More like this
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣శ్రీమాత్రే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ‘శ్రీమాతా’ – అంటే మంగళప్రదురాలైన అమ్మా! అని అర్థము. గుర్తు పట్టవలసిన విషయము లోకములో ఉన్న ఏకైక సంథానమయిన అమ్మ అన్నమాటకు పరిచయము లేదు. కడుపులో ఉండగా నాభీగొట్టముతో ప్రారంభమైన అనుబంధము బయటికి వచ్చాక తెగిపోతుంది. హృదయసంబంధము అలాగే ఉంటుంది. అమ్మ అంటే పోషణ – రక్షణ – మంగళము. అమ్మలేకపోతే సృష్టి ఆగిపోతుంది. అమ్మవారి సృష్టిశక్తి, మాతృత్వము ఒక పురుష వీర్యమును స్త్రీ శరీరము పుచ్చుకునేట్టుగా నిర్మాణము చేయడములో ఉన్నది. ఆ తల్లి అనుగ్రహముతో పిల్లవాడు పూర్తిగా తయారు అయ్యేవరకు పెరగాలి. లోపల పిల్లవాడు నొక్కుడు పడకుండా, తల్లి శరీరము పిగిలిపోకుండా, మళ్ళీ పిల్లవాడు బయటికి వచ్చాక సంకుచితమవ్వాలి. ఇంతమంది జన్మించడానికి స్త్రీ ఉపాధుల యందు అంత మార్పుతో నిర్మాణము చేసి, లోపల పసిగుడ్డును కాపాడి జాగ్రత్త చేసింది శ్రీమాత. కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే అమ్మ స్తన్యములో కోలోస్ట్రం అనే పసుపు పచ్చని ముద్ద ఒకటి ఊరుతుంది. ఏమీ తెలియని వాడిని జగన్మాత ఆవహించి ‘ నీ పోషణకోసము, రక్షణకోసము మీ అమ్మ స్తన్యములయందు నేను ప్రకాశిస్తున్నాను’ అని చెపుతుంది. అమ్మ స్తన్యములలో ఊరిన ఆ పదార్థమును పిల్లవాడు చప్పరిస్తే లోపలున్న ఊపిరితిత్తులు, జీర్ణాశయము అన్నీ పనిచేస్తాయి. కడుపులో ఉండగా నల్లటి మలము గడ్డలుగా పెరుగుతుంది. దానిని బయటికి పంపడము ఎవరికీ సాధ్యముకాదు. కోలోస్ట్రం మ్రింగగానే నల్లటి మలము బయటికి వెళ్ళిపోతుంది. మలినములు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అమ్మ కడుపులో, పక్కలో దూరి పడుకోవడములో పిల్లవాడు ఎంతో భద్రత అనుభవిస్తాడు. ఆ అమ్మతనము అంతా హృదయము పరవశించిపోయే శ్రీమాతాతత్త్వము. అమ్మవారి వంకచూసి ‘శ్రీమాతా’ అని పిలవడానికి భయపడనవసరము లేదు. ఉపాసన చేయడానికి నియమ నిబంధనలు లేవు . అమ్మగా అమ్మవారిని చూడాలి. అమ్మని ఒక మొగవాడిగా చూస్తే దోషము. ఏ అమ్మా క్షమించదు. కొడుకుగా నిలబడి నమస్కారము చేస్తే ఆదుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధముగా ఉంటుంది. ఆవిడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త గర్భాలయము ఇచ్చింది, పాలు పట్టింది, (స్వల్పకాలికలయము) నిద్రపుచ్చింది. ముగ్గురూ అమ్మలో ఉన్నారు కనక మొదటి దైవము అమ్మ . భగవంతుడు ఒక్కడే అయినా కర్తవ్యనిష్ఠ కలిగినప్పుడు బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రునిగా మూడురూపములతో ప్రకాశిస్తాడు. శ్రీమాత ఈ ముగ్గురూ మూడురకములైన కార్యములను నిర్వహించడానికి మూడురకములైన శక్తులను ఇచ్చింది. ఉపనిషత్తు – ‘యతోవా ఇమాని భూతాని జాయన్తి ’ అంటుంది. దేనినుండి సమస్తము ఉత్పన్నము అయినదో – ‘దేనినుండి’ అన్నమాట ఏది ఉన్నదో అదే అమ్మవారు. దేనినుండి సమస్తము పుట్టాయో అన్న ఉపనిషత్ వాక్యము మారిస్తే అదే శ్రీమాత. అన్ని ప్రాణులను సృజించుట వెనక అమ్మదయ ఉన్నది. శ్రీమాత ఎవరు? అన్న విషయము జాగ్రత్తగా అవలోకనము చేస్తే ‘శ్’ ‘ర్’ ‘ఈ’ అన్న మూడు అక్షరములు కలిస్తే ‘శ్రీ’ అవుతుంది. ఆ మూడూ సత్త్వ, రజ, తమో గుణములను చూపిస్తాయి. లోకమంతా వీటిలోనే ఉన్నది. ఇవి బయటికి రాకుండా కలసిపోయి అవ్యక్తమైపోయి ఒక దానిలోకి వెళ్ళి ఉండిపోతే ‘శ్’ ‘ర్’ ‘ఈ’ కలసి శ్రీ – కలసిపోయి మాత – ఆవిడలోకి వెళ్ళిపోతాయి. సృష్టికి ముందర