#శని..శని..శని అని పిలువకూడదు... శనీశ్వరుడు అనే పిలవాలి.. ఎందుకు? #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #వైశాఖ మాసం వైభవం (మాధవ మాసం వైశాఖం) #శనిజయంతి
*ఐశ్వర్యప్రదాత శనీశ్వర*
శని నవగ్రహాలలో ఏడవ గ్రహం. శనీశ్వరుడని, ధర్మానుజు డని లోకంలో పిలుస్తారు. అసలు పేరు శనైశ్చరుడు. శనైః చరతీతి శనైశ్చరః మెల్లమెల్లగా నడిచేవాడు అని అర్థం. అందువల్లనే శనిని మందుడు అని కూడా పిలుస్తారు. శనివారా నికి శని అధిపతి. శని మందుడైన వలన ఆ వారానికి మంద వాసరమని, స్థిరవాసరమని పేరు వచ్చింది.
శని పుట్టుపూర్వోత్తరాలను మత్స్యమహాపురాణం, ఇతర పురాణాలు కూడా వివరిం చాయి. ఛాయ, సూర్యదేవులు శనికి తల్లిదండ్రులు. యముడు అన్న. యమున అక్క ఛాయకే సంజ్ఞ అని మరోపేరు. ఉషా పద్మినిలు కూడా సూర్యుని భార్య లుగా ప్రసిద్ధి, సూర్యుని భార్య సంజ్ఞాదేవి సూర్యుని వల్ల యముణ్ణి, యమునను పొందింది. నానాటికీ సూర్య తాపం పెరుగుతున్నందువల్ల సంజ్ఞాదేవి తట్టుకోలేకపోయింది. ఒకరోజున తన తండ్రి ఇంటికి వెళ్ళింది. భర్తకు తెలియకుండా, ముందుగా తండ్రి అనుమతి లేకుండా వచ్చినందుకు తండ్రి మందలించాడు.
అప్పుడు సంజ్ఞాదేవి ఆలో చించి తననీడతో ఛాయ అనే స్త్రీమూర్తిని సృష్టించింది. ఛాయ సంజ్ఞవలెనే ఉంది. సూర్యుడు కూడా ఛాయను గుర్తు పట్టలేకపోయాడు. సూర్యతాపాన్ని తట్టుకునే శక్తిని సంపాదించటం కోసం సంజ్ఞ తపస్సు చేసుకోవటానికి వెళ్ళింది. ఛాయ సంజ్ఞ చెప్పినట్లుగా ఆమె సంతానాన్ని ప్రేమతో పరిపాలిస్తూ సూర్యునితో అన్యోన్యంగా కాలం గడుపుతున్నది.
ఛాయకు సూర్యుని వల్ల గర్భోత్పత్తి జరిగింది. 'ఛాయ' అంటే నీడ కనుక ఆ నీడకు పుట్టినందువల్ల శని నీలం నలుపురంగులు కలిసి నట్లుగా జన్మించాడు. శని నల్లగా ఉండటానికి మరొక కారణాన్ని ఇలా చెపుతున్నారు. ఛాయాదేవి గర్భంలో శని ఉన్న సమయంలో ఛాయాదేవి పరమేశ్వరుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేసింది. ఆ ప్రభావం వల్ల శనికి నల్లనివర్ణం వచ్చింది. శివుడు సర్వజ్ఞుడైనందు వల్ల పుట్టుకతోనే ఆధ్యాత్మిక జ్ఞానసంపద కూడా శనికి లభించింది. శని ఛాయాసూర్యదేవుల సంతానమైనందు వల్లనే శనిని ప్రార్థిం చేటప్పుడు
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ | శని గ్రహాలలో ప్రధానగ్రహం.
