PSV APPARAO
628 views • 18 days ago
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #పుష్ప వాహనసేవ🙏 #పుష్ప #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS
17th July 2026
తిరుమల శ్రీవారి ఆణివార ఆస్థానం (పుష్పపల్లకి ఉత్సవం) :
ఆపదమొక్కులవాడి సన్నిధిలో నిత్యం వేలాదిమంది మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అవన్నీ నిధుల రూపంలో స్వామి ఖజానాకు చేరుతుంటాయి. భక్తుల సౌకర్యాల కల్పనకు స్వామి కొంత ఖర్చుపెడుతూ ఉంటాడు. అందుకు ఎంతో వ్యయమవుతుంది. తిరుమల తిరుపతి వార్షిక ఆదాయ వ్యయాల నివేదికను శ్రీవారికి నివేదించే విశేష కార్యక్రమాన్నే ‘ఆణివార ఆస్థానంగా’ వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలు, నిల్వలు మొదలైన వాటికి సంబంధించిన వార్షిక లెక్కలను ఆనాడే స్వామి వింటాడు. ప్రతి సంవత్సరం దక్షిణాయన ప్రారంభంలో తిరుమలలో ఆణివార ఆస్థానం నిర్వహించడం ఆచారం. కర్కాటక మాసాన్ని తమిళంలో ఆడిమాసం అంటారు. కాలక్రమంలో ఆడివరమే ఆణివరం అయింది.
దక్షిణాయనం తొలిరోజు స్వామికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం వచ్చే సంవత్సరానికి సంబంధించిన కార్యక్రమాల గురించి నివేదిస్తారు. ఆణివార ఆస్థానం ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఇది మహంతుల కాలం నుంచి తిరుమలలో కొనసాగుతున్న ఆచారం. ఈ ఆణివార ఆస్థాన కార్యక్రమంలో భాగంగా.... బంగారు వాకిలి వద్ద జీయరు స్వాముల పర్యవేక్షణలో హారతి, చందన, తాంబూల, తీర్థ, శఠారి మర్యాదలతో శ్రీవారిని అర్చిస్తారు. అనంతరం రూపాయి హారతిస్తారు. ఈ కార్యక్రమంలో స్వామి ప్రతినిధులుగా నియమితులైన అధికార, అనధికార, అర్చక పరివారక బృందమంతా పాల్గొంటుంది.
ఆణిపర ఆస్థానం నాటి సాయంత్రం మలయప్పస్వామి ఉభయ దేవేరులతో పూల పల్లకిలో ఊరేగుతాడు. ఇందుకోసం వివిధ వర్ణశోభితమైన పుష్పాలతో పల్లకిని తయారు చేస్తారు. ఇందులో స్వామిని కూర్చోబెట్టి అన్ని లాంఛనాలతో (ఏనుగులు, గుర్రాలు, రథం, ఛత్రం, చామరం) అధికార బృందం స్వామిని సేవిస్తుంటే నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవాన్ని చూసి తరించేందుకు ఎంతోమంది భక్తులు హాజరవుతారు. దక్షిణాయన పుణ్యకాలంలో స్వామిని సేవించిన వారికి కీర్తి, విజయం, ఇష్టకామ్యార్ధ సిద్ధి, విష్ణులోకప్రాప్తి కలుగుతాయి.
12 likes
9 shares