ఆవిడ ఒక్కత్తే ఉన్నది. ఆమెను పూర్వజా అంటారు. ఆవిడలో ఉన్న మూడుగుణములు ఆవిడలోనుంచే పైకి వచ్చాయి. ఈ మూడుగుణములు తీసి శుద్ధసత్త్వము ఆమెయే ఇవ్వాలి. అమ్మా! ఈ గుణముల వలన లోపలనుండి కలిగే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యములన్న శత్రువులు అని గుర్తించి ఆవి ఉండటము వలన బాధ, కష్టము కలుగుతున్నాయి అమ్మా! అని నిజాయితీగా అంటే చాలు అమ్మవారు ఆ మూడూ ఉపసంహారము చేసి బాధలను తీర్చేస్తుంది. భాస్కరరాయలవారు అంటారు -- ‘లోకములో ఒక తల్లికీ తండ్రికీ జన్మించిన బిడ్డడు అమ్మా! అనే పిలుస్తాడు. బిడ్డడిని విడచి ఉండమంటే ఏ తల్లీ అంగీకరించదు. నేను వేరొకజన్మ లేకుండా చేసుకోవడానికి తురీయాశ్రమమునకు వెళ్ళిపోతాను అంటే అంగీకరించదు. శ్రీమాతా అని పిలిస్తే వేరొకజన్మలో అమ్మా! అని ఎవరినీ పిలవనవసరము లేని స్థితిలో మోక్షము ఇస్తుంది. శివజ్ఞానము ఇస్తుంది. ఆ జ్ఞానము కలగగానే పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యస్థితి పొందడము జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే 🙏🏻🙏🏻 ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 సాధనాత్ సాధ్యతే సర్వం💥 #తెలుసుకుందాం #❤️అమ్మ ప్రేమ 👩👧1014
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#😃మంచి మాటలు #తెలుసుకుందాం #parenting tips #parenting Teach them to your kids instead of Gender 🙏2111
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣*శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం –* *కుబేరుని వద్ద తీసుకున్న అప్పు – హుండీ రహస్యం* *శ్రీనివాసుడు–పద్మావతి దేవి దివ్యకళ్యాణం వైభవంగా జరగడానికి సమయం ఆసన్నమైంది. ఈ కళ్యాణం సాధారణ రాజవివాహం కాదు. దేవతలు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు అందరూ పాల్గొనే మహాదివ్యోత్సవం. అందువల్ల అన్ని ఏర్పాట్లు అత్యంత వైభవంగా ఉండాలని శ్రీనివాసుడు సంకల్పించాడు.* *పురాణాల ప్రకారం, ఈ దివ్య కళ్యాణానికి అవసరమైన అపారమైన సంపద కోసం శ్రీనివాసుడు ఐశ్వర్యాధిపతైన కుబేరుడి వద్దకు వెళ్లాడు. తన వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ధనాన్ని అప్పుగా ఇవ్వాలని కోరాడు. కుబేరుడు భక్తితో ఆ వినతిని అంగీకరించి, కావలసిన సంపదను సమర్పించాడు.* *అప్పుడు శ్రీనివాసుడు ఒక వాగ్దానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. "కలియుగం ముగిసే వరకు నా భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఈ అప్పును తీర్చుకుంటాను" అని ఆయన* *చెప్పాడని విశ్వసిస్తారు.* *అందుకే నేటికీ తిరుమలలో భక్తులు హుండీలో సమర్పించే ప్రతి రూపాయి, ప్రతి కానుకను కేవలం విరాళంగా కాకుండా, స్వామివారికి తమ ప్రేమ, కృతజ్ఞత, భక్తికి గుర్తుగా భావిస్తారు. కొందరు తమ మొదటి సంపాదనను సమర్పిస్తారు. మరికొందరు కోరిక నెరవేరిన తర్వాత మొక్కు తీర్చుకుంటారు. ఇంకొందరు ఎలాంటి కోరిక లేకుండానే, కేవలం కృతజ్ఞతతో సమర్పిస్తారు.* *ఈ కథలో దాగి ఉన్న అసలు సందేశం అప్పు గురించి కాదు. భగవంతుడు తన భక్తులకు త్యాగం, దానం, కృతజ్ఞత అనే గొప్ప విలువలను నేర్పించడమే ప్రధాన ఉద్దేశం. మనం సమర్పించేది భగవంతునికి అవసరం కాదు. కానీ ఇచ్చే మనసు, పంచుకునే గుణం, వినయం మనలో పెరగాలని ఈ మహత్యం తెలియజేస్తుంది.* *తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడు హుండీలో కానుక వేస్తూ, "స్వామీ! ఇది నా భక్తికి చిన్న గుర్తు. నాపై మీ కరుణ ఎల్లప్పుడూ ఉండాలి" అని మనసారా ప్రార్థిస్తాడు. భక్తితో సమర్పించిన చిన్న కానుకైనా, అది స్వామివారికి అమూల్యమైనదే.* *నీతి: దానం అనేది ధన పరిమాణంతో కాదు, మనసు విశాలతతో కొలవబడుతుంది. భక్తితో సమర్పించిన చిన్న కానుక కూడా భగవంతునికి ఎంతో ప్రీతికరమైనది.* #తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి ##పురాణాలూ_కథలు #కుబేరుడు #Kubera💰1821