చాలామంది శనిమహర్దశ వస్తున్నదని తెలిస్తే ముందుగానే భయపడతారు. 'నిజానికి శని కర్మఫలప్రదాత. కర్మసాక్షి కుమా రుడైనందువల్ల మానవులు చేసిన పుణ్యఫలాలను అనుభవింప చేస్తాడు. తానుగా ఎవ్వరినీ కష్టపెట్టడు. పాపం చేసిన వాళ్ళకి ఆ పాపఫలాన్ని అనుభవింపచేస్తాడు. పాపఫలం కష్టరూపంగా ఉంటుంది. కనుక శని కష్టపెడుతున్నాడని భావిస్తున్నారు. పుణ్యం చేసుకున్న వాళ్ళకి సుఖరూపమైన ఫలాన్నిస్తాడు'. ఇది గ్రహ అనుకూలతను సూచిస్తుందని కొందరు పండితులు చెపుతున్నారు.
శని కుండలిలో ఉన్న స్థానాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఈ స్థితి శనికే కాదు. గ్రహాలన్నింటికి ఉండేదే. గ్రహాలకు కూడా స్వక్షేత్రాలు, మిత్రక్షేత్రాలు, శత్రుక్షేత్రాలు అని ఉంటాయి. స్వక్షేత్రంలో మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు అనుకూల్య ప్రభావం చేత చక్కటి లాభదాయకంగా, సంతోషదాయకంగా జీవితం సాగుతుంది. క్షేత్రం మారితే ఆ ప్రభావం కూడా తీవ్రంగా ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది.
రాహుకేతువులు సంపూర్ణశరీరులు కారు. ఇక మిగిలిన ఏడు గ్రహాలలో శని ఏడవగ్రహం. అందువల్ల ఏడవవారమైన శని వారానికి శని అధిపతి. శనివారంరోజున కొందరు శనికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. శనిని నువ్వులతో అర్చిస్తే ఎంతో మేలు కలుగుతుంది. శనికి నువ్వులనూనె అంటే ప్రీతి కనుక నువ్వులనూనెతో అభిషేకం చెయ్యాలి.
త్రయోదశి తిథి రోజున (ప్రతినెల కాకుండా) శనిత్రయోదశి అనే విశేషసమయం వస్తుంది. ఆ రోజున కూడా శనికి విశేష పూజలు నిర్వహిస్తారు. శని నల్లగా ఉంటాడు కనుక నల్లని రంగు వస్త్రం ఇష్టం. నల్లని ధాన్యమైన నువ్వులు ఇష్టం. నువ్వులనుండి వచ్చిన తైలం ఇష్టం. నల్లనిపక్షి అయిన కాకి అంటే ఇష్టం కనుక కాకి వాహనం. శనిమహర్దశ అన్ని గ్రహదశల వలెనే నడుస్తున్నా చాలా మెల్లగా నడుస్తున్నట్లుగా ఉంటుంది. శనికి నీలం (రత్నం) అంటే ఇష్టం. నీలాలలో సముద్రనీలం, ఆకాశనీలం, కాకినీలం, మయూరనీలం, ఇంద్రనీలం అని అనేక రకాలున్నాయి. వారివారి స్థితిగతులను పట్టి, అవసరాన్ని బట్టి సిద్ధాంతిని సంప్రదించి వారి సూచన మేరకు ఆ రత్నాన్ని ధరించాలి.
శనికి తరతమ భేదం లేదు. స్వజన, పరజన భేదం లేదు. తన ధర్మం తాను నిర్వహించటమే శనిలో ఉన్న ప్రధానలక్షణం. శని ఈశ్వరుణ్ణి కూడా బాధించాడని లోకంలో వృత్తాంతం ఉన్నది.
ఒకసారి నారదుడు కైలాసంలో పరమేశ్వరుని దగ్గర శని గ్రహాన్ని గురించి ఎంతగానో ప్రశంసిస్తాడు. ఈశ్వరుడికి కొంచెం బాధ కలుగుతుంది. శని అంతటి గొప్పవాడైతే నాకె దురుపడి బాధించమని చెప్పు అని నారదుణ్ణి ఆదేశించాడు. నారదుడు శనికి ఈ వార్తను చేరవేస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి హెచ్చరించి వెళతాడు.
