#జై శ్రీ రామ శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ # #సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి నమః #🕉️🙏🚩 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🙏🕉️ శ్రీ ఆంజనేయ 🚩🕉️🙏 #🙏జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయ 🙏🏹 #🕉️🌷జై శ్రీ ఆంజనేయం 🌷🕉️ హనుమా 🕉️ జై హనుమాన్ 🕉️ ---------------------------------- *శ్రావణ శుక్ల సప్తమీ - సంత్ శ్రీ తులసీదాస్ జయన్తీ* ---------------------------------- *గోస్వామి తులసీదాసు ఈయనను రాంబోలా దూబే గోస్వామి తులసీదాస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. గోస్వామి తులసీదాసు శ్రావణ శుక్ల సప్తమీ రోజున జన్మించడం జరిగింది. తులసీదాస్ గారు 11 ఆగష్టు, 1511లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కన్గంజ్ జిల్లా, సుకర్ క్షేత్ర గ్రామంలో జన్మించారు. 30 జూలై, 1623లో (111 వయస్సులో) పరమపదించారు.* ---------------------------------- *గోస్వామి తులసీదాసు తండ్రిగారి పేరు ఆత్మారాముడు, తల్లిగారి పేరు హులసి. సాధారణంగా అందరూ తల్లి గర్భంలో 9, 10 నెలలకు జన్మిస్తారు. కాని, గోస్వామి తులసీదాసు గారు తన తల్లి గర్భం నుంచి 12 నెలలకు జన్మించారంటా. అయన జన్మించగానే నవ్వారూట. 5, 6 నెలల పిల్లాడిల కనిపించారూట. అంతేకాదు ఆయన నోటినిండ దంతలతో జన్మించారని నమ్మిక.* ----------------------------------- *తండ్రికి గండ నక్షత్రంలో జన్మించడం వలన తన తండ్రికి అశుభం కలుగుతుంది అన్న అపోహతో గోస్వామి తులసీదాసును పుట్టిన నాలుగు రోజులకే ఆయన తల్లిదండ్రులు ఆయనను చునియా అనే మహిళకు పెంచుకొమని అప్పగించారు. ఆమె 5 సంవత్సరాలు పెంచి చనిపోయింది. అనాథ బాలుడైన గోస్వామి తులసీదాసును బాబా నరహరి దాస్ అనే సాధువు పెంచి విద్య నేర్పిస్తారు. తరువాత శేషసనాతనుడనే శ్రేష్ఠుని దగ్గర గోస్వామి తులసీదాసు గారు వేద, వేదాంగాలను నేర్చుకుంటాడు. ఆతని రూప, గుణ, శీల, స్వభావ, విద్వలకు మైమరిచి ఒక బ్రాహ్మణడు అతనికి తన కుమార్తె రత్నావళితో వివాహం జరిపించాడు. ఓక రోజు తులసీదాసు ఇంట్లో లేని సమయంలో రత్నావళి పుట్టినింటికి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న గోస్వామి తులసీదాసు భార్యను కలుసుకోడానిక. చీకటి పైగా వర్షం పడుతున్న ఆ సమయంలో నది దాటి తన భార్య వద్దకు చెరుకుంటాడు. ఆ సమయంలో అతని భార్య “నాధా! ఎముకలు, చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ శ్రీరామచంద్రుడు మీద ఉంటే ఆ భయభీతియే ఉండదు కదా?!" అన్న రత్నావళి మాటలే గోస్వామి తులసీదాసు గారికి తారకమంత్రం మయ్యాయి. ఆరోజు నుండి గోస్వామి తులసీదాసు విరాగియై శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నులై పోయారు.* ---------------------------------- *స్మార్త-వైష్ణవ హిందూ సన్యాసిగా మరియు కవిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఈయన సంస్కృతం అవధి, బ్రజ్ భాషలలో అనేక ప్రసిద్ధ రచనలు రచించాడు. తులసీదాసు గారు* *హనుమాన్ చాలీసా అలాగే రామచరితమానస్ అనే ఇతిహాసం రచించి గొప్ప కవిగా ప్రసిద్ధి పొందారు.