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣తిరుమలకు వెళ్లే ముందు తిరుచానూరు ఎందుకు వెళ్లాలి? లక్ష్మీదేవే స్వయంగా తామర పువ్వులో పద్మావతిగా వెలసిన క్షేత్రం తిరుచానూరు. ఆకాశరాజు యజ్ఞ భూమిలో దొరికిన ఆ తల్లి కోసమే శ్రీనివాసుడు 12 ఏళ్లు తపస్సు చేశాడు. అమ్మను చూడకుండా అయ్యను చూస్తే ఫలం లేదు! ఓం శ్రీ పద్మావత్యై నమః 🙏 తిరుచానూరు - అలమేలుమంగాపురం పేరు ఎలా వచ్చింది? అమ్మవారు బంగారు తామర పువ్వు మీద వెలిసింది కాబట్టి ఈ ఊరికి అలర్ మేల్ మంగాపురం అని పేరు వచ్చింది. అలర్ అంటే తామర, మేల్ అంటే పైన, మంగ అంటే దేవి. ఇదే తిరుచానూరు. తిరుమలకు వెళ్లే ప్రతి యాత్రికుడు ముందుగా ఇక్కడ పద్మావతి అమ్మను దర్శించుకుంటేనే యాత్ర ఫలిస్తుందని నమ్మకం. ఈ పురాణానికి 2 పెద్ద కథలు ఉన్నాయి బ్రో: కథ 1: ఆకాశరాజు యజ్ఞభూమిలో దొరికిన బిడ్డ పూర్వం పుండరీక అనే బ్రాహ్మణుడికి కొడుకు మాధవుడు పుట్టి, దారి తప్పి పాపాలు చేసి, తిరుమల కొండల్లో సుదర్శన సరస్సులో స్నానం చేయగానే పాపాలు పోయి, తొండమండల రాజు మిత్రవర్మకు ఆకాశరాజు గా జన్మించాడు. ఆకాశరాజు పెరిగి ధరణీదేవిని పెళ్లాడి సంతానం లేక బాధపడుతూ, పూజారి చెప్పగా యజ్ఞం కోసం భూమి దున్నుతుండగా, నాగేటి చాలులో వెయ్యి రేకుల బంగారు కమలంలో ఒక పసిపాప దొరికింది. "ఈ బిడ్డను ప్రేమతో పెంచండి" అని ఆకాశవాణి వినిపించింది. పద్మం (తామర) లో దొరికింది కాబట్టి ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు. ఆమె పెద్దయ్యాక శ్రీనివాసుడిని వెతుక్కుంటూ వచ్చి వైభవంగా కళ్యాణం చేసుకున్నాడు. కథ 2: భృగు మహర్షి వల్ల లక్ష్మీదేవి అలిగి రావడం ఒకసారి త్రిమూర్తులలో గొప్పవారెవరో తెలుసుకోవడానికి భృగు మహర్షి వైకుంఠం వెళ్లి, విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. విష్ణువు కోపగించకపోగా అతని కాలు పట్టుకున్నాడు. ఇది చూసి నా నివాసమైన వక్షస్థలాన్ని తన్నినా ఊరుకున్నారని లక్ష్మీదేవికి కోపం వచ్చి, వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చి స్వర్ణముఖి నది ఒడ్డున పద్మసరోవరం తవ్వి 12 ఏళ్లు తపస్సు చేసింది. 13వ ఏట కార్తీక మాసం, ఉత్తరాషాఢ నక్షత్రం, పంచమి తిథి రోజున ఆ సరోవరం మధ్యలో ఉన్న బంగారు కమలం నుండి శ్రీ పద్మావతిగా తిరిగి అవతరించింది. అందుకే అక్కడి కోనేటిని పద్మసరోవరం అంటారు. ఆమెను లక్ష్మీ అనుమతితోనే శ్రీనివాసుడు పెళ్లాడాడు. ఆ సరోవరం మధ్యలో బంగారు కమలంపై మహాలక్ష్మిగా ఉద్భవించింది కాబట్టే ఈ ప్రదేశం పవిత్రమైంది. గుడిలో అమ్మ ఎలా ఉంటుంది? గర్భగుడిలో అమ్మ పద్మాసనంలో కూర్చుని ఉంటుంది. నాలుగు చేతులు, రెండు చేతుల్లో పద్మాలు, రెండు చేతులు వరద, అభయ ముద్రలతో ఉంటుంది. అందుకే ఆమెను అలమేలు మంగ అంటారు అలివేలు మంగమ్మా - అలరిన నవ్వులమ్మా పల్లవి: అలివేలు మంగమ్మా.. అలరిన నవ్వులమ్మా పద్మసరోవరములో పుట్టిన పద్మమ్మా తిరుచానూరులో వెలసిన తల్లీ మా ఇలవేల్పా నీ చూపు సోకితే చాలు కరుణ కురిపే అమ్మా చరణం 1: బంగారు తామరలో బాలగా