బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
568 views • 1 days ago
' ప్రార్టించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న ' అని మనసా,వాచ,కర్మణ చాటి చెప్పిన గొప్ప మానవతామూర్తి దివంగత మదర్ థేరీస్సా! ( 26 - 8 - 2026)
లేదా
కారణజన్మురాలు,సంఘ సేవకురాలు,బీద,నిరుపేదల,పీడిత వర్గాల ఆశాజ్యోతి, ప్రేమమూర్తి అయిన దివంగత మదర్ థేరీస్సా గారి 116వ జయంతిని పురస్కరించుకొని!
ఈ రోజు గొప్ప మానవతామూర్తి,సంఘ సంస్కర్త, సమాజ సేవకురాలు,అణువణువునా కరుణ,జాలి, ఎనలేని క్షమాగుణం,ఉదాత్త స్వభావంతో కూడిన ప్రపంచం మెచ్చిన కారణజన్మురాలు అయిన ఈ దివంగత మదర్ థేరీస్సా116వ జయంతి నేడు.ఈ ప్రత్యేక సందర్బంగా అనేక సంవత్సరాలు ఆనాధలు, అబాగ్యులు,పీడితులకు,కుష్టి, క్షయ,ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆమె అందించిన మహోన్నత, చిరస్మరణీయమైన,వెలకట్టలేని సేవలను ఈ ప్రత్యేక సమయాన యావత్ ప్రపంచ ప్రజానీకం ఒక్కసారి మననం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కందాలపై ఎంతైనా వుంది.ఎందుకంటే ఎక్కడో యుగోస్లోవియా దేశానికి చెందిన మదర్ థేరీస్సా ఎవరు లేని అనాధలు,అబాగ్యుల,పీడిత వర్గాల శ్రేయస్సు కోసం,వారి బాగోగులు చూసుకునేందుకై మన భారతదేశంలోని కలకత్తా నగరానికి విచ్చేసి అక్కడే తన స్థిర నివాసం ఏర్పరచుకొవడమే కాదు, అక్కడే టీచర్ గా పనిచేస్తూ వారి నారాయణసేవకే తన జీవితాన్ని అధ్యంతం ధారపోసిన ఓక మహా త్యాగమూర్తి,ఓక గొప్ప తపస్వి ఈ దివంగత మదర్ థేరీస్సా గారు.' ప్రార్టించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న ' అనే నీతి సూత్రాన్ని మనసా,వాచ, కర్మణ బలంగా నమ్మి ఆ ఆదర్శ సూత్రాన్నే తన జీవిత సర్వస్వంగా భావించి దాదాపు 123 దేశాలలో 610 సంస్థలను స్థాపించి అందులో అనాధలకు, అబాగ్యులకు,కుష్టి,క్షయ,ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు స్థానం కల్పించి వారి సేవలోనే తన జీవిత చివరి బొట్టు వరకు,జీవిత చరమాంకం వరకు కూడా తరించిన ధన్యురాలు,ఈ ప్రపంచానికి సేవ చేసే నిమిత్తమై మానవ రూపంలో వచ్చిన,విచ్చేసిన ఓక దేవతామూర్తి ఈ దివంగత మదర్ థేరీస్సా గారు.ఓక విధంగా చెప్పాలంటే సేవ అనే రెండు అక్షరాలకు ఓక గొప్ప సార్థకత చేకూర్చిన ఉత్తమోత్తమురాలు,యావత్ ప్రపంచమే మెచ్చిన,నచ్చిన ఓక ఉద్దాత్తమైన సమాజ సేవకురాలు.అందుకే దిక్కు లేని అబాగ్యులకు, వ్యాధిగ్రస్తులకు,పీడితులకు ఆమె చేసిన వెలకట్టలేని సేవలకు గుర్తుగా మన భారతప్రభుత్వం 1980 లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ' భారతరత్న ' అవార్డును ఆ మహోన్నత సేవకురాలు అయిన దివంగత మదర్ థేరీస్సా గారికి బహుకరించి ఆమెను అత్యంత ఘనంగా,గొప్పగా సత్కరించింది కూడా.
ఏదిఏమైన ఈ రోజు సేవాభావానికి,జాలి,దయకు, కరుణకు ప్రతిబింబం అయిన,పేద,సాధల పట్ల ఎప్పటికి,ఎన్నటికీ మరచిపోలేని ప్రేమను పంచిన ఓక గొప్ప విశాలహృదయశీలి దివంగత మదర్ థేరీస్సా 116వ జయంతి నేడు.అందుకే యావత్ ప్రపంచ ప్రజానీకం ఈ ప్రత్యేక సందర్భంలో కుల,జాతి,మతాలకు అతీతంగా ఎంతో మమకారంతో ఎవరి అండదండలు,దిక్కు ముక్కు లేని అబాగ్యులకు, నిరుపేదలకు అంతా తానై ఓక నిజమైన మాతృమూర్తిలాగా వారి ఆలనా పాలన చూసుకొని వారిని అన్ని విధాలా ఆదుకొని వారి కడుపు నింపిన ఈ నిస్వార్ధమూర్తి అయిన ఈ దివంగత మదర్ థేరీస్సా గారి అడుగుజాడల్లో ఈ సమాజం,ఈ సమాజంలోని ప్రజలు,నాయకులు,పాలకులు నడిస్తే యావత్ ప్రపంచమే సుఖ,సంతోషాలతో నిండి పోవడం తథ్యం.ఏమైనా మనవత్వానికే ఓక చిరునామా అయిన ఈ స్ఫూర్తిదాయమైన,ఆదర్శమైన మహిళ అయిన దివంగత మదర్ థేరీస్సా కు యావత్ భారత జాతి ఎప్పటికి రుణపడిఉంటుంది.అమర్ రహే,అమర్ రహే,జోహార్ యావత్ ప్రపంచం మెచ్చిన ఓక ధన్యజీవి,గొప్ప ధన్యురాలు ఈ దివంగత మదర్ థేరిస్సా గారు అనడంలో ఎవరికీ కూడా ఇసుమంతైనను సందేహం లేదు.✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #💐మదర్ థెరిసా జయంతి💐
13 shares