👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
588 views • 8 days ago
తిరుమలలో శ్రీవారి భక్తులను తీకమక పెడుతున్న : టిటిడి
ఎక్కడి నుంచో వచ్చిన భక్తులు శ్రీవారి నీ దర్శించకుండా వెళ్ళరు. సర్వదర్శనంలో దర్శించుకుంటే శ్రీవారి ఖాతాలో దర్శించినట్లు అనుకుంటున్నా భక్తులు. ఈ సంప్రదాయం అనాదిగా వస్తున్న నానుడి.
కానీ టీటీడీ వారు పూర్తిగా సర్వదర్శనం అనే కౌంటర్ను ఎవరు గుర్తించలేనటువంటి ప్రదేశంలో ఏర్పాటు. చేసి
కొత్త వారికైతేనేమి పాతవారికైతేనేమి వచ్చే భక్తుల కు చాలా ఇబ్బందికరంగా ఉంది.
ఉచిత సర్వదర్శనం లో శ్రీవారిని దర్శించుకోవాలంటే ఇక రాబోయే రోజుల్లో ప్రతి భక్తునికి అందని ద్రాక్ష పండులా ఏర్పాటు చేస్తారేమో అనే ఆలోచన ఊహించుకుంటే భయం వేస్తుంది.
ఒకప్పుడు శ్రీవారి సర్వ దర్శనం ప్రతి ఒక్కరు. ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శించుకుండేవారు కొన్ని రోజులు తరువాత భక్తుల సౌకర్యం కొరకు, శ్రీవారి ఉచిత సర్వదర్శనం.
గుడికి వెనుక భాగం దగ్గర సర్వదర్శనం కౌంటర్ నీ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వదర్శనానికి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేది.
కానీ ఈరోజు శ్రీవారి వారి గుడికి వెనుక నాలుగు కిలోమీటర్ల దూరంలో అడవిలో ఏర్పాటు చేసి గుడికి దగ్గరగా మాత్రము రూ.300 . ప్రవేశ కౌంటర్ ఏర్పాటుచేసి. ఆదాయం మార్గాన్ని ఎంచుకున్నారు కానీ సాధారణ భక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించి టాక్సీల దంద మొదలెట్టలాగా ఏర్పాటు చేశారు.
తిరుమలలో టాక్సీవాలా దళారి వ్యవస్థ రాజ్యమేలుతుంది. నాలుగు కిలోమీటర్ల ఉచిత సర్వదర్శనం కౌంటర్ దగ్గరికి తీసుకువెళ్లాలంటే 50 నుండి 200 కు చార్జీ చేస్తున్నారు.
ఇది ఎక్కడి న్యాయం అండి బాబు. కార్ల వ్యవస్థ సూది లాగా వచ్చి గుణపం లాగా తయారు చేశారు. ఈ వ్యవస్థ రాను రాను శ్రీవారి భక్తులను పట్టిపీడించేలాగా తయారైంది.
ఈ కార్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయండి. ఆర్టీసీ బస్సులును పెంచండి ఉచిత బస్సులను ఏర్పాటు చేయండి. ప్రైవేటు వ్యవస్థను తిరుమలలో దింపవద్దు.
ప్రతి భక్తుడికి ఉచిత సర్వదర్శనం కౌంటర్
కనిపించేలాగా. ఇదివరకు ఉన్నట్లుగానే ఏర్పాటు చేయండి.l రోజువారి వీఐపీలు వంద మంది శ్రీవారిని దర్శించుకుంటే.....
అలాగే రోజువారి పదివేల మంది 300 రూపాయలు టికెట్ మీద దర్శించుకుంటే.రోజువారి నాలుగు లక్షల మంది సర్వదర్శనం భక్తులు దర్శించుకుంటున్నారు.
ఈ ఒక్క మాట గుర్తుంచుకోండికానుకలు అయితేనేమీ ముడుపులు అయితేనేమి 75% సర్వదర్శనం భక్తులు కానుకలు ఉన్నాయి
10% పర్సంటేజ్ వీఐపీల భక్తుల కానుకలు
15% 300. రూపాయల టికెట్ కౌంటర్ భక్తులది
అలాంటిది. ఉచిత సర్వదర్శ భక్తులను చిన్నచూపు. చూస్తున్నారు.
ఇది మీకు తగదు. అందుకే ఎప్పటిలాగే ఉండే సర్వదర్శనం కౌంటర్ ను అక్కడనే ఏర్పాటు చేస్తే భక్తుల సౌకర్యార్థం బాగుంటుందని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు.
అందుకే భక్తులు సర్వదర్శనం పై పలు ఊహ గానాలు భక్తుల మనసులో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని భక్తులు కోరుకుంటున్నారు.
అలాగే తిరుమల కొండపై ప్రతి షాపు నందు అధిక రేట్లతో ప్రతి వస్తువు ను విక్రయిస్తున్నారు. వారి మీద కూడా కాస్త చర్య తీసు కొనివారిని కూడా కట్టడి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.
#తెలుసుకుందాం #♥️మంచి మాట మీ నోట...ఇది ఆలోచించండి♥️ #TTD తిరుపతి తిరుమల #తిరుమల తిరుపతి దేవస్థానం
10 likes
18 shares