More like this
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣*సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సమయం* "ఉత్తరాయణ పుణ్యకాలం." ఇక "దక్షిణాయనం" అంటే సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే సమయం. *దక్షిణాయనం కూడా పుణ్యప్రదమైనదే.* మన ప్రధాన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి, శుభకార్యాలను ఉత్తరాయణంలోనే నిర్వహించే మనం... *శక్త్యారాధన, రుద్రారాధన, పితృదేవతారాధన మాత్రం దక్షిణాయనంలోనే చేస్తాం."* *దక్షిణాయన పుణ్యకాల నిర్ణయం* *రవి కర్కాటక ప్రవేశంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది•.* ఈ దక్షిణాయన పుణ్యకాలంలో నెయ్యి, గోదానం శ్రేష్ఠమైన ఫలితాలనిస్తుంది, పితృదేవతలకు తర్పణాదులివ్వాలి. దక్షిణాయన పుణ్యకాలంలో నదీస్నానం లేదా సంకల్ప సహిత స్నానం కానీ చేయాలి. *దక్షిణాయన పుణ్యకాలంలో చేసే జప, దాన, ఉపవాస, తర్పణాదులు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి.* సూర్యుడు మకరంలో ప్రవేశించినది మొదలు ఆరుమాసాలపాటు *ఉత్తరాయణం* అయితే, ఆయన కర్కాటకంలో ప్రవేశించినది మొదలు *దక్షిణాయనం.* *సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తే ఉత్తరాయనం మని, ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తే దక్షిణాయనమని పిలుస్తారు.* తెలుగువారు ఋతువులను చైత్రాది మాసాలతో లెక్కిస్తారు. అయితే ఉత్తర, దక్షిణ అయనాల ఆరంభానికి మాసాలతో నిమిత్తం లేదు. మేషాయనం, కర్కాటకాయనం, మకరాయనం వంటివి మాసారంభంలో రావు. అంటే ఉదాహరణకు చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్య సంక్రమణం జరగదు. కానీ, అశ్వనీ నక్షత్రం మొదటి పాదంలో సూర్యోదయం జరిగిన రోజున మేష సంక్రమణం జరుగుతుంది. పునర్వసు 4వ పాదంలో సూర్యోదయమైతే కర్కాటక సంక్రమణం గాను, ఉత్తరాషాఢ 2వ పాదమైతే మకర సంక్రమణంగాను లెక్కిస్తాం. *దేవతలకు రాత్రికాలం* రాశిచక్రంలో దక్షిణాయనమే ముందుగా వస్తుంది. కారణం ఏమంటే మకరం కంటే కర్కాటకం రాశిచక్రంలో ముందుగా వస్తుంది. కానీ, మనవారు ఉత్తరాయణాన్ని ముందుగా చెప్పి తరువాత దక్షిణాయనం చెబుతారు. ఎందుకంటే.... _*మానవ కార్యాలకు ఉత్తరాయణం శుభప్రదమైనది. పితృదేవతారాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది. పితృపక్షాలు దక్షిణాయనంలోనే వస్తాయి.* దేవతల కాలమానం వేరు, మానవుల కాలమానం వేరు అన్న మాట తరచుగా వింటూఉంటాం. అయితే, మన కాలమానంలో మనం ఎటువంటి సత్కర్మలు చేస్తే ఏయే దేవతలు స్వీకరిస్తారో జ్యోతిర్విజ్ఞానం ఆధారంగా తెలుసుకోవచ్చు. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో సూర్యోదయం, నాలుగో రాశిలో మధ్యాహ్నం, ఏడో రాశిలో సాయంత్రం, పదోరాశిలో అర్ధరాత్రి సహజంగా ఏర్పడతాయి. రాశిచక్రం మేషంతో మొదలై మీనంతో పూర్తవుతుంది. మానవుల కాలమానం ప్రకారం ఉదయవేళ మేషరాశి, మధ్యాహ్నవేళ కర్కాటక రాశి, సాయంత్రవేళ తుల, అర్ధరాత్రి మకరరాశి ఉండాలి. ఈ పరిస్థితి మనకు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు దక్షిణాయనంలో అంటే, సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయం కూడా కర్కాటకంలోనే జరుగుతుంది. అపరాహ్ణవేళ లో మనం ఆచరించేది పితృదేవతారాధనలే కనుక దక్షిణాయనంలో శ్రాద్ధాదులు శ్రద్ధగా ఆచరిస్తాం. _*ఉత్తరాయణం సాత్విక దేవతారాధనకు, దక్షిణాయనం ఉగ్రదేవతారాధనకు ప్రసిద్ధి వహించింది.