👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
510 views 6 hours ago
తిరుమలలో వరాహస్వామినే ముందుగా ఎందుకు దర్శించుకోవాలి కలియుగ ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు అశ్రయమిచ్చారని పురాణ కథనం. అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామిని దర్శించాకే తనను దర్శిస్తారని వరమిచ్చారట. హిరణాక్షుడిని చంపి భూదేవిని రక్షించి పని పూర్తయిన తర్వాత వరాహస్వామి భూమిమీద సంచరించిన ప్రదేశమే నేటి తిరుమలకొండ. తిరుమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రం గా ప్రసిద్ధి పొందినది.అయితే తిరుమలకొండ పై ఉండేందుకు వేంకటేశ్వరస్వామికి అనుమతి నిచ్చినది వరాహస్వామే . వరాహస్వామి భూమిమీద సంచరించేటప్పుడు వృషభాసుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి ఆకొండమీదే నివాసస్థలం ఏర్పరచుకొని వుండేవాడట, కొంత కాలానికి అక్కడికి శ్రీనివాసుడు వస్తాడు . శ్రీనివాసుడే శ్రీ మహావిష్ణువని గ్రహిస్తాడు ఆదివరాహస్వామి . వరాహస్వామి రూపములో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు తెలుసుకుంటాడు . మహావిష్ణువే రెండు రూపాలను ధరించి ముచ్చటించుకుంటుంటే ,, ముక్కోటి దేవతలు మురిసిపోయారట . నాకు ఈ ప్రదేశం లో కలియుగాంతము వరకు నివసించాలన్న సంకల్పము కలిగింది . ఇక్కడ నాకు కొంత స్థలము ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా .. అప్పుడు ఆయన (వరాహస్వామి) మూల్యము చెల్లిస్తే స్థలమిస్తానని అంటారు . అప్పుడు శ్రీనివాసుడు " నా దగ్గర ధనం లేదు , అందుకు ప్రతిగా మీరిచ్చే స్థలానికి దర్శనానికి వచ్చే భక్తుల ప్రధమ దర్శనము , ప్రధమ నైవేద్యము మీకు జరిగేటట్లు చేస్తానని " చెబుతాడు . అందుకు ఆదివరాహస్వామి అంగీకరిస్తారు . శ్రీనివాసుడికి 100 అడుగులు స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి . శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి , . శ్రీనివాసునికి స్థలాన్నిచ్చి నేటి భక్తులు కొలుస్తున్న తిరుమల కొండ క్షేత్రానికి మూలమైనాడు . రెండు అవతారాలతో , రెండు మూర్తులతో భక్తుల కోరికల్ని తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ రెండు అవతారాలకు ఎంతో ప్రాముఖ్యము ఉన్నది . #తెలుసుకుందాం
7 likes
19 shares

More like this