Mahbubnagar Police
514 views • 18 days ago
498-ఏ కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలు శిక్ష – బాధిత మహిళకు న్యాయం చేసిన మహిళా పోలీసు స్టేషన్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్.
మహబూబ్నగర్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లో 2015లో నమోదు చేసిన సెక్షన్ 498-ఏ ఐపీసీ కేసులో నిందితులపై నేరం రుజువుకావడంతో బుధవారం మహబూబ్నగర్ గౌరవనీయ ప్రధాన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది.
బాధితురాలు శ్రీమతి కె.పావని వివాహం 11-12-2005న BC హాస్టల్, గొడ్లబండ, కొత్తకోట గ్రామము మరియు మండలం, వనపర్తి జిల్లా కి చెందిన కె.వెంకట్ రెడ్డితో జరిగింది. వివాహ సమయంలో రూ.1,50,000 నగదు కట్నంగా ఇచ్చినప్పటికీ, అనంతరం భర్త కె.వెంకట్ రెడ్డి, మామ కె.తిమ్మా రెడ్డి, అత్త వెంకటమ్మ కలిసి అదనపు కట్నం కోసం బాధితురాలిని శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు అక్రమ సంబంధం ఉందని ఆమెను అనుమానిస్తూ నిరంతరం హింసకు గురిచేశారు. భర్త మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ, బాధితురాలి విద్యా సర్టిఫికెట్లను కూడా దహనం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కుటుంబ సభ్యులు కూడా బాధితురాలి తల్లిదండ్రులను బెదిరించి, దుర్భాషలాడినట్లు విచారణలో తేలింది.
ఈ వేధింపులను తట్టుకోలేక బాధితురాలు 16-06-2015న ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆమెను హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు నిర్వహించారు.
దర్యాప్తులో సేకరించిన పటిష్టమైన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా మహబూబ్నగర్ గౌరవనీయ ప్రధాన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి కె.మమతా రెడ్డి గారు నిందితులైన కె.వెంకట్ రెడ్డి మరియు కె.తిమ్మా రెడ్డిలను దోషులుగా నిర్ధారించి, ప్రతి ఒక్కరికీ ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష తో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి ఎస్.సైదయ్య, సీఐ (మహిళా పోలీస్ స్టేషన్), ప్రస్తుతం మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఎం.కృష్ణయ్య, APP శ్రీమతి జె.భార్గవి, కోర్టు డ్యూటీ అధికారి హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ముజీబ్ లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మహిళలపై గృహహింస, కట్న వేధింపులు వంటి నేరాలపై జిల్లా పోలీసులు రాజీ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, బాధిత మహిళలకు న్యాయం జరిగేలా ప్రతి కేసును శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేసి నిందితులను శిక్షించే దిశగా కృషి కొనసాగిస్తామని తెలిపారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
10 likes
13 shares