Ramesh Devanapalli
546 views 1 days ago
#💪పాజిటీవ్ స్టోరీస్ తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని, లేదా ఏదైనా మంచి కార్పొరేషన్ పదవి ఇస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని , అందుకే ఈ వివాదం మొదలైందని మాజీ మంత్రి కొండ సురేఖ అన్నారు. తన భర్తకు ఎమ్మెల్సీ అంటేనే ఇష్టమని చెప్పారు..వరంగల్ జిల్లాలో ఉన్న నలుగురు అగ్ర కుల నాయకులు కొండా మురళిని చూస్తే ఓర్చుకోలేరని ఆయనకున్న ప్రజాదరణ ప్రజాభిమానాన్ని చూసి భయపడతారని అందుకే ముఖ్యమంత్రిని ప్రభావితం చేసి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా చేశారని అన్నారు. ఇటీవల సీఎంను తన భర్తకి ఎమ్మెల్సీ పదవి విషయం ప్రస్తావిస్తే, మురళిని అందరూ వ్యతిరేకిస్తున్నారని , ఆయనకు ఎమ్మెల్సీ వద్దని రాతపూర్వకంగా ఇచ్చారని, గొడవలు పెట్టుకుంటాడని ఆందోళన వ్యక్తం చేశారని అందువల్ల ఇవ్వలేనని ముఖ్యమంత్రి చెప్పేసాడని అన్నారు. ఎన్నికల్లో తన భర్త నాలుగు నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని , ఆయనకున్న ప్రజాదరణ, ఫాలోయింగ్ చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారని అన్నారు. తన భర్త ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇష్టపడడని, ఆయనకు ఎమ్మెల్సీగా ఉంటూ అన్ని బాధ్యతలు చూసుకోవడమే ఇష్టం అని సురేఖ చెప్పారు. కేవలం తన భర్త రాజకీయ పలుకుబడి చూసి ఓర్చుకోలేకనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా చేశారని, ఆరోపించారు.
6 shares

More like this