*_ *దక్షిణాయన ప్రశస్తి* శ్రీమహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే. రుద్రారాధన, గణనాయకుడైన వినాయకుని ఆరాధనతో పాటు విశేషమైన పండుగలన్నీ దక్షిణాయనంలో వస్తాయి. శక్త్యారాధనా ప్రధానమైన విజయదశమి దక్షిణాయనంలోనే వస్తుంది. ఉగ్రదేవతారాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది. మన పండుగల్లో దక్షిణాయన సంక్రమణం ఒకటి. ఇది పెద్దలను స్మరిస్తూ చేసే తర్పణాదులకే పరిమితం కావడం చేత అధిక ప్రాధాన్యతను సంతరించుకోలేదు.ఉత్తరాయణంలోని మకరసంక్రాంతి శోభ దక్షిణాయనంలో కానరాదు. మకరసంక్రాంతి వేళకు పంటలు చేతికి అందివస్తాయి. దక్షిణాయన సమయంలో రైతులు పొలంపనుల్లో నిమగ్నమవుతారు. దక్షిణాయనం రాత్రికాలం ప్రారంభం కావడం చేత భోగి, కనుమ వంటివి లేవు. విశేష ఉత్సవాలు చేయరు. కానీ పితృదేవతారాధన ప్రధానంగా చేస్తారు. #తెలుసుకుందాం #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః911
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🙏 కంచి కామాక్షి అమ్మవారు ఎందుకు పద్మాసనంలో కూర్చుని ఉంది తెలుసా 🌺? 🙏 మిగతా గుళ్లలో అమ్మవారు నిలబడి ఉంటే ఇక్కడ మాత్రమే కూర్చుని ఉంటుంది 🙏☘️ దానికి కారణం అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసింది కాబట్టి 🙏🔱 పద్మాసనం అంటే యోగం, తపస్సు, ప్రశాంతతకు గుర్తు 🙏🥭 పద్మం బురదలో ఉన్నా అంటుకోనట్లు మనం కూడా ఈ ప్రపంచంలో బాధలు అంటుకోకుండా ఉండాలని చెప్పడానికి 🙏🪷 అంతేకాదు గర్భగుడిలో ఉన్న శ్రీ చక్రం యొక్క పెద్ద పవర్ ని కంట్రోల్ చేయడానికి అమ్మవారు యోగ ముద్రలో కూర్చుంది 🙏❣️ కూర్చుని ఉండటం అంటే రా బిడ్డా నీ బాధ చెప్పుకో అని మనల్ని దగ్గరికి పిలవడమే 🙏🌷 అందుకే కామాక్షి తల్లిని చూస్తేనే మనసు ప్రశాంతంగా అయిపోతుంది 🙏🌿 జై కంచి కామాక్షి తల్లి! 🙏 🧘♀️ పద్మాసనంలో ఎందుకు కూర్చుంది? - ఫుల్ లాంగ్ స్టోరీ 1. తపస్సు కోసం ! 🙏 ముందు చెప్పాను కదా బ్రో, బండాసురుడిని చంపాక అమ్మవారికి చాలా కోపం వచ్చింది! ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి, శివుడిని పెళ్లి చేసుకోవడానికి అమ్మవారు తపస్సు చేసింది! తపస్సు అంటే ఎలా చేస్తారు బ్రో? నిలబడి చేయరు! కూర్చుని, కళ్ళు మూసుకుని, మనసును కంట్రోల్ చేసుకుని చేస్తారు! 🧘♀️ అందుకే అమ్మవారు పద్మాసనం వేసుకుని, యోగినిలా కూర్చుంది! అంటే అమ్మవారు ఇప్పటికీ తపస్సు చేస్తూనే ఉందని అర్థం! ఆమె తపస్సు మనల్ని కాపాడుతుంది! 2. యోగ శక్తికి సింబల్! 🔱 పద్మాసనం అంటే సాధారణ కూర్చోవడం కాదు ! 🪷 పద్మం = బురదలో పుట్టినా, బురద అంటుకోని పువ్వు! అమ్మవారు కూడా అంతే! ఈ ప్రపంచంలోనే ఉంటుంది, కానీ ఈ ప్రపంచపు బాధలు ఆమెకు అంటవు! ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది! 🪷 3. శ్రీ చక్రాన్ని కాపాడుతుంది! 