దొరికినావే ఆకాశరాజు ఇంట ఆనందమైనావే నాగేటి చాలులోన నవ్వులు చిందినావే సిరులిచ్చు దేవతవై సిరివెలుగైనావే పల్లవి: అలివేలు మంగమ్మా.. అలరిన నవ్వులమ్మా చరణం 2: భృగుముని కోపమునకు అలిగి వచ్చినావే స్వర్ణముఖి తీరమున తపము చేసినావే పంచమి నాడు వచ్చి పద్మమై పూసినావే శ్రీనివాసుని మనసు దోచిన రాణివమ్మా చరణం 3: నీ కనుల కాంతిలో కరుణే ఉన్నదమ్మా నీ కరము చాపితేనే కష్టాలు తీరునమ్మా అప్పుల బాధలన్నీ తీర్చే అమ్మవమ్మా అలమేలు మంగమ్మా మా ఇంట నిలువమ్మా ముగింపు: తిరుమల స్వామి కన్నా ముందు నిన్ను చూస్తే చాలు జన్మ జన్మ పుణ్యమంతా ఒకటై చేరునమ్మా ఓం శ్రీ పద్మావతీ.. అలివేలు మంగమ్మా మా గుండెల్లో కొలువై ఉండిపో అమ్మా ఓం శ్రీ పద్మావతియే నమః 🪷🙏🏻🪷 #తిరుచానూరు #అలివేలుమంగమ్మ #పద్మావతిఅమ్మవారు #తెలుసుకుందాం #శ్రీ అలివేలు మంగమ్మ 🚩 #అలివేలు మంగమ్మ అందాలు గోవిందా శ్రీ గోవిందా #🛕తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు🕉️ #పద్మావతి అమ్మవారు1226
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#శ్రీ వరాహ స్వామి వారి దివ్య మంగళ దర్శనం ఓం శ్రీ వరాహాయ నమః 🙏 సర్వ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ వరాహ స్వామిని ప్రార్థిద్దాం. #వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి #కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే. #అంతే కాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. #తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది. #అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. #అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది. #తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. #ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది #తెలుసుకుందాం #తిరుమల తిరుపతి దేవస్థానం #TTD తిరుపతి తిరుమల #hindu temples #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు24251
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣శ్రావణ మాసం: మహిళలకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సమయం.......!! శ్రావణ మాసం హిందూ ధర్మంలో, ముఖ్యంగా మహిళలకు, అత్యంత పవిత్రమైనదిగా పరిగణించ బడుతుంది. ఈ మాసం శ్రీమహావిష్ణువు, శ్రీమహాలక్ష్మి, మరియు పరమ శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు మరియు సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. ముఖ్యంగా మహిళలు ఆచరించే అనేక వ్రతాలు ఈ నెలలోనే ఉంటాయి. శ్రావణ మాసంలో ఆడపిల్లలు పాల్గొనగల ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రావణ మాసంలో మహిళలు మరియు ఆడపిల్లలు తమ ఆధ్యాత్మిక ఎదుగుదలకు, కుటుంబ శ్రేయస్సు కోసం పాల్గొనగల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు : * వరలక్ష్మీ వ్రతం: సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. ఇది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆచరించే ప్రధాన వ్రతాలలో ఒకటి. * మంగళ గౌరీ వ్రతం: వివాహిత స్త్రీలు తమ సుమంగళిత్వాన్ని (దీర్ఘ సుమంగళి సౌభాగ్యాన్ని) కాపాడుకోవడానికి, కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. * శ్రావణ సోమవార పూజలు: శివునికి ప్రీతికరమైన శ్రావణ సోమవారాల్లో శివారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి. * లక్ష్మీదేవి పూజలు: ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ధన లాభం, ఐశ్వర్యం లభిస్తాయి. * తులసి పూజ: తులసి మొక్కను పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. తులసిని విష్ణుపత్నిగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. * సాధారణ పూజలు, దీపారాధన: ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి, ఇంటి గుడిలో దీపారాధన చేయడం పుణ్యప్రదం. ఇది నిత్య పూజా విధానంలో భాగం. పిల్లలలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి సూచనలు పిల్లలు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవడానికి కొన్ని చక్కటి సూచనలు : * ఇంటి వాతావరణం: ఇంట్లో పూజలు, ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయడం ద్వారా పిల్లలు ఆ వాతావరణంలో పెరిగి ఆధ్యాత్మిక భావనను అలవర్చుకుంటారు. * కథలు చెప్పడం: పురాణ కథలు, భక్తి గీతాలు, ఆధ్యాత్మిక ఉపదేశాలు వంటివి చెప్పడం వల్ల వారిలో ఆసక్తి పెరుగుతుంది. * ఆలయ సందర్శన: తరచుగా ఆలయాలకు వెళ్లి పూజల్లో పాల్గొనడం, దేవతలను దర్శించుకోవడం వల్ల వారికి భక్తి భావం అలవడుతుంది. * భక్తిని ప్రోత్సహించడం: భక్తిని బలవంతం చేయకుండా, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రోత్సహించడం ద్వారా వారు స్వచ్ఛందంగా ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు. * సేవా కార్యక్రమాలు: దేవాలయాల్లో లేదా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం వల్ల సేవా దృక్పథం, దైవభక్తి పెరుగుతాయి. ఈ మాసం మహిళలకు, ఆడపిల్లలకు ఆధ్యాత్మిక ఎదుగుదలకు, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా కేటాయించిన పవిత్ర సమయాలుగా పరిగణించబడతాయి. #తెలుసుకుందాం #💐వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు🌼 #🔱లక్ష్మిదేవి కటాక్షం85
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣*శ్రావణ శనివారం వేంకటేశ్వరస్వామిపూజ* శ్రావణమాసంలో వచ్చే శనివారం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనకు చాలా విశేషమైనది. సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. భక్తులపాలిట కల్పవృక్షం, కలియుగం దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. అటువంటి స్వామిని శ్రావణమాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే ఓ విశేషపూజ ఉంది. పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం (తిరు నామం) దిద్దాలి. ఆ అవకాశం లేనప్పుడు ఏదైనా వేంకటేశ్వరుని ఫొటో తీసుకోవాలి. నీరు ఉపయోగించకుండా, ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలివిడి కలిపి, దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి. అందులో ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించాలి. వెలుగుతున్న ఆ జ్యోతినే వేంకటేశ్వరునిగా భావన చేసి, ఆ జ్యోతి స్వరుపుడైన వేంకటేశ్వరునికి గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించి, అష్టొత్తరశతనామవాళి (108 నామాలు)తో పూజించి, పానకం, వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు) నైవేద్యం పెట్టాలి (అవి కాక ఇతర పదార్ధాలు పెట్టడమనేది మన ఇష్టం, శ్రద్ద), మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ చలివిడిని కూడా నైవేద్యంగా స్వీకరించాలి. ఇది శ్రావణ శనివార వేంకటేశ్వర దీపారాధన. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించినవారికి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం. శనివారం సాయంత్రం పూట వేంకటేశ్వర ఆలయం దర్శంచి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా శ్రావణ మాసంలో శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణశాస్త్రాలు, గ్రంధాలు చెబుతున్నాయి. #తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🪔శ్రావణ మాసం #🕉️పవిత్ర శ్రావణ మాసం🙏2734
