More like this
- 尺 ㄖ ㄚ 卂 ㄥ 𖤍 尺 乇 ᗪ ᗪ ㄚ#life #truth of life #truth1771
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣శ్రావణంలో శనివారం ప్రత్యేకత శ్రావణమాసం అంటే శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు.అలాంటి రూపాలలో అర్చామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీవేంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు.ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం. కాబట్టి, ఈ నెలలో వచ్చే శనివారాలలో, శ్రవణానక్షత్రం రోజులలో శ్రీవేకంటేశ్వరుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి. దీనికోసం పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం, పూజ, ఉపవాసం తదితర ఆచారాలు మనదగ్గర ఏర్పడ్డాయి. ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది.ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయినా, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం.శనివారాలలో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించండం, పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం, ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. చాలామంది తెలుగు ప్రజలు సంతానం లేని వారు సంతానం కోసం ఏడుకొండల వాడికి మొక్కుకునే ఆచారం ఉంది.తమ కోరిక తీరిన తర్వాత ఆ పిల్లలతో శ్రావణమాసంలో *గోవిందం* అంటే చిన్న ఇత్తడి లేదా రాగి పాత్ర/చెంబు పెట్టి మూడు లేదా ఐదు ఇండ్ల దగ్గర గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్లి బియ్యం తీసుకువచ్చి ఆ బియ్యంతో స్వామికి తియ్యని ప్రసాదం చేసి అందరికీ పంచడం, తామూ స్వీకరించండం వస్తుంది.ఇలా మూడు లేదా ఐదు ఏండ్లు పాటిస్తారు. ఇలా ఆయా ప్రాంతాలలో అనేక ఆచారాలు ఉన్నాయి. శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర ఆరాధన వల్ల శనిబాధలు, ఈతి బాధలు పోతాయి. అంతే కాకుండా స్వామి అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నేరవేరుతాయి. #తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🪔శ్రావణ మాసం #🕉️పవిత్ర శ్రావణ మాసం🙏1322
- 🧿 ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🧿🙏జీవితంలో ఏదైనా సరే మొండి పట్టుదలతో సంపాదించుకో... కానీ ఒక్క"" స్త్రీ "" కోసం , ప్రేమ కోసం మాత్రం ఆరాటపడకు. అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు ఫ్యామిలీ background ను నిశితంగా పరిశీలించి ముందుకు step వేయండి. ___________________________________________ ఇప్పుడు సోషల్ మీడియా లో రోజూ చూస్తూ వున్నాం. భార్య భర్తను చంపిందనో , లేక భర్త భార్యను చంపిందనో.. దీనికి కారణము కుటుంబ వంశ వృక్షాన్ని చూడకుండా , ఆలోచించకుండా .. ఉద్యోగం ఉందని , ఆస్తిపరులు అనీ..సుఖపడతారనీ ... కానీ జరిగేది మరొకటి... ఇలాంటి హింసా ప్రవృత్తి లక్షణాలు తల్లిదండ్రుల ద్వారా , తరాల ద్వారా సంక్రమించవచ్చు.. ___________________________________________ పూర్వం రోజుల్లో పెళ్లి సంప్రదాయాలు పెద్దలు నిర్ణయించినట్టు జరిగేవి.. పెళ్లి అయిన తర్వాతనే మొహాలు చూసుకునేవారు. ఒక సంప్రదాయ వైదిక బ్రాహ్మణ సమక్షంలో , తాటాకు పందిళ్లలో వేద మంత్రాల సాక్షిగా, సొంత ఇంటి ముందే పెళ్లి వేడుక జరిగేది. పరిస్థితులు మారినా .. పద్దతి మారకూడదు కదా.. ___________________________________________ అందుకే ఏ స్త్రీ నీ బ్రతిమాలకు.. తనకు తానుగా నువ్వే కావాలి , నీతోనే నా ప్రయాణం , నా బ్రతుకు అని వస్తుందే.... అలా వచ్చిన స్త్రీ ప్రేమ జెన్యూన్. అప్పుడే మీరిద్దరూ happy గా ఉండగలుగుతారు. ___________________________________________ అంతే గానీ , ముక్కు , మొహం తెలియని వాళ్ళని , సోషల్ మీడియా లో పరిచయం అయినవాళ్ళని అస్సలు నమ్మకండి. వాళ్ళంతా దొంగలు.. మాటలు చాటింగ్ రూపంలో వస్తాయి. ఫేస్ కన్పించదు. అమ్మాయో తెలియదు.. అబ్బాయో తెలియదు.. దీనికి ఉదాహరణ చెప్తాను.. మొన్నీమధ్య social మీడియాలో ఆడపేరు పెట్టుకున్న మగవాడు నాకు తారసపడ్డాడు. అమ్మాయి అని అనుకుని పరిచయం పెంచుకున్నాను. తర్వాత తెలిసింది... వాడు అబ్బాయి అని...