PSV APPARAO
899 views 13 days ago
#తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వైభవం 🪔🕉️🙏🙏🙏 #తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం 🙏 #శుభ శ్రావణమాసం ... వరలక్ష్మీ వ్రతం ... వరలక్ష్మీ వ్రతకల్పం 🙏 #🛕తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు🕉️ #🙏 ఓం నమో శ్రీ పద్మావతి దేవియే నమః 🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 👆 *స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం* తిరుపతి, 2026 ఆగస్టు 21:: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. స్వర్ణరథోత్సవంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నాలుగు మాడ వీధుల్లో రథాన్ని లాగారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్‌తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
7 shares

More like this