- 🧿 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 🧿🙏జీవితంలో ఏదైనా సరే మొండి పట్టుదలతో సంపాదించుకో... కానీ ఒక్క"" స్త్రీ "" కోసం , ప్రేమ కోసం మాత్రం ఆరాటపడకు. అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు ఫ్యామిలీ background ను నిశితంగా పరిశీలించి ముందుకు step వేయండి. ___________________________________________ ఇప్పుడు సోషల్ మీడియా లో రోజూ చూస్తూ వున్నాం. భార్య భర్తను చంపిందనో , లేక భర్త భార్యను చంపిందనో.. దీనికి కారణము కుటుంబ వంశ వృక్షాన్ని చూడకుండా , ఆలోచించకుండా .. ఉద్యోగం ఉందని , ఆస్తిపరులు అనీ..సుఖపడతారనీ ... కానీ జరిగేది మరొకటి... ఇలాంటి హింసా ప్రవృత్తి లక్షణాలు తల్లిదండ్రుల ద్వారా , తరాల ద్వారా సంక్రమించవచ్చు.. ___________________________________________ పూర్వం రోజుల్లో పెళ్లి సంప్రదాయాలు పెద్దలు నిర్ణయించినట్టు జరిగేవి.. పెళ్లి అయిన తర్వాతనే మొహాలు చూసుకునేవారు. ఒక సంప్రదాయ వైదిక బ్రాహ్మణ సమక్షంలో , తాటాకు పందిళ్లలో వేద మంత్రాల సాక్షిగా, సొంత ఇంటి ముందే పెళ్లి వేడుక జరిగేది. పరిస్థితులు మారినా .. పద్దతి మారకూడదు కదా.. ___________________________________________ అందుకే ఏ స్త్రీ నీ బ్రతిమాలకు.. తనకు తానుగా నువ్వే కావాలి , నీతోనే నా ప్రయాణం , నా బ్రతుకు అని వస్తుందే.... అలా వచ్చిన స్త్రీ ప్రేమ జెన్యూన్. అప్పుడే మీరిద్దరూ happy గా ఉండగలుగుతారు. ___________________________________________ అంతే గానీ , ముక్కు , మొహం తెలియని వాళ్ళని , సోషల్ మీడియా లో పరిచయం అయినవాళ్ళని అస్సలు నమ్మకండి. వాళ్ళంతా దొంగలు.. మాటలు చాటింగ్ రూపంలో వస్తాయి. ఫేస్ కన్పించదు. అమ్మాయో తెలియదు.. అబ్బాయో తెలియదు.. దీనికి ఉదాహరణ చెప్తాను.. మొన్నీమధ్య social మీడియాలో ఆడపేరు పెట్టుకున్న మగవాడు నాకు తారసపడ్డాడు. అమ్మాయి అని అనుకుని పరిచయం పెంచుకున్నాను. తర్వాత తెలిసింది... వాడు అబ్బాయి అని...పైగా ముసలివాడు అని...అమ్మాయి tag పెట్టుకుని , అమ్మాయిలతో చాటింగ్ చేస్తుంటాడు... వాడి ట్యాగ్...రామ చిలుక...వాడు గ్రూప్ కూడా మెయింటైన్ చేశాడు.. ఆ గ్రూప్ లోని ఒక అమ్మాయి చెప్తే నాకు తెలిసింది. అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. కొంత డబ్బు పోగొట్టుకున్నాను.. ___________________________________________ ఇలా సోషల్ మీడియాలో ఆడపేర్లు పెట్టుకున్న మగవారు చాలా మంది ఉన్నారు. అందుకే నీవు వెంటబడే బంధం ఎక్కువ కాలం నిలబడదు. కలసి బ్రతకాలని ఇద్దరికీ వుండాలి. ప్రయత్నం ఇద్దరూ చేయాలి. పెద్దల అంగీకారంతో తాటాకు పందిళ్లలో , వేద మంత్రాలతో , నిజమైన ప్రేమ కు సాక్ష్యంగా మీ కలలను సాకారం చేసుకోండి. .. నూరేళ్ళ వివాహ బంధాన్ని కాపాడుకోండి. ___________________________________________ Hari (ఓం శ్రీ మాత్రే నమః) ___________________________________________ #తెలుసుకుందాం #🙆 Feel Good Status #✍️నా ఆలోచనలు✍️ #😃మంచి మాటలు #✍️నా మది అంతరంగం💜1221
