Satya Vadapalli
777 views 5 months ago
క్షీరసాగర మథనం లో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నింటికి ఐశ్వర్యమును ఇచ్చింది. పచ్చటి కాంతితో, తెల్లటి వస్త్రములు కట్టుకుని ‘పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే’ అని నల్లని కన్నులతో సొగసయిన చూపులతో మాతృ వాత్సల్యంతో అందరివంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారు చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకూ దరిద్రములు అన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరు వింటారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశిస్తుంది. ఇది పరమయధార్థం. లోకము నందు మనము సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కులేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మా! సమస్త లోకములకు తల్లివయిన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యమును ఇచ్చి కాపాడు’ అని అమ్మవారిని స్తోత్రం చేస్తే అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. #దేవుళ్ళ స్టేటస్ #శ్రీ మహాలక్ష్మి దేవియే నమః #ఓం శ్రీమాత్రే నమః🙏🕉️🌹🙏 #🙏🏻భక్తి సమాచారం😲 #శుభోదయం
13 likes
9 shares

More like this