🧿 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 🧿🙏
644 views • 12 days ago
*మహారాష్ట్ర : పండరీపురం శ్రీ విఠల రుక్మిణి - విఠోబా ఆలయం*
💠 మహారాష్ట్రలో పండరీపురం అత్యంత ప్రసిద్ధమైన తీర్థయాత్రా కేంద్రం. ఈ క్షేత్రంలోని ప్రధాన దైవం విఠోబా లేదా శ్రీకృష్ణుడు.
💠 మరాఠీలో ఇటుకను 'విక్ అనీ, కన్నడంలో విట్టు అనీ పిలుస్తారు. అందుకే స్వామిని విఠల, విరోబా వంటి పేర్లతో పూజిస్తున్నారనీ పుండరీకుడి వల్ల ఈ ప్రాంతానికి పండరీపురం అనే పేరు వచ్చిం దనీ చెబుతారు.
🔆 స్థలపురాణం
💠 ఒకప్పుడు ఈ ప్రాంతంలో పుండరీకుడు అనే వ్యక్తి ఉండేవాడు. దురలవాట్లకు బానిస అయిన అతడు తల్లిదండ్రుల్ని ఎంతో వేదించాడట. ఇతరుల్నీ దూషించేవాడట అలాంటి వుండరీకుడు ఓసారి స్వామీజీ మాటలకు ప్రభావితుడై తనని తాను మార్చుకోవాలని నిర్ణయించుకుని ఆధ్యాత్మిక చింతనకు సిద్ధమయ్యాడట. అయినా అతడిలో ఎలాంటి మార్పూ రాకపోవడంతో మళ్లీ స్వామీజీని కలిశాడు.
💠 ఈసారి ఆ మహర్షి సలహాతో తల్లిదండ్రుల సేవకూ ప్రాధాన్యం. ఇవ్వడంతో... క్రమంగా పుండరీకుడిలో మార్పు వచ్చింది.
ఊరివాళ్లూ అతడి భక్తినీ, తల్లిదండ్రుల్ని గౌరవించే తీరునీ చూసి అభిమానించడం ప్రారంబించారట.
💠 కొన్నాళ్లకు కృష్ణుడు భీమా నది ఒడ్డుకు వెళ్లి.. ఆ తరువాత పుండరీకుడి గురించి తెలిసి అతడి ఆశ్రమానికి చేరుకున్నాడట.
ఆ సమయంలో పుండరీకుడు తల్లిదండ్రులకు సేవ చేయడంలో తలమునకలై ఉన్నాడట.
పుండరీకుడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉండగా, రుక్మిణీసమేతుడైన శ్రీకృష్ణుడు వారి కుటీర ద్వారం వద్ద ప్రత్యక్షమయ్యాడు.
💠 పుండరీకుడు తాను ఉన్న చోటి నుండి కదలకుండా గుమ్మం వైపు ఒక ఇటుక రాయిని విసిరి, తాను వచ్చేవరకు రుక్మిణీకృష్ణులను ఆ రాయిపై నిలబడమన్నాడు.
💠 తల్లిదండ్రుల పట్ల అతడు చూపించే భక్తికి ముగ్గుడైన కృష్ణుడు కూడా పుందరీకుడు వచ్చేవరకూ ఇటుక మీరే నిల్చుండిపోయాడట.
కాసేపటికి పుండరీకుడు వచ్చి స్వామిని పూజించి, క్షమించమని కోరి, ఆ ప్రాంతంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడట.
దాంతో స్వామి అనుగ్రహించి ఉన్నచోటే శిలగా మారిపోవడంతో పుండరీకుడు అదే స్థలంలో విఠోభా లయాన్ని నిర్మించాడు.
💠 నామదేవుడు, తుకారం, చొక్కమేళ కూడా మహారాష్ట్రలో గొప్ప భక్తులు. వీరందరూ శ్రీకృష్ణుని సజీవ దర్శనం పొంది తరించినవారు.
💠 ప్రధానాలయానికి ముందుద్వారం మధ్య భాగంలో భక్తాగ్రేసరుడు నామ్దేవ్ మహరాజ్ సుందరిమూర్తి ఒకటి ఉంది.
పండరీపురం పాండురంగస్వామి వారి దర్శనంకోసం వచ్చే భక్తులు ముందుగా నామ్దేవ్ మహరాజ్ వారి మూర్తిని దర్శించుకుంటేనే పాండురంగస్వామి వారిని దర్శించుకున్న ఫలం దక్కుతుందని చెబుతారు.