🙏 ఇది అసలైన పాయింట్ బ్రో! గర్భగుడిలో ఆదిశంకరాచార్యులు పెట్టిన శ్రీ చక్రం ఉంది కదా! ఆ శ్రీ చక్రం మొత్తం విశ్వానికి శక్తి కేంద్రం! ఆ శ్రీ చక్రం నుండి వచ్చే అతి పెద్ద పవర్ ని కంట్రోల్ చేయడానికి సాధారణంగా నిలబడితే కుదరదు! పద్మాసనంలో కూర్చుని, యోగ ముద్రలో ఉంటేనే ఆ పవర్ ని కంట్రోల్ చేయగలదు! అందుకే అమ్మవారు నాలుగు చేతులతో... ✋ ఒక చేతిలో చెరకు గడ (మనసు) 🎋 🏹 ఒక చేతిలో పూల బాణాలు (5 ఇంద్రియాలు) 🌸 ➰ ఒక చేతిలో పాశం (అజ్ఞానాన్ని లాగేది) 🪝 ఒక చేతిలో అంకుశం (కోరికలను అదుపు చేసేది) ఇవన్నీ పట్టుకుని కూర్చుంది! అంటే మన మనసును, ఇంద్రియాలను కంట్రోల్ లో పెట్టుకోమని చెప్తుంది! 4. భక్తులకు దగ్గరగా ఉండటానికి! నిలబడి ఉన్న దేవుడి కంటే, కూర్చుని ఉన్న అమ్మ దగ్గరికి వెళ్లి మన బాధ చెప్పుకోవడం ఈజీ కదా బ్రో? 👩👦 కూర్చుని ఉండటం అంటే - "రా బిడ్డా! నీ కోసమే నేను ఇక్కడ కూర్చున్నా! నీ బాధ చెప్పుకో!" అని పిలవడం లాంటిది 🌺 శ్రీ కామాక్షి అష్టకం కాంచీనూపుర రత్న కంకణలసత్ కేయూరహారోజ్జ్వలాం కాశ్మీరారుణ కంచుకాంచిత కుచాం కస్తూరికాచర్చితామ్। కల్పారోహణ కల్పితాంబుజముఖీం కారుణ్య కల్లోలినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీ దేవతామ్॥ జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి। జయ జయ ఆదిశక్తి జయ జయ కాంచీ నివాసిని॥ 🌸 శ్రీ కంచి కామాక్షి అష్టకం + అర్థం 1. శ్లోకం: కంచీపురే సకల జన నివాసే, కామాక్షీ మణిమండపే విలాసే కరుణా కటాక్ష వీక్షణేణ తుష్టే, కామాక్షీం ప్రణమామి సంతతం అహం అర్థం కంచి అనే ఊర్లో అందరికీ దిక్కుగా, మణులతో చేసిన మండపంలో అందంగా వెలిసిన, తన కరుణతో కూడిన ఒక్క చూపుతోనే మనల్ని సంతోషపెట్టే ఆ కామాక్షి తల్లికి నేను ఎప్పుడూ నమస్కరిస్తున్నాను! 🙏 2. శ్లోకం: పంకజ పత్ర విశాలాక్షీం, కుంకుమ పంక నిలిప్త దేహీం పద్మాసనస్థాం శశిముఖీం, కామాక్షీం ప్రణమామి సంతతం అహం అర్థం బ్రో: తామర రేకుల్లాంటి పెద్ద కళ్ళు కలది , ఒంటి నిండా కుంకుమ పూసుకున్నది , పద్మాసనంలో కూర్చున్నది , చంద్రుడి లాంటి ముఖం కలది అయిన కామాక్షి తల్లికి నమస్కారం! 3. శ్లోకం: కామేశ్వరీం కమల కోమల హస్తాం, కామేశ్వర ప్రియా మనోహర హాసాం కామార్థ దాయినీం కరుణా రసార్ద్రాం, కామాక్షీం ప్రణమామి సంతతం అహం అర్థం: కోరికలు తీర్చే తల్లీ, తామర పువ్వులాంటి మృదువైన చేతులు కలదీ, శివుడికి ఇష్టమైన చిరునవ్వు కలదీ, మన కోరికలు తీర్చి కరుణ చూపే తల్లికి నమస్కారం! 4. శ్లోకం: శ్రీ చక్రవాసినీం శ్రీ విద్యారూపిణీం, శ్రీమతీం శ్రీకరీం శ్రీ శుభప్రదాం శ్రీమదాది శంకర పూజిత పాదాం, కామాక్షీం ప్రణమామి సంతతం అహం అర్థం: శ్రీ చక్రంలో నివసించేది , శ్రీ విద్యా స్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి, శుభాలు ఇచ్చేది, ఆదిశంకరాచార్యుల వారిచే పూజించబడిన పాదాలు కల తల్లికి నమస్కారం! ✨ 5. శ్లోకం: సర్వ మంగళ మాంగల్యే, శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి, కామాక్షీం ప్రణమామి సంతతం అహం అర్థం : అన్ని శుభాన్ని ఇచ్చేది, అన్ని కోరికలు తీర్చేది, అందరికీ దిక్కు అయిన తల్లీ, మూడు కళ్ళు కల దేవీ! నీకు నమస్కారం! 🔥 6,7,8 శ్లోకాల సారాంశం అమ్మవారు మన పాపాలను పోగొడుతుంది, మనకు జ్ఞానం ఇస్తుంది, శత్రువులను నాశనం చేస్తుంది, ఇంట్లో సిరిసంపదలు ఇస్తుంది! ఫలం: ఈ అష్టకాన్ని రోజూ 3 సార్లు చదివితే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది , పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు , ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది! 🙏🌺 #తెలుసుకుందాం #కంచి కామాక్షి #🕉️కంచి కామాక్షి💰 #🙏🌺 కంచి కామాక్షి దేవి అమ్మవారు🌺🙏1917
