Ravi Talluri
536 views 20 hours ago
*_05/09/2026 - ఉపాధ్యాయుల దినోత్స‌వం - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినం_* *_భారతదేశ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా సెప్టెంబ‌ర్ 5వ తేదీన మ‌న దేశంలో ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు_*. *_ఆ రోజున ఉత్త‌మ ఉపాధ్యాయుల‌ను స‌న్మానిస్తారు. అలాగే మ‌న‌కు చ‌దువు చెప్పిన గురువుల‌ను కూడా గుర్తు చేసుకుంటారు._* *_ప్ర‌పంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని అక్టోబ‌ర్ 5వ తేదీన జ‌రుపుకుంటారు. మొద‌టి సారిగా దీన్ని 1994లో ప్రారంభించారు. యునెస్కోతోపాటు ఎడ్యుకేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే సంస్థ‌తో క‌లిసి వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డేను నిర్వ‌హిస్తున్నాయి_*. *_అజ్ఞానమనే చీకటిలో ఉన్నవారికి విజ్ఞానమనే దారిని చూపి వారి జీవితాల్లో వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులు. గురువు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడవుతాడు. ప్రపంచ వ్యాప్తంగా టీచర్స్ డే ను అక్టోబర్ 5న జరుపుకుంటే భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది._* *_తల్లిదండ్రులు తర్వాత భగవంతుడికి కూడా ఇవ్వని స్థానాన్ని మన పురాణాలు గురువుకు ఇచ్చాయి. గురువు లేనిదే విద్య ఉండదు. విద్య లేనిదే జ్ఞానం రాదు. జ్ఞానం లేకపోతే లోకంలో మనుగడే ఉండదు. అందుకే విజ్ఞానం కన్నా జ్ఞానానికే ప్రథమ ప్రాధాన్యత దక్కింది. మనలోని ప్రతిభను గుర్తించి వాటికి మెరుగులు దిద్ది ఉన్నతమైన భవితవ్యానికి బాటలు వేసేవారు గురువులు_*. *_20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పండితులు, తత్వవేత్తలలో ఒకరైన భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు_* *_ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన నియోగి బ్రాహ్మణ దంపతులైన వీరాస్వామి, సీతమ్మలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబరు 5, 1888న జన్మించారు. బతుకుదెరువు కోసం రాధాకృష్ణన్ తల్లిదండ్రులు తమిళనాడులోని తిరుత్తణికి వలస వచ్చారు. అక్కడే రాధాకృష్ణన్ పుట్టారు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణయ్య పేరు తమిళనాడులో రాధాకృష్ణన్‌గా మారిపోయింది. చిన్న వయసు నుంచే చదువుల్లో రాణించిన సర్వేపల్లి 20 ఏళ్ల వయసులోనే బ్యాచిలర్ డిగ్రీ థీసిస్ పూర్తిచేశారు. వేదాంత వ్యవస్థలో నైతికతకు చోటు లేదని చెప్పే అంశంపై ఆయన ఈ థీసిస్ చేశారు.రాధాకృష్ణన్ మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ, మైసూరు, కలకత్తా యూనివర్సిటీలతో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ పాఠాలు బోధించేవారు. వైజాగ్‌లో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్‌గా కూడా పనిచేశారు._* *_సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952లో భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఆ తర్వాత భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా 1962- 1967 నడుమ ప్రజలకు సేవలందించారు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడే కాకుండా గొప్ప తత్వవేత్త కూడా. ఆయన అంకితభావానికి గుర్తుగా కొందరు విద్యార్థులు రాధాకృష్ణన్ పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించారు. అదే విషయాన్ని విద్యార్ధులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దానికి ఆయన స్పందిస్తూ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకునే బదులు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవంగా పాటిస్తే అది తనకు ఎంతో గర్వకారణమని రాధాకృష్ణన్ సూచించారు. దీంతో 1962 నుంచి కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది.సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954లో భారత అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న వరించింది._* *_ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి. ఎందుకంటే వారి సేవకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది ఏకైక మార్గం. విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించుకోవటం, వారికి బహుమతులు అందజేయడం వంటివి నేడు చేస్తారు. ఉపాధ్యాయులను స్మరించుకోవడం అన్నది విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుంది_*. *_అజ్ఞానాన్ని చీల్చి విజ్ఞానం పంచే గురువులకు వందనం._* #మన సంప్రదాయాలు సమాచారం
10 shares

More like this