వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గి సత్తా చాటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు!
లేదా
చెన్నై - ముంబైల తర్వాత వరుసగా రెండు టైటిల్స్ నెగ్గిన జట్టుగా నిలిచి అందరిచే శెబాష్ అనిపించుకున్న ఆర్ సీబీ జట్టు!
తొలి ట్రో్ఫీ కోసం ఏకంగా దాదాపు 18 సీజన్ల పాటు కళ్ళకు వత్తులు కట్టుకొని మరీ ఎదురుచూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఎట్టకేలకు వరుసగా రెండోసారి ఐపీ ఎల్ టైటిల్ ను సొంతం చేసుకోవడం ఎంతైనా హర్షణీయం,అభినందనీయం. ఆదివారం అహ్మదాబాద్ లో దాదాపు ఏకపక్షంగా సాగిన ఫైనల్ లో బెంగుళూరు జట్టు 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేయడం ఓక గొప్ప విశేషం.అదేమాదిరి చెన్నై సూపర్ కింగ్స్ ( 5సార్లు ), ముంబయి ఇండియన్స్ ( 5 సార్లు ):కోల్ కత్తా నైట్ రైడర్స్ మూడు సార్లు ఐపీఎల్ టోర్నీ నెగ్గినప్పటికి,విరాట్ కోహ్లీ వంటి టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మ్యాన్ ఆర్ సీబీ జట్టులో ఉన్న ఐపీ ఎల్ టోర్నీ విజేతగా ఆవిర్భవించేందుకు ఏకంగా కొన్ని వసంతాల పాటు చెకోరా పక్షుల్లాగా,కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి రావడం ఆ జట్టుకు ఖచ్చితంగా ఓక చేదు అనుభవమే.అయినప్పటికీ ఆ ఘోర ఓటముల నుంచి వీలయినంత త్వరగా పాఠాలు నేర్చుకొని,ఆర్ సీబీ జట్టు కెప్టెన్ రజిత్ పాటీదార్ నాయకత్వంలోని ఆ జట్టు బ్యాటింగ్,బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో బాగా రాటుదేలి,ఈ ఐపీఎల్ టోర్నీ అద్యంతం ఆ జట్టు అంతా సమిష్టికృషితో సత్తా చాటడంతో ఈ రోజు ఐపీ ఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురవేయడానికి కారణభూతమైంది. అన్నింటికీ మించి చావో రేవో తేల్చుకోవాల్సిన ఐపీ ఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఎలాగైనా గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించేందుకు కంకణం కట్టుకొని ఆ దిశగా తీవ్ర కసరత్తు చేసి ముందడుగు వేయడం,అందుకు తగ్గట్లు టీం ఇండియా ప్రదాన ఆటగాడు విరాట్ కోహ్లీ తనదైన శైలితో కూడిన మార్క్ బ్యాటింగ్ తో తప్పనిసరిగా గెలవాల్సిన ఈ ఫైనల్ మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు,4 సిక్సర్లతో కలుపుకొని 75 నాటౌట్ విలువైన పరుగులు సాధించి మరీ తన ఆర్ సీబీ జట్టు ఘన విజయం సాధించడానికి తన వంతుగా విశేష కృషి సల్పడం అనేది నిజంగా ఓక చెప్పుకోదగ్గ విశేషం.
ఏదిఏమైన ఈ ఐపీ ఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగిన వెంకటేష్ అయ్యర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పడమే కాదు వ్యక్తిగతంగా తన బ్యాటింగ్ లో 32 విలువైన పరుగులు సాధించడం,మరో వైపు బౌలింగ్ విభాగంలో జమ్మూ కాశ్మీర్ ఆటగాడు రసిఖ్ సలాం తన పదునైన బౌలింగ్ తో మూడు వికెట్లు సాధించడం,మరో వైపు మాజీ టీం ఇండియా జట్టు ఆటగాడు భువనేశ్వర్ సైతం రాణించి 2 వికెట్లు తీయడం,ఇక హాజల్ వుడ్ కూడా తాను కూడా ఏమి తక్కువ తినలేదు అన్నట్లుగా 2 వికెట్లు సాధించి గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లకు సింహా స్వప్నంగా నిలిచి వారి వికెట్లను ఒకరితో మరొకరు పోటీపడినట్లుగా కూల్చివేయడంతో ఆర్ సీబీ జట్టు విజయం నల్లేరు మీద నడకే అయ్యింది అనే మాట సత్యదూరం కాదు.దీన్నిబట్టి చూస్తే ఈ ఐపీ ఎల్ టోర్నమెంట్ లలో ఏ జట్టు టైటిల్ నిలబెట్టుకుంటుందో ముందుగా ఊహించడం,
ఓక అవగాహనకు రావడం అంతా సులభమైభ విషయం కాదు అనే పచ్చి యదార్థం మనందరికి తేటతెల్లమయ్యింది.ఎందుకంటే అత్యంత పటిష్ట, ప్రతిభావంతమైన జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్,కల కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్,గుజరాత్ టైటాన్స్ సైతం ఈ 2026 ఐపీ ఎల్ టోర్నమెంట్ లో విజేతగా ఆవిర్భవించే విషయంలో నీళ్లు నమిలి మరీ తోక ముడిచిన విషయం మనందరికీ కూడా విదితమే. జయ జయహో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు! హ్యాట్సాఫ్ టూ కింగ్ విరాట్ కోహ్లీ!✍️✍️✍️🏏🏏🏏🏏
- బుగ్గన మధుసూదరెడ్డి,
సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,
నంద్యాల జిల్లా! #రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు💥


