Sekhar Digitals & Reporter 9603197203
645 views 2 months ago
#పకృతి #పకృతి అందాలు #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 *కోనసీమలో ఏం తినాలి...భవిష్యత్ భవిత్వం ఏంటి..!* *చేపలా...? రొయ్యలా...?ధాన్యమా...? కొబ్బరా...?* *కోనసీమలో కరువు మొదలుకాబోతుందా..??* *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* కొబ్బరి,వరి సాగులకు గడ్డుకాలం.సహజసిద్ధంగా ఏర్పడిన నల్ల రేగడినేలలతో,నేలంతా పచ్చటి తివాచీపరిచినట్టు గోదావరి లంకభూములుతో వాణిజ్య పంటలను సైతం పురుడుపోసుకుని, మనిషి పుడితే ఇక్కడేపుట్టాలి అన్నట్టు దేవుణ్ణి కోరుకునే చూడచక్కని ప్రాంతం కోనసీమ.ఆప్యాయతలు అనురాగాల మధ్య అలరాడుతూ సాగునీరు, త్రాగునీరు,ఉప్పునీరు పెనవేసుకుని కలిసిమెలిసి జీవించినట్టు,ఒక చక్కటి దీవిలా ఏర్పడిన కోనసీమ ప్రాంతం అనేక రకాల పంటలకు సిరిసీమ గా చెప్పుకోవచ్చు.సమతుల్యతా వాతావరణంతో అక్కడక్కడ లంక భూములు కలిగి వాణిజ్య పంటలతో హోయలు పోతూ,గోదావరి నది తీరాన నల్లరేగడి భూములతో కొబ్బరి చెట్లు సోయగాలతో,అద్భుతమైన వరి సాగుతో మనిషికి ఆనందాన్ని కల్పించి,సిరి సంపదలు తెచ్చిపెట్టే ధాన్యంతో నట్టింట నాట్యమాడే కుటుంబాలతో ఆనంద సీమగా ఏర్పడ్డ భూతల స్వర్గం ఈ కోనసీమ ప్రాంతం.ప్రస్తుతం ఈ ప్రాంతం మంచినీటికి,సాగునీరుకి కరువై మనిషి ఆవాసానికి,సాగు భూములకు, పంటచేలుకు ఉప్పునీరు సోకి చిన్న సన్నకారు రైతులను చిదేమేసింది.చక్కగా మూడు పంటలు పండే భూములతో నిఖారసైనా మోముతో కొబ్బరిచెట్లు నిండుతనం,రైతు శ్రమకు నిలువుటద్దంగా నిలబడి సాక్ష్యం ఇచ్చే వరిపంటదిగుబడులు ఇప్పుడు దిగాలుగా చూస్తున్నాయి.కోనసీమ ప్రాంతంలో అధికమొత్తంలో, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కొంతమంది బడా రైతులు ఈ ప్రాంతానికి అక్వాసాగును పరిచయం చేశారు. కోనసీమలో అక్వాసాగు రాగానే కోట్లరూపాయలు ఇబ్బడిముబ్బడిగా రైతులకు రావడంతో పక్కనే ఉన్న చిన్న, సన్నకారు రైతులపంట భూములను అక్వా సాగువైపు మళ్లేలా పూరిగోల్పారు.అధిక లాభాలతో సిరులు కురిపిస్తున్న అక్వా రంగాన్ని చిన్నరైతులు కూడా హక్కునచేర్చుకోవడంతో చాలా వరకు పంటభూములను అక్వాచెరువులుగా మార్చేశారు. అక్వా చెరువులకు ముఖ్యంగా ఉప్పునిటీ అవసరం ఎక్కువుగా ఉండటంతో, చాలా వరకు అక్వాసాగును సముద్రతీరప్రాంతాల్లోను,చౌడు భూముల్లోనూ సాగుచేస్తూఉంటారు.రైతులు అత్యాశతో వాళ్ళు అక్వా చెరువుల్లో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు,మనము సంపాదించాలి అని నెపంతో ఊరుమధ్యలోకి అక్వాను ప్రారంభించేశారు.దీంతో కోనసీమ ప్రాంతంలో ఇబ్బడి-ముబ్బడిగా రొయ్యలు చెరువులు చేపల చెరువులో దర్శనమీచ్చేశాయి. ఆక్వా చెరువుల హంగామాతో పంట భూముల్లోకి ఉప్పునీరు సోకడంతో చిన్నసన్నకారు రైతులు వరి పంటలు పండించలేక బోరుమని వినిపిస్తున్నారు. ఒకప్పుడు వరి, కొబ్బరి.మొక్కజొన్న,మినుములు,పెసలు,అరటి ప్రధాన పంటలుగా పాడి పాడి పరిశ్రమకు పచ్చగడ్డి -ఎండుగడ్డి అందుబాటులో ఉండటంతో కోనసీమ కాస్త సిరులు సీమగా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుండేది.ఇప్పుడా ఆ పరిస్థితులు కోనసీమలో ఇసుమంతైన కనబడటం లేదు, దీని కారణం ఎక్కడబడితే అక్కడ ఆక్వాసాగు ఆక్రమించడంతో భూగర్భ జలాలు ఉప్పునీటి సెలయేరులుగా మారిపోయాయి. ఇదిలా ఉంటే,రోగ నిరోధక శక్తితో ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరిగే కోనసీమ కొంగుబంగారంగా చెప్పుకునే కొబ్బరి సాగు కుదేలైపోయింది.ఈప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ కుటుంబానికి పెద్ద దిక్కుగా చెప్పుకునే కొబ్బరి చెట్లు ఆక్వాభూతానికి బలైపోయి దిగుబడి లేక,రైతుకు ఆదాయం కరువై కొబ్బరికాయలను సైతం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.కోనసీమ ప్రాంతంలో ఎక్కడ చూసినా రొయ్యలు చెరువులు,చేపల చెరువులు దర్శనమీవ్వడంతో చిన్నచిన్నరైతులు అక్వా రంగంలో పెట్టుబడులు పెట్టలేక,నష్టాలువస్తే తట్టుకోలేక పక్కనే ఉన్నా పెద్ద రైతులకు భూములు ఇచ్చేసి వ్యవసాయాన్ని వదిలేసిన సందర్భాలు ఎన్నో.చాలామంది ఇక్కడ ప్రజలు ఉప్పునీరు అదుపుచేయలేక,అక్వావైపు చూడలేక,వరి,కొబ్బరి పంటలు పండించలేక భూములు కౌలుకు ఇచ్చేసి ఊరువదిలి వెళ్లిపోయిన సంఘటనలు మరెన్నో.ఒకవైపు మనిషి జీవనాధారానికి ప్రధానమైన సహజ వనరు మంచినీరు కలుషితం అవ్వడం,మంచినీరే కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడడంతో చాలావరకు కోనసీమ ఖాళీ అయిపొయింది.దీనికి తోడు కోనసీమ ఆవాసానికి ఆమోదమైనట్టు,సహజ వనరులు పుష్కలంగా దొరికినట్టు,ఇక్కడ కొంతమంది బడాబాబులు రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిచయంచేస్తూ,కొబ్బరిచెట్లను, వరిభూములను ఆవాస నివాసాలుగా ప్లాట్లువేసి విక్రయించేస్తున్నారు.దీంతో ఇక్కడ సామాన్యప్రజలు ఏం తినాలో, ఎలా బ్రకతకాలో తెలియక, రోజువారి పనులు దొరక్క పొట్టచేతపట్టుకుని పట్టణానికి పైనమవుతున్నారు.ఆంధ్రప్రదేశ్ లో వరి పంటకు అన్నపూర్ణగా,కొబ్బరి సాగుకి రెండో కేరళగా భారతదేశమంతా గొప్పలు చెప్పుకునే కోనసీమ ఇప్పుడు కరువుసీమగా తయారయింది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.భవిష్యత్ కాలంలో ఇక్కడ అక్వారంగం ఇలాగే కోనసాగితే సామాన్య రైతులు వరి సాగు, కొబ్బరీ సాగు కు వాణిజ్యపంటలకు దూరమై అన్నందొరక్క పొట్టనింపుకోవడం కోసం చేపలు,రొయ్యలు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కోనసీమ ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికే ఉప్పునిటీ దెబ్బకు సారవంతమైన భూములు కాస్త చౌడు భూములుగా మారిపోయాయి. ప్రధాన పంటలుగా చెప్పుకునే వరి, కొబ్బరి సాగులకు అక్వాపెనుభూతం పట్టడంతో కోనసీమలో కరువు మొదలైపోయింది.ఈప్పటికైనా ప్రభుత్వాలు ఎక్కడో ఊరుకిదూరంగా ఉండాల్సిన ఆక్వా రంగాన్ని మూడు పంటలు పండే ఊరు మధ్యలోకి తీసుకురావడంతో అవసా-నివాసలాకు ప్రజల మనుగడుకు తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని కోనసీమ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 2️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/GLEFRjZEzc17SzBaKlBfdW?mode=ems_wa_c ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
15 likes
17 shares

More like this