రథసప్తమి రోజు చిక్కుడుకాయలను చిక్కుడు ఆకులను ఎందుకు వాడతారో తెలుసా ...??
సూర్య భగవానుడి సూర్యకిరణాల తేజస్సును శక్తిని ఎక్కువగా లాక్కునే శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే రథసప్తమి రోజు చిక్కుడు ఆకుల్లో నైవేద్యం సమర్పిస్తారు సూర్య భగవానుడి శక్తిని మనము పొందవచ్చు ఆకుల్లో నైవేద్యం మనం తినాలి.
అలాగే పారే నీటిలో లేదా నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేస్తే వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
అలాగే రథసప్తమి రోజున రాగి పాత్రలో నీటిని నింపి, ఎర్రటి పుష్పాలను అందులో వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే అదృష్టం పెరుగుతుంది. శత్రువులపై కూడా విజయాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే రథసప్తమి నాడు మట్టికుండలో పాలను పెట్టి, వాటిని వేడి చేసిన తర్వాత ఆ పాలను సూర్యకిరణాల్లో కొంతసేపు ఉంచాలి. దాంతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి, సూర్యుడికి సమర్పించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.
#🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః #☸🙏సూర్యనారాయణ స్వామి #రధ సప్తమి


