DUDEKULA DASTAGIRI
652 views 3 days ago
#ఎమ్మెల్యే_ముత్తుముల_కృషితో_గిద్దలూరు_నియోజకవర్గంలో_విద్యా_విప్లవం... #గిద్దలూరు నియోజకవర్గంలోనే పుట్టి, ఇక్కడే అంచలంచలుగా ఎదుగుతూ, నేడు అదే నియోజకవర్గానికి శాసనసభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ Muthumula AshokReddy గారు తన ప్రాంతంపై ఉన్న మమకారంతో అభివృద్ధి, సంక్షేమమే ఏకైక లక్ష్యంగా దీక్ష పూనారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలను అందించాలనే తపనతో ఆయన అన్ని రంగాలను సమన్వయం చేసుకుంటూ పాలనలో తనదైన ముద్రను నెలకొల్పారు. ముఖ్యంగా నియోజకవర్గంలో విద్యను పేద, బడుగు, బలహీనవర్గాలకు నాణ్యమైన రీతిలో అందించాలనే దృఢ సంకల్పంతో, విద్యాభివృద్ధికి అవసరమైన ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తూ ఆయన ప్రత్యేక చొరవ చూపుతున్నారు. వెనుకబడిన వర్గాలకు ఉన్నత చదువులను చేరువ చేయడంలో భాగంగా, నియోజకవర్గ చరిత్రలోనే ఇప్పటివరకు బీసీ బాలురకు ప్రత్యేక వసతి గృహం లేని లోటును గుర్తించి, ఏకంగా రూ. 50 కోట్ల రూపాయల భారీ నిధులతో బీసీ బాలుర పాఠశాల మరియు వసతి గృహాన్ని మంజూరు చేయించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అద్దె భవనంలో దానిని ప్రారంభించడం గిద్దలూరు నియోజకవర్గానికి ఎంతో మేలు చేకూర్చింది. ఇదే బాటలో గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం మరో రూ. 16 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్టీ వసతి గృహం మరియు పాఠశాల నిర్మాణ పనుల కోసం నిధులను మంజూరు చేయించారు. వీటితో పాటుగా దళిత విద్యార్థుల వసతి గృహాల రూపురేఖలను మార్చేందుకు, నియోజకవర్గంలోని ఎస్సీ (SC) హాస్టల్స్ సమగ్ర అభివృద్ధి మరియు ఆధునీకరణ కోసం ప్రత్యేకంగా రూ. 6 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేయించి ముందడుగు వేశారు. అంతేకాకుండా, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో బెస్తవారిపేటలో ప్రతిష్టాత్మకమైన లీప్ (LEAP) స్కూల్‌ను ఏర్పాటు చేయించడం నియోజకవర్గ విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. కూటమి ప్రభుత్వ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు యువ నాయకులు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గార్ల పూర్తి సహకారంతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అన్ని వర్గాలను, అన్ని రంగాలను సమపాళ్ళలో ముందుకు నడిపిస్తూ ఎనలేని కృషి చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు మరియు తరగతి గదుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని ఎమ్మెల్యే గారు అనేకమార్లు స్వయంగా కలిసి ఇక్కడి క్షేత్రస్థాయి సమస్యలను వారికి విన్నవించి, పెద్ద ఎత్తున నిధులు రాబట్టారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలనే ఆశయంతో, పాఠశాలల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు మంచినీటి బోర్లు వేయించడంతో పాటు, స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరో (RO) ప్లాంట్లను సమకూర్చారు. అంతేకాకుండా, నియోజకవర్గంలో రవాణా ఇబ్బందుల వల్ల ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, అనేక గ్రామాల నుండి పాఠశాలలకు బస్సు సౌకర్యాలు లేవని తెలుసుకొని, విద్యార్థులు తగిన సమయానికి విద్యాసంస్థలకు చేరుకునేలా ప్రత్యేక బస్సు రవాణా సౌకర్యాలను కూడా కల్పించారు. ఈ విధంగా సొంత నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలనే గట్టి సంకల్పంతో, నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి కృషి మరియు పట్టుదల వల్లనే నేడు గిద్దలూరు నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అద్భుతమైన మార్పులను, అభివృద్ధి పనులను కళ్లారా చూస్తున్న నియోజకవర్గ ప్రజలంతా ఎమ్మెల్యే గారిపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన చేస్తున్న అలుపెరగని కృషికి తమ గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ ఎల్లప్పుడూ కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. #NarendraModi #NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #MuthumulaAshokReddy #IdhiManchiPrabhutvam #NDAGovernment #GiddalurTelugudesamparty #గిద్దలూరుఅభివృద్ధిప్రధాత #గిద్దలూరుగడ్డముత్తుములఅడ్డా #టీంముత్తుముల #మనఊరువాడు_మనఅందరివాడు #GiddalurHopeMuthumula #GiddalurMLA #giddalur #Giddalurtown #ThankYouCMsir #మనగిద్దలూరుమనముత్తుముల #ThankyouMlaMuthumulaAshokReddySir #ManaGiddaluruManaMuthumula #జైతెలుగుదేశం #జైముత్తుముల #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
10 likes
8 shares

More like this