్టి పడుతుంది. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పిండి దీపాలు, బియ్యం పిండిని ప్రమిధగా చేసి అందులో ఆవు నైయి పోసి దీపం వెలిగించాలి.. ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతుంది, అప్పులు తిరిపోతుంది, స్త్రీలకు మాంగళ్య దోషం తోలగి పోతుంది, ఇంట్లో గొడవలు తగ్గుతుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది, ఉపాధి లేని వారు ప్రతి శనివారం, మంగళవారం ఇలా పిండితో శ్రీనివసుడికి దీపం వెలిగించి చింబిలి నివేదిస్తే వారి ఆటంకాలు అన్ని తొలగి పోతుంది. స్వామి కి తులసి అంటే ఇష్టం ప్రసాదంలో కచ్చితంగా తులసి ఆకు పెట్టె నైవేద్యం పెట్టాలి తులసి దొరకని సమయంలో తులసమ్మను తలచుకుని నైవేద్యం పెట్టాలి, బియ్యం, నువ్వులు, బెల్లం, ఆవు నైయి కలిపి పొడి చేస్తే చింబిలి అవుతుంది.. అది ప్రతి శనివారం రోజు నివేదించి ప్రసాదం స్వీకరిస్తే శని బాధలు, ఈతి బాధలు, తగ్గుతుంది.. బెల్లం అన్నం శుక్రవారం రోజు స్వామికి నివేదించాలి. స్వామి వారి తీర్థంలో ముఖ్యమైనది తులసి తీర్థం అందులో పచ్చ కర్పూరం, స్వామి వారికి తీర్థం తాంభూలంలో పచ్చ కర్పూరం తప్పకుండా వాడాలి స్వామి వారికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. వివాహం, ఉద్యోగం, ఏదైనా కొనడం అమ్మడం, కోర్ట్ తగాధాలు ఇలాంటి కొన్ని సమసిపోని సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామి కి శనివారం రోజు ఒక పసుపు బట్టలో 11 రూపాయి నాణాలు ముడుపు కట్టి స్వామి ముందు ఉంచి వారి కోరిక చెప్పుకొని అది నెరవేరాక ఆ ముడుపు తో పాటు వడ్డీ కలిపి హుండీలో వేయాలి.. ఇది మంచి పరిష్కారం. స్వామి వారికి కీర్థనలు అంటే చాలా ఇష్టం కలియుగంలో నామ స్మరణ, కీర్తన తోనే ప్రసన్నుడు అవుతాడు స్వామి, పాడటం అందరికి రాకపోయినా రోజూ ఒకసారి గోవింద నామాలు స్మరించడం వల్ల స్వామి అనుగ్రహం దక్కుతుంది. ఇక స్వామి వారి అనుగ్రహం కోసం, ఏకాదశి వ్రతాలు, ఏడు శనివారం వ్రతాలు, శనివారం ఉపవాసాలు, ఇవన్నీ ప్రీతిగా భక్తిగా ఆచరిస్తారు, శనివారం నాడు రావి చెట్టు ప్రదర్శన చేసిన స్వామి అనుగ్రహము దక్కుతుంది.. నిత్యం హరినామ స్మరణ సకల పాపహారం... (శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, స్వామిని ఎంత అలంకరిస్తే అంత సంతోష పడతాడు, అలాగే పూజ చేసే వారు కూడా స్వామి నామం ధరించి చక్కగా అలంకారం తో చేయాలి.) నిత్యం హరినామ స్మరణ చేసే వారికి స్వామి స్వప్న సాక్షాత్కారం శీఘ్రoగా లభిస్తుంది.అంతేకాదు వెంకటేశ్వరుణ్ణి ఎక్కడ పూజీస్తేఅక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరుచుకొని ఉంటుంది. అంతేకాడు వారి వెన్నంటే ఉండి కవచంలా స్వామి రక్షిస్తూ ఉంటారు. #తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి1121
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#తెలుసుకుందాం #🕉️ గణపతి బప్పా మోరియా హరిద్రా(పసుపు) వినాయకుడు..........!! మన దేవతలందరిలోనూ గణపతిని మాత్రమే మహాగణపతి అని పిలుస్తాం. మహాగణపతి అంటే గొప్ప గణపతి, విశేషమైన గణపతి అని అర్థం. ప్రతి సంవత్సరం మనం పూజించే గణపతికి సైతం పూజనీయుడైన గణపతియే మహాగణపతి. ఆయనను మనం పసుపు ముద్దగా రూపొందించి పూజిస్తాం. గణం అంటే ఒక సమూహం..... గణనాయకులందరికీ నాయకుడే గణపతి వినాయక చతుర్థినాడు. మనం వరసిద్ది వినాయకునికి పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభువైన వాడు మహాగణపతి. ఆయనకంటే అధికులు ఎవ్వరూ లేరు. ఆ మహాగణపతినే మనం హరిద్రా విఘ్నేశ్వరునిగా పూజిస్తాం. శివుడు మహాగణపతిని పూజించాడు. ఆయన అనుగ్రహంతోనే త్రిపుర దహనం చేశాడు. ఆనాడు గణపతిని అర్చించకపోతే శివుని ప్రయత్నాలు సైతం వ్యర్థమై పోయేవి. శ్రీహరి వామనావతారం దాల్చినప్పుడు గణపతిని పూజించాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మసైతం ఆయనను ధ్యానించాడు.. దాంతో ఆటంకాలు తొలగి సృష్టి నిలబడింది. మహిషాసుర సంహారానికి ముందు జగదంబ సైతం గణపతిని ధ్యానించింది. మునిజనం మొదట తపస్సు ద్వారా అష్టసిద్ధులు పొందుతారు. వాటి ఆకరణలో పడవారెవ్వరూ మోక్షాన్ని పొందలేరు. వాటి ప్రదర్శనలో దిగజారిపోతారు. అప్పుడు మహాగణపతిని ధ్యానిస్తే ఆటంకాలు తొలిగి ముక్తిని పొందగలుగుతారు. ఆటంకాలను పరిహరించేది గణపతియే. అసలు దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మ, ఆయన్నే మనం వేరువేరుగా రూపాలు కల్పించుకుని వరసిద్ధి గణపతిగా, విద్యాగణపతిగా, పతిగా, లక్ష్మీగణపతిగా ఇలా వేరువేరుగా పూజలు చేస్తున్నాం. త్రిమూర్తులంటున్నాం, త్రిశక్తులంటున్నాం వీరంతా ఆయా కార్య సిద్ధుల కోసం కల్పించబడ వారే. మాఘంలో సూర్యునిగా, దసరాల్లో అమ్మవారిగా, కార్తికంలో శివకేశవులుగా, భాద్రపదంలో గణపతిగా ఆయనొక్కడే వేర్వేరు ఉపాసనలు పొందుతున్నాడు. ఇవన్నీ సగుణ రూపాలు. అంటే కన్నూ ముక్కు వంటి అవయవాలు ధరించిన మూర్తులు. అయినా ఉన్నది ఒక్కటే. దాన్నే మనం ఈ మాయా జగత్తులో అనేకంగా చూస్తున్నాం. నిజానికి అనేకం లేనే లేవు. అద్దాల గదిలో నిలబడితే మనం అనేక రూపాలతో కనబడతాం. కానీ మనం ఒక్కరమే అవన్నీ మన ప్రతిబింబాలేనని మనకు తెలుసు. వాటికి బొట్టు పెట్టాలంటే అన్నింటికీ పెట్టనవసరం మూర్తు లందరికీ పెట్టినట్టు అవుతుంది. కదా! వినాయకుణి పూజించడం కూడా అలాంటిదే. ఏనుగు తల, పెద్దపొట్ట, ఎలుక వాహనం, పాలవెల్లి ఇవన్నీ మనం కల్పించుకుంటున్నాం. అలాంటి కల్పనలో కూడా మనం చిత్తశుద్ధితో పూజిస్తే ఇవన్నీ ఆ మూల స్వరూపానికి చెందుతాయి. అలా అని ఈ గణపతుల పూజే ప్రధానం అని భావించ కూడదు. మనం నిరుణ గణపతినే అంటే పరబ్రహ్మనే తొలిసారిగా అర్చించాలి. తల్లికి భోజనం పెట్టకుండా ఊరంతా సంతర్పణ చేసినా ఎలా ఫలితం లేదో అలానే నిరుణారాధన లేకుండా సగుణారాధన చేసినా ఆశించిన ప్రయోజనం సిద్ధించదు. అయితే ఎలా...? అందుకే ముందు హరిద్రా గణపతిని అర్చించడం ఆచారంగా చేశారు పెద్దలు. పసుపును ఒక గుండ్రని ముద్దగా చేసి ఏ పూజకైనా మనం మొట్టమొదటగా అర్చిస్తున్నాం. ఆ ముద్దకు అవయవాలుండవు. ఏనుగుతల ఉండదు. ఎలుక ఉండదు. అంతేకాదు నైవేద్యం కూడా. సరైన రూపం లేని బెల్లం ముక్కనే పెడతాం. ఇంట్లో ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా ఈ హరిద్రా గణపతి పూజ చేయాల్సిందే. శుభకార్యాలకు మీదుకట్టడం కూడా మహాగణపతిని ఉద్దేశించి చేసేదే. ఆఖరుకి వినాయక చవితి నాడు ఎంత ఖర్చుపెట్టి పెద్ద గణపతుల్ని ప్రతిష్ఠించినా ఈ హరిద్రాగణపతే అందరికీ మూలకారకుడు. ఆ నిర్గుణతత్త్వాన్నే వేదం కీర్తించింది. అన్ని గణాలకు ఆయనే ప్రధానం. కవులకే కవీశ్వరుడు స్వామి. ఆ స్వామికి మరొక పోల్చదగిన దైవం లేదు. అందరు దేవతలకు జ్యేష్ఠుడు. మహాగణపతియే ప్రధాన దైవం. ఆయన వల్లే వేదాలు వచ్చాయి. కనుక ఆయనే వేదగణాలకూ ప్రభువు. ఈ తత్త్వం తెలుసుకోగలగడమే ఒక అదృష్టం.36152
