_*శరవణ భవ*_ కృత్తికా నక్షత్రాన జన్మించిన వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యుని ఆరాధనలో కృత్తికా నక్షత్రం ప్రత్యేకమైంది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా వచ్చే కృత్తికా నక్షత్రం రోజున తమిళనాట ఆడికృత్తికను నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత ప్రీతికరమైన రోజది. ఆడికృత్తికనాడు సుబ్రహ్మణ్య భక్తులు తమిళనాడులో 'ఆరు పడైవీడు'గా ప్రసిద్ది చెందిన ఆరు ప్రధాన క్షేత్రాలను దర్శించి విశేష పూజలు చేస్తారు. *🌺బాలసుబ్రహ్మణ్యుడు పళని🌺* పూర్వం శివుడు, 'గొప్ప జ్ఞానఫలం 'నీవే' అని సుబ్రహ్మణ్యస్వామితో అన్నాడు. తమిళంలోని 'ఫలం నీ' అనే పేరు కాలక్రమంలో పలనిగా మారింది. అదే పళని క్షేత్రం. ఒకసారి నారదుడు అమూల్యమైన జ్ఞానఫలాన్ని తీసుకుని కైలాసానికి వెళ్లాడు. దానిని ముక్కలు చేయకుండా తినమని కోరాడు. పార్వతి ఆ ఫలాన్ని కుమారులకు ఇవ్వాలనుకుంది. "ఎవరైతే ముందుగా ఈ భూప్రదక్షిణం చేసివస్తారో వారికే ఈ ఫలం యిస్తాను' అని పార్వతీదేవి పలుకడంతోనే సుబ్రహ్మణ్యస్వామి తన వాహనమైన నెమలిని అధిరోహించి బయలుదేరాడు. వేగంగా ప్రయాణించలేని వినాయకుడు ఆలోచించి, తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి భూప్రదక్షిణ ఫలాన్ని, నారదుడిచ్చిన జ్ఞానఫలాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. దాంతో అలిగిన సుబ్రహ్మణ్యస్వామి కైలాసం వదలి, ప్రస్తుతం పళని వున్న కొండపైకి వచ్చి కొలువుదీరినట్లు స్థలపురాణం చెబుతోంది. పళనిలో ఆలయం ఉన్న శివగిరి కొండ సుమారు 485 అడుగుల ఎత్తు. 695 మెట్లమార్గం ద్వారా, రోప్ వే లేదా రైలు మార్గాల్లో కొండ మీదికి చేరుకోవచ్చు. విశాలమైన ప్రాంగణంలో వివిధ మండపాలు కలిగిన ఈ ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నిలుచుని ద్విభుజాలతో కటిహస్తుడై మరో చేతిలో దండం ధరించి కౌపీనధారిగా దర్శనం ఇస్తాడు. స్వామివారిని మురగన్, దండాయుధపాణి అని భక్తలు పిలుస్తారు. నవపాషాణం అనే విశిష్టమైన శిలతో తయారుచేసిన స్వామి విగ్రహం నుంచి ధూప, దీప సమర్పణ సమయంలో మూలికా పదార్థాలు వెలువడుతాయని, వాటిని పీల్చడం వల్ల వ్యాధులు నశిస్తాయని చెబుతారు. ఈ స్వామి కావడి ప్రియుడు. పూలు, పాల కావళ్ళను భక్తులు స్వామి వారికి సమర్పిస్తారు. ___________________________________________ HARI (ఓం శ్రీ మాత్రే నమః) ✍🏻🙏 #🌅శుభోదయం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
11 shares

More like this