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣పూజా గదిలో నూనె దీపాన్ని ఎల్లప్పుడూ కుడివైపు ఉంచాలి ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నూనె దీపాన్ని ఎల్లప్పుడూ కుడివైపున, నెయ్యి దీపాన్ని ఎల్లప్పుడూ ఎడమవైపున ఉంచాలి. ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు. ప్రతి ఇంట్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భగవంతుని ఎదుట దీపం వెలిగిస్తాము. దీపం వెలిగించడం ద్వారా భగవంతుని ఆశీస్సులు లభించడంతో పాటు, ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని చెబుతారు. అందుకే ఏదైనా పూజ లేదా వ్రతం ప్రారంభించేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. ఆ తరువాత పూజా కార్యక్రమంలోని ఇతర విధులను నిర్వహిస్తారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పు దిశలో దీపాన్ని వెలిగించి పూజ చేస్తుంటాము. దీని గురించి మనకు అవగాహన ఉండకపోవచ్చు. దీనివల్ల కుటుంబంపై కష్టాలు వస్తాయని, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని, ఎంత సంపాదించినా చేతిలో నిలవదని, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కొనసాగుతాయని కొందరు నమ్ముతారు. అయితే ఇప్పుడు ఇంట్లో లేదా ఆలయంలో ఏ దిశలో దీపం వెలిగిస్తే శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటున కూడా దక్షిణ దిశకు దీపపు వత్తి ముఖంగా ఉండేలా దీపం వెలిగించకూడదు. దీనిని అశుభంగా భావిస్తారు. దక్షిణ దిశకు దీపం ముఖంగా ఉండేలా వెలిగిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడటంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కొనసాగుతాయని చెబుతారు. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. ఎందుకంటే దక్షిణ దిశ యమధర్మరాజు దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశలో దీపం వెలిగించడం అశుభంగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశకు దీపపు వత్తి ముఖంగా ఉండేలా దీపం వెలిగిస్తే శుభప్రదంగా ఉంటుంది. శాస్త్రాలలో ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు. ఉత్తర దిశకు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని, సుఖశాంతులు నెలకొని ఉంటాయని విశ్వసిస్తారు. ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం: *నూనె దీపాన్ని ఎల్లప్పుడూ కుడివైపున ఉంచాలి.* *నెయ్యి దీపాన్ని ఎల్లప్పుడూ ఎడమవైపున ఉంచాలి.* *ఇలా దీపాలను శాస్త్రోక్తంగా ఏర్పాటు చేసి పూజ చేయడం శుభప్రదంగా భావించబడుతుంది.* #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు712