పైగా ముసలివాడు అని...అమ్మాయి tag పెట్టుకుని , అమ్మాయిలతో చాటింగ్ చేస్తుంటాడు... వాడి ట్యాగ్...రామ చిలుక...వాడు గ్రూప్ కూడా మెయింటైన్ చేశాడు.. ఆ గ్రూప్ లోని ఒక అమ్మాయి చెప్తే నాకు తెలిసింది. అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. కొంత డబ్బు పోగొట్టుకున్నాను.. ___________________________________________ ఇలా సోషల్ మీడియాలో ఆడపేర్లు పెట్టుకున్న మగవారు చాలా మంది ఉన్నారు. అందుకే నీవు వెంటబడే బంధం ఎక్కువ కాలం నిలబడదు. కలసి బ్రతకాలని ఇద్దరికీ వుండాలి. ప్రయత్నం ఇద్దరూ చేయాలి. పెద్దల అంగీకారంతో తాటాకు పందిళ్లలో , వేద మంత్రాలతో , నిజమైన ప్రేమ కు సాక్ష్యంగా మీ కలలను సాకారం చేసుకోండి. .. నూరేళ్ళ వివాహ బంధాన్ని కాపాడుకోండి. ___________________________________________ Hari (ఓం శ్రీ మాత్రే నమః) ___________________________________________ #తెలుసుకుందాం #🙆 Feel Good Status #✍️నా ఆలోచనలు✍️ #😃మంచి మాటలు #✍️నా మది అంతరంగం💜1221
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣*🌹పండుగలమాసం శ్రావణమాసం🌹* తెలుగు మాసాలలోని అతి పవిత్రమైన మాసాలలో శ్రావణమాసం ఒకటి ఈ మాసంలో ఉన్నన్ని పండుగలు వ్రతాలు ఇతర యే మాసంలోను ఉండవు.అందుకే శ్రావణమాసాన్ని శుభ శ్రావణమాసం అంటారు. శ్రావణమాసంలో పండుగలు *శ్రావణ శుద్ధ విదియ: అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి* *శ్రావణ శుద్ధ చతుర్థి: నాగుల చవితి* *శ్రావణ శుద్ధ పంచమి: గరుడ పంచమి,కల్కి జయంతి* *శ్రావణ శుద్ధ ఏకాదశి: పుత్రదా ఏకాదశి* *శ్రావణ శుద్ధ ద్వాదశి: రెండవ శుక్రవారం: వరలక్ష్మీ వ్రతం* *శ్రావణ శుద్ధ ద్వాదశి: దామోదర ద్వాదశి.* *శ్రావణ శుద్ధ చతుర్దశి: వరాహజయంతి* *శ్రావణ పూర్ణిమ: రాఖీ పూర్ణిమ,హయగ్రీవ జయంతి* *శ్రావణ బహుళ విదియ: శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి* *శ్రావణ బహుళ చవితి: సంకటహర చతుర్ధి* *శ్రావణ బహుళ అష్ఠమి: కృష్ణాష్టమి* *శ్రావణ బహుళ ఏకాదశి: కామిక ఏకాదశి* *శ్రావణ అమావాస్య: పొలాల అమావాస్య* *వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసం లో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. గరుడ పంచమి శ్రావణ శుద్ద పంచమిని గరుడపంచమి అంటారు. ఈరోజుననిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి పూజ. ఈరోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యంపోసి, వారి శక్తి మేర బంగారు,వెండి గరుడపక్షి ప్రతిమను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది.అంతేకాదు నాగదోషాలు,దుఃస్వప్నాలు వల్లకలిగే కీడును తొలిగిస్తుంది. దామోదర వ్రతం శ్రావణ శుక్ల ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు.ఈ రోజున శ్రీమహావిష్ణువును వివిధ రకాల పూల మాలికలతో అలంకరించాలి. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించి, స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. మహా విశిష్టమైన ఈ రోజున శ్రీమహా విష్ణువుకి ప్రతీకగా చెప్పబడే సాలాగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిది. దామోదర ద్వాదశి రోజున ఈ విధంగా చేయడం వలన మోక్షాన్ని పొందడానికి అవసరమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది. శ్రావణ శనివారములు ఈ శ్రావణమాసంలోని శనివారాలలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా మహావిష్ణువు