* *ప్రసిద్ధ సంకట్ మోచన్ దేవాలయాన్ని కూడా ఈయనే నిర్మించడం జరిగింది. ఆ ప్రదేశంలోనే హనుమాన్ స్వయంగా గోస్వామి తులసీదాస్ గారికి దర్శనం ఇచ్చారాని నమ్ముతారు.* ----------------------------------- *శ్రీరాముని జీవిత విధానం గురించి సంస్కృత రామాయణాన్ని తిరిగి మాతృభాషలో చెప్పడంలో పెద్ద పాత్ర వహించాడు. గోస్వామి తులసీదాసు ఎక్కువగా తన జీవిత భాగం వారణాసి మరియు అయోధ్యలో జీవించాడని అంటారు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని తులసి ఘాట్ అనే నామకరణంతో పిలుస్తున్నారు. లోక కల్యాణానికి కారణమైన 'రామచరితమానస్' అనే మహాకావ్యాన్ని గోస్వామి తులసీదాసు అయోధ్యలోనే రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత రెండున్నర సంవత్సరాల పాటు కాశీలో ఉంటూ “రామచరిత మానస్ ను” పూర్తి చేశాడు.* ------------------------------------ *శ్రీ తులసీదాస్ రచించిన రామచరిత మానస్ ఉత్తరాదివారు నిత్యం పారాయణ చేస్తుంటారు. పరమశివుడు తన మనస్సులో రచించుకున్న రామాయణం ఇది. అందుకే తులసీ రామాయణం అంతా శివుడు పార్వతికి ఉపదేశించినట్లుగా ఉంటుంది. తులసీదాసు ‘మానస’ శబ్దాన్ని మానస సరోవరంగా అన్వయించారు. సప్తసోపానాలంకృతమైన శ్రీరామకీర్తిని సరోవరంగా చిత్రీకరించారు. ఇందులో శివపార్వతి సంవాదం, భుశుండి గరుడ సంవాదం, యాజ్ఞవల్క్య భరద్వాజ సంవాదం, తులసీదాసూ ఆయన శిష్యుల సంవాదం ఇలా ప్రసిద్ధమైన నాలుగు సంవాదాల రూపంలో కథ నడుస్తుంది.* ------------------------------------ *తులసీదాసు ‘రామచరితమానస్’ రచనకు దోహా, చౌపాయీ అనే రెండు ఛందస్సులను విరివిగా ఉపయోగించాడు. రెండేసి దోహాల మధ్య నాలుగేసి చౌపాయీలను రాయడం తులసీదాసు శైలి. తులసీదాసు మహావిష్ణు అవతారంగా భావించాడు. అలాగే హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకువచ్చేప్పుడు భరతుణ్ణి కలిసినట్లుగా చెప్పాడు. ఇలాంటివే అనేక మౌలిక కల్పనలు రామచరిత మానస్ నిండా కనిపిస్తాయి. తనలోని అజ్ఞానాంధకారం తొలగేందుకే దేశభాషలో రామాయణం రచిస్తున్నానని ఆయన చెప్పుకున్నాడు. రామచరితమానస్ కావ్యం నిండా భక్తివైరాగ్యాలను, పరబ్రహ్మతత్త్వాన్ని, మానవ ధర్మాలను విలువలను తులసీదాసు వర్ణించిన తీరు అమోఘం, అద్వితీయం.* ----------------------------------- *వాల్మీకి అవతారమని గోస్వామి తులసీదాసు గారిని అంటారు. ఆయనకు అపర వాల్మీకి అని కూడా అంటారు. ఆయన సంస్కృతంలోనే కాకుండా హిందీలో 22 రచనలు రచించాడు. సరళమైన సంస్కృత, తత్సమ శబ్దాలతో కూడిన అవధి భాషలో రచించడం చేత తులసీ రామాయణం లోక ప్రసిద్ధి గాంచింది.* ----------------------------------- *ఆయన రచయితగానే కాకుండా, అంతరించి పోతున్న హిందూ జ్వాలను, భక్తి ఉద్యమంను మళ్ళీ విస్తరింపచేసిన మహా భక్తుడు. ముస్లిం అరాచకాల నుండి మరియు మతమార్పిడి దౌర్జన్యం నుండి హిందూ సమాజంను కాపాడుకోవడంలో ఈ మహత్ముడు ముర్ఖ్య పాత్ర పోషించాడు. హిందీ మరియు భారతీయ, ప్రపంచ సాహిత్యంలో గొప్ప గొప్ప కవులలో ఆయన ఒకరు.* -------------------------------- *_𝕝𝕝ॐ𝕝𝕝 శ్రీరామ జయరామ 𝕝𝕝卐𝕝𝕝_* --------------------------------- *_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_* -----------------------------------
12 shares

More like this