P.Venkateswara Rao
484 views 20 hours ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #ఏపీ అప్డేట్స్ 🎯 * #చంద్రబాబు ఇంతగా దిగజారడానికి కారణమేమిటి❓* మోడీ పాదాలకు మోకరిల్లిన ఆంధ్రుల పరువు భజన చేసే విధములో పతనం చివరి అంచుకు చేరిన ముఖ్యమంత్రి పొగడ్తలు ఇది ఎంత మాత్రం భక్తి కాదు, భయమైతే దేనివల్ల? మా నాయకుడిని ఇట్లా కూడా కీర్తించవచ్చని మాకే తెలియలేదంటున్న బిజెపి నేతలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఈ గతి పట్టడం విచారకరం భోగాపురం విమానాశ్రయ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం సర్వత్రా విమర్శల పాలవుతున్నది. చంద్రబాబు నాయుడు సాధారణ రాజకీయ వాది కాదు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నేత. మహామహుల చేత విజనరీ అని ప్రశంసలు పొందిన, రాజకీయాలను సాంప్రదాయ పోకడల నుంచి అభివృద్ధి దిశకు మలుపు తిప్పిన అఖండ మేధావి. పదిహేనేళ్లకుపైగా ముఖ్యమంత్రి. జాతీయ రాజకీయాలలో ఆయన పాత్ర కీలమైనది. కానీ ఈ సభలో మాత్రం ఆయన ప్రవర్తన, మాటలు, విన్యాసాలు ఒక చవకబారు కార్యకర్త వలే కనిపించాయి. ఆ మాటలు విన్న, విన్యాసాలు చూసిన వారంతా, తెలుగుదేశం నేతలతో సహా ఎంతో బాధపడ్డారు. మన నాయకుడికి ఈ దుర్గతి ఏమిటని వాపోయారు. మోడీని ఆకాశానికి ఎత్తడంలో అవధులు మీరాడు చంద్రబాబు. మోడీ... మోడీ... మోడీ... అంటూ కేకలు పెట్టి, చేతులు తిప్పి విన్యాసాలు చేశాడాయన. చూసే వారికి వికారంగా కనిపించాయవి. ఇక్కడ నుంచి మోడీ గారు కర్నాటక వెళ్లారు. అక్కడి ముఖ్యమంత్రి డికె.శివకుమార్, రాజకీయంగా చాలా చిన్నస్థాయి కలిగిన వాడు. కానీ వేదిక మీద ఆయన ప్రవర్తన ఎంతో హుందాగా కనిపించింది. దేశ ప్రధానికి ఎంత మేర గౌరవం ఇవ్వాలో అంతా ఇస్తూ కూడా తన ముఖ్యమంత్రి పదవి ప్రతిష్టకు భంగం కలగకుండా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవినే కాదు, తన వ్యక్తిత్వాన్ని, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గౌరవాన్ని పణంగా పెట్టేశాడు. తెలుగుదేశం పార్టీ ఏ కారణంతో పుట్టిందీ అందరికీ తెలుసు. ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన పార్టీ అది. ఆ రోజులలో రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్లే కాంగ్రెస్ నాయకులు అధిష్టానం పెద్దల మెప్పు కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్నే దెబ్బ తీస్తున్నారని ఆరోపిస్తూ రాజకీయాల్లోకి వచ్చాడు ఎన్టీఆర్. ఆయన మాటల్లోని నిజం గ్రహించిన ఆంధ్ర ప్రజానీకం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ, అదే ఢిల్లీ పెద్దల మోకాళ్ల ముందు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మోకరిల్లేట్లు చేస్తున్నది. పరువు తీస్తున్నది. సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి తెచ్చి పెడుతున్నది. ఎందుకీ దిగజారుడు? మోడీ పట్ల భక్తితోనో లేదా ఆయన దేశం కోసం ఎవరూ చేయనంత గొప్పగా పని చేస్తున్నాడనో ఈ దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదని చంద్రబాబుకు కూడా తెలుసు. మోడీ విషయంలో, ఏడేళ్ల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు వాడిన పదజాలం అందరికీ గుర్తే. మోడీ ఒక ఉగ్రవాది అన్నాడు. ఇంకా వ్యక్తిగతంగా వెళ్లి భార్యను చూసుకోలేని వాడు దేశాన్ని ఏమి చూసుకుంటాడని నిందించాడు. మోడీ కూడా తక్కువ తినలేదు. చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడని ధ్వనించేట్లు, పోలవరాన్ని ఎటిఎం వలే వాడుకుంటున్నాడని విమర్శించాడు. తన కంటే సీనియర్ అని చంద్రబాబు పదే పదే చెప్తూ వుంటాడని, కానీ ఒక ఎన్నికలో గెలిచి, ఆ వెంటనే మరొక ఎన్నికలో ఓడిపోయే సీనియారిటీ; సొంత మామనే కాక ఆంధ్ర ప్రజల స్వప్నాలను కూడా వెన్నుపోటు పొడిచే సీనియారిటీ తనకు లేదని ఎగతాళి చేశాడు. ఇద్దరి మధ్య పరస్పర గౌరవ భావాలు లేవని చెప్పడానికి ఇవొక ఉదాహరణలు. భక్తి లేనప్పుడు, భయం వుండాలి. ఆ భయం దేనికోసం అన్నది ప్రశ్న. ఇడి, సిబిఐ వంటి కేంద్ర సంస్థలతో ప్రత్యర్థుల మీద దాడులు చేయించడం; కాళ్లబేరానికి వస్తే ఎంత పెద్ద నేరం చేసిన వాడినైనా పదవితో సత్కరించడం మోడీ నైజం. చంద్రబాబుకు ఒకరు పదవి ఇవ్వవలసిన అవసరం లేదు. ఆయన సొంత కష్టంతో నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. కావాలనే కోరిక ఉంటే పాతికేళ్ల క్రితమే ప్రధానిగా కూడా వ్యవహరించే వాడు. ఇక మిగిలింది - ఇడి దాడుల భయం. తప్పుడు దారులలో అక్రమ సంపాదన చేసే వారిని మాత్రమే ఇడి భయపెట్టగలదు. అంటే, చంద్రబాబు వద్ద కూడా అటువంటి అక్రమాలు వున్నాయని భావించాలా? ఏది ఏమైనా, తన స్వార్థం కోసం యావత్ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని బజారులో తాకట్టు పెట్టడం చంద్రబాబు చేయదగిన పని కాదు. ఈ తప్పును ఆయన ఎట్లా సవరించుకుంటాడో తెలియదు; జీవితకాలంలో తప్పు దిద్దుకొనే అవకాశం రాకపోయినా ఆశ్చర్యం లేదు.
15 likes
12 shares

More like this