పరమేశ్వరుడు శనికి తానుదొరికితేనే కదా బాధపెట్టేది. దొరకకుండా ఉండాలని కైలాసాన్ని వదిలి తన పరివారాన్ని విడిచి ఒక అడవిలో ప్రవేశించి అక్కడ ఉన్న మర్రిచెట్టుతొర్రలో దాగి ఉంటాడు. మరునాడు ఉదయం శని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఈశ్వరా! చూశారా? మీరు నా ప్రభావాన్ని, హాయిగా ప్రమథగణాల మధ్య కైలాసంలో సేవలందుకోవలసిన మీరు ఈచెట్టు తొర్రలో దాగి ఉన్నారు అని నమస్కారం చేశాడు.
పరమేశ్వరుడు ఒక్కక్షణం ఆలోచించి ఓశనీ! నీ ప్రభావం అమోఘం. ఈనాటి నుండీ నీవు కూడా ఈశ్వరపదంతో ప్రసి ద్ధిని పొందుతావు. నిన్ను శనీశ్వరుడని పిలుస్తారు అని అను గ్రహించాడు.
శని ఆనాటి నుండి శనీశ్వరుడుగా పేరు పొందాడు. అందు వల్లనే శనిగ్రహ దేవాలయాలు మనకు దర్శనమిస్తున్నాయి.
శనీశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయాలు కూడా ఉన్నాయి. మంగనూరులో కూడా ఒక శనీశ్వరదేవాలయం ఉంది. ఇది నిర్ణీత సమయంలోనే తెరచి ఉంటుంది. మనరాష్ట్రంలోని మంద పల్లిలోని శనీశ్వరాలయం సుప్రసిద్ధం. మహారాష్ట్రలోని శని శింగణాపూర్ చాలా విలక్షణక్షేత్రం. ఆరు బయటే ఉంటుంది. ఇక్కడ వాకిళ్ళకు తలుపులు కూడా ఉండవు. దొంగతనాలు జరుగవు. అక్కడ ఎవరైనా దొంగతనానికి పాలుపడితే వాళ్ళు పొలిమేర దాటరు. ఇప్పటికీ శనీశ్వరప్రభావాన్ని ఇది చాటు చున్నట్లే కదా! మరొక మహిమాన్వితమైన పాగడ (పావగడ) క్షేత్రం అనే పేరుతో ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులలో ఉన్నటు వంటి శనీశ్వరాలయం ఎంతో ప్రసిద్ధమైనది. గొప్పశక్తి కలిగిన శనీశ్వరుడికి పరమేశ్వరుడు లోబడినా పరమేశ్వరాంశతో అవ తరించిన హనుమంతుడు మాత్రం శనికి లోబడలేదు.
శని అనుకూలంగా లేని వాళ్ళు ఆ దోపం తొలిగిపోవటానికి హనుమకి పూజలు, సుందరాకాండ పారాయణలు చేయిస్తారు. శనికి మందగమనుడు అనే పేరు రావటానికి కారణాన్ని
పురాణాలు ఇలా చెపుతున్నాయి. సంజ్ఞాదేవి తపస్సు పూర్తిచేసు కొని వచ్చేసరికి ఛాయ సూర్యుని వల్ల శనిని కన్నది. తాను సృష్టించిన స్త్రీయే, తన ఛాయే అయినా ఆ కుమారుణ్ణి చూడ గానే సంజ్ఞకు తన సవతికుమారుడనే భావం కొద్దిపాటి ఈర్ష్య కలిగాయి. తన దగ్గరకు వస్తున్న ఆ చిన్నారి శనిని అసూయతో సంజ్ఞాదేవి నీవు కుంటివాని వలె మెల్లగా నడుస్తావు. నీ మంద గమనం వల్ల నిన్ను మందుడని పిలుస్తారు. అని శపించింది. ఆ కారణంగా శని మందు డు, శనైశ్చరుడు అయినాడు.
మీనరాశిలో శని ఉంటే కరువుకాటకాలు వస్తాయి. అయోధ్యానగరాన్ని దశరథ మహా రాజుగారు పరిపాలిస్తున్న సమయంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలు అనేకకష్టాలతో బాధ పడుతున్నారు. ఇందుకు కారణం శనే అని జ్యోతిష్యుల వల్ల తెలుసుకున్న దశరథుడు శని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఓడి పోయిన దశరథమహారాజు చివరికి చేసేది లేక శనిని స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం.