ఈ మూర్తికి సమీపంలో నామ్దేవ్ మహరాజ్ మెట్లు దర్శనమిస్తాయి. ఉత్సవాలపుడు భక్తులు ఈ మెట్లుమీదుగానే ప్రధానాలయంలోకి చేరుకుంటారు.
💠 నిత్యమూ భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయ ప్రాంగణంలో కుడివైపున భక్తతుకారాం పాదుకలున్నాయి.
అలాగే గర్భాలయ మంటపంలో వినాయకుడు, లక్ష్మీనారాయణ మూర్తులున్నాయి.
గర్భాలయ మండపం 16 స్తంభాలతో నిర్మితమైంది.
గర్భాలయం వెండి ద్వారంమీద స్వామివారి లీలా విశేషాలను తెలిపే మూర్తులున్నాయి.
గర్భాలయ మండపంలో గరుడ స్తంభం ఉంది. వెండితో చేసిన ఈ స్తంభాన్ని దర్శించుకున్నా, భక్తితో ఆలింగనం చేసుకున్నా పాండురంగస్వామిని ఆలింగనం చేసుకున్న ఫలం లభిస్తుందంటారు.
ఇక్కడ స్వామి పాదాలను భక్తులు స్వయంగా తాకి నమస్కరించుకోవచ్చు.
💠 శిలారూపుడైన స్వామి ఇక్కడ రెండుచేతులను నడుంమీద పెట్టినట్టుగా దర్శనమిస్తాడు.
💠 పాండురంగని మూలమూర్తికి సమీపంలో రుక్మిణీ మాత మందిరం ఉంది.
ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, శ్రీవెంకటేశ్వరుడు, సత్యభామ, రాధికమాత, శనీశ్వరస్వామి, సూర్యనారాయణస్వామి, మహాలక్ష్మి, భక్తతుకారాం, ఆంజనేయస్వామి, నామ్దేవ్ తదితర మందిరాలు కూడా దర్శనమిస్తాయి.
పండరీపురం క్షేత్రానికి సమీపంలో ఉన్న గోపాలపురంలో జానాబాయి, సక్కుబాయి వాడిన బిందెలు, తిరగలి, కుండలను దర్శించుకోవచ్చు.
💠 ఈ క్షేత్రరాజంలో భక్తుల మందిరాలు ఎక్కువగా కనిపించడానికి కారణం కేవలం ఈ పాండురంగడు భక్తజన పక్షపాతి కనుకనే. ఎందరెందరో భక్తులు ఈ పాండురంగని దయామృతాన్ని గ్రోలిఉన్నారు. అటువంటి వారిలో పుండ రీకుడు కూడా ఒకడు.
🔆 తొలి ఏకాదశి.... ఇక్కడ ప్రత్యేకం!
💠 ముఖ్యంగా తొలి ఏకాదశి 48 నెలరోజుల ముందునుంచీ లక్షల సంఖ్యలో భక్తులు పాదయాత్రలు చేస్తూ ఆలయానికి వేడుకునే వైనం చూసి తీరాల్సిందే
💠 ఆషాఢంలో వచ్చే తొని ఏకాదశికి సుమారు నెల రోజుల ముందుగా వివిధ ప్రాంతాల్లోని స్వామి భక్తులు మెడలో తులసి మాలను ధరించి దీక్షను తీసుకుంటారు. అప్పటినుంచి తొలి ఏకాదశిక ఆల కాలినడకన యాత్రను ప్రారంబిస్తారు. అలా వచ్చేవారి వార్కనీలు అంటారు.
రోజూ 40,50 కిమీ ప్రయాణిస్తూ, రాత్రికి ఓ చోట బస చేస్తూ అనుక్షణం స్వామి నింతనలో గడుపుతూ చివరకు తొలి ఏకాదశికి ఆలయానికి చేరుకుని స్వామిని పూజిస్తారు.
ఆ రోజున స్వామి విగ్రహాన్ని భుజాలపైన మోసుకుంటూ ఊరే గింపుగా చంద్రభాగ నదీ వద్దకు తీసుకువస్తారు. ఆ నది నీటితో స్వామిని అభిషేకించి మళ్లీ ఆలయానికి తెస్తారు.
💠 షోలాపూర్ నుంచి 74 కిలో దూరం.
___________________________________________
HARI (ఓం శ్రీ మాత్రే నమః ✍🏻 🧿)
___________________________________________
#జయ పాండురంగ విఠల ప్రభో 🙏🕉️🙏 #శ్రీ శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయం #ఏకాదశి శుభాకాంక్షలు #ఏకాదశి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
10 shares