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🌺 శ్రావణ మాసం – వరలక్ష్మీ వ్రతం విశిష్టత 🌺 🙏 శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో శివుడు, పార్వతీదేవి, మహాలక్ష్మి, వరలక్ష్మీదేవి తదితర దేవతలను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు అమ్మవారి పూజకు విశేషమైనవిగా భావిస్తారు. 🌸🪔 🌺 శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున వరాలను ప్రసాదించే వరలక్ష్మీ దేవిని పూజిస్తారు. 🙏🌺 🌸 వరలక్ష్మీ దేవిని ఎందుకు పూజించాలి? అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులు— 💰 ధనసంపద 🌾 ధాన్యసమృద్ధి 🏡 కుటుంబ సుఖశాంతులు 💍 సౌభాగ్యం 👶 సంతాన శ్రేయస్సు 🧘 ఆరోగ్యం, మానసిక ప్రశాంతత 🏆 విజయాలు, కార్యసిద్ధి 🌺 కుటుంబ క్షేమం కలగాలని ప్రార్థిస్తారు. “వరాలను ప్రసాదించే తల్లి” కనుక ఆమెను వరలక్ష్మీ అని భక్తితో పిలుస్తారు. 🙏🪷 🌺 చారుమతి చరిత్ర 🌺 🌸 పరమ పవిత్రమైన వరలక్ష్మీ వ్రత కథకు ప్రసిద్ధమైన మూలకథ చారుమతి వృత్తాంతం. పూర్వం మగధ దేశంలోని కుండిన నగరంలో చారుమతి అనే సద్గుణ సంపన్నురాలైన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. 👩🦱🌸 ఆమె తన భర్తను ఎంతో గౌరవంతో చూసేది. 🙏 అత్తమామలను తన తల్లిదండ్రుల వలె భావించి భక్తితో సేవించేది. ❤️ ఇంటి పనులను ఓర్పుతో, శ్రద్ధతో చేసేది. 🏡 అందరితోనూ మితంగా, మృదువుగా, ప్రేమగా మాట్లాడేది. 🌺 🌅 ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, దేవతలను పూజించి తన దినచర్యను ప్రారంభించేది. 🪔🌸 భర్తను దైవస్వరూపంగా భావించి సేవించడం, అత్తమామలను గౌరవించడం, పెద్దలను ఆదరించడం, అందరితో మంచిగా ఉండడం ఆమె జీవితంలో ముఖ్యమైన లక్షణాలు. 🙏🌷 🌺 మహాలక్ష్మి స్వప్న దర్శనం 🌺 చారుమతి యొక్క భక్తి, వినయం, సేవాభావం, సద్గుణాలు చూసి మహాలక్ష్మీదేవి సంతోషించిందని కథనం. 🪷✨ ఒకరోజు రాత్రి చారుమతి నిద్రిస్తున్న సమయంలో మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చింది. 🌟🌺 అమ్మవారు ఆమెతో తనను భక్తిశ్రద్ధలతో పూజించే వారికి సకల శుభాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తానని తెలియజేసి, వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమని చెప్పింది. 🙏🪔 🌸 ముఖ్యంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయాలని అమ్మవారు సూచించినట్లు చారుమతి కథలో చెప్పబడుతుంది. 🪷 చారుమతి తన కుటుంబానికి చెప్పడం 🪷 🌅 ఉదయం నిద్రలేచిన చారుమతి తనకు వచ్చిన స్వప్నాన్ని భర్తకు, అత్తమామలకు వివరించింది. 🙏 అందరి అనుమతితో ఇరుగుపొరుగు స్త్రీలను కూడా పిలిచి, అమ్మవారు చెప్పిన విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించేందుకు సిద్ధమైంది. 🌺🪔 ఇంటిని శుభ్రం చేసి, మంగళకరంగా అలంకరించి, కలశాన్ని ప్రతిష్ఠించి, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించింది. 🌼🥥🍌 స్త్రీలందరూ కలిసి భక్తితో వరలక్ష్మీదేవిని పూజించారు. 🙏🌸 ✨ అమ్మవారి అనుగ్రహం ✨ వ్రతం పూర్తయిన తరువాత చారుమతి మరియు ఆమెతో కలిసి వ్రతం చేసిన స్త్రీలు అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందారని కథనం. 🌺🙏 💰 వారి ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరిశాయి. 🌾 ధనధాన్యాలు సమృద్ధిగా లభించాయి. 🐘 గజరాజులు, వైభవం కలిగాయని కథలో చెప్పబడుతుంది. 🏡 కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొన్నాయి. 