*ప్రసాదం కురు మే సౌరే వరదో యది మే స్థితః*
*అధ్య ప్రభతి మే రాష్ట్ర పీడా కార్యా న కస్యచిత్ |*
అని ప్రారంభమై ఇరవైఐదు శ్లోకాలతో పూర్తవుతుంది. ఇది అత్యద్భుతమైన స్తోత్రం. ఓ శనీ! ఇకనుండీ నా దేశంలో ప్రతి పన్నెండుసంవత్సరాలకు వచ్చే దుర్భిక్షం రాకూడదు అని కోర గానే శని వెంటనే వరమిచ్చాడు. ఈ వరాన్ని పొంది దశరథ మహారాజు కృతకృత్యుడైనట్లు భావించి రథంపై ధనుర్బాణాల నుంచి చేతులు జోడించి నమస్కరిస్తూ సరస్వతీదేవిని, గణపతిని ధ్యానించి శనిని ఈవిధంగా స్తోత్రం చెయ్యటం మొదలు పెట్టాడు.
*నమః కృష్ణాయ నీలాయ శిఖికంఠనిభాయ చ*
*నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ...* అంటూ స్తోత్రం చేశాడు. శని సంతుష్టుడైతే అప్ల్యైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఆగ్రహిస్తే అష్టకష్టాలపాలు చేస్తాడు. దేవతలు, రాక్ష సులు, మనుష్యులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు అందరూ కూడా శని అనుగ్రహదృష్టి లేకపోతే అష్టకష్టాల పాలౌతారు. కేవలం వీళ్ళేకాదు. బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, సప్తర్షులు కూడా తమ తేజస్సులను కోల్పోయి దీనులౌతారు. మహా రాజులు రాజ్యభ్రష్టులౌతారు.
దశరథ మహారాజు చేసిన స్తోత్రం విని ఓ మహారాజా! నీ స్తోత్రానికి నేను ప్రీతుణ్ణయ్యాను. ఇవ్వకూడనిదే అయినా నీకు నేను వరాన్నిస్తాను. నీవు చేసిన ఈ స్తోత్రాన్ని మానవుడు ఒక సారి కాని, రెండుసార్లుకాని భక్తి శ్రద్ధలతో పఠిస్తే మృత్యుముఖం నుండి కూడా రక్షణ పొందుతాడు. ఎవడైతే లోహంతో నా ప్రతిమను చేయించి జమ్మిపూలతో
పూజించి మినుములతో వండిన అన్నాన్ని నువ్వులతో కలిపి నివేదించి నల్లని ఆవుని, గేదెను, వస్త్రాన్ని దానం చేస్తాడో, శనివారం రోజున ఈ స్తోత్రంతో పూజచేస్తాడో వాడికి నేనేవిధమైన బాధని కలిగించను. గోచారంలో కాని, జన్మలగ్నంలో కాని, దశలో కాని, అంత ర్దశలో కాని ఇతర గ్రహాల వల్ల కూడా బాధ కలుగకుండా రక్షిస్తాను. అని మరొక వరాన్నిచ్చాడు. ఈ విధంగా దశరథుడు రెండు వరాలను పొంది కృతార్థుడైనాడు.
*ఇంతకంటే సులభతరంగా షోడశనామావళి ఉంది.*
1. కోణః, 2. శనైశ్చరః, 3. మందః, 4. ఛాయాహృదయ నందనః, 5. మార్తాండజః, 6. తథా సౌరి:, 7. పాతంగీ,8. గృహనాయకః, 9. అబ్రాహ్మణః, 10. క్రూరకర్మా, 11, నీల వస్త్రః, 12. అంజనద్యుతిః, 13. కృష్ణః, 14. ధర్మానుజః, 15. శాంతః, 16. శుష్కోదరవరప్రదః
ఈ 16 నామాలను ప్రతిరోజు చదువుకుంటే విశేషమైన శుభఫలితాలు వస్తాయి.
అత్యంత ప్రభావసంపన్నుడైన శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందటానికి మనం కూడా శనీశ్వరునిజయంతి రోజున ఆరాధించి అప్లైశ్వర్యాది అనేక శుభాలను పొందుదాం.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*