అవతారాలు పూజించడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శనివారం రోజున అఖండ దీపంవెలిగించి, ఉపవాసముఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేసి అష్టైశ్వర్యాలు పొందవచ్చు. మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసమునందు ఆచరించ వలసిన వ్రతములలో రెండవది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. శుక్లచవితి-నాగచతుర్థి దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజుని నాగులచవితి పండుగలా నాగాపుజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి. శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది శ్రావణ పూర్ణిమ–రాఖీపూర్ణిమ అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు. *పూర్ణిమ–హయగ్రీవ జయంతి ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం కృష్ణవిదియ-శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది. కృష్ణపక్ష అష్టమి–శ్రీకృష్ణాష్టమి శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది. *కృష్ణపక్ష ఏకాదశి–కామిక ఏకాదశి* ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు.దీనివలన మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం. *అమావాస్య–పోలాల అమావాస్య * పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి, పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. #తెలుసుకుందాం #🪔శ్రావణ మాసం #🕉️పవిత్ర శ్రావణ మాసం🙏1213
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣వెంకటేశ్వరస్వామి ఏయుగానికి చెందినవాడు తిరుమల లో స్వామి వారు శిలారూపం లో దర్శనం ఇవ్వడం ప్రారంభించింది కలియుగం లోనే కావచ్చు...... కానీ స్వామి వారు కృతయుగం నుండి తిరుమల లొనే " మాయా స్వరూపం "లో వున్నారు. అందుకే స్వామివారు శ్రీ ఆది వరహస్వామి గా తిరుమలనే కలియుగంకు నాందిగా కృతయుగం లొనే ఎంచుకున్నారు., అందుకే వరాహస్వామి తిరుమలలో వెలిసినారు. పూర్వం సృష్టి ప్రారంభం లో శ్వేత వరాహ కల్పం లో వరాహస్వామి భూమిని సముద్రం నుండి పైకి తెచ్చి సృష్టిని ఆరంభింప చేశాడనితదనంతరం వెంకటాచలం పైన ఇప్పటి స్వామి వారి పుష్కరిణి పక్కన శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడని వరాహ పురాణం చెప్తుంది.దానికి నిదర్శనమే ఇప్పుడు మనం చూస్తున్న పుష్కరిణి కి పశ్చిమాన కల వరాహస్వామి ఆలయం. ఈ సంఘటన సృష్టి ఆరంభం లో సుమారు 200 కోట్ల సంవత్సరాల కాలం క్రితం జరిగింది. దానికి ఋజువే నేటి సహజ సిధ్ధ శిలాతోరణం కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ శిలాతోరణం వయస్సు 200 బిలియన్ సంవత్సరాలు గా తేల్చారు. శ్రీనివాసుడు తిరుమల పై కలియుగాంతం వరకు ఉండడానికి వరాహస్వామి అనుమతి ఇచ్చినందున ప్రథమ దర్శన భాగ్యాన్ని శ్రీనివాసుడు వరాహ స్వామి వారికి కల్పించారని వెంకటాచల మహత్యం లో తెలుపబడింది. దానికి నిదర్శనమే నేటి వరాహ స్వామి సన్నిధి లో కల అనుమతిపత్రం. (అయితే అది కుబేరయంత్రం అని ఒక నమ్మకం కలదు ) త్రేతాయుగంలో దశరథ మహారాజు తిరుమల క్షేత్రo లో అప్పటికి ఎవరికీ సాధ్యం కాని స్వామి వారి " మాయా స్వరూప" దర్శనం చేయగలిగిన కారణంగా..... పుత్రుడు కొరకు ప్రార్ధించడం, స్వామి శ్రీ రామునిగా అతనికే జన్మించాడు అని వెంకటాచల మహత్యం లో చెప్పబడింది రావణుని బారి నుండి రక్షింపమని మునులు, ఋషులు వెంకటాచాలమునకు వెళ్ళుట. శ్రీనివాసుడు అభయమిచ్చుట. శ్రీరాముని కంటే స్వామి హనుమ వయసులో పెద్ద. త్రేతాయుగం కాలంలో బాల్యం లో అల్లరి చేస్తున్న అతనిని అతని తల్లి , అల్లరి చేస్తే ఎదురుగా ఉన్న పుట్టలో ఒక నల్ల బూచాడు వున్నారు..