బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
681 views • 1 months ago
వైద్యో నారాయణో హరి - డాక్టర్లు అనే వారు మన దృష్టిలో నడిచే దేవుళ్ళ వంటి వారు! ( జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు 1 - 7 - 2026 )!
లేదా
డాక్టర్స్ అంటే మన ప్రాణాలను నిలబెట్టే ప్రాణదాతలే కాదు - కొన్ని సందర్భాలలో మనకు ప్రాణం పొసే డాక్టర్ల రూపంలో వున్న దేవుళ్ళు కూడా!
ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన దేశంలోని ప్రతి ఒక్క ప్రజానీకం యావత్తు మానవాళికి వారు అందిస్తున్న అమూల్యమైన సేవలను,ముఖ్యంగా కరోనా వంటి గడ్డు కాలంలో కరోనా రోగుల ప్రాణాలకు వారి ప్రాణాలు అడ్డుపెట్టి మరీ వారు అందించిన మహోన్నత సేవలు నభూతో న భవిష్యత్ అని మనకు అనిపించక మానదు. ఓక విధంగా చెప్పాలంటే డాక్టర్లు రోగుల, ప్రజల దృష్టిలో ప్రాణదాతలు,సాక్ష్యాత్తు డాక్టర్ల రూపంలో వున్న దేవుళ్లుగా,జబ్బు చేసిన రోగులకు దైర్యం చెప్పే ఓక ఆశాజీవులుగా కూడా మనం వారిని పరిగణిస్తూ ఉంటాము.ఎందుకంటే మనకు ఏ ఆనారోగ్యం సంభవించిన,ఏ రకమైన రోగం మన దరి చేరిన ముందుగా డాక్టర్ల దగ్గరకే మనం వెళ్లాల్సిన తప్పని పరిస్థితి.అంటే మన వచ్చిన జబ్బును నయం చేసే బలమైన ఆయుధం అనేది వారి చేతుల్లోనే ఉంటుంది అనే మాట సత్యదూరం కాదు.అయితే కొంతమంది డాక్టర్లు విచ్చలవిడిగా డబ్బు సంపాదన మోజులో పడి,కాసుల కోసం కకృతి పడి రోగులకు వచ్చిన జబ్బును గోరంతలు కొండంతలుగా చూపిస్తూ చికిత్సలో భాగంగా లక్షలు,వేల రూపాయలను కొంతమంది రోగుల బంధువుల నుంచి ఓక డేగ లాగా పీక్కు తింటూ వుంటారు,గుంజుతూ వుంటారు అనే మాట ఎవ్వరూ కాదనలేని నగ్న సత్యం కూడా.అంతమాత్రాన అందరూ డాక్టర్లు అలా వుంటారు అనుకోవడానికి వీలులేదు.ఎందుకంటే వాళ్లలో కూడా కొంతమంది డాక్టర్లు తమ వైద్య వృత్తిని ఓక దైవసమానంగా భావిస్తూ పేద సాదలకు,బీద బిక్కికి, సామాన్య ప్రజలకు ఉచితంగా చికిత్స అందించే సామాజిక సేవ మెండుగా గల డాక్టర్లకు ఈ సమాజంలో ఏ మాత్రం కోదువలేదు.అంతేకాదు తమకు వచ్చిన జబ్బులకు నయం చేసుకునేందుకు ఆర్థిక స్తోమత లేని పేద ప్రజానీకం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని, వైద్యశాలను ఆశ్రయించి తమకు వచ్చిన జబ్బులకు అక్కడ వున్న డాక్టర్ దేవుళ్ళ ద్వారా ఉచిత వైద్యం పొంది తమ ప్రాణాలను నిర్భయంగా కాపాడుకోవొచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ప్రయువేటు వైద్యశాలలలో తమకు వచ్చిన పెద్ద జబ్బులను నయం చేసుకునేందుకు వెళ్లాలంటే మాత్రం రోగులకు గుండె ఆగినంత పని అవుతుంది.ఎందుకంటే అక్కడ వేలు, లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప చికిత్సకు రోగులు నోచుకోలేని దయనీయ స్థితి.అయినప్పటికీ ఇప్పుడు మనకు వస్తున్న అన్ని రకాల జబ్బులకు ఆధునాతనమైన వైద్యం,మంచి ప్రతిభావంతమైన, నిపుణులు అయిన డాక్టర్లు అందుబాటులో ఉండటంతో పాటు అంతకుమించి ఆ దేవుడి దయ రోగులపై చల్లగా వుంటే మాత్రం ఆ డాక్టర్ దేవుళ్ళ ద్వారా మన ప్రాణాలను నిచ్చితంగా కాపాడుకొని మరికొంతకాలం మన ఆయురారోగ్యాలను, ఆయుష్షును పెంచుకోవొచ్చు.ఇందులో ఎలాంటి ఇసుమంతా సందేహానికి కూడా తావు లేదు.
ఏదిఏమైన వైద్య విద్యను అభ్యసించిన,ఎంతో నిపుణులు అయిన డాక్టర్ దేవుళ్ళు తాము నేర్చుకున్న విద్య ద్వారా మనకు ఏ అవయవానికి ఏ జబ్బు వచ్చిన అందుకు సంబందించిన స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండటం మూలాన మనకు వచ్చిన జబ్బుకు తక్షణమే వైద్యం చేసి నయం చేసే మంత్రదండం ఒక్క డాక్టర్ మహాశయుల చేతుల్లోనే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.ఏమైనా అందుబాటులో మనకు వచ్చిన జబ్బుకు చికిత్స అందించడానికి డాక్టర్లు అనే వారు అసలు అందుబాటులోనే లేకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఉహించుకుంటేనే నిలువెల్లా మనకు భయం కంపిస్తుంది.ఇలా ఏ విధంగా చూసిన ఈ సమాజం అనే దేవాలయంలోని ప్రజలు దేవుళ్ళ తరువాత చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్లకే అనే మాట ఎవ్వరూ కాదనలేని అక్షర సత్యం.అలాంటి ఓక గొప్ప మహాభాగ్యం పొందగలిగిన ధన్యజీవులు మన డాక్టర్ దేవుళ్ళు.జయ జయహో డాక్టర్స్! వారి దీరోదత్తమైన వైద్య సేవలకు ఈ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనమంతా ఆ నడిచే దేవుళ్ళు అయిన డాక్టర్స్ కు ఒక్కసారి ముక్తకంఠంతో హ్యాట్సాఫ్ చెబుదాం!లాల్ సలాం చేద్దాం!🥼🥼🩺🩺🩺💊💊👩⚕️👨⚕️💉💉💉
- బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #జాతీయ 🩺వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు💉
10 likes
3 shares