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣*_ఇంటి పూజలు_* *ప్రదర్శన కోసం కాదు, భక్తి కోసం.* *వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, లక్ష్మీ పూజ, రుద్రాభిషేకం, సత్యనారాయణ వ్రతం వంటి గృహపూజలు కేవలం ఒక కార్యక్రమం కాదు*. ఇవి మన సంప్రదాయంలో భక్తి, శ్రద్ధ, నియమం, ఆత్మశుద్ధి, కుటుంబ క్షేమం కోసం నిర్వహించే పవిత్రమైన ఆచారాలు. పూజను ఇతరులు చూడకూడదని కాదు. కుటుంబ సభ్యులు, బంధువులు, ఆహ్వానితులు, భక్తులు పాల్గొనడం సందర్భానుసారం సహజమే, *అయితే పూజను ప్రదర్శనగా మార్చాల్సిన అవసరం లేదు.* *ఈ రోజుల్లో పూజా కార్యక్రమం కంటే దాని అలంకరణ, ఫోటోలు, వీడియోలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఎక్కువగా కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది*. కానీ పూజ యొక్క అసలు ఉద్దేశం — మనసును భగవంతునిపై నిలపడం, సంకల్పాన్ని శ్రద్ధతో నిర్వహించడం, మంత్రాలను భక్తితో జపించడం, నైవేద్యాన్ని సమర్పించడం, ప్రసాదాన్ని స్వీకరించడం. పూజ ఎంత గొప్పగా కనిపించింది అనేది ముఖ్యమేమీ కాదు; *ఎంత భక్తితో నిర్వహించామన్నదే ముఖ్యమైనది.* *పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచడం, పూజకు ముందు శరీర – మనస్సులను ప్రశాంతంగా ఉంచుకోవడం, పూజా సమయంలో అనవసరమైన మాటలు, హడావుడి, ఫోన్ వినియోగం, ఫోటోలు–వీడియోలపై అధిక శ్రద్ధ తగ్గించడం — ఇవన్నీ పూజలో ఏకాగ్రతను పెంచుతాయి.* అలంకరణలు చేయడం తప్పు కాదు. పూలు, తోరణాలు, దీపాలు, రంగవల్లులు, కలశాలు ఏర్పాటు చేయడం కూడా భక్తి వ్యక్తీకరణలో భాగమే. కానీ అవి భగవంతుని ఆరాధనకు సహాయకాలుగా ఉండాలి; మన ప్రదర్శనకు సాధనాలుగా మారకూడదు. *ఇతరులు మన పూజను చూస్తే తప్పు, వారి చూపు వల్ల పూజ ఫలితం నశిస్తుంది అని భయపెట్టాల్సిన అవసరం లేదు.* అయితే అసూయ, పోటీ, ఆడంబరం, ఇతరుల ప్రశంస కోసం చేసే ప్రదర్శన వంటి భావాలకు దూరంగా ఉండటం మంచిది. మన పూజ మన అంతరంగాన్ని భగవంతుని వైపు తిప్పాలి. *ఇతరుల దృష్టిని ఆకర్షించే విధంగా కాకుండా, మన దృష్టిని భగవంతునిపై నిలిపే విధంగా ఉండాలి.* సార్వజనిక పూజలు — అందరి క్షేమం కోసం. ~ *“సర్వేజనా సుఖినో భవంతు”* అనే సంకల్పంతో చేసే సామూహిక పూజలు, హోమాలు, భజనలు, ధార్మిక కార్యక్రమాలు సమాజ క్షేమాన్ని ఉద్దేశించినవి. అందువల్ల దేవాలయాలు, మండపాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం సహజమైన విషయం. అక్కడ కూడా ప్రధాన ఉద్దేశం ప్రచారం కాదు — ప్రజల శ్రేయస్సు. వ్యక్తిగత గృహపూజ అయినా, సామూహిక ధార్మిక కార్యక్రమమైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి: *పూజ ప్రదర్శన కోసం కాదు — పరమాత్మ స్మరణ కోసం.* *అలంకారం చూపించడానికి కాదు — భక్తిని వ్యక్తపరచడానికి*. *ప్రశంస కోసం కాదు — ఆత్మశుద్ధి కోసం.* *ప్రచారం కోసం కాదు — ధర్మాచరణ కోసం.* *చివరగా ~* *పూజను దాచాల్సిన అవసరం లేదు — ప్రదర్శించాల్సిన అవసరం లేదు.* *భక్తిని నిరూపించాల్సిన అవసరం లేదు — ఆచరించాలి.* అలంకరణను చూపించాల్సిన అవసరం లేదు — ఆరాధనలో ఆనందించాలి *భగవంతుని కోసం చేసిన పూజ, భగవంతునికే అర్పణగా ఉండాలి*. *కర్మను కర్మగా చేయండి.* పవిత్రమైన ఆచారాన్ని ఆడంబరంగా మార్చవద్దు. భగవంతుని ముందు మన భక్తి కనిపించాలి — మన ప్రదర్శన కాదు. #తెలుసుకుందాం #😃మంచి మాటలు36212
