👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
530 views • 3 days ago
శ్రీపురం శ్రీమహాలక్ష్మి స్వర్ణదేవాలయం
సిరిపురంగా పిలువబడే శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారి ఆలయం దక్షిణాదిన స్వర్ణశకానికి నాంది పలికింది. శ్రీ పురం స్వర్ణమహాలక్ష్మి ఆలయం, వంద ఎకరాల విస్తీర్ణం… 1500 కిలోల బంగారం… 400 మంది శిల్పులు… ఆరేళ్ల నిరంతర శ్రమ… అద్భుతమైన శిల్ప చాతుర్యం… సుమారు 600 కోట్ల రూపాయలు… వెరసి తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణదేవాలయం ప్రపంచ దేశాల ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తుంది.
ఇప్పటివరకూ స్వర్ణదేవాలయం పేరు వినగానే వెంటనే స్ఫురించేది అమృత్సర్. కానీ, ఇప్పుడా ఖ్యాతిని శ్రీపురమూ దక్కించుకుంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలూ శిల్పాలను మొదట రాగి తాపడం చేశారు. ఆ తరవాత దానిపై బంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి, శిల్పాలను తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్తోనే రూపొందించి, బంగారు తొడుగుతో అలంకరించారు.
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం, కృత్రిమ ఫౌంటెన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. మంటపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు వెళ్లి ఎడమవైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. మానవుడు తన ఏడు జన్మల్నీ దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు.
వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, స్వర్ణకవచాలు, కిరీటంతో స్వర్ణతామరపై ఆసీనమై మహాలక్ష్మి దర్శనమిస్తుంది. పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచుని అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి, సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం, ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యంలో నీళ్లతో నిండిన కందకం ఉంది.
ఆలయాన్ని చేరుకోవాలంటే 1.5 కిలోమీటర్ల దూరం ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్లాలి.గుడిలోకి ప్రవేశి౦చే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రన్త్ లనుంచి సేకరించిన శ్లోకాలను పొందు పరిచారు.మరియు చేతితో రాసిన శాసనాలు ఎంతో ఘనంగా అలంకరించబడ్డాయి.ఈ ఆలయంలో శాసనాలు, కళ వేదాలు ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ప్రతి శుక్రవారం గుడిని అందంగా అలంకరిస్తారు. మరియు శుక్ర వారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించటానికి 700 మంది పోలిస్ లను అక్కడి రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ గుడి నిర్మించిన నారాయణి అమ్మ అను అతను మూడు కోట్ల ధనం తో సుమారు ఆ చుట్టూ పక్కల ఉన్న 600 దేవాలయాలను పునరుద్ధరించారు.
గోల్డెన్ టెంపుల్ ని సాయంత్రం 6 దాటిన తరువాత చూస్తే బంగారంతో విద్యుత్ కాంతులతో కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు వర్ణించడం కష్టంగా ఎంతో శోభాయమానంగా నిజంగా లక్ష్మీనిలయంలో ఉన్నామా అనిపిస్తుంది. మహాలక్ష్మీ అమ్మవారిని చూడటానికి రెండుకళ్ళు చాలవు.
శ్రీపురం స్వర్ణ దేవాలయ దర్శనానికి వచ్చే వారు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులనే ధరించాలి. సందర్శకులు తప్పనిసరిగా దుస్తుల కోడ్ ను పాటించాలి.సందర్శనార్ధం వచ్చే పర్యాటకులు చిన్న ప్యాంట్లు, మిడ్డి లు మరియు కేప్రిలు వేసుకొని రాకూడదు. అలాగే మొబైల్ ఫోన్లు, కెమెరాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, పొగాకు, మద్యం మరియు మండే వస్తువులను వంటివి ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. భక్తులు సంవత్సరంలో 365 రోజులు ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు శ్రీపురం స్వర్ణ దేవాలయంను సందర్శించవచ్చు. ఆలయం వద్ద అభిషేకం ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు,ఆరతి సేవ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహిస్తారు.
నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి పేరు శక్తిఅమ్మ. ఈయన అసలు పేరు సతీశ్కుమార్. సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్ ఒకమిల్లు కార్మికుడు. తల్లి టీచర్. 1976లో జన్మించిన సతీశ్కుమార్ చిన్నప్పటి నుంచీ అందరు పిల్లల్లా చదువూ ఆటపాటలపైన ఆసక్తి చూపకుండా గుళ్లు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు. 16వ ఏట శక్తి అమ్మగా పేరు మార్చుకున్నారు. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి (లక్ష్మీదేవి రూపం) దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠం తరుపున ఉచిత వైద్యశాల, పాఠశాలను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉపదేశాలివ్వడం, వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించడం, అన్నదానంఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు.
చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపాన శ్రీపురంలో ఈ ఆలయం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాంతం తిరుమలైకోడిగా ప్రసిద్ధి. మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు.తిరుమల స్వామి వారి దర్శనం చేస్కున్నవారు గోల్డెన్ టెంపుల్ కి వెళ్తూ ఉంటారు.తిరుమల నుంచి గోల్డెన్ టెంపుల్ కి బస్సు సౌకర్యం ఉంది(3 గం,,) . కాణిపాకం నుంచి కూడా గోల్డెన్ టెంపుల్ దగ్గరే (1గం,,) .గోల్డెన్ టెంపుల్నుంచి కంచి (2 గం,,)ల ప్రయాణం.గుర్తుపెట్టుకోండి సాయత్రం 7-8 లోపు మీరు అక్కడ ఉండేలా చూస్కోండి 8 దాటితే ప్రవేశం ఉండదు .
#తెలుసుకుందాం #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #🔱లక్ష్మిదేవి కటాక్షం #శ్రీ మహాలక్ష్మి దేవి
14 shares