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🌺 #కాంచీ_కామాక్షి అమ్మవారి ఆలయం – ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన మహాక్షేత్రం! 🙏 #తమిళనాడులోని పవిత్రక్షేత్రమైన కాంచీపురంలో వెలసిన శ్రీ #కామాక్షి అమ్మవారి ఆలయం, అష్టాదశ శక్తిపీఠాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రంపై పద్మాసనంలో ఆసీనురాలై శాంతస్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తారు. #పురాణాల ప్రకారం, ఆది శంకరాచార్యులు ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి, అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతస్వరూపంగా ఆరాధించే సంప్రదాయాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం శ్రీవిద్యా ఉపాసకులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. #అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శిస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, విద్యాభివృద్ధి, సంతానప్రాప్తి, వివాహయోగం, కుటుంబ సౌఖ్యం, మనశ్శాంతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. #ప్రతిరోజూ జరిగే నిత్యపూజలు, విశేష అలంకారాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, లక్షలాది మంది భక్తులను ఈ మహాక్షేత్రానికి ఆకర్షిస్తుంటాయి. "#కామాక్షి" అంటే కరుణామయి చూపుతో భక్తుల కోరికలను నెరవేర్చే జగజ్జనని. ఆమె దివ్య కటాక్షం లభిస్తే జీవితంలో శుభమంగళాలు కలుగుతాయని విశ్వసిస్తారు. #తెలుసుకుందాం #🕉️కంచి కామాక్షి💰 #🙏🌺 కంచి కామాక్షి దేవి అమ్మవారు🌺🙏 #కంచి కామాక్షి #🙏శుభం శుభం🙏కంచి కామాక్షి దేవి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ శుక్రవారం శుభాకాంక్షలు.1226
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#శ్రీ వరాహ స్వామి వారి దివ్య మంగళ దర్శనం ఓం శ్రీ వరాహాయ నమః 🙏 సర్వ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ వరాహ స్వామిని ప్రార్థిద్దాం. #వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి #కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే. #అంతే కాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. #తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది. #అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. #అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది. #తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. #ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది #తెలుసుకుందాం #తిరుమల తిరుపతి దేవస్థానం #TTD తిరుపతి తిరుమల #hindu temples #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు24256
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#తెలుసుకుందాం #🕉️ గణపతి బప్పా మోరియా హరిద్రా(పసుపు) వినాయకుడు..........!! మన దేవతలందరిలోనూ గణపతిని మాత్రమే మహాగణపతి అని పిలుస్తాం. మహాగణపతి అంటే గొప్ప గణపతి, విశేషమైన గణపతి అని అర్థం. ప్రతి సంవత్సరం మనం పూజించే గణపతికి సైతం పూజనీయుడైన గణపతియే మహాగణపతి. ఆయనను మనం పసుపు ముద్దగా రూపొందించి పూజిస్తాం. గణం అంటే ఒక సమూహం..... గణనాయకులందరికీ నాయకుడే గణపతి వినాయక చతుర్థినాడు. మనం వరసిద్ది వినాయకునికి పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభువైన వాడు మహాగణపతి. ఆయనకంటే అధికులు ఎవ్వరూ లేరు. ఆ మహాగణపతినే