TALRadio Telugu
574 views • 10 hours ago
జీవితాంతం సంపాదించిన డబ్బును తమ కోసం దాచుకోవడం సహజమే. కానీ అస్సాంకు చెందిన ఈ దంపతులు మాత్రం తమ పొదుపుతో మరెందరో జీవితాల్లో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
పన్నాలాల్, నందితా గోస్వామి దంపతులు తమ 40 ఏళ్ల ఉద్యోగ జీవితంలో పొదుపు చేసుకున్న కోటి రూపాయలను నల్బరీలోని కుమార్ భాస్కర్ వర్మ సంస్కృత్ అండ్ ఏన్షియంట్ స్టడీస్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చారు.
ఈ మొత్తంతో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడంతో పాటు సంస్కృతం, అస్సాం చరిత్ర, ప్రాచీన విజ్ఞానంపై పరిశోధనలకు కూడా సహాయం అందనుంది. 40 ఏళ్ల పొదుపును భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మార్చిన ఈ దంపతుల నిర్ణయం నిజంగా అభినందనీయం.
#GoodNews #InspiringStory #AssamCouple #InspiringIndia #SocialImpact #EducationForAll #Scholarship #Assam #Research #Humanity #IndiaInspires #MotivationalStory #TALRadio #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status
7 likes
14 shares