అతనికి నిన్ను ఇచ్చేస్తా అని భయపెట్టి, చేతులకి బేడీలు వేసి అన్నందనిలయనికి ఎదురుగా నిలబెట్టింది. మనం ఇపుడు తిరుమల లో చూస్తున్న బేడి ఆంజనేయ స్వామి విగ్రహం త్రేతాయుగం లోనిది. అంటే స్వామి అక్కడ అప్పటి నుంచే ఉన్నట్టే కదా. ద్వాపరయుగంలో బలరాముడు కూడా మహాభారత యుద్ధం సమయం లో మనశాంతి కోసం తిరుమల ,మొదలగు క్షేత్ర దర్శనానికి వచిన్నట్టు ఆధారాలు ఉన్నాయి. పాండవులు అరణ్య వాసం లో కూడా తిరుమల క్షేత్ర దర్శనం చేశారు అని ఆధారాలు ఉన్నాయి. వారు స్నానం ఆచరించి, కొంత కాలం కొండ పై గడిపిన తీర్థమే నేటి తిరుమల లో " పాండవ తీర్థం". ఇలాంటి ఎన్నో సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి కనుక తిరుమలలో శ్రీనివాసుడు మాయా స్వరూపంలో కృతయుగం నుంచి ఉన్నాడు కానీ శిలారూపంలో కలియుగం నుండి మాత్రమే దర్శనం ఇస్తున్నారు అంతే. #తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి ##పురాణాలూ_కథలు815
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣⚜️ *జీవితం-మరణం* ⚜️ ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం. మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతీ ఘడియనూ మరణ సమయంగానే భావించాలి, మనిషి వేసే ప్రతీ అడుగూ మరణానికి దగ్గర చేసేదే ! నేడు జీవితం, రేపు మరణం అన్న భావనతోనే జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. తెలిసిన ప్రపంచం నుంచి తెలియని లోకానికి ప్రయాణమే మరణం. కానీ, మనిషి దీన్ని గుర్తించడు, మరణమనే మాటనే జీర్ణించుకోలేడు. ఇప్పట్లో చావు తన దరికి రాదనుకుంటాడు. ఈ భావనే అతణ్ని మోసానికి గురిచేస్తుంటుంది. కానీ, నిత్యం మరణాన్ని గుర్తుంచుకున్న వారే వివేకవంతులు. ‘చివరకు ప్రతి మనిషీ మరణిస్తాడు. ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు వ్యవధి ఉండదు. ‘ఎవరికైనా మరణ సమయం సమీపించినప్పుడు.. ఆ వ్యక్తి ... ‘భగవాన్ నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు. నేను దానధర్మాలు చేసి సజ్జనులలో కలిసిపోయేవాణ్ని కదా?’ అని వాపోయే పరిస్థితి రాకముందే మంచిని ఆచరించండి. ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, దైవం అతనికి ఎంతమాత్రం అదనపు వ్యవధి ఇవ్వడు’. ‘ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తాడు. అంత్యకాలం సమీపించినప్పుడు, ఒక్క ఘడియ కూడా వెనుకా ముందూ కాజాలదు’ శరీరమున్నప్పుడే చేతనైనంత మంచిని ఆచరించు, సత్కర్మలలో పాల్గొను, ఆర్తిక శక్తి చాలకపోతే, చెవుల ద్వారా మంచిని విను, కళ్ళ ద్వారా మంచిని చూడు, నోటి ద్వారా మంచి పలుకు, కాళ్ళను మంచి వైపుకి నడిపించు, చేతులతో మంచి పనుల్లో సహకారం అందజేయు... అందుకే !!... *శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం’’ అన్నాడు మహాకవి కాళిదాసు.* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 #🗣️జీవిత సత్యం #😃మంచి మాటలు #తెలుసుకుందాం1225
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🪷🙏 గ్రామ దేవతల నుండి శక్తి స్వరూపిణి వరకు.. అమ్మవారికి నిమ్మకాయల దండ ఎందుకు వేస్తారో తెలుసా? మనం ఏదైనా అమ్మవారి గుడికి వెళ్లినప్పుడు లేదా గ్రామ దేవతల జాతరలు జరిగినప్పుడు అమ్మవారి మెడలో నిమ్మకాయల దండను చూస్తుంటాం. ముఖ్యంగా దుర్గాదేవి, కాళీమాత, పోలేరమ్మ వంటి ఉగ్ర రూపం కలిగిన దేవతలకు నిమ్మకాయల దండ అంటే ఎంతో ప్రీతి. అయితే, పువ్వుల దండలు ఉండగా కేవలం నిమ్మకాయలనే దండగా ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న పురాణ గాథలు ఏమిటి? ఇది కేవలం నమ్మకమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? ఈ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 🪷🙏 నిమ్మకాయ అంటే కేవలం ఒక పండు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం అదొక శక్తివంతమైన ఆయుధం. మనపై ఉన్న ప్రతికూల శక్తిని (Negative Energy) గ్రహించే గుణం నిమ్మకాయకు ఉంది. అందుకే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా మన కష్టాలు, దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి నిమ్మకాయల సంఖ్యకు, అమ్మవారి అనుగ్రహానికి ఉన్న సంబంధం ఏంటి? 