మనం హరిద్రా విఘ్నేశ్వరునిగా పూజిస్తాం. శివుడు మహాగణపతిని పూజించాడు. ఆయన అనుగ్రహంతోనే త్రిపుర దహనం చేశాడు. ఆనాడు గణపతిని అర్చించకపోతే శివుని ప్రయత్నాలు సైతం వ్యర్థమై పోయేవి. శ్రీహరి వామనావతారం దాల్చినప్పుడు గణపతిని పూజించాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మసైతం ఆయనను ధ్యానించాడు.. దాంతో ఆటంకాలు తొలగి సృష్టి నిలబడింది. మహిషాసుర సంహారానికి ముందు జగదంబ సైతం గణపతిని ధ్యానించింది. మునిజనం మొదట తపస్సు ద్వారా అష్టసిద్ధులు పొందుతారు. వాటి ఆకరణలో పడవారెవ్వరూ మోక్షాన్ని పొందలేరు. వాటి ప్రదర్శనలో దిగజారిపోతారు. అప్పుడు మహాగణపతిని ధ్యానిస్తే ఆటంకాలు తొలిగి ముక్తిని పొందగలుగుతారు. ఆటంకాలను పరిహరించేది గణపతియే. అసలు దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మ, ఆయన్నే మనం వేరువేరుగా రూపాలు కల్పించుకుని వరసిద్ధి గణపతిగా, విద్యాగణపతిగా, పతిగా, లక్ష్మీగణపతిగా ఇలా వేరువేరుగా పూజలు చేస్తున్నాం. త్రిమూర్తులంటున్నాం, త్రిశక్తులంటున్నాం వీరంతా ఆయా కార్య సిద్ధుల కోసం కల్పించబడ వారే. మాఘంలో సూర్యునిగా, దసరాల్లో అమ్మవారిగా, కార్తికంలో శివకేశవులుగా, భాద్రపదంలో గణపతిగా ఆయనొక్కడే వేర్వేరు ఉపాసనలు పొందుతున్నాడు. ఇవన్నీ సగుణ రూపాలు. అంటే కన్నూ ముక్కు వంటి అవయవాలు ధరించిన మూర్తులు. అయినా ఉన్నది ఒక్కటే. దాన్నే మనం ఈ మాయా జగత్తులో అనేకంగా చూస్తున్నాం. నిజానికి అనేకం లేనే లేవు. అద్దాల గదిలో నిలబడితే మనం అనేక రూపాలతో కనబడతాం. కానీ మనం ఒక్కరమే అవన్నీ మన ప్రతిబింబాలేనని మనకు తెలుసు. వాటికి బొట్టు పెట్టాలంటే అన్నింటికీ పెట్టనవసరం మూర్తు లందరికీ పెట్టినట్టు అవుతుంది. కదా! వినాయకుణి పూజించడం కూడా అలాంటిదే. ఏనుగు తల, పెద్దపొట్ట, ఎలుక వాహనం, పాలవెల్లి ఇవన్నీ మనం కల్పించుకుంటున్నాం. అలాంటి కల్పనలో కూడా మనం చిత్తశుద్ధితో పూజిస్తే ఇవన్నీ ఆ మూల స్వరూపానికి చెందుతాయి. అలా అని ఈ గణపతుల పూజే ప్రధానం అని భావించ కూడదు. మనం నిరుణ గణపతినే అంటే పరబ్రహ్మనే తొలిసారిగా అర్చించాలి. తల్లికి భోజనం పెట్టకుండా ఊరంతా సంతర్పణ చేసినా ఎలా ఫలితం లేదో అలానే నిరుణారాధన లేకుండా సగుణారాధన చేసినా ఆశించిన ప్రయోజనం సిద్ధించదు. అయితే ఎలా...? అందుకే ముందు హరిద్రా గణపతిని అర్చించడం ఆచారంగా చేశారు పెద్దలు. పసుపును ఒక గుండ్రని ముద్దగా చేసి ఏ పూజకైనా మనం మొట్టమొదటగా అర్చిస్తున్నాం. ఆ ముద్దకు అవయవాలుండవు. ఏనుగుతల ఉండదు. ఎలుక ఉండదు. అంతేకాదు నైవేద్యం కూడా. సరైన రూపం లేని బెల్లం ముక్కనే పెడతాం. ఇంట్లో ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా ఈ హరిద్రా గణపతి పూజ చేయాల్సిందే. శుభకార్యాలకు మీదుకట్టడం కూడా మహాగణపతిని ఉద్దేశించి చేసేదే. ఆఖరుకి వినాయక చవితి నాడు ఎంత ఖర్చుపెట్టి పెద్ద గణపతుల్ని ప్రతిష్ఠించినా ఈ హరిద్రాగణపతే అందరికీ మూలకారకుడు. ఆ నిర్గుణతత్త్వాన్నే వేదం కీర్తించింది. అన్ని గణాలకు ఆయనే ప్రధానం. కవులకే కవీశ్వరుడు స్వామి. ఆ స్వామికి మరొక పోల్చదగిన దైవం లేదు. అందరు దేవతలకు జ్యేష్ఠుడు. మహాగణపతియే ప్రధాన దైవం. ఆయన వల్లే వేదాలు వచ్చాయి. కనుక ఆయనే వేదగణాలకూ ప్రభువు. ఈ తత్త్వం తెలుసుకోగలగడమే ఒక అదృష్టం.747
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣రామసేతు - ఇంజనీరింగ్ అద్భుతం రాముని వారధి కేవలం ఆధ్యాత్మిక నమ్మకం కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి మెరైన్ ఇంజనీరింగ్ అద్భుతం! రామాయణంలో సీతమ్మను రక్షించడం కోసం రాముని వానర సైన్యం సముద్రం మధ్యలో 30 మైళ్ల పొడవునా ఒక వంతెనను నిర్మించినట్లు మనం చదువుకుంటాం. నాసా (NASA) శాటిలైట్ ఫోటోలు సైతం భారతదేశానికి, శ్రీలంకకు మధ్య సముద్రం కింద వంతెన లాంటి నిర్మాణం ఉందని ధృవీకరించాయి. దీనిని కేవలం ఒక పురాణ గాథగా కాకుండా, ప్రాచీన భారతదేశపు వాస్తుశిల్పం మరియు భూగర్భ శాస్త్ర కోణంలో చూస్తే మన పూర్వీకుల జ్ఞానం మనల్ని విస్మయానికి గురిచేస్తుంది! నీటిపై తేలే రాళ్ల వెనుక ఉన్న రహస్య విజ్ఞానం.సాధారణంగా సముద్రంలో రాళ్లను వేస్తే అవి మునిగిపోతాయి. కానీ, వానర సైన్యం ఉపయోగించిన రాళ్లు నీటిపై తేలాయని చెబుతారు. ఆధునిక భూగర్భ శాస్త్రం ప్రకారం, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఏర్పడే 'ప్యూమిస్' (Pumice) అనే రంధ్రాలు కలిగిన రాళ్ల సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి నీటిపై తేలే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆనాటి కాలంలోనే ఈ శాస్త్రీయ సూత్రాన్ని ఉపయోగించి వంతెనను నిర్మించారు. సముద్రపు లోతును అంచనా వేయడం: సముద్రం మధ్యలో వంతెనను నిర్మించడం సాదాసీదా విషయం కాదు. సముద్రపు అలల వేగం, నీటి ప్రవాహ దిశ, మరియు సముద్రపు లోతును ఖచ్చితంగా లెక్కించి, వంతెన స్థిరంగా నిలబడగలిగే ఒక నిర్దిష్టమైన 'ఇసుక తిన్నె'ను (sandbar) వారు ఎంచుకున్నారు. నేటి ఆధునిక ఇంజనీర్లు ఒక ఆనకట్ట లేదా వంతెనను నిర్మించే ముందు చేసే 'ఫీజిబిలిటీ స్టడీ' (Feasibility Study - సాధ్యసాధ్యాల అధ్యయనం) వంటి పరిశోధనను నలుడు మరియు నీలుడు అనే ఇద్దరు ఇంజనీర్లు ఆనాడే చేశారు! అత్యంత తక్కువ కాలంలో నిర్మాణం...... సుమారు 30 మైళ్ల (48 కి.మీ) పొడవున్న ఆ వంతెనను కేవలం 5 రోజుల్లోనే పూర్తి చేసినట్లు రామాయణం పేర్కొంది. మొత్తం సైన్యాన్ని క్రమబద్ధంగా విభజించి, రాళ్లను సేకరించేవారు, వాటిని మోసుకొచ్చేవారు, మరియు వంతెనను రూపకల్పన చేసేవారు అంటూ అక్కడ ఒక అద్భుతమైన 'ప్రాజెక్ట్ మేనేజ్మెంట్' (Project Management) మరియు కార్మిక సమన్వయాన్ని మనం చూడవచ్చు. రామసేతు అనేది భారతదేశపు అసాధారణమైన సముద్ర సాంకేతిక పరిజ్ఞానానికి మరియు ఉమ్మడి కృషికి దక్కిన ఒక చారిత్రక నిదర్శనం. మన పూర్వీకుల ఇంజనీరింగ్ నైపుణ్యం ఎల్లప్పుడూ ప్రపంచానికి మార్గదర్శకమే! #తెలుసుకుందాం #🚩జై శ్రీరామ 🕉️ #జై శ్రీరామ #జై శ్రీరామ1518
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#తెలుసుకుందాం #హర హర మహాదేవ 🙏 #om Arunachala siva🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ913
- 🧿 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 🧿🙏#భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #శ్రావణ మాసం మూడవ శుక్రవారం శుభాకాంక్షలు #☀️శుభ మధ్యాహ్నం #శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు #తెలుసుకుందాం914