దేవునికి అభిషేకo చేయటం ద్వారా మనం పొందే ఫలితాలేంటి మనము ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకాలు చేయిస్తుంటాము. అలా అభిషేకాల ద్వారా ఆలయాల్లో శుద్ధి చేయడం పరిపాటి. అభిషేకాలకు పలు వస్తువులు, పదార్థాలను ఉపయోగిస్తారు. ఆలయాల్లో జరిగే అభిషేకాలకు వస్తువుల్ని, వివిధ పదార్థాలను సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఆలయాల్లో వివిధపదార్థాల ద్వారా దేవునికి జరిగే అభిషేకాల వల్ల లభించే ఫలితాలేంటో తెలుసుకుందాం పదార్థాలు - ఫలితాలు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. ఆవుపాలతో అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆపు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన వృద్ధి చేకూరుతుంది. పంచదారలో అభిషేకం చేయిస్తే శత్రువులు నశిస్తారు. నేతితో అభిషేకం చేయిస్తే భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తుంది శంఖువు ద్వారా నీటితో అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు. చందనం, పనీర్‌లను కలిపి అభిషేకం చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. కలశ జలంతో అభిషేకం చేస్తే కార్యానుసిద్ధి చేకూరుతుంది. మామిడి పండుతో అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాల్లో విజయం సొంతమవుతుంది. స్వర్ణాభిషేకం చేయిస్తే లాభాలు చేకూరుతాయి. పంచామృతం (కలకండ, పంచదార, నెయ్యి, పండ్లు, తేనె)తో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కొబ్బరి బొండాంతో అభిషేకం చేస్తే కుటుంబంలో కలహాలుండవు. చందనంతో అభిషేకం ద్వారా ఐశ్వర్యం చేకూరుతుంది పచ్చిబియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధ తీరిపోతుంది. చక్కెర రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. తేనెతో అభిషేకం సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. అరటి పండుతో అభిషేకం సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. అన్నంతో అభిషేకం చేస్తే రాజభోగాలు చేకూరుతాయి. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సర్వసంతోషాలను ప్రసాదిస్తుంది. నిమ్మరసంతో అభిషేకం చేస్తే పగ తీరుతుంది. ఏరోజున ఏదేవుడికి అభిషేకం చేయాలి రాముడు, సూర్యుడు, వినాయకుడు నవగ్రహాలకు- ఆదివారం శ్రీకృష్ణుడు,ఈశ్వరుడు - సోమవారం నృసింహస్వామి, ఆంజనేయస్వామి, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి - మంగళవారం విష్ణుమూర్తి - బుధవారం త్రివిక్రమ స్వామి, హయగ్రీవ స్వామి - గురువారం అమ్మవారికి ( లక్ష్మీదేవి, పార్వతి దేవి, సరస్వతి దేవి - శుక్రవారం వెంకటేశ్వర స్వామి మరియు మహావిష్ణువు యొక్క దశావతారములు అన్నింటికీ - శనివారం అభిషేకాలు చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. #తెలుసుకుందాం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతాన ధర్మం #సనాతన హిందూ ధర్మం
165 shares

More like this