జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
596 views • 1 days ago
ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అభివృద్ధి పేరుతో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతినకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివాసీ భాషలు, కళలు, నృత్యాలు, జానపద సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి సీతక్క గారు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారితో కలిసి అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
గిరిజన విద్యార్థులకు ఉపయోగపడేలా గిరిజన విద్యార్థుల కేంద్రం వద్ద రూ.25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం దమ్మపేట మండలం మారప్పగూడెం గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
నాచారం గ్రామంలో సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
అనంతరం నాగుపల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చిన్నారులకు మెరుగైన వసతులు, పౌష్టికాహారం, మహిళలు మరియు పిల్లలకు అవసరమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం – ఎమ్మెల్యే జారె
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు మాట్లాడుతూ, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. మంత్రి సీతక్క గారి సహకారంతో నియోజకవర్గంలో అవసరమైన మౌలిక వసతులు, విద్య, వైద్యం, రహదారులు, అంగన్వాడీ కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తారని అన్నారు. చైతన్యం, విద్య, ఐక్యతతో ఆదివాసీ సమాజం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఆదివాసీ దినోత్సవం కేవలం వేడుకలకు పరిమితం కాకుండా ఆదివాసీ సమాజ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలవాలని, కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని హక్కుల సాధనతో పాటు విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబనలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులు, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ
7 likes
20 shares