🌸 చారుమతితో పాటు వ్రతం చేసిన స్త్రీల కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాయి. అందుకే వరలక్ష్మీ వ్రతం స్త్రీలలో ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న పవిత్రమైన సంప్రదాయంగా భావిస్తారు. 🙏🪷 🌺 అష్టలక్ష్ములను పూజించాలా? 🌺 అవును బ్రో 🙏🌸 వరలక్ష్మీ పూజలో లక్ష్మీదేవి యొక్క వివిధ స్వరూపాలను స్మరించడం, ముఖ్యంగా అష్టలక్ష్ములను ఆరాధించడం అనేక సంప్రదాయాల్లో ఉంది. అయితే ప్రతి ఇంట్లో ఒకే విధమైన పూజా విధానం తప్పనిసరి కాదు; కుటుంబ ఆచారం, ప్రాంతీయ సంప్రదాయం ప్రకారం మారవచ్చు. 🙏 🪷 అష్టలక్ష్ములు 🪷 💰 1. ఆదిలక్ష్మి అమ్మవారి ఆదిస్వరూపం. శుభం, మంగళం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఆరాధిస్తారు. 🌸🙏 💵 2. ధనలక్ష్మి ధనం, సంపద, ఆర్థిక సౌభాగ్యం కోసం పూజిస్తారు. 💰🌺 🌾 3. ధాన్యలక్ష్మి ధాన్యసమృద్ధి, ఆహార సమృద్ధి, కుటుంబ పోషణకు ప్రతీకగా భావిస్తారు. 🌾🙏 👶 4. సంతానలక్ష్మి సంతానం మరియు వారి శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. 👨👩👧👦🌸 🐘 5. గజలక్ష్మి వైభవం, రాజసౌభాగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా ఆరాధిస్తారు. 🐘🪷 📚 6. విద్యాలక్ష్మి విద్య, జ్ఞానం, వివేకం కోసం పూజిస్తారు. 📖🙏 🏆 7. విజయలక్ష్మి కార్యాలలో విజయం, ధర్మబద్ధమైన ప్రయత్నాల్లో సాఫల్యం కోసం ప్రార్థిస్తారు. 🏆🌺 💪 8. ధైర్యలక్ష్మి ధైర్యం, ఆత్మవిశ్వాసం, కష్టాలను ఎదుర్కొనే శక్తి కోసం ఆరాధిస్తారు. 🪷✨ 🌸 శ్రావణ శుక్రవారాల్లో ఏం చేయాలి? 🌸 🧹 ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. 🪔 ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. 🌺 లక్ష్మీదేవికి పూలతో అలంకరణ చేయాలి. 🥥 కలశాన్ని ప్రతిష్ఠించి పూజించవచ్చు. 🍌 పండ్లు, పాయసం, లడ్డూలు వంటి నైవేద్యాలను శక్తికి తగిన విధంగా సమర్పించవచ్చు. 🙏 వరలక్ష్మీ వ్రతం చేసే రోజున వ్రతకథను చదివి లేదా విని అమ్మవారిని భక్తితో ప్రార్థించాలి. 🌸 ముత్తైదువులను గౌరవించి పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం అనేక కుటుంబాల్లోని సంప్రదాయం. 🪷 ముఖ్యంగా భక్తి, శ్రద్ధ, పవిత్రమైన మనసే ప్రధానమైనవి. 🌺 నాలుగు శ్రావణ శుక్రవారాలు 🌺 శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించవచ్చు. 🪔🌸 🌸 1వ శుక్రవారం – కుటుంబ మంగళం కోసం 🌸 2వ శుక్రవారం – ధనధాన్య సమృద్ధి కోసం 🌸 3వ శుక్రవారం – కుటుంబ ఆరోగ్యం, సుఖశాంతుల కోసం 🌸 4వ శుక్రవారం – ఐశ్వర్యం, శ్రేయస్సు, సర్వమంగళం కోసం 🙏 అయితే నాలుగు శుక్రవారాలు తప్పనిసరిగా వరలక్ష్మీ వ్రతం చేయాలి అనే నియమం లేదు. ప్రధాన వరలక్ష్మీ వ్రతానికి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 🌺 🪷 చివరగా... “చారుమతి వంటి భక్తి, సేవాభావం, వినయం మనలో ఉంటే అదే నిజమైన లక్ష్మీ అనుగ్రహానికి మార్గం.” 🙏🌸 🌺 శ్రీ వరలక్ష్మీ దేవి కటాక్షం ప్రతి ఇంటిపై ఉండాలి 💰 ధనధాన్య సమృద్ధి కలగాలి 🏡 సుఖశాంతులు వెల్లివిరియాలి 👨👩👧👦 కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి 🌸 అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి 🪔 శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః 🙏🪷 శ్రీ వరలక్ష్మీ దేవి శుభకటాక్షం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటూ… 🌺🙏 #తెలుసుకుందాం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి #ఓం శ్రీ మహాలక్ష్మీయ్ నమః4343