DUDEKULA DASTAGIRI
580 views • 13 days ago
*🟡 అర్ధవీడు మండలంలో వైసీపీ నుండి టిడిపిలోకి భారీ చేరికలు*
*ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో 65 కుటుంబాల చేరిక*
*మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మాగుటూరు పంచాయతీ మరియు రంగాపురం గ్రామంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి, పేదలకు అందించే పథకాలకు నియోజకవర్గం లో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు గ్రామాలకు చేస్తున్న అభివృద్ధి ని తెలుసుకొని మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు , పార్లమెంట్ ట్రెజరర్ అంబవరం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రగుంట్ల రాజన్న, కన్నెం కాశన్న , పేర్నపాటి రామ సుబ్బయ్య , కేశనపల్లి వెంకటేష్ చౌదరి, క్రిష్ణ , గంగుల పోలురాజు మండల పార్టీ కన్వీనర్ సర్వేశ్వరరావు , సర్పంచ్ జయరాం నాయక్ గారి ఆధ్వర్యంలో సభ్యులు కలిసి మొత్తం 65 కుటుంబాలు YSR కాంగ్రెస్ పార్టీ ను వీడి తెలుగుదేశం పార్టీ లో చేరారు.*
*ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించారు.*
*ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, గ్రామాభివృద్ధే లక్ష్యంగా టిడిపి పనిచేస్తుందని, పార్టీని బలోపేతం చేయడంలో కొత్తగా చేరిన కుటుంబాలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.*
*ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల విశ్వాసంతో టిడిపిలో చేరినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.*
*రాబోయే రోజుల్లో గ్రామంలో పార్టీ మరింత బలపడుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.*
*ఈ చేరికలతో అర్ధవీడు మండలంలో టిడిపి బలం మరింత పెరిగిందని నాయకులు పేర్కొన్నారు.*
*కార్యక్రమంలో ఆధ్వర్యంలో ప్రసాద్, పిచ్చయ్య, రామ నాయక్, చిన్న మస్తాన్, కాశీంరెడ్డి, పుల్లారెడ్డి , కాశిరెడ్డి, నల్లబోతుల అనిల్, అల్లూరయ్య, బుజ్జి, తదితరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినారు* #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
23 likes
20 shares