108 లేదా 54 నిమ్మకాయల దండ వెనుక ఉన్న మర్మమేమిటి? వంటి రహస్యాలను ఇప్పుడు సవివరంగా విశ్లేషిద్దాం..🪷🙏 1. ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి: శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దుష్ట శిక్షణ చేసేటప్పుడు అత్యంత ఉగ్రంగా ఉంటారు. నిమ్మకాయలో ఉన్న పులుపు మరియు చలవ చేసే గుణం అమ్మవారి ఉగ్రతను తగ్గించి, ఆమెను శాంతింపజేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 2. ప్రతికూల శక్తిని హరించడం: నిమ్మకాయకు గాలిలోని లేదా మనుషులలోని ప్రతికూల ప్రకంపనలను (Negative Vibrations) ఆకర్షించే గుణం ఉంటుంది. భక్తులు తమపై ఉన్న దిష్టి, ఈర్ష్య, ద్వేషం వంటి నెగటివ్ ఎనర్జీని నిమ్మకాయలు గ్రహించి, తమకు శుభం కలగాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ దండను సమర్పిస్తారు. 3. రాహు దోష నివారణ: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నిమ్మకాయల దండ సమర్పించడం వల్ల రాహు గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. రాహు కాలంలో దుర్గాదేవికి నిమ్మకాయలతో దీపం వెలిగించడం లేదా దండ వేయడం వల్ల పెళ్లి సంబంధాలు కుదరడం, ఉద్యోగ ప్రాప్తి వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. 4. ఆరోగ్య సంరక్షణ (శాస్త్రీయ కోణం): పూర్వ కాలంలో జాతరలు, ఉత్సవాలు జరిగినప్పుడు జనం ఎక్కువగా ఉండేవారు. నిమ్మకాయల నుండి వచ్చే సహజమైన సువాసన గాలిలోని క్రిములను చంపి, అంటువ్యాధులు ప్రబలకుండా చేసే ‘డిస్-ఇన్ఫెక్టెంట్’ లా పనిచేసేది. అందుకే గుడుల వద్ద నిమ్మకాయల వినియోగం ఎక్కువగా ఉండేది. 5. నిమ్మకాయల సంఖ్య ప్రాముఖ్యత: సాధారణంగా అమ్మవారికి 18, 54 లేదా 108 నిమ్మకాయలతో దండ వేస్తారు. ఈ సంఖ్యలు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనవి. పండని పచ్చని నిమ్మకాయల కంటే, బాగా పండిన పసుపు రంగు నిమ్మకాయలతో దండ వేయడం శుభప్రదంగా భావిస్తారు. గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. హిందూ ధర్మ శాస్త్రాలు మరియు పురాతన నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించబడింది. దీనిని పాటించే ముందు మీ ఆధ్యాత్మిక గురువులను సంప్రదించడం శ్రేయస్కరం.🪷🙏 దుర్గాదేవి ఆరాధనలో నిమ్మకాయల పూజకు, నిమ్మకాయ దండలకు ప్రాధాన్యత ఉండడం తెలిసిందే! అయితే లక్ష్మి సరస్వతి దేవతలకు కాకుండా కేవలం దుర్గాదేవికి మాత్రమే నిమ్మకాయల దండ సమర్పించడం వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటి? ఇలా నిమ్మకాయల దండ సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దుర్గాదేవికి నిమ్మకాయల దండ సాధారణంగా దుర్గాదేవికి నిమ్మకాయల దండలు వేసి పూజిస్తూ ఉంటాం. ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు వేస్తారు? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది? హిందూ సంప్రదాయంలో లక్ష్మీ దేవికి, సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండలు వేసే ఆచారం కనిపించదు. కానీ శక్తి ఆలయాల్ల, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది. ప్రాణికోటిని రక్షించే శక్తి స్వరూపిణి అన్నవారు శక్తి స్వరూపిణి. సమస్త ప్రాణికోటిని ఆ తల్లి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అమ్మవారు అనునిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి కొంత తామస గుణం ఉంటుంది. దేవి సత్వ సరూపమే అయినా ఆ తల్లి సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది . గ్రామ దేవతలు కూడా దేవీ స్వరూపాలే! గ్రామ దేవతలు కూడా ఆ దేవీ స్వరూపాలే! గ్రామదేవతలు గ్రామాలకి రక్షణగా ఉండటానికి రాత్రిపూట గ్రామ సంచారం చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తారు. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. అమ్మవారికి మాత్రమే ఎందుకు? అమ్మవారికి నిమ్మకాయ దండలని సమర్పించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శత్రు సంహారం కోసం రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవికి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ తల్లి శాంతిస్తుందని చెబుతారు. అందువల్లే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు.దుర్గాదేవికి నిమ్మకాయల దండ ఏ రోజు సమర్పించాలి? మంగళవారం, శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం శుభప్రదం. ఇంటి పూజలో నిషిద్ధం అయితే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించే సంప్రదాయాన్ని ఇళ్లల్లో చేసుకొనే పూజల్లో పాటించకూడదని గుర్తుంచుకోవాలి. ఇంట్లో మనం చేసుకునే పూజలో సాత్విక తత్వం ఉంటుంది. అయితే నిమ్మకాయల దండ సమర్పించడంలో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో పాటించకపోవడమే మంచిది. ఇలా చేయవచ్చు ఆలయంలో దుర్గాదేవి కోసం నిమ్మకాయల దండని తయారు చేసి, గుడిలో అమ్మవారికి సమర్పించి, అర్చన చేయించుకొని, అమ్మవారి ప్రసాదంగా ఆలయం నుంచి రెండు మూడు నిమ్మకాయలు తెచ్చుకొని, గుమ్మానికి కట్టుకుంటే నరఘోష, ద్రుష్టి దోషాలు, శత్రుపీడలు తొలగిపోతాయి. అలాగే మన ఇల్లు అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి . చివరగా ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదని గుర్తుంచుకోవాలి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః #తెలుసుకుందాం3151K
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🌿 శాకంబరీ దేవి అంటే ఎవరు?🥕🥦🫑🥬🫛🍐🥒🫒🍋🟩🍋🍍🥭🍆 విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢమాసంలో శాకంబరీ దేవి అలంకారం ఎంతో విశిష్టత 🌿🥒🍆🥕🥬 పూర్వం దుర్గమాసురుడు 100 ఏళ్లు వర్షాలు లేకుండా చేశాడు 🙏 భూమి మీద తినడానికి తిండి లేక అందరూ ఆకలితో అల్లాడారు 🙏శాకం" అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, "అంబరీ" అంటే ధరించిన తల్లి. పురాణాల ప్రకారం, ఒకసారి దుర్గమాసురుడు వేదాలను అపహరించడంతో వర్షాలు పడలేదు. భూమిపై కరువు ఏర్పడి ప్రజలు, పశువులు ఆకలితో బాధపడ్డారు. అప్పుడు జగన్మాత శాకంబరీ దేవి రూపంలో అవతరించి, తన శరీరం నుంచే వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఉద్భవింపజేసి సృష్టిని రక్షించింది. 🌾🥒🍅🥕🍆 🔸 ఆషాఢమాసంలో ప్రకృతి పచ్చగా మారుతుంది. 🔸 రైతులు పండించిన తొలి కూరగాయలు, పంటలను అమ్మవారికి సమర్పిస్తారు. 🔸 సర్వలోకాలకు అన్నం, ఆహారం ప్రసాదించే తల్లిగా కనకదుర్గమ్మను శాకంబరీ రూపంలో అలంకరిస్తారు. 🔸 అమ్మవారికి వేలాది కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అద్భుతమైన అలంకారం చేస్తారు. 🌸 శాకంబరీ అలంకార విశిష్టత 🌿 అన్నపూర్ణ స్వరూపిణి. 🥒 కరువు, ఆకలి, దారిద్ర్యం తొలగుతాయని విశ్వాసం. 🍅 ఇంట్లో ఐశ్వర్యం, ఆరోగ్యం, పంటల సమృద్ధి కలుగుతుందని నమ్మకం. 🥬 వ్యవసాయం చేసే వారికి ప్రత్యేక కృప లభిస్తుందని భక్తుల విశ్వాసం. 🍇 కుటుంబంలో సుఖశాంతులు, ధాన్య సమృద్ధి పెరుగుతాయని చెబుతారు. 🙏 భక్తులు ఏమి సమర్పిస్తారు? 🥒 దోసకాయలు 🍆 వంకాయలు 🥕 క్యారెట్లు 🥬 ఆకుకూరలు 🌽 మొక్కజొన్న కంకులు 🍅 టమాటాలు 🌶️ మిరపకాయలు 🍋 నిమ్మకాయలు 🥭 మామిడిపండ్లు 🍌 అరటిపండ్లు 🥥 కొబ్బరికాయలు ఇలా ఎన్నో రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించి దర్శించుకుంటారు. 🌺 శాకంబరీ దేవి దర్శనం చేసిన వారికి అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ధాన్య సమృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. 