TALRadio Telugu
16K views 4 hours ago
108 దేశాల నుంచి వేలాది మంది పోటీపడితే... అందులో ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చోటు దక్కించుకుంది! తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల జెస్సి, ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ ప్రాజెక్ట్ ‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికై అందరి ప్రశంసలు అందుకుంటోంది. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసిన జెస్సి, తన చదువుతో పాటు ఉపగ్రహ వ్యవస్థలు, స్పేస్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణను పూర్తి చేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో జరిగిన ఇంటర్వ్యూలో తన ప్రతిభను చాటుకుని తుది జాబితాలో చోటు సంపాదించింది. 108 దేశాల నుంచి దాదాపు 12,000 మంది విద్యార్థినులు దరఖాస్తు చేయగా, భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి జెస్సి ఒక్కరే ఉండటం విశేషం. ఈ ఎంపికతో ఆమె అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న ‘మిషన్ శక్తిశాట్’ లూనార్ క్యూబ్‌శాట్ ప్రాజెక్ట్‌లో పాల్గొననుంది. #GoodNews #KandulaJessi #MissionShakthiSAT #SpaceMission #SatelliteProject #AndhraPradesh #EastGodavari #Dhavaleswaram #StudentAchievement #YoungTalent #InspiringStory #GovernmentSchool #TALRadio #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status
168 likes
147 shares

More like this