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🪷🙏 గ్రామ దేవతల నుండి శక్తి స్వరూపిణి వరకు.. అమ్మవారికి నిమ్మకాయల దండ ఎందుకు వేస్తారో తెలుసా? మనం ఏదైనా అమ్మవారి గుడికి వెళ్లినప్పుడు లేదా గ్రామ దేవతల జాతరలు జరిగినప్పుడు అమ్మవారి మెడలో నిమ్మకాయల దండను చూస్తుంటాం. ముఖ్యంగా దుర్గాదేవి, కాళీమాత, పోలేరమ్మ వంటి ఉగ్ర రూపం కలిగిన దేవతలకు నిమ్మకాయల దండ అంటే ఎంతో ప్రీతి. అయితే, పువ్వుల దండలు ఉండగా కేవలం నిమ్మకాయలనే దండగా ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న పురాణ గాథలు ఏమిటి? ఇది కేవలం నమ్మకమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? ఈ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 🪷🙏 నిమ్మకాయ అంటే కేవలం ఒక పండు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం అదొక శక్తివంతమైన ఆయుధం. మనపై ఉన్న ప్రతికూల శక్తిని (Negative Energy) గ్రహించే గుణం నిమ్మకాయకు ఉంది. అందుకే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా మన కష్టాలు, దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి నిమ్మకాయల సంఖ్యకు, అమ్మవారి అనుగ్రహానికి ఉన్న సంబంధం ఏంటి? 108 లేదా 54 నిమ్మకాయల దండ వెనుక ఉన్న మర్మమేమిటి? వంటి రహస్యాలను ఇప్పుడు సవివరంగా విశ్లేషిద్దాం..🪷🙏 1. ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి: శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దుష్ట శిక్షణ చేసేటప్పుడు అత్యంత ఉగ్రంగా ఉంటారు. నిమ్మకాయలో ఉన్న పులుపు మరియు చలవ చేసే గుణం అమ్మవారి ఉగ్రతను తగ్గించి, ఆమెను శాంతింపజేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 2. ప్రతికూల శక్తిని హరించడం: నిమ్మకాయకు గాలిలోని లేదా మనుషులలోని ప్రతికూల ప్రకంపనలను (Negative Vibrations) ఆకర్షించే గుణం ఉంటుంది. భక్తులు తమపై ఉన్న దిష్టి, ఈర్ష్య, ద్వేషం వంటి నెగటివ్ ఎనర్జీని నిమ్మకాయలు గ్రహించి, తమకు శుభం కలగాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ దండను సమర్పిస్తారు. 3. రాహు దోష నివారణ: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నిమ్మకాయల దండ సమర్పించడం వల్ల రాహు గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. రాహు కాలంలో దుర్గాదేవికి నిమ్మకాయలతో దీపం వెలిగించడం లేదా దండ వేయడం వల్ల పెళ్లి సంబంధాలు కుదరడం, ఉద్యోగ ప్రాప్తి వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. 4. ఆరోగ్య సంరక్షణ (శాస్త్రీయ కోణం): పూర్వ కాలంలో జాతరలు, ఉత్సవాలు జరిగినప్పుడు జనం ఎక్కువగా ఉండేవారు. నిమ్మకాయల నుండి వచ్చే సహజమైన సువాసన గాలిలోని క్రిములను చంపి, అంటువ్యాధులు ప్రబలకుండా చేసే ‘డిస్-ఇన్ఫెక్టెంట్’ లా పనిచేసేది. అందుకే గుడుల వద్ద నిమ్మకాయల వినియోగం ఎక్కువగా ఉండేది. 5. నిమ్మకాయల సంఖ్య ప్రాముఖ్యత: సాధారణంగా అమ్మవారికి 18, 54 లేదా 108 నిమ్మకాయలతో దండ వేస్తారు. ఈ సంఖ్యలు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనవి. పండని పచ్చని నిమ్మకాయల కంటే, బాగా పండిన పసుపు రంగు నిమ్మకాయలతో దండ వేయడం శుభప్రదంగా భావిస్తారు. గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. హిందూ ధర్మ శాస్త్రాలు మరియు పురాతన నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించబడింది. దీనిని పాటించే ముందు మీ ఆధ్యాత్మిక గురువులను సంప్రదించడం శ్రేయస్కరం.