DUDEKULA DASTAGIRI
506 views 3 days ago
*విద్యుత్ డివిజన్ కార్యాలయం మంజూరుకృషి చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారికి విద్యుత్ శాఖ అధికారుల కృతజ్ఞతలు* *గిద్దలూరు పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో గిద్దలూరుకు విద్యుత్ డివిజన్ కార్యాలయం మంజూరు కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.* *ఈ సందర్భంగా గిద్దలూరు ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చుతూ విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, ఈ కార్యాలయం మంజూరుకు విశేష కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.* *విద్యుత్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు వల్ల గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు విద్యుత్ సేవలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందడంతో పాటు వినియోగదారుల సమస్యల పరిష్కారం త్వరితగతిన జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.* *ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొని గిద్దలూరుకు విద్యుత్ డివిజన్ కార్యాలయం మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి తమ కృతజ్ఞతలు తెలుపుతూ శాలువ, పూలమలతో ఘనంగా సన్మానించారు* #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
12 likes
15 shares

More like this