ShareChat
click to see wallet page
search
ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధన కోసం అమరనిరాహారదీక్ష చేసి మరీ ప్రాణ త్యాగం చేసిన మహాపురుషుడు,మన అమర జీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి నేడు! ( 16 - 3 - 2026)! లేదా త్యాగానికి మారుపేరుగా నిలిచి తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం చివరి క్షణం వరకు కూడా ఓక అలుపెరుగని పోరు సల్పిన ఓక విప్లవశిఖరం ఈ పొట్టి శ్రీరాములు గారు! ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,మహా పురుషుడు,గొప్ప త్యాగధనుడు,ఓక విప్లవ శిఖరం అయిన పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి అయిన ఈ ప్రత్యేక,శుభదినాన్ని పురస్కరించుకొని ఆయన గొప్పతనం,ప్రాణ త్యాగం గురించి ప్రతి ఒక్క తెలుగు వారు తెలుసుకొని ఆయనకు ( 1901 -2026- మార్చి 16) గొప్ప నివాళులు అర్పించాల్సిన గురుతర భాద్యత మనందరి భుజస్కంధాలపై ఎంతైనా వుంది. ఎందుకంటే ముఖ్యంగా మన అహింసావాది మహాత్మాగాంధీజీ బోదించిన సత్యం,అహింస, హరిజనోద్దరణ వంటి ఆశయాల కోసం తన జీవితాంతం అలుపెరుగని పోరు సల్పిన ఓక ఆదర్శప్రాయమైన మహనీయుడు మన పొట్టి శ్రీరాములు గారు.ముఖ్యంగా తమిళ భాష మాట్లాడే అధిపత్యమైన తమిళనాడు ప్రెసిడెన్సీ నుండి తెలుగు భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఏకైక ఆశయం,లక్ష్యంతో దాదాపు 56 రోజుల పాటు అమరనిరాహార దీక్ష చేసి మరీ తన ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన గొప్ప చెప్పుకోదగిన వ్యక్తి,మహా శక్తి సంపన్నుడు ఈ మహా యోధుడు, ఆశయసాధకుడు ఈ పొట్టి శ్రీరాములు గారు.అదేవిధంగా ఆయన మరణించిన మూడు రోజులకు అల్లర్లు సంభవించి ఓక మహా ఉద్యమం తలెత్తడంతో ఓక మెట్టుదిగి వచ్చి మరీ అప్పటి భారతదేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు అప్పటికప్పుడు తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించవలసి వచ్చిందంటే పొట్టి శ్రీరాములు గారి ప్రాణాత్యాగం ఎంతటి మహోన్నత ప్రభావం చూపిందో మనం ఇట్టే ఊహించవచ్చు.అలా ఆంధ్రులకు ప్రాంత.. భాషప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వాడు ఈ కర్మ యోగి పొట్టి శ్రీరాములు గారు.అంతటి మహోన్నతమైన కారణజన్ముడు పొట్టి శ్రీరాములు గారు,ఓక గొప్ప ఆశయసాధనలో భాగంగా ఆయన ఈ భూమ్మీద నుంచి శాశ్వత నిష్క్రమణ తీసుకోని నేటికి 74 సంవత్సరాలు కావస్తున్న నేటికి ఆయన ఆశేష తెలుగు ప్రజల హృదయాలలో గుడి కట్టుకొని మరీ వున్నాడు అంటే ఆయన ఎంతగా ప్రజల నీరాజనాలకు,వారి మెచ్చుకోలుకు పాత్రుడు అయ్యాడో మనకు తెలియంది కాదు. ఏదిఏమైన ' పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ' అంటారే ఆ విధంగా తన అమూల్యమైన జీవితానికి ఎనలేని ఓక గొప్ప సార్థకత చేకూర్చుకొని చాలా సగర్వంగా తల ఎత్తుకొని మరీ స్వర్గప్రాప్తి పొందిన మహా పోరాటయోధుడు,త్యాగనీరతికి నిలువెత్తు దర్పణం,ఓక నిస్వార్థ పరుడు,ఆంధ్రప్రజల సుఖ, సంతోషాలే తన ఏకైక అజెండాగా భావించడమే కాదు నెల విడిచి సాము చేసి మరీ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసిన ఓక చరిత్రాత్మిక పురుషుడు అమర జీవి అయిన ఈ మహా పరిశ్రామికుడు మన పొట్టి శ్రీరాములు గారు.ఏమైనా అలాంటి గొప్ప,మహోన్నత ఆశయాలు గల స్వాతంత్ర్య సమరయోధుడు అయిన పొట్టి శ్రీరాములు గారి అడుగుజాడల్లో నేటి పాలకులు,ప్రజలు నడిస్తే ఎలాంటి ప్రాంతీయ కుల, మత,వర్గ తారతమ్య భేదాలు లేకుండా మన ప్రజాస్వామ్యం,ఈ యావత్తు సమాజంలోని ప్రజలు మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా వర్ధిల్లడం తథ్యం.అమర్ రహే,అమర్ రహే ఆంధ్రరాష్ట్ర సాధకుడు,అంకుటిత దీక్ష తత్పరుడు,ఇటు పొద్దు అటు పొడిచిన తన చివరి మరణగడియల వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు,సంక్షేమం కోసం పరితపించిన మహా పరాక్రమవంతుడు,అపార ధైర్యసాహసి,చావు అంటే ఏమాత్రం భయం లేని ఓక గట్టి పిండం,ఉక్కు సంకల్పం మెండుగా వున్న ఓక దృఢచిత్తం మన పొట్టి శ్రీరాములు గారు!జైహింద్!మేరా హిందూస్తాన్ మహాన్!🇮🇳🇮🇳🇮🇳 - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి 🙏🌼
శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి 🙏🌼 - Appl Praja ಆಂಡರಾಖ ನೌಧನ Bನ೦ಆಮರಣ ನಿರಾವಾರ ಐತವೆನ ప్రదాలర్పించిన మహపురుషుడు అమంబివి  థీవటి శీరములు గారి 21 బయంది సందరయి తయనమ எலa Appl Praja ಆಂಡರಾಖ ನೌಧನ Bನ೦ಆಮರಣ ನಿರಾವಾರ ಐತವೆನ ప్రదాలర్పించిన మహపురుషుడు అమంబివి  థీవటి శీరములు గారి 21 బయంది సందరయి తయనమ எலa - ShareChat