🪷🙏 దుర్గాదేవి ఆరాధనలో నిమ్మకాయల పూజకు, నిమ్మకాయ దండలకు ప్రాధాన్యత ఉండడం తెలిసిందే! అయితే లక్ష్మి సరస్వతి దేవతలకు కాకుండా కేవలం దుర్గాదేవికి మాత్రమే నిమ్మకాయల దండ సమర్పించడం వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటి? ఇలా నిమ్మకాయల దండ సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దుర్గాదేవికి నిమ్మకాయల దండ సాధారణంగా దుర్గాదేవికి నిమ్మకాయల దండలు వేసి పూజిస్తూ ఉంటాం. ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు వేస్తారు? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది? హిందూ సంప్రదాయంలో లక్ష్మీ దేవికి, సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండలు వేసే ఆచారం కనిపించదు. కానీ శక్తి ఆలయాల్ల, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది. ప్రాణికోటిని రక్షించే శక్తి స్వరూపిణి అన్నవారు శక్తి స్వరూపిణి. సమస్త ప్రాణికోటిని ఆ తల్లి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అమ్మవారు అనునిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి కొంత తామస గుణం ఉంటుంది. దేవి సత్వ సరూపమే అయినా ఆ తల్లి సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది . గ్రామ దేవతలు కూడా దేవీ స్వరూపాలే! గ్రామ దేవతలు కూడా ఆ దేవీ స్వరూపాలే! గ్రామదేవతలు గ్రామాలకి రక్షణగా ఉండటానికి రాత్రిపూట గ్రామ సంచారం చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తారు. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. అమ్మవారికి మాత్రమే ఎందుకు? అమ్మవారికి నిమ్మకాయ దండలని సమర్పించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శత్రు సంహారం కోసం రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవికి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ తల్లి శాంతిస్తుందని చెబుతారు. అందువల్లే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు.దుర్గాదేవికి నిమ్మకాయల దండ ఏ రోజు సమర్పించాలి? మంగళవారం, శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం శుభప్రదం. ఇంటి పూజలో నిషిద్ధం అయితే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించే సంప్రదాయాన్ని ఇళ్లల్లో చేసుకొనే పూజల్లో పాటించకూడదని గుర్తుంచుకోవాలి. ఇంట్లో మనం చేసుకునే పూజలో సాత్విక తత్వం ఉంటుంది. అయితే నిమ్మకాయల దండ సమర్పించడంలో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో పాటించకపోవడమే మంచిది. ఇలా చేయవచ్చు ఆలయంలో దుర్గాదేవి కోసం నిమ్మకాయల దండని తయారు చేసి, గుడిలో అమ్మవారికి సమర్పించి, అర్చన చేయించుకొని, అమ్మవారి ప్రసాదంగా ఆలయం నుంచి రెండు మూడు నిమ్మకాయలు తెచ్చుకొని, గుమ్మానికి కట్టుకుంటే నరఘోష, ద్రుష్టి దోషాలు, శత్రుపీడలు తొలగిపోతాయి. అలాగే మన ఇల్లు అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి . చివరగా ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదని గుర్తుంచుకోవాలి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః #తెలుసుకుందాం4331K