🙏🌿🌾 అప్పుడు అమ్మవారు తన 100 కళ్ళతో చూసి కన్నీళ్లు పెట్టుకుంది 🙏 ఆ కన్నీళ్లే వర్షాలుగా మారి నదులు అయ్యాయి 🙏 తన ఒంటి నుండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పుట్టించి ప్రపంచానికి అన్నం పెట్టింది 🙏 అందుకే ఆమె శాకంభరీ అయ్యింది 🙏 శాకం అంటే కూరగాయల తల్లి అని 🙏 ఆషాడం అంటే రైతులకు పంటల నెల 🙏 పంటలు బాగా పండాలని, కరువు రాకూడదని, ఎవరికీ ఆకలి బాధ ఉండకూడదని మన కనకదుర్గమ్మను శాకంభరీగా అలంకరిస్తారు 🙏 ఈ అలంకారం చూస్తే అర్థం ఏంటంటే - తిండిని వృధా చేయొద్దు, ప్రకృతిని కాపాడండి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి అని 🙏 #శాకంబరీదేవి 🌿 #విజయవాడకనకదుర్గమ్మ 🙏🌺🍀🌿⚜️💗🧿 #తెలుసుకుందాం #🔱విజయవాడ కనక దుర్గమ్మ #విజయవాడ కనక దుర్గమ్మ #శ్రీ కనక దుర్గ దేవి #కనక దుర్గమ్మ2K3K
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣*ఏది ముందు కావాలి?* 💥💥💥💥💥💥💥 అది ఒక చిన్న కొండ. ఆ కొండ మీద ఓ పూరిగుడిసె!ఓ ముసలిభార్యాభర్తా, వారికొడుకూ కోడలూ ఆఇంట్లో ఉంటున్నారు. అంతాబాగానే ఉంది. పొద్దున లేచి గుడిసెలోంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది, ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు. కొండ కింద ఉన్న ఊరిలోకి ఈ ఇంటి పెద్దాయనా, ఆయన కొడుకూ పనికి వెళ్తారు. రోజంతా ఒళ్లు వంచి పనిచేసి, మర్నాటికి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరతారు. ఓ రోజు తండ్రీకొడుకులు ఎప్పటిలాగే పనికి వెళ్ళారు. ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు.చారెడు మీసాలు, బారెడు గడ్డంతో వారంతా చాలా చిత్రంగా ఉన్నారు. కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ‘ఎవరయ్యా మీరు! పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు. రండి కాసిని మంచినీళ్లు తాగండి. మాతో కలిసి భోంచేయండి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి,’ అంటూ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించింది. ఇంటావిడ మాటలకు ఆ నలుగురూ చిరునవ్వు నవ్వి ‘మరేం ఫర్వాలేదు. మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము. మీ ఇంట్లోవారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తాము,’ అని చెప్పారు. మరికాసేపటికి తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికి చేరుకోనే చేరుకున్నారు. ఇంటి బయట ఉన్నవారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది. వెంటనే ఆ ఇంటి పెద్దాయన బయటకు వెళ్లి- ‘ఇంట్లో వారమంతా వచ్చేశాము. దయచేసి లోపలకి రండి,’ అంటూ ఆహ్వానించాడు. ‘మేము నలుగురమూ ఒకేసారి లోపలకి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి,’ అని వారిలో ఒకరు చెప్పారు. వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్లి విషయం చెప్పాడు- ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది? ముందు డబ్బుని లోపలకి రమ్మనండి. ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను,’ అన్నాడు కొడుకు. ‘అబ్బే డబ్బుదేముంది! ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కీర్తి శాశ్వతం కదా. ముందు ఆ కీర్తిని లోపలకు రమ్మని పిలవండి,’ అని చెప్పింది కోడలు. ‘ఇన్నాళ్లూ నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను. ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను. నేను విజయాన్నే లోపలకు పిలుస్తాను’ అన్నాడు తండ్రి. ‘భలేవారే!మనం అరాయించుకోలేనంత డబ్బు, డప్పు కొట్టుకొనేంత కీర్తి, తలపొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్లూ సుఖంగా ఉన్నామా లేదా! అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే! ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే... తతిమావి ఏవుండి మాత్రం ఏం లాభం? నా మాట విని వెళ్లి ఆ ప్రేమను లోపలకు పిలవండి,’ అని గట్టిగా చెప్పింది భార్య. ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది. వెంటనే వెళ్లి ‘మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి!’ అని పెద్దాయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలకి అడుగుపెట్టారు. విచిత్రం! ప్రేమ లోపలకు అడుగుపెట్టగానే మిగతావారు కూడా ఆయన వెంటనే లోపలకు వచ్చేశారు. ‘మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా, మిగతా ముగ్గురూ తిరిగి వెళ్లిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది. విజయం ఉన్నచోట డబ్బు, కీర్తి ఉంటాయి. మిగతా లక్షణాలు అలా కాదు! ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు!’ అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు. అప్పటి నుంచీ వారి జీవితాల్లోనూ, మనసుల్లోనూ ఏ లోటూ లేకుండా పోయింది.. 💥💥💥💥 #😃మంచి మాటలు #🙆 Feel Good Status #🗣️జీవిత సత్యం #తెలుసుకుందాం922
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣పూజా గదిలో నూనె దీపాన్ని ఎల్లప్పుడూ కుడివైపు ఉంచాలి ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నూనె దీపాన్ని ఎల్లప్పుడూ కుడివైపున, నెయ్యి దీపాన్ని ఎల్లప్పుడూ ఎడమవైపున ఉంచాలి. ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు. ప్రతి ఇంట్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భగవంతుని ఎదుట దీపం వెలిగిస్తాము. దీపం వెలిగించడం ద్వారా భగవంతుని ఆశీస్సులు లభించడంతో పాటు, ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని చెబుతారు. అందుకే ఏదైనా పూజ లేదా వ్రతం ప్రారంభించేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. ఆ తరువాత పూజా కార్యక్రమంలోని ఇతర విధులను నిర్వహిస్తారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పు దిశలో దీపాన్ని వెలిగించి పూజ చేస్తుంటాము. దీని గురించి మనకు అవగాహన ఉండకపోవచ్చు. దీనివల్ల కుటుంబంపై కష్టాలు వస్తాయని, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని, ఎంత సంపాదించినా చేతిలో నిలవదని, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కొనసాగుతాయని కొందరు నమ్ముతారు. అయితే ఇప్పుడు ఇంట్లో లేదా ఆలయంలో ఏ దిశలో దీపం వెలిగిస్తే శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటున కూడా దక్షిణ దిశకు దీపపు వత్తి ముఖంగా ఉండేలా దీపం వెలిగించకూడదు. దీనిని అశుభంగా భావిస్తారు. దక్షిణ దిశకు దీపం ముఖంగా ఉండేలా వెలిగిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడటంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కొనసాగుతాయని చెబుతారు. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. ఎందుకంటే దక్షిణ దిశ యమధర్మరాజు దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశలో దీపం వెలిగించడం అశుభంగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశకు దీపపు వత్తి ముఖంగా ఉండేలా దీపం వెలిగిస్తే శుభప్రదంగా ఉంటుంది. శాస్త్రాలలో ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు. ఉత్తర దిశకు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని, సుఖశాంతులు నెలకొని ఉంటాయని విశ్వసిస్తారు. ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం: *నూనె దీపాన్ని ఎల్లప్పుడూ కుడివైపున ఉంచాలి.* *నెయ్యి దీపాన్ని ఎల్లప్పుడూ ఎడమవైపున ఉంచాలి.* *ఇలా దీపాలను శాస్త్రోక్తంగా ఏర్పాటు చేసి పూజ చేయడం శుభప్రదంగా భావించబడుతుంది.* #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు712